అన్వేషించండి

Patnam Narendar Reddy: లగచర్ల దాడి కేసు, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ప‌ట్నం న‌రేంద‌ర్‌రెడ్డికి 14 రోజుల పాటు రిమాండ్

Lagacharla attack case | వికారాబాద్ జిల్లా లగచర్లలో అధికారులపై దాడి కేసులో ప‌ట్నం న‌రేంద‌ర్‌రెడ్డికి కొడంగల్ కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలున్నాయి.

BRS leader Patnam Narendar Reddy in Lagacharla attack case | కొడంగల్‌: బీఆర్ఎస్ నేత, కొడంగల్‌ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. వికారాబాద్‌ జిల్లాలోని లగచర్లలో కలెక్టర్ సహా అధికారులపై దాడి ఘటనలో ప్రమేయం ఉందనే ఆరోపణలతో పోలీసులు పట్నం నరేందర్ రెడ్డిని నేటి ఉదయం అరెస్ట్‌ చేశారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం బీఆర్ఎస్ నేతను కొడంగల్‌ కోర్టులో పోలీసులు హాజరు పరిచారు. విచారణ చేపట్టిన కొడంగల్ కోర్టు పట్నం నరేందర్ రెడ్డిక ఈనెల 27 వరకు 14 రోజులపాటు రిమాండ్‌ విధించింది. లగచర్ల కేసులో అరెస్టైన పట్నం నరేందర్‌రెడ్డిని పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించనున్నారు. 

ఈ కేసులో మొదట దాదాపు 60 మంది రైతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక విచారణ అనంతరం 50 మందిని రైతులను వదిలేసిన పోలీసులు 16 మందిని రిమాండ్ కు తరలించారు. అధికారులపై దాడిని తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ క్రమంలో పోలీసులు బుధవారం పట్నం నరేందర్ రెడ్డిని, ప్రధాన నిందితుడు సురేశ్‌ సోదరుడు సహా నలుగుర్ని అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు.

రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు
వికారాబాద్‌ జిల్లా లగచర్లలో ఫార్మా పరిశ్రమ ఏర్పాటుకు అభిప్రాయ సేకరణ కోసం జిల్లా కలెక్టర్‌ సహా ఇతర అధికారులు నవంబర్ 11న వెళ్లారు. తొలుత లగచర్ల గ్రామ శివార్లలో గ్రామ సభ ఏర్పాటు చేశారు... అనంతరం ఈ కేసులో ఏ1గా ఉన్న సురేశ్‌ అనే వ్యక్తి కలెక్టర్‌ సహా ఇతర అధికారులను ఒప్పించి గ్రామంలోకి తీసుకువెళ్లాడు. రైతులు భూములు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, మీరు ఓసారి వచ్చి వారి అభిప్రాయాలు తెలుసుకోవాలని కలెక్టర్, ఉన్నతాధికారులను సురేష్ నమ్మించి తీసుకెళ్లినట్లు పోలీసులు చెబుతున్నారు. 

కాగా, కలెక్టర్‌ అక్కడికి వెళ్లిన సమయంలో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. లగచర్ల ప్రజలు ఒక్కసారిగా కలెక్టర్ వాహనాన్ని అడ్డగించి నినాదాలు చేశారు, కలెక్టర్‌ కారు దిగి వారిని వారించే ప్రయత్నం చేస్తుండగా ఉద్దేశపూర్వకంగానే దాడి చేసి వాహనాలపై రాళ్లు విసిరి ధ్వంసం చేసినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. దాంతో పలు సెక్షన్ల కింద లగచర్లలో దాడి కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అధికారులపై దాడికి ఉపయోగించిన రాళ్లు, కర్రలు స్వాధీనం చేసున్నట్లు కోర్టుకు పోలీసులు తెలిపారు. 

Also Read: KTR News: పట్నం నరేందర్ రెడ్డి ఫ్యామిలీని పరామర్శించిన కేటీఆర్, కొండగల్ నుంచే రేవంత్ రెడ్డి భరతం పడతామంటూ ఫైర్

డీఎస్పీ శ్రీనివాస్‌ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు జరుగుతోంది. ఏ1గా భోగమోని సురేశ్‌ను చేర్చుతూ మొత్తం 46 మందిని నిందితులుగా గుర్తించారు పోలీసులు. మంగళవారం 16 మందిని అరెస్ట్ చేయగా, బుధవారం నాడు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా మరో నలుగుర్ని అరెస్ట్ చేసి కొడంగల్ కోర్టులో హాజరుపరిచారు. గ్రామస్తులు, రైతుల రాళ్లదాడిలో కలెక్టర్‌, కొందరు అధికారులు, పోలీసులకు గాయాలయ్యాయని రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు. అభిప్రాయ సేకరణ కోసం వెళ్లిన సమయంలో ఈ దాడి జరగిందని, కానీ దీని వెనుక కుట్రకోణం దాగి ఉందని విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయని పోలీసులు రిపోర్టులో పేర్కొన్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan vs Jagadish Reddy: చిచ్చు పెట్టిన దిష్టి వ్యాఖ్యలు - పవన్ కల్యాణ్‌పై బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి తీవ్ర విమర్శలు
చిచ్చు పెట్టిన దిష్టి వ్యాఖ్యలు - పవన్ కల్యాణ్‌పై బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి తీవ్ర విమర్శలు
Amaravati farmers: అమరావతి రైతులతో  చంద్రబాబు సమావేశం - కీలక సమస్యలపై చర్చ - 6 నెలల్లో  పరిష్కారానికి హామీ
అమరావతి రైతులతో చంద్రబాబు సమావేశం - కీలక సమస్యలపై చర్చ - 6 నెలల్లో పరిష్కారానికి హామీ
TTD Adulterated ghee case: కల్తీ నెయ్యి కేసులో మరో కీలక అరెస్టు - మొదటి సారి టీటీడీ జీఎం అరెస్ట్
కల్తీ నెయ్యి కేసులో మరో కీలక అరెస్టు - మొదటి సారి టీటీడీ జీఎం అరెస్ట్
Special Trains: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్! SCR 42 ప్రత్యేక రైళ్లను పొడిగించింది: మీ గమ్యస్థానాలకు చేరేందుకు రెడీ అవ్వండి!
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్! SCR 42 ప్రత్యేక రైళ్లను పొడిగించింది: మీ గమ్యస్థానాలకు చేరేందుకు రెడీ అవ్వండి!
Advertisement

వీడియోలు

Hong kong Apartments Fire Updates | 60ఏళ్లలో ప్రపంచంలోనే అతిపెద్ద అగ్నిప్రమాదం | ABP Desam
Gambhir Comments on Head Coach Position | గంభీర్ సెన్సేషనల్ స్టేట్‌మెంట్
World Test Championship Points Table | టెస్టు ఛాంపియన్‌షిప్ లో భారత్ స్థానం ఇదే
Reason for Team India Failure | భారత్ ఓటమికి కారణాలు ఇవే !
Rohit Sharma First Place in ICC ODI Rankings | అగ్రస్థానంలో
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan vs Jagadish Reddy: చిచ్చు పెట్టిన దిష్టి వ్యాఖ్యలు - పవన్ కల్యాణ్‌పై బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి తీవ్ర విమర్శలు
చిచ్చు పెట్టిన దిష్టి వ్యాఖ్యలు - పవన్ కల్యాణ్‌పై బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి తీవ్ర విమర్శలు
Amaravati farmers: అమరావతి రైతులతో  చంద్రబాబు సమావేశం - కీలక సమస్యలపై చర్చ - 6 నెలల్లో  పరిష్కారానికి హామీ
అమరావతి రైతులతో చంద్రబాబు సమావేశం - కీలక సమస్యలపై చర్చ - 6 నెలల్లో పరిష్కారానికి హామీ
TTD Adulterated ghee case: కల్తీ నెయ్యి కేసులో మరో కీలక అరెస్టు - మొదటి సారి టీటీడీ జీఎం అరెస్ట్
కల్తీ నెయ్యి కేసులో మరో కీలక అరెస్టు - మొదటి సారి టీటీడీ జీఎం అరెస్ట్
Special Trains: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్! SCR 42 ప్రత్యేక రైళ్లను పొడిగించింది: మీ గమ్యస్థానాలకు చేరేందుకు రెడీ అవ్వండి!
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్! SCR 42 ప్రత్యేక రైళ్లను పొడిగించింది: మీ గమ్యస్థానాలకు చేరేందుకు రెడీ అవ్వండి!
Sri charani: మహిళల ఐపీఎల్‌ ఆటగాళ్ల వేలంలో శ్రీచరణికి కోటి 30 లక్షలు - ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడనున్న స్టార్ ప్లేయర్
మహిళల ఐపీఎల్‌ వేలంలో శ్రీచరణికి కోటి 30 లక్షలు - ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడనున్న స్టార్ ప్లేయర్
Kalvakuntla Kavitha: ఎలా ట్రెండింగ్‌లో ఉండాలో కవితకు బాగా తెలుసా? - ఇప్పుడంతా ఆమె గురించే చర్చ
ఎలా ట్రెండింగ్‌లో ఉండాలో కవితకు బాగా తెలుసా? - ఇప్పుడంతా ఆమె గురించే చర్చ
Shiva Jyothi : శ్రీవారి దర్శనం... యాంకర్ శివజ్యోతి ఆధార్ కార్డ్ బ్లాక్ - ఆ వార్తలపై క్లారిటీ!
శ్రీవారి దర్శనం... యాంకర్ శివజ్యోతి ఆధార్ కార్డ్ బ్లాక్ - ఆ వార్తలపై క్లారిటీ!
2019 Group 2 Issue: గ్రూప్-2 2019 ర్యాంకర్లకు భారీ ఊరట.. సింగిల్ బెంచ్ తీర్పును సస్పెండ్ చేసిన డివిజన్ బెంచ్
గ్రూప్-2 2019 ర్యాంకర్లకు భారీ ఊరట.. సింగిల్ బెంచ్ తీర్పును సస్పెండ్ చేసిన డివిజన్ బెంచ్
Embed widget