అన్వేషించండి

Telangana CM KCR ఏ క్షణంలోనైనా తెలంగాణ అసెంబ్లీ రద్దు చేసే ఛాన్స్, ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చు !

BJP MLA Etela Rajender: తెలంగాణ సీఎం కేసీఆర్ ఏ క్షణంలోనైనా అసెంబ్లీ రద్దు చేసే అవకాశం ఉందని, ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చునని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Telangana CM KCR : రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులను గమనిస్తే తెలంగాణ సీఎం కేసీఆర్ ఏ క్షణంలోనైనా అసెంబ్లీ రద్దు చేసే అవకాశం ఉందని, ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చునని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో పుట్టబోయే బిడ్డ కూడా లక్షా 25 వేల అప్పుతో పుడుతున్నారని, అందుకు బాధ్యుడు కేసీఆర్ అన్నారు. ఎదులాబాద్, మరిపల్లి గూడెంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసిఆర్ నైజం తెలంగాణ ప్రజలకు తెలిసిందని, రాష్ట్రాన్ని నడిపేది కేవలం ఆయన కుటుంబమేనని.. తెలంగాణ వచ్చే నాటికి నీ దగ్గర ఉన్న డబ్బు ఎంత? అని సీఎం కేసీఆర్‌ను హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల ప్రశ్నించారు.

అవినీతి లేకపోతే రూ.600 కోట్ల ఖర్చు ఎందుకు
తెలంగాణ ప్రభుత్వం నీతిగా, న్యాయంగా పాలన సాగిస్తున్నట్లయితే హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో తనను ఓడించేందుకు రూ.600 కోట్ల ఎందుకు ఖర్చు పెట్టారు. అంత డబ్బు నీకు ఎలా వచ్చింది. ఎవరిదగ్గర తీసుకున్నావు. చెప్పే మాటలకు, చేసే చేతలకు పొంతన లేని నేత కేసీఆర్. ఆయన ఎన్ని కుట్రలు చేసినా హుజూరాబాద్ ప్రజలు తన వెంట నిలిచి, తెలంగాణ ఆత్మగౌరవం కాపాడి, సీఎం కేసీఆర్ చెంప చెళ్లుమనిపించారని ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. 

కేసీఆర్‌కు మళ్లీ దిమ్మ తిరిగింది..
‘తొలిసారి ఉప ఎన్నికల్లో హుజూరాబాద్ ప్రజలు కొట్టిన దెబ్బకు సీఎం కేసీఆర్ దిమ్మతిరిగింది. తాజాగా ఐదు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 4 రాష్ట్రాలు కొట్టిన దెబ్బతో సీఎం కేసీఆర్‌కు మళ్లీ దిమ్మ తిరిగింది. కుట్లో రాయి తీయలేని వాడు ఎట్లో రాయి తీస్తా అని పోయినట్టు ఉంది కేసీఆర్ వ్యవహారం. అసెంబ్లీకి వెళ్లి సమస్యలపై మాట్లాడాలని హుజూరాబాద్ ప్రజలు తనను ఎమ్మెల్యేగా గెలిపించి పంపించారని, కానీ సమావేశాలకు హాజరు కాకుండా బీజేపీ ఎమ్మెల్యేల గొంతు నొక్కారని’ ఈటల ఆరోపించారు. కోర్టులను సైతం కేసీఆర్ మేనేజ్ చేసి బీజేపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీకి రాకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.

ఓటుకు రూ.10 వేలు తీసుకోండి..
కేసీఆర్ దగ్గర మస్తు పైసలు ఉన్నాయి. రాష్ట్రం ఏర్పడకముందు ఉన్న డబ్బులు కావు అవి. అంతా అక్రమంగా సంపాదించినవే. వచ్చే ఎన్నికల్లో రూ.10 వేలు ఇస్తారంట. డబ్బులు తీసుకుని ధర్మానికి ఓటు వెయ్యాలని ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు. 

‘ప్రపంచంలోనే ఎక్కువ సభ్యత్వం కలిగిన పార్టీ బీజేపీ. మొన్న ఎన్నికల్లో ప్రజలు బీజేపీని ఆశీర్వదించారు. బీజేపీ రేపటి అడ్డా తెలంగాణ. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశంలో అన్యాయం జరగకుండా పాలన చేస్తున్నారు. కానీ సామాన్యులే మా నాయకులు. చరిత్ర తిరగరాసేది ప్రజలే. రేపు ఎన్నికల్లో కేసీఆర్ వర్సెస్ తెలంగాణ ప్రజలుగా జరగబోతున్నాయి. మోకాళ్ల మీద నడిచినా కేసీఆర్‌కు ప్రజలు ఓట్లు వేయరు. వాళ్లు డబ్బు, మద్యం, కుట్రలను నమ్ముకున్నారని’ ఈటల ఆరోపించారు.

మద్యం ఆదాయం..
కేసీఆర్ ప్రభుత్వం కేవలం మద్యం ఆదాయంతో బతికేస్తుందని, ప్రభుత్వానికి రూ.37 వేల కోట్ల ఆదాయం వస్తుందన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కలెక్టర్లకు ఫోన్లు చేసి కేవలం మద్యం అమ్మకాల గురించి తెలుసుకుంటున్నారు. ఈ మద్యం ఎంతమంది ఆడబిడ్డల పుస్తెలు తెంపుతుందో కేసీఆర్ తెలుసుకోవాలి అన్నారు. తాగించడంలో కేసీఆర్ ప్రభుత్వం నెంబర్ వన్‌లో ఉంది. ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారని, 3.25 లక్షల కోట్లు డైరెక్ట్ అప్పు ఉంటే.. 1 లక్షా 5 వేల కోట్లు కార్పొరేషన్ల అప్పులు ఉన్నాయని. పుట్టబోయే బిడ్డ కూడా 1 లక్ష 25 వేల రూపాయల అప్పుతో పుడుతుందని చెప్పారు.

రాజ్యాంగం మార్చే హక్కు లేదు..
రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని మార్చే హక్కు పార్లమెంట్ కి కూడా లేదు అని కేసీఆర్ తెలుసుకోవాలి. కానీ ఈయన మాత్రం రాజ్యాంగాన్ని మారుస్తా అంటున్నారు. కేసీఆర్ పాలన తెలంగాణకు అరిష్టం. ఇదో దుర్మార్గమైన ప్రభుత్వం. ఇలాగే పాలన కొనసాగితే బానిసత్వంలో కూరుకుపోతం. మరోవైపు కేసీఆర్ ఏ క్షణంలోనైనా అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. 

Also Read: Mallareddy Comedy: కేంద్రమోళ్లు రామా చంద్రా అనాలె, వీళ్లు డుర్రు డుర్రుమంటూ తిరగాల - మల్లారెడ్డి పంచ్‌లు, కేటీఆర్ నవ్వులు 

Also Read: TRS Jumpings : ఆ ముగ్గురు సీనియర్లు టీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పబోతున్నారా ? వాళ్లెవరు ?

టాప్ హెడ్ లైన్స్

GHMC Elections: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
Private Schools Fee: ప్రైవేట్‌ స్కూళ్లలో ఫీజుల వివరాలు ప్రదర్శించాలి: విద్యాశాఖ కీలక ఆదేశాలు
ప్రైవేట్‌ స్కూళ్లలో ఫీజుల వివరాలు ప్రదర్శించాలి: విద్యాశాఖ కీలక ఆదేశాలు
నా భర్తను చంపు.. లేకపోతే నేను చచ్చిపోతా.. లవర్‌తో భార్య చాటింగ్ చూసి భర్త షాక్
నా భర్తను చంపు.. లేకపోతే నేను చచ్చిపోతా.. లవర్‌తో భార్య చాటింగ్ చూసి భర్త షాక్
PMFBY Last Date: రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!
రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
Embed widget