ABP Southern Rising Summit 2024 Live Updates: హైదరాబాద్ అంటే అంతకు మించి - నటుడు మహమ్మద్ అలీ బేగ్
ABP Southern Rising Summit 2024: ఏబీపీ నెట్వర్క్ 'ది సదరన్ రైజింగ్ సమ్మిట్'కు సర్వం సిద్ధమైంది. హైదరాబాద్లో జరిగే ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ, సినీ, వ్యాపార, క్రీడా ప్రముఖులు పాల్గొంటున్నారు.
LIVE
Background
ABP Southern Rising Summit 2024 Live Updates: దేశంలో పలు భాషల్లో మీడియా సంస్థలను నిర్వహిస్తోన్న ప్రముఖ మీడియా సంస్థ ఏబీపీ నెట్వర్క్ సదరన్ రైజింగ్ సమ్మిట్కు సర్వం సిద్ధమైంది. దేశ ప్రగతిలో దక్షిణాది విజయాలను మరింత బలంగా వినిపించేలా రెండో ఎడిషన్ సదరన్ రైజింగ్ సదస్సు హైదరాబాద్లో శుక్రవారం ప్రారంభమైంది. ఈ సమ్మిట్లో దక్షిణాది రాజకీయ, సాంస్కృతిక, పారిశ్రామిక, క్రీడా రంగాల్లో చెరగని ముద్ర వేసిన ప్రముఖులు తమ అభిప్రాయాలను తెలియజేస్తారు. Coming of Age: Identity, Inspiration, Impact”, అనే థీమ్తో నిర్వహిస్తున్న ఈ సమ్మిట్లో కీలకమైన రాజకీయ, సాంస్కృతిక, విద్య, ఆరోగ్య సంరక్షణతో పాటు దక్షిణాది ప్రత్యేకతను నిలబెట్టుకునే అంశంపై ప్రభావవంతమైన చర్చలు జరుగుతాయి. ఈ సదస్సు దేశ అభివృద్ధి, ప్రగతిలో దక్షిణ భారత ప్రాధాన్యతను అందులో ఈ వ్యక్తుల పాత్రను ఆవిష్కరిస్తుంది. "ది సదరన్ రైజింగ్ సమ్మిట్" జాతీయ కోణంలో దక్షిణాది ప్రాధాన్యతను మరోసారి ప్రముఖంగా ప్రస్తావించనుంది. అలాగే ఆయా రంగాల్లో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు సన్నద్ధం కావాల్సిన అంశాల ప్రముఖులు తమ ఆలోచనలు పంచుకుంటారు.
సదస్సులో పాల్గొనే ప్రముఖులు వీరే
సౌతిండియా నుంచి అగ్రశ్రేణి రాజకీయ, పారిశ్రామిక, సినీ రంగాలకు చెందిన ప్రముఖులు, రచయతలు, వ్యాపారులు ఇందులో పాల్గొంటున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సదస్సును ప్రారంభించి తన విజన్ను ఆవిష్కరిస్తారు. కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు తన అంతరంగాన్ని ఆవిష్కరిస్తారు. ఇండియన్ బాడ్మింటన్ దిగ్గజం, పద్మభూషణ్ పుల్లెల గోపీచంద్, స్టార్ హీరో సాయి దుర్గా తేజ్, నటి రాశీఖన్నా, జాతీయ నటుడు ప్రకాష్ రాజ్, మంజుమ్మల్ బాయ్స్ దర్శకుడు, రచయిత చిదంబరం, వెటరన్ యాక్టర్ గౌతమి వంటి ప్రముఖులు పాల్గొంటున్నారు.
అటు, పలువురు రాజకీయ ప్రముఖులు సైతం ఈ సదస్సులో పాల్గొని ప్రసంగిస్తారు. రాజకీయ రంగంలో దక్షిణాది నుంచి తమదైన ముద్ర వేసిన యువనేతలు సదస్సుకు హాజరవుతున్నారు. బీజేపీ నేత కొంపెల్ల మాధవి, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిది డాక్టర్ షామా మహమ్మద్, తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ లీడర్ మధుయాష్కీ గౌడ్, బీజేపీ ఎంపీ రఘునందన్ వంటి వారు కూడా దక్షిణాది రాజకీయ రంగం భవిష్యత్లో దేశంలో పోషించబోతున్న పాత్రపై తమ విశ్లేషణను అందిస్తారు. అలాగే సాంస్కృతిక రంగం నుంచి క్లాసికల్ సింగర్ బిందు సుబ్రహ్మణ్యం, అవార్డు విన్నింగ్ సింగల్ శిల్పారావు, క్లాసికల్ డ్యాన్సర్, మూడుసార్లు జాతీయ అవార్డు పొందిన యామినిరెడ్డి దక్షిణాది కల్చర్ హెరిటేజ్ను హైలెట్ చేస్తారు. అదే సమయంలో దక్షిణాది భవిష్యత్లో ఎలా దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందో రచయిత, చరిత్రకారుడు డాక్టర్ విక్రమ్ సంపత్ చర్చిస్తారు. అలాగే, స్టార్టప్ల్లో తనదైన ముద్ర వేసిన రాపిడో కో ఫౌండర్ అరవింద్ సంకా.. యువత మరింత వేగంగా వ్యాపార రంగంలో రాణించడానికి ఎలాంటి పాలసీలు అవసరమో... ప్రభుత్వాల వైపు నుంచి ఎలాంటి సహకారం ఉంటే అద్భుతాలు సృష్టించవచ్చో అన్న అంశాలపై తన అభిప్రాయాలు పంచుకుంటారు.
అన్ని రంగాల్లోనూ దక్షిణాది పాత్రను చాటేలా 'సదరన్ రైజింగ్ సమ్మిట్' జరగనుంది. దేశాభివృద్ధిలో దక్షిణాది పాత్రను సెలబ్రేట్ చేసుకునేలా ఈ కార్యక్రమం జరుగుతుంది.
హైదరాబాద్ అంటే అంతకు మించి - నటుడు మహ్మద్ అలీ బేగ్
ABP Southern Rising Summit 2024: హైదరాబాద్ అంటే ఛార్మినార్, బిర్యానీ మాత్రమే కాదని అంతకు మించి అని ప్రముఖ నటుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత మహమ్మద్ అలీ బేగ్ అన్నారు. ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్లో ఆయన మాట్లాడారు. భాగ్యనగరం.. ఛార్మినార్, ముత్యాలు, బిర్యానీ కంటే గొప్పదని పేర్కొన్నారు. సాహిత్యం, ప్రదర్శన కళలను సముచిత ప్రేక్షకులకు మించి తీసుకెళ్లాలని అభిప్రాయపడ్డారు.
భారతదేశంలో అది సులభం కాదు - దినేష్ విక్టర్
ABP Southern Rising Summit 2024: భారతదేశంలో మహిళలు తమ శని, ఆదివారాల్లో ఫ్రీగా గడపడం అంత సులభం కాదని.. ఇది అభినందనీయమని SIP అకాడమీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ CEO దినేష్ విక్టర్ అన్నారు. తమ సంస్థలో ఎక్కువ భాగం మహిళలే పని చేస్తున్నారని చెప్పారు. ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్లో ఆయన పాల్గొన్నారు.
ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్లో ప్రముఖ గాయని బిందు సుబ్రమణ్యం అద్భుత ప్రదర్శన
ABP Southern Rising Summit 2024: ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్లో ప్రముఖ గాయని సుబ్రమణ్యం అకాడమీ సహ వ్యవస్థాపకురాలు, సీఈవో బిందు సుబ్రమణ్యం పాల్గొన్నారు. ఈ సందర్భంగా గణపతి భజన అనంతరం 'బేబీ ఐయామ్ ఎ ఫూల్' పాటను ప్రదర్శించారు. అనంతరం నెట్ఫ్లిక్స్ సిరీస్ మనీ హీస్ట్ ద్వారా ప్రాచుర్యం పొందిన బెల్లా సియావో పాటను పాడారు. ప్రత్యక్ష ప్రసారం చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
మీ డేటాపై మీ నిర్ణయమే ఫైనల్ - మ్యాప్ మైజెనోమ్ సీఈవో అను ఆచార్య
ABP Southern Rising Summit 2024: మీ జీనోమ్ పరీక్షల నుంచి వచ్చే డేటా పూర్తి ప్రైవేట్గా ఉంటుందని మ్యాప్ మైజెనోమ్ సీఈవో అను ఆచార్య స్పష్టం చేశారు. ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్లో ఆమె పాల్గొన్నారు. మీ సొంత నిర్ణయంతో షేర్ చేస్తే తప్ప ఆ సమాచారం షేర్ కాదని అన్నారు. కొవిడ్ మహమ్మారి తర్వాత, ప్రజలు ఇప్పుడు తమ గురించి, తమ DNA గురించి తెలుసుకోవాలనే ఆసక్తిని కలిగి ఉన్నారని పేర్కొన్నారు.
గళం విప్పితే జాతీయ వ్యతిరేకులుగా పరిగణిస్తారు - కాంగ్రెస్ నేత మధుయాష్కీ గౌడ్
ABP Southern Rising Summit 2024: దేనిపై గళం విప్పినా మనల్ని జాతీయ వ్యతిరేకులుగా పరిగణిస్తారని కాంగ్రెస్ నేత మధుయాష్కీ గౌడ్ అన్నారు. ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ నేత రఘునందన్ రావు వ్యాఖ్యలపై ఆయన స్పందించారు.