అన్వేషించండి

Breaking News: బీజేపీ రైతు రాబందు పార్టీ : సీఎం కేసీఆర్

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నవంబర్ 30న జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం

LIVE

Key Events
Breaking News: బీజేపీ రైతు రాబందు పార్టీ : సీఎం కేసీఆర్

Background

తిరుమల శ్రీవారి ఆలయం ఓఎస్డీ డాలర్‌ శేషాద్రి కన్నుమూశారు. గుండెపోటు రావడంతో డాలర్ శేషాద్రి కన్నుమూశారని సమాచారం. కార్తీక దిపోత్సవంలో పాల్గొనేందుకు ఆయన విశాఖపట్నం వెళ్లారు. అక్కడ ఒక్కసారిగా ఛాతీలో నొప్పి రావడంతో డాలర్ శేషాద్రి తుదిశ్వాస విడిచారని అధికారులు తెలిపారు. డాలర్‌ శేషాద్రి 1978 నుంచి శ్రీవారికి సేవలు అందిస్తున్నారు. ఈ క్రమంలో 2007లో ఆయన రిటైర్‌ అయ్యారు. కానీ, ఆయన సేవలు తప్పనిసరి కావడంతో ఓఎస్టీగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆయనకు బాధ్యతలు అప్పగించింది.

ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. కరోనా భారిన పడిన ఆయన ఆరోగ్యం విషమించడంతో హాస్పిటల్ లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. చికిత్స పొందుతూనే ఆయన మరణించినట్లు తెలుస్తోంది. ఈరోజు 8 గంటల సమయంలో ఆయన తుదిశ్వాస విడిచినట్లు సమాచారం. నేటి ఉదయం కుటుంబసభ్యులకు డెడ్ బాడీని అప్పగించారు. సోమవారం మధ్యాహ్నం శివశంకర్ మాస్టర్ అంత్యక్రియలు జరగనున్నాయి.

ఏపీలోని కొండపల్లి మున్సిపాలిటీ ఫలితాలపై నేడు ఉత్కంఠ వీడనుంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయినా ఫలితాలు వెలువడలేదు. ఉద్రిక్తతల నడుమ హైకోర్టు ఆదేశాలతో ఎట్టకేలకు కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక గురువారం జరిగింది. కోర్టు ఉత్తర్వుల మేరకు ఫలితాలను రిజర్వులో ఉంచారు. ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన వీడియోలను ఎన్నికల అధికారులు సీల్డ్‌కవర్‌లో కోర్టుకు పంపారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని ఎక్స్‌ అఫిషియో ఓటుపై ఉన్న అభ్యంతరాలపై స్పష్టత రానుంది. ఆయన ఓటు చెల్లితే టీడీపీకి చైర్మన్‌ పదవికి దక్కుతుంది. చెల్లనిపక్షంలో టాస్‌ ద్వారా చైర్మన్ ఎన్నిక నిర్వహించే అవకాశం ఉంది.

నేడు మరో అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో మరో మూడురోజుల వరకు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. కోమరిన్ ప్రాంతం దానిని అనుకుని ఉన్న శ్రీలంక తీర ప్రాంతం మీద ఉన్న ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. మరో అల్పపీడనం దక్షిణ అండమాన్ సముద్రంలో నవంబర్ 20 తేదీలోగా ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

నేడు, లేదా రేపటిలోగా ఏర్పడనున్న ఈ అల్పపీడనం మరింత బలపడి మరో 48 గంటల్లో పశ్చిమ వాయవ్య దిశలో ప్రయాణించే అవకాశం ఉంది. వరుసగా రెండు అల్పపీడనాలు ఏర్పడటంతో ఏపీ ప్రజల్లో ఆందోళన నెలకొంది. రెండు అల్పపీడనాల ప్రభావంతో ఏపీలో నేడు, రేపు ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురవనున్నాయి. ఆ మరుసటి రోజు సైతం పలు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ముఖ్యంగా దక్షిణ కోస్తాంద్ర, రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అలర్ట్ చేశారు. 

Also Read: Weather Updates: మరో అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీని ముంచెత్తుతున్న వర్షాలు.. మరో రెండు రోజులు దంచికొట్టనున్న వానలు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

20:24 PM (IST)  •  29 Nov 2021

గుత్తివారిపల్లి పొలాల్లో మరణించిన చిరుత పులి... 

చిత్తూరు జిల్లా పెద్దపంజాని మండలం గుత్తివారిపల్లి గ్రామం సమీపంలో వ్యవసాయ పొలాల్లో చిరుత పులి మరణించింది. చనిపోయిన చిరుత పులిని గొర్రెల కాపరులు గుర్తించి అటవీ శాఖ అధికారులకి‌ సమాచారం అందించారు. గత పది రోజుల నుంచి చుట్టు పక్కల గ్రామాల ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్న చిరుత పులి చనిపోవడంతో గ్రామస్తులంతా ఊపిరి పీల్చుకున్నారు. అటవీ సమీపంలో గ్రామం ఉన్నందున ఆవులు, గొర్రెల కాపరులు పొలాల్లో పని చేస్తున్న రైతులు జాగ్రత్త వహించాలని అటవీ శాఖ అధికారులు సూచించారు.

19:28 PM (IST)  •  29 Nov 2021

బీజేపీ రైతు రాబందు పార్టీ : సీఎం కేసీఆర్

దేశంలో ఆహార ధాన్యాలు సేకరిచండం, సేకరించిన ధాన్యాన్ని ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు అందించడం కేంద్ర ప్రభుత్వం బాధ్యత అని సీఎం కేసీఆర్ అన్నారు. ఆహార భద్రత కోసం బఫర్‌ స్టాక్‌ నిల్వ చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. కేబినెట్‌ భేటీ అనంతరం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. కేంద్రం ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేదల వ్యతిరేక విధానాలు అమలుచేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వల్ల అనేక రంగాల్లో ఇబ్బందులు సృష్టిస్తున్నారని కేసీఆర్ మండిపడ్డారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే సిపాయిలా పోరాడాలి కానీ చేతకాని దద్దమ్మాలా మాట్లాడుతున్నారని విమర్శిస్తున్నారన్నారు. బీజేపీ రైతు రాబందు పార్టీ అని విమర్శించారు. 

16:33 PM (IST)  •  29 Nov 2021

భారత్ కివీస్ తొలిటెస్ట్ డ్రా

కాన్పూర్ లో జరుగుతున్న భారత్ కివీస్ తొలి టెస్టు డ్రా గా ముగిసింది. భారత్ స్కోర్ 345/10, 234/7, న్యూజిలాండ్ స్కోర్ 296/10, 165/9. భారత్ విజయాన్ని కివీస్ బ్యాట్స్ మెన్ రచిన్ రవీంద్ర, అజాజ్ పటేల్ అడ్డుకున్నారు. 

15:04 PM (IST)  •  29 Nov 2021

వివేకా కేసులో తెరపైకి మరో వ్యక్తి

వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ హత్య కేసులో మరో వ్యక్తి పేరు తెరపైకి వచ్చింది. అతని పేరు గంగాధర్ రెడ్డి. వివేకానంద రెడ్డి కుమార్తె సునీత, సీబీఐ, మడకశిర ఎస్సై నన్ను వేధించారని గంగాధర్ రెడ్డి అన్నారు. అవినాష్ రెడ్డి, శంకర్ రెడ్డి కలిసి తనతో హత్య చేయించినట్లుగా చెప్పమంటున్నారని ఆయన ఆరోపించాడు. రూ.10 కోట్లు సుపారీ తీసుకున్నట్లుగా చెప్పమంటున్నారని ఆరోపించాడు. సీబీఐ అధికారులు, సీఐ శ్రీరామ్ తనను వేధిస్తున్నారని, అసలు ఆ హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. కాబట్టి, తనకు, తన కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరుతూ జిల్లా ఎస్పీని గంగాధర్ రెడ్డి కలిశారు. 

12:44 PM (IST)  •  29 Nov 2021

ఎగువ అహోబిలం రహదారిలో లోయలో పడ్డ ఆర్టీసీ బస్సు

కర్నూలు జిల్లా ఎగువ అహోబిలం రహదారిలో ఆర్టీసీ బస్సు లోయలో పడింది. బస్సులోని 29 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఎగువ అహోబిలం నుంచి దిగువ అహోబిలంకు వస్తుండగా మలుపు దగ్గర వేగం కంట్రోల్ కాకపోవడంతో ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు లోయలోకి దూసుకెళ్లింది.  బ్రేకులు ఫెయిల్ కావడంతో మలుపు తిప్పే క్రమంలో ప్రమాదవశాత్తూ బస్సులో లోయలో పడిపోయిటన్లు తెలుస్తోంది.

11:19 AM (IST)  •  29 Nov 2021

సోమశిలకు పెరిగిన వరద.. అప్రమత్తమై గేట్లు ఎత్తిన అధికారులు

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు సోమశిలకు వరదనీరు పోటెత్తడంతో ఒకేసారి 12 గేట్లు ఎత్తి ఒకేరోజు 5లక్షల క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేశారు అధికారులు. దీంతో పెన్నా పరివాహక ప్రాంతాలు నీటమునిగాయి. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు అనూహ్యంగా ఇన్ ఫ్లో పెరగడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఒకేరోజు పెద్దఎత్తున నీటిని విడుదల చేయాల్సి వచ్చింది. ఇప్పుడు మరోదఫా అలాంటి పరిస్థితులు రాబోతున్నాయి. ప్రస్తుతం సోమశిల ప్రాజెక్ట్ కి ఇన్ ఫ్లో పెరుగుతోంది. 95వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. అధికారులు ముందు జాగ్రత్తగా మొత్తం 12 గేట్లు ఎత్తేశారు. లక్షా 15వేల క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. పెన్నా పరివాహక ప్రాంతాల ప్రజలు, లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.

11:12 AM (IST)  •  29 Nov 2021

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. లోక్ సభ, రాజ్యసభలలో క్రిప్టో కరెన్సీ మరియు డిజిటల్ కరెన్సీల రెగ్యులైజేషన్ 2021 బిల్లు, నూతన సాగు చట్టాల ఉపసంహరణతో పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. కనీస మద్దతు ధరపై విపక్షాలు కేంద్రాన్ని ప్రశ్నించేందుకు సిద్ధంగా ఉన్నాయి. సాగు చట్టాలు, రైతు సమస్యలపై కాంగ్రెస్ నేతలు మనీష్ తివారీ, మాణికం ఠాగూర్ వాయిదా తీర్మానం నోటీసులు ఇచ్చారు. క్వశ్చన్ అవర్ రద్దుకు కాంగ్రెస్ డిమాండ్ చేసింది.

10:29 AM (IST)  •  29 Nov 2021

డాలర్ శేషాద్రి అంత్యక్రియలు రేపు

రేపు మధ్యాహ్నం డాలర్ శేషాద్రి అంతిమ సంస్కారాలు జరగనున్నాయి. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు రోడ్డు మార్గాన వైజాగ్ నుంచి తిరుపతికి శేషాద్రి పార్దివదేహం బయలుదేరనుంది. అర్దరాత్రికి తిరుపతికి చేరుకోనుంది. రేపు ఉదయం ప్రజల సందర్శనార్థం తిరుపతిలో సిరిగిరి అపార్ట్మెంట్‌లో పార్థీవదేహాన్ని ఉంచేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు మధ్యాహ్నం 2 నుంచి 3 గంటలకు వరకు పూజలు నిర్వహించిన అనంతరం తిరుపతి గోవిందదామంలో అంతిమసంస్కారాలు చేస్తారు.

08:32 AM (IST)  •  29 Nov 2021

శేషాద్రి స్వామి మరణం తీరని లోటు: టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సంతాపం

‘‘తిరుమల శ్రీవారి సేవలో 1978 నుంచి తరిస్తున్న శ్రీపాల శేషాద్రి (డాలర్ శేషాద్రి) స్వామి మరణం టీటీడీకి తీరని లోటు. వైజాగ్‌లో ఈ రోజు టీటీడీ నిర్వహించనున్న కార్తీక దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొనడానికి శేషాద్రి స్వామి వెళ్ళారు. శ్రీవారి సేవే ఊపిరిగా ఆయన పని చేశారు. ఆయన జీవితమంతా స్వామివారి సేవలో తరించిన ధన్య జీవి. అందరితో ప్రేమగా, ఆలయ కార్యక్రమాల్లో అధికారులు, అర్చకులకు పెద్ద దిక్కుగా పని చేశారు. ఆయన మరణ వార్త నన్ను తీవ్ర ఆవేదనకు గురి చేసింది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని శ్రీవారిని ప్రార్థిస్తున్నాను.’’ అని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సంతాపం తెలిపారు.

08:23 AM (IST)  •  29 Nov 2021

దక్షిణ అండమాన్ సముద్రంలో మరో అల్పపీడనం

నేడు, లేదా రేపటిలోగా ఏర్పడనున్న ఈ అల్పపీడనం మరింత బలపడి మరో 48 గంటల్లో పశ్చిమ వాయవ్య దిశలో ప్రయాణించే అవకాశం ఉంది. వరుసగా రెండు అల్పపీడనాలు ఏర్పడటంతో ఏపీ ప్రజల్లో ఆందోళన నెలకొంది. రెండు అల్పపీడనాల ప్రభావంతో ఏపీలో నేడు, రేపు ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురవనున్నాయి. ఆ మరుసటి రోజు సైతం పలు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ముఖ్యంగా దక్షిణ కోస్తాంద్ర, రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అలర్ట్ చేశారు. 

Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Sharmila: మోదీ ఎన్ని మంగళసూత్రాలు తెంచారు, జగన్ ఈ ఐదేళ్లు గాడిదలు కాశారా? - షర్మిల హాట్ కామెంట్స్
మోదీ ఎన్ని మంగళసూత్రాలు తెంచారు, జగన్ ఈ ఐదేళ్లు గాడిదలు కాశారా? - షర్మిల హాట్ కామెంట్స్
Tummala Nageswara Rao :  మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
Pawan Kalyan Assets: నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
Top 5 K Dramas: కొరియన్ డ్రామాలు ఇష్టమా? అయితే ఈ టాప్ 5 లేటెస్ట్ వెబ్ సిరీస్‌లను ట్రై చేయాల్సిందే!
కొరియన్ డ్రామాలు ఇష్టమా? అయితే ఈ టాప్ 5 లేటెస్ట్ వెబ్ సిరీస్‌లను ట్రై చేయాల్సిందే!
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Pawan Kalyan Assets | 5 ఏళ్లలో పవన్ కల్యాణ్ ఆస్తులు 191 శాతం పెరిగాయి.. ఇంత సంపాదన ఎలా వచ్చింది..?Pawan Kalyan Nomination From Pithapuram | పిఠాపురంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ నామినేషన్ దాఖలు | ABPMadhavi Latha vs Asaduddin Owaisi |  పాతబస్తీలో కొడితే దేశవ్యాప్తంగా రీసౌండ్ వస్తుందా..? | ABPAllari Naresh on Aa okkati Adakku | మళ్లీ కామెడీ సినిమాలు చేయటంపై అల్లరి నరేష్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila: మోదీ ఎన్ని మంగళసూత్రాలు తెంచారు, జగన్ ఈ ఐదేళ్లు గాడిదలు కాశారా? - షర్మిల హాట్ కామెంట్స్
మోదీ ఎన్ని మంగళసూత్రాలు తెంచారు, జగన్ ఈ ఐదేళ్లు గాడిదలు కాశారా? - షర్మిల హాట్ కామెంట్స్
Tummala Nageswara Rao :  మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
Pawan Kalyan Assets: నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
Top 5 K Dramas: కొరియన్ డ్రామాలు ఇష్టమా? అయితే ఈ టాప్ 5 లేటెస్ట్ వెబ్ సిరీస్‌లను ట్రై చేయాల్సిందే!
కొరియన్ డ్రామాలు ఇష్టమా? అయితే ఈ టాప్ 5 లేటెస్ట్ వెబ్ సిరీస్‌లను ట్రై చేయాల్సిందే!
Diamonds in Mumbai: న్యూడిల్స్ ప్యాకెట్‌లో డైమండ్స్, రూ.6 కోట్ల విలువైనవి స్వాధీనం
న్యూడిల్స్ ప్యాకెట్‌లో డైమండ్స్, రూ.6 కోట్ల విలువైనవి స్వాధీనం
Pesticides in Protein Powder : మీకు ప్రోటీన్ పౌడర్​ తీసుకునే అలవాటు ఉందా? అయితే జాగ్రత్త.. వాటిలో పురుగులమందులు కలుపుతున్నారట
మీకు ప్రోటీన్ పౌడర్​ తీసుకునే అలవాటు ఉందా? అయితే జాగ్రత్త.. వాటిలో పురుగులమందులు కలుపుతున్నారట
Pratinidhi 2: ప్రతినిధి 2 విడుదల వాయిదా... రాజకీయ ఒత్తిళ్లు పని కాకుండా చేశాయా?
ప్రతినిధి 2 విడుదల వాయిదా... రాజకీయ ఒత్తిళ్లు పని కాకుండా చేశాయా?
KCR Bus Yatra :  పూర్వ వైభవమే లక్ష్యం - కేసీఆర్ బస్సు యాత్రకు సర్వం  సిద్ధం
పూర్వ వైభవమే లక్ష్యం - కేసీఆర్ బస్సు యాత్రకు సర్వం సిద్ధం
Embed widget