అన్వేషించండి

KTR: ఆ ఇద్దరిలో ఎవరు సన్నాసో చెప్పాలి, వీపులు పగలగొట్టడమే ప్రజాపాలనా?: కేటీఆర్

KTR on Revanth Reddy: బీఆర్ఎస్వీ విద్యార్థి నాయకుల సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఏంటో ప్రజలు ఆర్నెల్లలోనే అర్థం చేసుకున్నారని అన్నారు.

Telangana News: విద్యార్ధులను అధికారం కోసం వాడుకున్న రాహుల్ గాందీ సన్నాసా.. లేక రేవంత్ రెడ్డి సన్నాసా చెప్పాలి. విద్యార్థులను, నిరుద్యోగులను అవమానపరిచేలా మాట్లాడిన రేవంత్ వారికి క్షమాపణ చెప్పాలి’’ అని కేటీఆర్.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపైన నిప్పులు చెరిగారు. మెగా డీఎస్సీ అని చెప్పి కేవలం 6 వేల అదనపు పోస్టులతో విద్యార్ధులను, నిరుద్యోగులను ధగా చేస్తున్నారని విమర్శించారు. నేడు విద్యార్థులపై దాడులు చేస్తున్న పోలీసుల పేర్లు డైయిరీలో నమోదు చేస్తున్నారని.. అధికారంలోకి వచ్చినాక వదిలిపెట్టబోమని హెచ్చరించారు.

ప్రజలపై దాడులు చేయడమే ప్రజాపాలనా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్వీ విద్యార్థి నాయకుల సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. ‘‘సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కూడా భరించలేని నిరంకుశ మనస్తత్వం రేవంత్ రెడ్డికి ఉంది. తమ విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులపైన పోలీసు దాడులు చేస్తూ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడు. రాహుల్ గాంధీతో సహా నిరుద్యోగులను ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ వాడుకుంది. జాబ్ క్యాలెండర్ పేరు చెప్పి దినపత్రికల్లో పెద్ద ఎత్తున ప్రకటనలు కూడా ఇచ్చారు. 

ఎవరు సన్నాసో చెప్పాలి
రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చిన కాంగ్రెస్ హామీని నిరుద్యోగులు, విద్యార్థులు అడుగుతున్నారు. నిరుద్యోగులందరికీ యువకులకు రాజకీయాలను రేవంత్ అంటగడుతున్నాడు. ఆరోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డితో సహా అనేక మందిని విద్యార్థులు కలిశారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న మాతోపాటు, ఇతర పార్టీ నాయకులను కలుస్తున్నారు. ఉద్యోగాలను.. నోటిఫికేషన్లను అడిగితే వారిని అవమానపరిచేలా అడ్డగోలుగా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. మరి విద్యార్థుల చుట్టూ చేరి వారిని ఎన్నికల కోసం వాడుకున్న రేవంత్ రెడ్డి సన్నాసా.. లేక అప్పుడు వారిని కలిసిన రాహుల్ గాందీ సన్నాసా.. రేవంత్ చెప్పాలి.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారి.. తలలు పగలగొట్టడం.. వీపులు పగలగొట్టడమే ప్రజల పాలనా? పాత అరాచకాల కాంగ్రెస్ మోసపూరితంగా కొత్త రూపంలో వచ్చిందని ప్రజలు ఆరు నెలల్లోనే అర్థం చేసుకుంటున్నారు. ఇచ్చిన హామీలు పక్కకు వదిలేసి ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలను కూడా రద్దు చేస్తున్నారు. ఇదేం అన్యాయమని అడిగిన వాళ్లందరిపైన కేసులు నమోదు చేస్తున్నారు. అధికారంలో లేనప్పుడు ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు వద్దన్న కాంగ్రెస్ పార్టీ.. అధికారంలోకి రాగానే 7 కొత్త వాటికి అనుమతులు ఇచ్చింది.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 50 వేల ఉద్యోగాలతోని మెగా డీఎస్సీ  విడుదల చేయాలని రేవంత్ రెడ్డి మాట్లాడిండు, కానీ ఈనాడు మెగా డీఎస్సీ మాట మర్చిపోయిండు. కానీ ఇప్పుడు కేవలం సూమారు 6 వేల ఉద్యోగాలు అదనంగా ఇచ్చి డీఎస్సీ పేరుతో యువకులను మోసం చేస్తుండు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్న ప్రతి ఒక్క తెలంగాణ యువకుడు తెలంగాణ కథానాయకుడిగా నిలబడిపోతారు. ఈరోజు విద్యార్థులపై దాడులతో చేస్తున్న గాయాలు మానిపోయినా, ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని మాత్రం మర్చిపోరు. తెలంగాణ పోలీసులు అధికారులు విద్యార్థుల పైన చేస్తున్న దాడులను విద్యార్థి నాయకులు తమ డైరీలో నమోదు చేసుకుంటున్నారు. విద్యార్థులపైన ప్రజల పైన దాడులు చేస్తున్న పోలీస్ అధికారులను,  మేము తిరిగే అధికారంలోకి వచ్చినంక వదిలిపెట్టం. 

పదేళ్ల మన ప్రభుత్వ హయాంలో లక్ష అరవై రెండు వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశాము.. మరో 40,000 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతూ ఉండే, అందులోంచి 30 వేల ఉద్యోగాల నియామక పత్రాలను రేవంత్ రెడ్డి ఇచ్చి మేమే ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకుంటున్నారు. విద్యార్థుల ఉద్యోగాల కోసం 95% స్థానిక రిజర్వేషన్లు కల్పించాం. పార్టీ విద్యార్థి విభాగం నుంచి అనేకమంది నాయకులను, ప్రజాప్రతినిధులుగా, చైర్మన్లుగా, మేయర్లుగా, జిల్లా స్థాయి అధ్యక్షులుగా అనేకమందిని పార్టీ తయారు చేసుకోగలిగింది. అధికారంలో ఉన్నప్పటి కంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే విద్యార్థి నాయకుల పాత్ర కీలకమవుతుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడగలిగే అవకాశం కలుగుతుంది.

ప్రభుత్వ అన్యాయాలను అక్రమాలను ఎండగట్టవచ్చు. రాజకీయ నాయకులుగా ఎదిగేందుకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎక్కువ అవకాశం ఉంటుంది. నిజాయితీపరులు, దమ్మున్న నాయకులు వందలు, వేలమంది ఈ పార్టీకి ఆస్తిగా ఉన్నారు. 2009 నుంచి 2014 దాకా తెలంగాణ కోసం విద్యార్థులు చేసిన గొప్ప ఉద్యమ స్ఫూర్తిని పోరాటాలను ఇప్పటి విద్యార్థులకు చెప్పేలా చేయాలి. విద్యారంగంలో జరిగే ప్రతి అన్యాయం దగ్గర విద్యార్ధి విభాగం అందోళన ఉండాలి’’ అని కేటీఆర్ పిలుపు ఇచ్చారు.

టాప్ హెడ్ లైన్స్

Ponguleti Srinivas Reddy on 22A Lands: రబ్బరు చెప్పులతో వచ్చి వేల కోట్లు సంపాదించలేదు.. 22ఏ భూముల వివాదంపై పొంగులేటి కీలక వ్యాఖ్యలు
రబ్బరు చెప్పులతో వచ్చి వేల కోట్లు సంపాదించలేదు.. 22ఏ భూముల వివాదంపై పొంగులేటి కీలక వ్యాఖ్యలు
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Embed widget