అన్వేషించండి

ABP Southern Rising Summit 2024 Live Updates: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు - సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్

ABP Southern Rising Summit 2024: ఏబీపీ నెట్‌వర్క్ 'ది సదరన్ రైజింగ్ సమ్మిట్'కు సర్వం సిద్ధమైంది. హైదరాబాద్‌లో జరిగే ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ, సినీ, వ్యాపార, క్రీడా ప్రముఖులు పాల్గొంటున్నారు.

Key Events
ABP network second edition of southern rising summit 2024 in hyderabad live updates ABP Southern Rising Summit 2024 Live Updates: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు - సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్ లైవ్ అప్ డేట్స్
Source : ABP Desam

Background

ABP Southern Rising Summit 2024 Live Updates: దేశంలో పలు భాషల్లో మీడియా సంస్థలను నిర్వహిస్తోన్న ప్రముఖ మీడియా సంస్థ ఏబీపీ నెట్‌వర్క్ సదరన్ రైజింగ్ సమ్మిట్‌కు సర్వం సిద్ధమైంది. దేశ ప్రగతిలో దక్షిణాది విజయాలను మరింత బలంగా వినిపించేలా రెండో ఎడిషన్ సదరన్ రైజింగ్ సదస్సు హైదరాబాద్‌లో శుక్రవారం ప్రారంభమైంది. ఈ సమ్మిట్‌లో దక్షిణాది రాజకీయ, సాంస్కృతిక, పారిశ్రామిక, క్రీడా రంగాల్లో చెరగని ముద్ర వేసిన ప్రముఖులు తమ అభిప్రాయాలను తెలియజేస్తారు. Coming of Age: Identity, Inspiration, Impact”, అనే థీమ్‌తో నిర్వహిస్తున్న ఈ సమ్మిట్‌లో  కీలకమైన రాజకీయ, సాంస్కృతిక, విద్య, ఆరోగ్య సంరక్షణతో పాటు దక్షిణాది ప్రత్యేకతను నిలబెట్టుకునే అంశంపై ప్రభావవంతమైన చర్చలు జరుగుతాయి. ఈ సదస్సు దేశ అభివృద్ధి, ప్రగతిలో దక్షిణ భారత ప్రాధాన్యతను అందులో ఈ వ్యక్తుల పాత్రను ఆవిష్కరిస్తుంది. "ది సదరన్ రైజింగ్ సమ్మిట్" జాతీయ కోణంలో దక్షిణాది ప్రాధాన్యతను మరోసారి ప్రముఖంగా ప్రస్తావించనుంది. అలాగే ఆయా రంగాల్లో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు సన్నద్ధం కావాల్సిన అంశాల ప్రముఖులు తమ ఆలోచనలు పంచుకుంటారు. 

సదస్సులో పాల్గొనే ప్రముఖులు వీరే

సౌతిండియా నుంచి అగ్రశ్రేణి రాజకీయ, పారిశ్రామిక, సినీ రంగాలకు చెందిన ప్రముఖులు, రచయతలు, వ్యాపారులు ఇందులో పాల్గొంటున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సదస్సును ప్రారంభించి తన విజన్‌ను ఆవిష్కరిస్తారు. కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు తన అంతరంగాన్ని ఆవిష్కరిస్తారు. ఇండియన్ బాడ్మింటన్ దిగ్గజం, పద్మభూషణ్ పుల్లెల గోపీచంద్, స్టార్ హీరో సాయి దుర్గా తేజ్, నటి రాశీఖన్నా, జాతీయ నటుడు ప్రకాష్ రాజ్, మంజుమ్మల్ బాయ్స్ దర్శకుడు, రచయిత చిదంబరం, వెటరన్ యాక్టర్ గౌతమి వంటి ప్రముఖులు పాల్గొంటున్నారు. 

అటు, పలువురు రాజకీయ ప్రముఖులు సైతం ఈ సదస్సులో పాల్గొని ప్రసంగిస్తారు. రాజకీయ రంగంలో దక్షిణాది నుంచి తమదైన ముద్ర వేసిన యువనేతలు సదస్సుకు హాజరవుతున్నారు. బీజేపీ నేత కొంపెల్ల మాధవి, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిది డాక్టర్ షామా మహమ్మద్, తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ లీడర్ మధుయాష్కీ గౌడ్, బీజేపీ ఎంపీ రఘునందన్ వంటి వారు కూడా దక్షిణాది రాజకీయ రంగం భవిష్యత్‌లో దేశంలో పోషించబోతున్న పాత్రపై తమ విశ్లేషణను అందిస్తారు. అలాగే సాంస్కృతిక రంగం నుంచి క్లాసికల్ సింగర్ బిందు సుబ్రహ్మణ్యం, అవార్డు విన్నింగ్ సింగల్ శిల్పారావు, క్లాసికల్ డ్యాన్సర్, మూడుసార్లు జాతీయ అవార్డు పొందిన యామినిరెడ్డి దక్షిణాది కల్చర్ హెరిటేజ్‌ను హైలెట్ చేస్తారు. అదే సమయంలో దక్షిణాది భవిష్యత్‌లో ఎలా దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందో రచయిత, చరిత్రకారుడు డాక్టర్ విక్రమ్ సంపత్ చర్చిస్తారు. అలాగే, స్టార్టప్‌ల్లో తనదైన ముద్ర వేసిన రాపిడో కో ఫౌండర్ అరవింద్ సంకా.. యువత మరింత వేగంగా వ్యాపార రంగంలో రాణించడానికి ఎలాంటి పాలసీలు అవసరమో... ప్రభుత్వాల వైపు నుంచి ఎలాంటి సహకారం ఉంటే అద్భుతాలు సృష్టించవచ్చో అన్న అంశాలపై తన అభిప్రాయాలు పంచుకుంటారు.

అన్ని రంగాల్లోనూ దక్షిణాది పాత్రను చాటేలా 'సదరన్ రైజింగ్ సమ్మిట్' జరగనుంది. దేశాభివృద్ధిలో దక్షిణాది పాత్రను సెలబ్రేట్ చేసుకునేలా ఈ కార్యక్రమం జరుగుతుంది.

21:15 PM (IST)  •  25 Oct 2024

ఐఏఎస్ కావాలని ఉండేది - నటి రాశీ ఖన్నా

ABP Southern Rising Summit 2024: కాలేజీలో ఉన్నప్పుడు తనకు ఐఏఎస్‌ కావాలనే కోరిక ఉండేదని నటి రాశీ ఖన్నా వెల్లడించారు. ఆమె 12వ తరగతిలో 91 శాతం ఉత్తీర్ణత సాధించి, లేడీ శ్రీరాం కాలేజీలో బ్యాచిలర్స్ చదివారు. తన స్నేహితురాలితో కలిసి ముంబై వెళ్లి మద్రాస్ కేఫ్ కోసం ఆడిషన్‌కు వచ్చినప్పుడు యాధృచ్ఛికంగా నటి అయ్యానని ఆమె ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో చెప్పారు.

20:56 PM (IST)  •  25 Oct 2024

గుజరాత్ అల్లర్ల ఆధారంగా 'ద సబర్మతి రిపోర్ట్' - నటి రాశీ ఖన్నా

ABP Southern Rising Summit 2024: ప్రముఖ నటి రాశిఖన్నా ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన రాబోయే చిత్ర 'ది సబర్మతి రిపోర్ట్' గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఇది 2002 గుజరాత్ అల్లర్ల ఆధారంగా రూపొందించబడింది.

Load More
New Update
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Mancherial Police Operation: మంచిర్యాలలో అర్ధరాత్రి పోలీసుల భారీ సెర్చ్ ఆపరేషన్: 171 వాహనాలు, అక్రమ మద్యం స్వాధీనం
మంచిర్యాలలో అర్ధరాత్రి పోలీసుల భారీ సెర్చ్ ఆపరేషన్: 171 వాహనాలు, అక్రమ మద్యం స్వాధీనం
POCSO Case: కుషాయిగూడలో ఇద్దరు బాలికల మిస్సింగ్ కేసు సుఖాంతం.. బంధువైన యువకుడి అరెస్ట్, పోక్సో కేసు
కుషాయిగూడలో ఇద్దరు బాలికల మిస్సింగ్ కేసు సుఖాంతం.. బంధువైన యువకుడి అరెస్ట్, POCSO కేసు
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో వ్యక్తి దారుణహత్య కలకలం!
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో వ్యక్తి దారుణహత్య కలకలం!
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
POCSO Case: కుషాయిగూడలో ఇద్దరు బాలికల మిస్సింగ్ కేసు సుఖాంతం.. బంధువైన యువకుడి అరెస్ట్, పోక్సో కేసు
కుషాయిగూడలో ఇద్దరు బాలికల మిస్సింగ్ కేసు సుఖాంతం.. బంధువైన యువకుడి అరెస్ట్, POCSO కేసు
IND VS ENG 5th T20 Result Update: క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  
క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  రాణించిన ఇషాన్, తిలక్
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో వ్యక్తి దారుణహత్య కలకలం!
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో వ్యక్తి దారుణహత్య కలకలం!
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Vietnam Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదం.. మరణించిన 15 మంది భారతీయులు వీరే.. ఏపీ నుంచి ముగ్గురు
వియత్నాం బోటు ప్రమాదం.. మరణించిన 15 మంది భారతీయులు వీరే.. ఏపీ నుంచి ముగ్గురు
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
Car Insurance: నీళ్లలో కారు మునిగిపోతే పొరపాటున కూడా ఈ తప్పులు చేయవద్దు, ఇన్సూరెన్స్ రాదు
నీళ్లలో కారు మునిగిపోతే పొరపాటున కూడా ఈ తప్పులు చేయవద్దు, ఇన్సూరెన్స్ రాదు
US Iran War: హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
Embed widget