అన్వేషించండి

Nizamabad: నిజామాబాద్ జిల్లాలో మళ్లీ కల్తీ కల్లు తయారీ.. తాగిన వారికి అస్వస్థత

నిజామాబాద్ జిల్లాలో కల్తీ కల్లు మరోసారి బయటపడింది. బోధన్ లో మళ్లీ కల్తీ కల్లు బాగోతం వెలుగులోకి వచ్చింది.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కల్తీ కల్లు అమ్మకాలు ఆగటం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాటి, ఈత చెట్లను వచ్చే కల్లును గతంలో కల్లు వ్యాపారులు అమ్మేవారు. కానీ రాను రాను బట్టిల్లో చెట్ల కల్లుకు బదులు కృత్రిమ కల్లు విక్రయిస్తున్నారని తెలుస్తోంది. ఆల్ఫాజోలోం, డైజోఫాం, క్లోరో హైడ్రెట్ వంటి రసాయనాలు కలిపి కల్లును కృత్రిమంగా తయారు చేస్తున్నారని తెలుస్తోంది. ఇది చాలా ప్రమాదకరం అని తెలిసినా కల్లు వ్యాపారులు వీటినే వాడుతూ కల్లును తయారు చేస్తూ విక్రయిస్తున్నారని అంటున్నారు.

తక్కువ ధరకు దొరుకుతుందని కూలీలు, హమాలీలు, గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు కల్లును తాగుతారు. అయితే చెట్ల కల్లుకు బదులు కృత్రిమ కల్లు తయారు చేసి అమ్మటంతో చాలా మంది అనారోగ్యం పాలవుతున్నారు. ఈ నెల 18న బోధన్ మండలం సంగం గ్రామంలోని వెంకటేశ్వర స్వామి జాతరలో కల్తీకల్లు సేవించిన వారు అస్వస్థతకు గురయ్యారు. ఆస్పత్రుల పాలయ్యారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో305 కల్లు సోసైటీలు ఉన్నాయి. వీరు కల్లు అమ్మకాలు సాగిస్తున్నారు. అయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సరిపడా ఈత, తాటి చెట్లు లేవు. వాటి నుంచి వచ్చే కల్లు డిపోలకు పూర్తిస్తాయిలో సరిపోదు. దీంతో కొందరు నిషేధిత క్లోరో హైడ్రెట్, అల్పాజోలోం, డైజోఫాం వంటి రసాయనాలను కలిపి కృత్రిమ కల్లును తయారు చేస్తూ అమ్మకాలు జరుపుతున్నట్లు సమాచారం.

డిపోలపై నిఘా ఉంచాల్సిన ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవటం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కల్తీ కల్లు తయారీ జరుగుతోందన్న విషయం తెలిసినా అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదన్న వాదనా ఉంది. రసాయనాలు కలిపి కృత్రిమ కల్లు తయారు చేస్తూ విక్రయించటం వల్ల అమయాకుల ప్రాణాలకు ఇబ్బందిగా మారింది. మొన్న బోధన్ మండలం సంగం గ్రామంలో జరిగిన ఘటనే ఇందుకు ఊదాహరణగా చెప్పొచ్చు. కల్తీ కల్లు సేవించటం వల్లే వారంతా అస్వస్థతకు గురయ్యారని వైద్యులు తెలిపారు. ఆరోగ్యానికి హాని చేసే రసాయనాలను కలిపి కృత్రిమ కల్లు తయారు చేయటం వల్ల ప్రజల ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావం చూపుతుందని డాక్టర్లు చెబుతున్నారు. ఇక నైనా ఈ కల్తీ కల్లుకు ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని కోరుతున్నారు జిల్లా వాసులు.

Also Read: AP Vs Telangana : విద్యుత్ బకాయిల గొడవ మీరే పరిష్కరించుకోండి... తెలుగు రాష్ట్రాలకు తేల్చేసిన కేంద్రం !

Also Read: YSRCP Attack : మద్యం ధరలపై వాగ్వాదం... టీడీపీ కార్యకర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు !

టాప్ హెడ్ లైన్స్

Breaking News:పాస్‌పోర్ట్ ఫీజులను భారీగా పెంచిన కేంద్రం!
పాస్‌పోర్ట్ ఫీజులను భారీగా పెంచిన కేంద్రం!
Kalvakuntla Kavitha Local Status Speech: గ్రూప్-1లో 200 మంది పక్క రాష్ట్రాల వాళ్లే - రేవంత్ సర్కార్‌పై కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు.. జూలై 2న మిలియన్ మార్చ్!
గ్రూప్-1లో 200 మంది పక్క రాష్ట్రాల వాళ్లే - రేవంత్ సర్కార్‌పై కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు.. జూలై 2న మిలియన్ మార్చ్!
CM Revanth Reddy Gumpu Mestri Speech: అవును.. నేను గుంపు మేస్త్రినే, ఈ ప్రజలే నా బలం - దొరల పోకడల్లేవ్ - సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!
అవును.. నేను గుంపు మేస్త్రినే, ఈ ప్రజలే నా బలం - దొరల పోకడల్లేవ్ - సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Tungabhadra Dam 33 Crest Gates Inauguration: గోదావరి-కృష్ణా-కావేరి అనుసంధానం - తుంగభద్ర కార్యక్రమంలో సీఎంల కీలక ప్రకటనలు
గోదావరి-కృష్ణా-కావేరి అనుసంధానం - తుంగభద్ర కార్యక్రమంలో సీఎంల కీలక ప్రకటనలు

వీడియోలు

NBK112 Pooja Ceremony Balakrishna | NBK112 పూజా కార్యక్రమం
Gundenininda Gudigantalu Serial June 25 | బాలు సక్సెస్‌తో ప్రభావతి బ్యాచ్‌కి మైండ్ బ్లాక్
Hardik Pandya To KKR For IPL 2027? | ముంబైని వీడనున్న హార్దిక్? KKR లోకి భారీ డీల్
Vaibhav Suryavanshi Debuting vs Ireland | సూర్యవంశీ ఎంట్రీపై మాజీల షాకింగ్ కామెంట్స్
ICC Rankings 2026 Shubman Gill | వన్డే ర్యాంకింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ సంచలనం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kalvakuntla Kavitha Local Status Speech: గ్రూప్-1లో 200 మంది పక్క రాష్ట్రాల వాళ్లే - రేవంత్ సర్కార్‌పై కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు.. జూలై 2న మిలియన్ మార్చ్!
గ్రూప్-1లో 200 మంది పక్క రాష్ట్రాల వాళ్లే - రేవంత్ సర్కార్‌పై కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు.. జూలై 2న మిలియన్ మార్చ్!
IAS Y Srilakshmi GAD Post: వివాదాల ఐఏఎస్ వై. శ్రీలక్ష్మికి జీఏడీ పోస్టింగ్.. రిటైర్మెంట్‌కు 4 రోజుల ముందు కూటమి సర్కార్ ఊరట!
వివాదాల ఐఏఎస్ వై. శ్రీలక్ష్మికి జీఏడీ పోస్టింగ్.. రిటైర్మెంట్‌కు 4 రోజుల ముందు కూటమి సర్కార్ ఊరట!
Balakrishna : ఏపీలో నంది అవార్డ్స్ - బాలయ్య గుడ్ న్యూస్
ఏపీలో నంది అవార్డ్స్ - బాలయ్య గుడ్ న్యూస్
Breaking News:పాస్‌పోర్ట్ ఫీజులను భారీగా పెంచిన కేంద్రం!
పాస్‌పోర్ట్ ఫీజులను భారీగా పెంచిన కేంద్రం!
Gold Price: పది గ్రాముల బంగారం ₹2 లక్షలు! షాకింగ్ న్యూస్ చెప్పిన ప్రపంచ బ్రోకరేజ్ సంస్థ!
పది గ్రాముల బంగారం ₹2 లక్షలు! షాకింగ్ న్యూస్ చెప్పిన ప్రపంచ బ్రోకరేజ్ సంస్థ!
SEBI New Rules 2026: 5 లక్షల ఫాలోవర్స్‌ ఉంటే మీరు సెలబ్రిటీనే! సెబీ నుంచి బిగ్ అప్‌డేట్‌!
5 లక్షల ఫాలోవర్స్‌ ఉంటే మీరు సెలబ్రిటీనే! సెబీ నుంచి బిగ్ అప్‌డేట్‌!
Darshanam Mogilaiah Land Dispute: వివాదాల్లో ఉన్న భూమి ఇచ్చిన కేసీఆర్ ప్రభుత్వం - కోర్టుల చుట్టూ తిరుగుతున్న దర్శనం మొగిలయ్య - ఆదుకోవాలని వేడుకోలు
వివాదాల్లో ఉన్న భూమి ఇచ్చిన కేసీఆర్ ప్రభుత్వం - కోర్టుల చుట్టూ తిరుగుతున్న దర్శనం మొగిలయ్య - ఆదుకోవాలని వేడుకోలు
Dharman OTT : రజనీ ధర్మన్ ఓటీటీ డీల్ క్లోజ్ - రిలీజ్‌కు ముందే రికార్డులు
రజనీ ధర్మన్ ఓటీటీ డీల్ క్లోజ్ - రిలీజ్‌కు ముందే రికార్డులు
Embed widget