అన్వేషించండి

Breaking News: బీజేపీ రైతు రాబందు పార్టీ : సీఎం కేసీఆర్

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నవంబర్ 30న జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం

Key Events
AP Telangana News Live Updates on 29 November 2021 Breaking News: బీజేపీ రైతు రాబందు పార్టీ : సీఎం కేసీఆర్
Today-News-Updates

Background

తిరుమల శ్రీవారి ఆలయం ఓఎస్డీ డాలర్‌ శేషాద్రి కన్నుమూశారు. గుండెపోటు రావడంతో డాలర్ శేషాద్రి కన్నుమూశారని సమాచారం. కార్తీక దిపోత్సవంలో పాల్గొనేందుకు ఆయన విశాఖపట్నం వెళ్లారు. అక్కడ ఒక్కసారిగా ఛాతీలో నొప్పి రావడంతో డాలర్ శేషాద్రి తుదిశ్వాస విడిచారని అధికారులు తెలిపారు. డాలర్‌ శేషాద్రి 1978 నుంచి శ్రీవారికి సేవలు అందిస్తున్నారు. ఈ క్రమంలో 2007లో ఆయన రిటైర్‌ అయ్యారు. కానీ, ఆయన సేవలు తప్పనిసరి కావడంతో ఓఎస్టీగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆయనకు బాధ్యతలు అప్పగించింది.

ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. కరోనా భారిన పడిన ఆయన ఆరోగ్యం విషమించడంతో హాస్పిటల్ లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. చికిత్స పొందుతూనే ఆయన మరణించినట్లు తెలుస్తోంది. ఈరోజు 8 గంటల సమయంలో ఆయన తుదిశ్వాస విడిచినట్లు సమాచారం. నేటి ఉదయం కుటుంబసభ్యులకు డెడ్ బాడీని అప్పగించారు. సోమవారం మధ్యాహ్నం శివశంకర్ మాస్టర్ అంత్యక్రియలు జరగనున్నాయి.

ఏపీలోని కొండపల్లి మున్సిపాలిటీ ఫలితాలపై నేడు ఉత్కంఠ వీడనుంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయినా ఫలితాలు వెలువడలేదు. ఉద్రిక్తతల నడుమ హైకోర్టు ఆదేశాలతో ఎట్టకేలకు కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక గురువారం జరిగింది. కోర్టు ఉత్తర్వుల మేరకు ఫలితాలను రిజర్వులో ఉంచారు. ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన వీడియోలను ఎన్నికల అధికారులు సీల్డ్‌కవర్‌లో కోర్టుకు పంపారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని ఎక్స్‌ అఫిషియో ఓటుపై ఉన్న అభ్యంతరాలపై స్పష్టత రానుంది. ఆయన ఓటు చెల్లితే టీడీపీకి చైర్మన్‌ పదవికి దక్కుతుంది. చెల్లనిపక్షంలో టాస్‌ ద్వారా చైర్మన్ ఎన్నిక నిర్వహించే అవకాశం ఉంది.

నేడు మరో అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో మరో మూడురోజుల వరకు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. కోమరిన్ ప్రాంతం దానిని అనుకుని ఉన్న శ్రీలంక తీర ప్రాంతం మీద ఉన్న ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. మరో అల్పపీడనం దక్షిణ అండమాన్ సముద్రంలో నవంబర్ 20 తేదీలోగా ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

నేడు, లేదా రేపటిలోగా ఏర్పడనున్న ఈ అల్పపీడనం మరింత బలపడి మరో 48 గంటల్లో పశ్చిమ వాయవ్య దిశలో ప్రయాణించే అవకాశం ఉంది. వరుసగా రెండు అల్పపీడనాలు ఏర్పడటంతో ఏపీ ప్రజల్లో ఆందోళన నెలకొంది. రెండు అల్పపీడనాల ప్రభావంతో ఏపీలో నేడు, రేపు ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురవనున్నాయి. ఆ మరుసటి రోజు సైతం పలు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ముఖ్యంగా దక్షిణ కోస్తాంద్ర, రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అలర్ట్ చేశారు. 

Also Read: Weather Updates: మరో అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీని ముంచెత్తుతున్న వర్షాలు.. మరో రెండు రోజులు దంచికొట్టనున్న వానలు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

20:24 PM (IST)  •  29 Nov 2021

గుత్తివారిపల్లి పొలాల్లో మరణించిన చిరుత పులి... 

చిత్తూరు జిల్లా పెద్దపంజాని మండలం గుత్తివారిపల్లి గ్రామం సమీపంలో వ్యవసాయ పొలాల్లో చిరుత పులి మరణించింది. చనిపోయిన చిరుత పులిని గొర్రెల కాపరులు గుర్తించి అటవీ శాఖ అధికారులకి‌ సమాచారం అందించారు. గత పది రోజుల నుంచి చుట్టు పక్కల గ్రామాల ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్న చిరుత పులి చనిపోవడంతో గ్రామస్తులంతా ఊపిరి పీల్చుకున్నారు. అటవీ సమీపంలో గ్రామం ఉన్నందున ఆవులు, గొర్రెల కాపరులు పొలాల్లో పని చేస్తున్న రైతులు జాగ్రత్త వహించాలని అటవీ శాఖ అధికారులు సూచించారు.

19:28 PM (IST)  •  29 Nov 2021

బీజేపీ రైతు రాబందు పార్టీ : సీఎం కేసీఆర్

దేశంలో ఆహార ధాన్యాలు సేకరిచండం, సేకరించిన ధాన్యాన్ని ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు అందించడం కేంద్ర ప్రభుత్వం బాధ్యత అని సీఎం కేసీఆర్ అన్నారు. ఆహార భద్రత కోసం బఫర్‌ స్టాక్‌ నిల్వ చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. కేబినెట్‌ భేటీ అనంతరం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. కేంద్రం ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేదల వ్యతిరేక విధానాలు అమలుచేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వల్ల అనేక రంగాల్లో ఇబ్బందులు సృష్టిస్తున్నారని కేసీఆర్ మండిపడ్డారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే సిపాయిలా పోరాడాలి కానీ చేతకాని దద్దమ్మాలా మాట్లాడుతున్నారని విమర్శిస్తున్నారన్నారు. బీజేపీ రైతు రాబందు పార్టీ అని విమర్శించారు. 

Load More
New Update
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ganja Seized: బ్యాంకాక్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు.. వ్యక్తి లగేజీ చెక్ చేస్తే రూ. 14 కోట్ల గంజాయి
బ్యాంకాక్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు.. వ్యక్తి లగేజీ చెక్ చేస్తే రూ. 14 కోట్ల గంజాయి
Congress guarantees: కారణాలు కాదు హామీల అమలు కావాలి - మాటల చాణక్యంతో ఆర్థిక నిస్సహాయతను రేవంత్ అధిగమిస్తారా?
కారణాలు కాదు హామీల అమలు కావాలి - మాటల చాణక్యంతో ఆర్థిక నిస్సహాయతను రేవంత్ అధిగమిస్తారా?
Hyderabad Biryani:బంజారాహిల్స్‌లో మూడు రోజుల బిర్యానీ విక్రయిస్తున్న హోటల్ సీజ్! ఎలుకలు తిరుగుతున్న ఫ్రిడ్జ్‌లో ఆహారం నిల్వ! 
బంజారాహిల్స్‌లో మూడు రోజుల బిర్యానీ విక్రయిస్తున్న హోటల్ సీజ్! ఎలుకలు తిరుగుతున్న ఫ్రిడ్జ్‌లో ఆహారం నిల్వ! 
CM Revanth Reddy: పినరయి విజయన్‌‌ను గాడ్ ఫాదర్‌లా కాపాడుతున్న మోదీ.. కేరళలో మార్పు తప్పదు- రేవంత్ రెడ్డి
పినరయి విజయన్‌‌ను గాడ్ ఫాదర్‌లా కాపాడుతున్న మోదీ.. కేరళలో మార్పు తప్పదు- రేవంత్ రెడ్డి

వీడియోలు

Bumrah vs Vaibhav Suryavanshi IPL 2026 | బుమ్రా యార్కర్ల ముందు వైభవ్ నిలబడగలడా?
Ashwin about CSK’s Failure IPL 2026 | సీఎస్కే వైఫల్యంపై అశ్విన్ కామెంట్స్
Who Is Prashant Veer CSK IPL 2026 | ఎవరీ ప్రశాంత్ వీర్
Hardik Pandya back in Mumbai Indians Team | ముంబై టీంలోకి కెప్టెన్ హార్దిక్ కమ్‌బ్యాక్
IPL 2026 KKR VS PBKS Cameron Green | వరుసగా విఫలమవుతున్న కామెరూన్ గ్రీన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kurnool Bus Tragedy: ఎమర్జెన్సీ డోర్ మూసేయడంతో 19 ప్రాణాలు పోయాయి. కర్నూలు బస్సు ప్రమాదంపై ASCI నివేదిక
ఎమర్జెన్సీ డోర్ మూసేయడంతో 19 ప్రాణాలు పోయాయి. కర్నూలు బస్సు ప్రమాదంపై ASCI నివేదిక
Share Market: ట్రంప్ సీజ్ ఫైర్ ప్రకటనతో స్టాక్ మార్కెట్లో వైల్డ్ ఫైర్.. సెన్సెక్స్ 2800, నిఫ్టీ 800 పాయింట్లు జంప్
ట్రంప్ సీజ్ ఫైర్ ప్రకటనతో స్టాక్ మార్కెట్లో వైల్డ్ ఫైర్.. సెన్సెక్స్ 2800, నిఫ్టీ 800 పాయింట్లు జంప్
Amaravati Gazette: అమరావతి గెజిట్‌తోనే అన్నీ అయిపోవు - ప్రభుత్వం మూడేళ్లలో చేయాల్సింది చాలా ఉంది - లేకపోతే?
అమరావతి గెజిట్‌తోనే అన్నీ అయిపోవు - ప్రభుత్వం మూడేళ్లలో చేయాల్సింది చాలా ఉంది - లేకపోతే?
Naga Vamsi : మాకు క్లాసులు పీకావ్... ప్రొడ్యూసర్ కష్టాలు తెలిశాయా! - సుప్రియపై నాగవంశీ, మైత్రీ రవి ఫన్ ర్యాగింగ్
మాకు క్లాసులు పీకావ్... ప్రొడ్యూసర్ కష్టాలు తెలిశాయా! - సుప్రియపై నాగవంశీ, మైత్రీ రవి ఫన్ ర్యాగింగ్
Congress guarantees: కారణాలు కాదు హామీల అమలు కావాలి - మాటల చాణక్యంతో ఆర్థిక నిస్సహాయతను రేవంత్ అధిగమిస్తారా?
కారణాలు కాదు హామీల అమలు కావాలి - మాటల చాణక్యంతో ఆర్థిక నిస్సహాయతను రేవంత్ అధిగమిస్తారా?
Toll Tax New Rule: టోల్ ప్లాజాల వద్ద కేవలం క్యాష్‌లెస్ పేమెంట్స్.. ఏప్రిల్ 10 నుంచి FASTAG, UPI ద్వారా చెల్లింపులు
టోల్ ప్లాజాల వద్ద కేవలం క్యాష్‌లెస్ పేమెంట్స్.. ఏప్రిల్ 10 నుంచి FASTAG, UPI ద్వారా చెల్లింపులు
IPL 2026 RR VS MI Result Update: రాజ‌స్థాన్ రాయ‌ల్స్ హ్యాట్రిక్.. ముంబైపై ఘ‌న విజ‌యం.. దుమ్మురేపిన జైస్వాల్, సూర్య‌వంశీ.. ప‌ట్టిక‌లో టాప్ ప్లేస్ కు రాయ‌ల్స్
రాజ‌స్థాన్ రాయ‌ల్స్ హ్యాట్రిక్.. ముంబైపై ఘ‌న విజ‌యం.. దుమ్మురేపిన జైస్వాల్, సూర్య‌వంశీ.. ప‌ట్టిక‌లో టాప్ ప్లేస్ కు రాయ‌ల్స్
Vaibhav Suryavanshi: డేయ్.. బుమ్రా అనుకుంటున్నావా..? లేక టుమ్రీ అనుకున్నావా ఆ కొట్టుడేంది.. బుడ్డోడా..?
డేయ్.. బుమ్రా అనుకుంటున్నావా..? లేక టుమ్రీ అనుకున్నావా ఆ కొట్టుడేంది.. బుడ్డోడా..?
Embed widget