ABP Southern Rising Summit 2024 Live Updates: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు - సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
ABP Southern Rising Summit 2024: ఏబీపీ నెట్వర్క్ 'ది సదరన్ రైజింగ్ సమ్మిట్'కు సర్వం సిద్ధమైంది. హైదరాబాద్లో జరిగే ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ, సినీ, వ్యాపార, క్రీడా ప్రముఖులు పాల్గొంటున్నారు.
LIVE

Background
ఐఏఎస్ కావాలని ఉండేది - నటి రాశీ ఖన్నా
ABP Southern Rising Summit 2024: కాలేజీలో ఉన్నప్పుడు తనకు ఐఏఎస్ కావాలనే కోరిక ఉండేదని నటి రాశీ ఖన్నా వెల్లడించారు. ఆమె 12వ తరగతిలో 91 శాతం ఉత్తీర్ణత సాధించి, లేడీ శ్రీరాం కాలేజీలో బ్యాచిలర్స్ చదివారు. తన స్నేహితురాలితో కలిసి ముంబై వెళ్లి మద్రాస్ కేఫ్ కోసం ఆడిషన్కు వచ్చినప్పుడు యాధృచ్ఛికంగా నటి అయ్యానని ఆమె ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్లో చెప్పారు.
గుజరాత్ అల్లర్ల ఆధారంగా 'ద సబర్మతి రిపోర్ట్' - నటి రాశీ ఖన్నా
ABP Southern Rising Summit 2024: ప్రముఖ నటి రాశిఖన్నా ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన రాబోయే చిత్ర 'ది సబర్మతి రిపోర్ట్' గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఇది 2002 గుజరాత్ అల్లర్ల ఆధారంగా రూపొందించబడింది.
ఒకే రోజు 20 సెషన్లు.. ఇది ఎంతో గొప్ప విషయం - ఏబీపీ దేశం ఎడిటర్ నాగేశ్వరరావు
ABP Southern Rising Summit 2024: ఇది ఎంత గొప్ప రోజని.. ఉదయం నుంచి ప్రముఖ రాజకీయ నాయకులు, గొప్ప నటుల డిబేట్స్ విజయవంతంగా జరిగాయని ఏబీపీ దేశం ఎడిటర్ నాగేశ్వరరావు చెప్పారు. 'ఒకే రోజు 20 కంటే ఎక్కువ సెషన్లను చూశాం. ఇది గొప్ప రోజు. గొప్ప వక్తలు, ప్యానెలిస్ట్ల నుంచి అనుభవాలు ఈ ఈవెంట్ను విజయవంతం చేసిన స్పీకర్లు, ప్లానెలిస్ట్లు మరియు ప్రతినిధులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.' అని పేర్కొన్నారు.
నా పొలాలు ప్రకృతితో స్నేహాన్ని ప్రతిబింబిస్తాయి - ప్రకాష్ రాజ్
ABP Southern Rising Summit 2024: నాసిరకంగా ఉన్న పొలాలను కొనుగోలు చేసి వాటి పరిస్థితిని మెరుగుపరిచేందుకు కృషి చేశానని నటుడు ప్రకాష్ రాజ్ చెప్పారు. ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్లో ఆయన వ్యవసాయంపై తనకున్న ప్రేమ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. నగరాల్లో తనకు సొంత ఇళ్లు లేవని.. తన పొలాలన్నీ ప్రకృతితో తన స్నేహాన్ని ప్రతిబింబిస్తాయని చెప్పారు.
నన్ను నమ్మిన వారి గొంతుకగా నిలబడతా - నటుడు ప్రకాష్ రాజ్
ABP Southern Rising Summit 2024: తనను నమ్మిన వారి గొంతుకగా నిలబడడం తన బాధ్యత అని ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ అన్నారు. ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్లో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా జర్నలిస్ట్ గౌరీ లంకేష్ను కోల్పోవడం గురించి పంచుకున్నారు. 'నా స్నేహితురాలు గౌరీ లంకేష్ గొంతు పెంచినందుకే ఆమెను కాల్చిచంపారు.' అని అన్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

