Breaking News Live: చలో విజయవాడకు పోలీసుల అనుమతి నిరాకరణ
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

Background
తెలంగాణలో నేటి నుంచి అన్ని స్కూళ్లు, కాలేజీలు పున:ప్రారంభం కానున్నాయి. కరోనా కేసుల ప్రభావంతో అన్ని విద్యా సంస్థలు మూతపడిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 1 నుంచి పాఠశాలలను తెరుస్తున్నట్లుగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కొద్ది రోజుల క్రితం ప్రకటించారు. కరోనా నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తూ స్కూళ్లు తెరవాలని స్కూల్, హైయర్ ఎడ్యూకేషన్ విభాగాలకు ఆదేశాలు ఇచ్చారు. తొలుత సంక్రాంతికి ఇచ్చిన సెలవులను కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తితో ఈనెల 30 వరకు పొడిగించాల్సి వచ్చింది. మరోవైపు, విద్యా సంస్థల్లో 15 నుంచి 18 ఏళ్ల వారికి వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని వైద్యశాఖకు సూచించింది. ప్రస్తుతం ప్రైవేట్ విద్యాసంస్థలతో పాటు ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ కాలేజీల్లో టీవీ, ఆన్లైన్ తరగతులు జరుగుతున్నాయి.
వాతావరణం
ఏపీలో నేడు, రేపు వాతావరణం పొడిగా ఉంటుందని అమరావతిలోని వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేశారు. అదే సమయంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణంగా నమోదవుతాయని తెలిపారు. వాతావరణ కేంద్రం ప్రకటించిన వివరాల మేరకు.. ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా తక్కువ ఎత్తులో ఉత్తర, ఈశాన్య గాలులు వీస్తున్నాయి. దీని ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకూ సాధారణంగానే కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. కొన్ని చోట్ల మాత్రం సాధారణం కన్నా తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం ప్రాంతాల్లో వచ్చే మూడు రోజులు వాతావరణం వాతావరణం పొడిగా ఉంటుంది. నేడు అక్కడక్కడ పొగమంచు ఏర్పడే అవకాశం ఉంటుంది. సాధారణ కనిష్ఠ ఉష్ణోగ్రతల కన్నా రెండు నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంటుంది.
దక్షిణ కోస్తా ఆంధ్రలో వచ్చే మూడు రోజులు వాతావరణం వాతావరణం పొడిగా ఉంటుంది. నేడు అక్కడక్కడ పొగమంచు ఏర్పడే అవకాశం ఉంటుంది. సాధారణ కనిష్ఠ ఉష్ణోగ్రతల కన్నా రెండు నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంటుంది.
రాయలసీమలోనూ వచ్చే మూడు రోజులు వాతావరణం వాతావరణం పొడిగా ఉంటుంది. నేడు అక్కడక్కడ పొగమంచు ఏర్పడే అవకాశం ఉంటుంది. సాధారణ కనిష్ఠ ఉష్ణోగ్రతల కన్నా రెండు నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంటుంది.
తెలంగాణలో ఇలా..
హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించిన వివరాల మేరకు.. రాష్ట్రమంతా ఎలాంటి వర్ష సూచన లేదు. వాతావరణం పొడిగానే ఉంటుంది. కానీ, రాష్ట్రంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 2 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది.
చలో విజయవాడకు పోలీసుల అనుమతి నిరాకరణ
ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఈనెల 3వ తేదీన తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. ఉద్యోగులు ఇతర ప్రాంతాల నుంచి విజయవాడకు రావొద్దని సూచించారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో చలో విజయవాడ నిర్వహిస్తామని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేస్తున్నాయి.
జీవో 317 చాలా గొప్పది.. దీన్ని వ్యతిరేకించిన వాళ్ల గూబ పగలగొట్టండి: కేసీఆర్
తెలంగాణలో యువతు, ఉద్యోగులకు మేలు చేసేలా జీవో 317 తీసుకొచ్చాం: కేసీఆర్
కొందరు స్వార్థపరులైన ఉద్యోగులు దీన్ని వ్యతిరేకిస్తున్నారు: కేసీఆర్
ఇలా వ్యతిరేకించేవాళ్ల గూబ పగలకొట్టండి: కేసీఆర్
ఈ జీవో ప్రకారం చాలా మంది జాయిన్ అయ్యారు: కేసీఆర్
ఇంకా 57మంది జాయిన్ కాలేదు: కేసీఆర్
వాళ్ల కోసం కొందరు ఉద్యమం అంటున్నారు: కేసీఆర్





















