అన్వేషించండి

Eatala Rajender: దమ్ము, ధైర్యం ఉంటే హుజూరాబాద్ ఉపఎన్నిక అలా నిర్వహించాలి.. సీఎం కేసీఆర్‌కు ఈటల రాజేందర్ సవాల్

ఈటల రాజేందర్ అనే ఒక్క వ్యక్తి రాజీనామాతో రాష్ట్ర వ్యాప్తంగా పథకాలు ప్రవేశపెడుతున్నారని, దాంతో ఆయన అంటే ఏంటో రాష్ట్ర ప్రజలకు తెలిసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

హుజారాబాద్ ఉప ఎన్నికతో తెలంగాణలో రాజకీయ వేడి తారాస్థాయికి చేరుతుంది. అధికార టీఆర్ఎస్‌పై. కాంగ్రెస్, బీజేపీ తమదైన శైలిలో విమర్శలు చేస్తున్నాయి. టీఆర్ఎస్ పార్టీలో సీఎం కేసీఆర్ కుడిభుజంలా ఉన్న మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఇప్పుడు బీజేపీలో కొనసాగుతున్నారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జన ఆశీర్వాద సభలో భాగంగా కమలాపూర్‌లో పర్యటించారు. నేతలు, ఓటర్లను ఎలా కొనుగోలు చేయాలి, ప్రలోభపెట్టాలని సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. అయితే టీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్లు కూడా దక్కవంటూ ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు.

కిషన్ రెడ్డి జన ఆశీర్వాద సభలో పాల్గొన్న ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఓటర్లు అధికార టీఆర్ఎస్ పార్టీకి వాతలు పెట్టడం ఖాయమన్నారు. ఈటల అనే కేవలం ఒకే ఒక్క వ్యక్తిని ఓడించేందుకు సీఎం కేసీఆర్ కుయుక్తులు పన్నుతున్నారని ఆరోపించారు. ఓవైపు ఓటర్లను ప్రలోభపెడుతున్నారని, మరోవైపు ఎన్నికలు అనగానే దళిత బంధు లాంటి పథకాలు తీసుకొస్తున్నారని విమర్శించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు హుజూరాబాద్ ఉప ఎన్నికల రిహార్సల్ లాంటిదని బీజేపీ నేత ఈటల రాజేందర్ చెప్పారు.

ప్రస్తుతం తెలంగాణలో సీఎం కేసీఆర్ నియంతృత్వ పాలన, పోలీసుల రాజ్యం, అధికారుల రాజ్యం నడుస్తూ ప్రజాస్వామ్య చరిత్రలో మాయని మచ్చగా నిలిచిపోతుందన్నారు. ఇలాంటి పాలనకు చరమగీతం పాడే రోజు దగ్గర్లోనే ఉందని, అందుకు తెలంగాణ ప్రజలు నడుం బిగించాలని ఈటల పిలుపునిచ్చారు. నీకు దమ్ము, ధైర్యం ఉంటే హుజూరాబాద్‌లో ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు నిర్వహించాలని సీఎం కేసీఆర్‌కు బీజేపీ నేత ఈటల రాజేందర్ సవాల్ విసిరారు. కేవలం ఒక్క వ్యక్తిని ఓడించేందుకు అధికార పార్టీ, మంత్రులు, అధికారులు హడావుడి చేస్తున్నారని పేర్కొన్నారు. కుట్రలు, కుతంత్రాలు లేకుండా ఎన్నికలు నిర్వహిస్తే తమదే విజయమని.. టీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్లు కూడా దక్కవని హెచ్చరించారు. 

Also Read: Jagga Reddy: పీర్ల పండగలో చిందేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. వైరల్ అవుతున్న వీడియో

మరోవైపు తన నియోజకవర్గంలో ప్రజా దీవెన పాదయాత్రతో ప్రజల నమ్మకం చూరగొనే ప్రయత్నం చేస్తున్నారు. మధ్యలో అస్వస్థతకు గురికావడంతో కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్నా.. మళ్లీ పాదయాత్రను కొనసాగిస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. తనపై ప్రజలకు విశ్వాసం ఉంది కనుకనే పలుమార్లు వరుస ఎన్నికల్లో తనను గెలిపించుకున్నారని, తనకు ప్రజా బలం ఉందని ఈటల వ్యాఖ్యానించారు. ఈటల ఒంటరి కాదని, ఆయన వెంట బీజేపీ నేతలం ఉన్నామని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఒక్క నేత ఈటల రాజీనామాతో రాష్ట్ర వ్యాప్తంగా పథకాలు వచ్చాయని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారని చెప్పారు. 
Also Read: Weather Updates: రాగల మూడు రోజుల్లో భారీ వర్షాలు... ఏపీ, తెలంగాణలపై ఉపరితల ఆవర్తనం ప్రభావం

 

టాప్ హెడ్ లైన్స్

KTR vs Pawan Kalyan:
"పవన్‌ కల్యాణ్‌ను గౌరవిస్తా, అభిమానిస్తా, బిర్యానీ పెడతా కానీ..." కేటీఆర్ ఆసక్తికర కామెంట్స్‌
Pawan Kalyan Press Meet: తెలంగాణ 100 శాతం భూమిపుత్రుల జాగీరే.. కానీ మనసుల్లో విభజన రేఖలు వద్దు! - అమరావతిలో పవన్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణ 100 శాతం భూమిపుత్రుల జాగీరే.. కానీ మనసుల్లో విభజన రేఖలు వద్దు! - అమరావతిలో పవన్ కీలక వ్యాఖ్యలు
BRS MLA Talasani Srinivas Yadav Challenge: ఆంధ్రా వాళ్లకు కాంట్రాక్టులు ఆపే చట్టం తెస్తే.. నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా - కోమటిరెడ్డికి తలసాని ఓపెన్ ఛాలెంజ్
ఆంధ్రా వాళ్లకు కాంట్రాక్టులు ఆపే చట్టం తెస్తే.. నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా - కోమటిరెడ్డికి తలసాని ఓపెన్ ఛాలెంజ్
CM Chandrababu Naidu supports Pawan Kalyan: పవన్‌ను అడ్డుకోవడం కరెక్ట్ కాదు - తెలంగాణ రచ్చపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు.. డీకే శివకుమార్ ప్రస్తావన!
పవన్‌ను అడ్డుకోవడం కరెక్ట్ కాదు - తెలంగాణ రచ్చపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు.. డీకే శివకుమార్ ప్రస్తావన!

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Press Meet: తెలంగాణ 100 శాతం భూమిపుత్రుల జాగీరే.. కానీ మనసుల్లో విభజన రేఖలు వద్దు! - అమరావతిలో పవన్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణ 100 శాతం భూమిపుత్రుల జాగీరే.. కానీ మనసుల్లో విభజన రేఖలు వద్దు! - అమరావతిలో పవన్ కీలక వ్యాఖ్యలు
KTR vs Pawan Kalyan:
"పవన్‌ కల్యాణ్‌ను గౌరవిస్తా, అభిమానిస్తా, బిర్యానీ పెడతా కానీ..." కేటీఆర్ ఆసక్తికర కామెంట్స్‌
Imtiaz Ali : లవ్ స్టోరీస్ తీసేందుకు ఇదే రైట్ టైం - యాక్షన్ మూవీస్ ట్రెండ్‌పై ఇంతియాజ్ అలీ రియాక్షన్
లవ్ స్టోరీస్ తీసేందుకు ఇదే రైట్ టైం - యాక్షన్ మూవీస్ ట్రెండ్‌పై ఇంతియాజ్ అలీ రియాక్షన్
TTD Ghee Scam: టీటీడీ కల్తీ నెయ్యి స్కామ్‌పై ఈడీ మెరుపు దాడులు- దేశవ్యాప్తంగా 15 చోట్ల సోదాలు.. రూ.45 కోట్ల ఆస్తులు సీజ్!
టీటీడీ కల్తీ నెయ్యి స్కామ్‌పై ఈడీ మెరుపు దాడులు- దేశవ్యాప్తంగా 15 చోట్ల సోదాలు.. రూ.45 కోట్ల ఆస్తులు సీజ్!
Karnataka Chief Minister DK Shivakumar : కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్! మంత్రులుగా 13 మంది ప్రమాణం 
కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్! మంత్రులుగా 13 మంది ప్రమాణం 
Delhi Fire Accident: ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
Congress Internal Rifts: ఇందిరమ్మ ఇళ్ల కోటా లొల్లి - పల్లెల్లో సెగ రేపుతున్న లబ్ధిదారుల ఎంపిక.. కాంగ్రెస్ నేతల్లోనే అంతర్గత కుమ్ములాటలు!
ఇందిరమ్మ ఇళ్ల కోటా లొల్లి - పల్లెల్లో సెగ రేపుతున్న లబ్ధిదారుల ఎంపిక.. కాంగ్రెస్ నేతల్లోనే అంతర్గత కుమ్ములాటలు!
Peddi USA Collection : పెద్ది ఓవర్సీస్ కలెక్షన్స్ - ప్రీ సేల్స్‌తో మిలియన్ డాలర్ మార్క్
పెద్ది ఓవర్సీస్ కలెక్షన్స్ - ప్రీ సేల్స్‌తో మిలియన్ డాలర్ మార్క్
Embed widget