అన్వేషించండి

Skill University: స్కిల్ యూనివర్శిటీకి అదానీ గ్రూప్ రూ.100 కోట్ల విరాళం - సీఎం రేవంత్ రెడ్డికి చెక్కు అందజేత

Telangana News: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన స్కిల్ యూనివర్శిటీకి అదానీ గ్రూప్ భారీ విరాళం ఇచ్చింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

Adani Group Huge Donation To Skill University: యువతకు ఉపాధి అవకాశాలు మెరుగయ్యే లక్ష్యంతో వారిలో నైపుణ్యాలు పెంపొందించేందుకు తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) ప్రతిష్టాత్మకంగా స్కిల్ యూనివర్శిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్శిటీకి అదానీ గ్రూప్ భారీ విరాళం ప్రకటించింది. ఈ మేరకు అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ (Gautam Adani) శుక్రవారం హైదరాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి రూ.100 కోట్ల చెక్కును అందజేశారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఈ సమావేశంలో అదానీ గ్రూప్ ఫౌండేషన్ ప్రతినిధులు, సీఎస్ శాంతికుమారి, ఇతర అధికారులు ఉన్నారు. కాగా, ఇటీవలే స్కిల్ వర్శిటీ వీసీ సహా బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, ఇతర నియామకాలు చేపట్టారు. వర్శిటీ వీసీగా కేంద్ర ప్రభుత్వంలో ప్రిన్సిపల్ ఎకనమిక్ అడ్వయిజర్‌గా పదవీ విరమణ చేసిన వీఎల్‌వీఎస్ఎస్ సుబ్బారావు పేరు ఖరారు చేశారు. యూనివర్శిటీ బోర్డు ఛైర్మన్‌గా పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రాను నియమించారు.

రంగారెడ్డి జిల్లా ముచ్చర్లలోని బేగరికంచెలో తెలంగాణ ప్రభుత్వం స్కిల్ యూనివర్శిటీ ఏర్పాటుకు ఇటీవల సీఎం రేవంత్ శంకుస్థాపన చేశారు. బేగరికంచెలో సొంత భవనం పూర్తయ్యే వరకూ గచ్చిబౌలిలోని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా భవనంలో వర్శిటీ కార్యకలాపాలు కొనసాగనున్నాయి. 17 రకాల కోర్సుల్లో యువతకు శిక్షణ ఇచ్చి ప్రైవేట్ సంస్థల్లో ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. ఏటా లక్ష మందికి శిక్షణ ఇచ్చేలా రాబోయే కాలంలో ఈ వర్శిటీని విస్తరించనున్నారు. ఈ ఏడాది నుంచే ప్రవేశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఇప్పటికే దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. నవంబర్ 4వ తేదీ నుంచి స్కిల్ యూనివర్శిటీలో కోర్సులు ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతానికి ప్రాధాన్యం ఉన్న 6 కోర్సులతో మొదలు పెట్టి తర్వాత కోర్సులు పెంచనున్నారు. లాజిస్టిక్స్, ఈ కామర్స్, హెల్త్ కేర్, ఫార్మాసుటికల్స్, లైఫ్ సైన్సెస్ విభాగాల్లో యువతకు నైపుణ్యాలు పెంపొందించే విధంగా శిక్షణ ఇవ్వనున్నారు. 

మూడేళ్లలో 18 విభాగాలు

స్కిల్ యూనివర్శిటీలో మూడు దశల్లో 18 రంగాలకు చెందిన విభాగాల్లో యువతకు శిక్షణ ఇవ్వనున్నారు. తొలిదశలో ఈ కామర్స్, హెల్త్ కేర్, ఫార్మాస్యూటికల్స్ అండ్ లైఫ్ సైన్సెస్, యూనిమేషన్ - విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్, కన్‌స్ట్రక్షన్ రంగాలకు చెందిన స్కూళ్లు ప్రారంభం కానున్నాయి. రెండో దశలో ఫుడ్ ప్రాసెసింగ్, టూరిజం, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, తర్వాత డిజిటల్ డిజైన్, ఎలక్ట్రానిక్స్ - సెమీ కండక్టర్స్ ఉన్నాయి. మొదటి దశలో 2 వేల మందికి, రెండో దశలో 10 వేల మందికి, మూడో దశలో 20 వేల మందికి పెంచాలన్నది లక్ష్యం. వర్శిటీలో కోర్సును బట్టి 3 నెలల నుంచి ఏడాది వరకూ ఉంటుంది.

Also Read: Telangana Group One: షెడ్యూల్ ప్రకారమే గ్రూప్ 1 పరీక్షలు - హైకోర్టు డివిజన్ బెంచ్‌లోనూ ప్రభుత్వానికే అనుకూల తీర్పు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kasibugga Stampede Exgratia: కాశీబుగ్గ తొక్కిసలాట మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
కాశీబుగ్గ తొక్కిసలాట మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
Hyderabad Metro Timings: హైదరాబాద్‌ వాసులకు అలర్ట్.. ఈ 3 నుంచి మెట్రో రైలు టైమింగ్స్‌లో మార్పులు
హైదరాబాద్‌ వాసులకు అలర్ట్.. ఈ 3 నుంచి మెట్రో రైలు టైమింగ్స్‌లో మార్పులు
SSMB 29 నుంచి అప్‌డేట్‌ల వెల్లువ..  రాజమౌళి మహేష్ అర్థరాత్రి అంతా లీక్ చేసి పడేశారుగా
SSMB 29 నుంచి అప్‌డేట్‌ల వెల్లువ.. రాజమౌళి మహేష్ అర్థరాత్రి అంతా లీక్ చేసి పడేశారుగా
Rajamouli - Rana Daggubati: ఒక అబద్దంతో టాలీవుడ్ చరిత్రను మార్చేశాడు... తెలుగు సినిమా పొగరు బాహుబలి కాదు, భళ్లాల దేవుడు
ఒక అబద్దంతో టాలీవుడ్ చరిత్రను మార్చేశాడు... తెలుగు సినిమా పొగరు బాహుబలి కాదు, భళ్లాల దేవుడు
Advertisement

వీడియోలు

Stampedes in India 2025 | తొక్కిసలాటలతో నిండిపోయిన 2025 సంవత్సరం | ABP Desam
భారత్, సౌతాఫ్రికా మ్యాచ్‌కు వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దయితే విన్నర్ ఎవరు?
చరిత్ర సృష్టించడానికి అడుగు దూరంలో భారత్, సౌత్‌ఆఫ్రికా
అయ్యో పాపం.. దూబే రికార్డ్ పోయిందిగా..!
భారత మహిళల టీమ్ తలరాత  మార్చిన ద్రోణాచార్యుడు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kasibugga Stampede Exgratia: కాశీబుగ్గ తొక్కిసలాట మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
కాశీబుగ్గ తొక్కిసలాట మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
Hyderabad Metro Timings: హైదరాబాద్‌ వాసులకు అలర్ట్.. ఈ 3 నుంచి మెట్రో రైలు టైమింగ్స్‌లో మార్పులు
హైదరాబాద్‌ వాసులకు అలర్ట్.. ఈ 3 నుంచి మెట్రో రైలు టైమింగ్స్‌లో మార్పులు
SSMB 29 నుంచి అప్‌డేట్‌ల వెల్లువ..  రాజమౌళి మహేష్ అర్థరాత్రి అంతా లీక్ చేసి పడేశారుగా
SSMB 29 నుంచి అప్‌డేట్‌ల వెల్లువ.. రాజమౌళి మహేష్ అర్థరాత్రి అంతా లీక్ చేసి పడేశారుగా
Rajamouli - Rana Daggubati: ఒక అబద్దంతో టాలీవుడ్ చరిత్రను మార్చేశాడు... తెలుగు సినిమా పొగరు బాహుబలి కాదు, భళ్లాల దేవుడు
ఒక అబద్దంతో టాలీవుడ్ చరిత్రను మార్చేశాడు... తెలుగు సినిమా పొగరు బాహుబలి కాదు, భళ్లాల దేవుడు
Jubilee Hills By Elections: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికపై కేకే సర్వే ఫలితాలు వెల్లడి.. వారికి బిగ్ రిలీఫ్
జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికపై కేకే సర్వే ఫలితాలు వెల్లడి.. వారికి బిగ్ రిలీఫ్
Maruti e Vitara Car: మారుతి సుజుకీ తొలి ఎలక్ట్రిక్ కారు విడుదలకు అంతా సిద్ధం- ఫీచర్లు, మైలేజ్ రేంజ్ పూర్తి వివరాలు
మారుతి సుజుకీ తొలి ఎలక్ట్రిక్ కారు విడుదలకు అంతా సిద్ధం- ఫీచర్లు, మైలేజ్ రేంజ్ పూర్తి వివరాలు
Srikakulam Stampede News: శ్రీకాకుళం కాశీబుగ్గ తొక్కిసలాట దుర్ఘటనపై చంద్రబాబు సీరియస్,  నిర్వాహకుల అరెస్టుకు ఆదేశం!
శ్రీకాకుళం కాశీబుగ్గ తొక్కిసలాట దుర్ఘటనపై చంద్రబాబు సీరియస్, నిర్వాహకుల అరెస్టుకు ఆదేశం!
Top 5 Most Affordable Cars: దేశంలో అత్యంత చవకైన కార్లు ఇవే.. మారుతి ఆల్టో నుంచి సెలెరియో వరకు బడ్జెట్ కార్లు
దేశంలో అత్యంత చవకైన కార్లు ఇవే.. మారుతి ఆల్టో నుంచి సెలెరియో వరకు బడ్జెట్ కార్లు
Embed widget