అన్వేషించండి

2019 Group 2 Issue: గ్రూప్-2 2019 ర్యాంకర్లకు భారీ ఊరట.. సింగిల్ బెంచ్ తీర్పును సస్పెండ్ చేసిన డివిజన్ బెంచ్

Telangana Highcourt: 2019 గ్రూప్ 2 ఇష్యూలో సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది. దీంతో ఇప్పటికే ఉద్యోగాల్లో చేరిన వారికి ఊరట లభించినట్లయింది.

Division Bench suspends single bench verdict in 2019 Group 2 issue : తెలంగాణ హైకోర్టులో గ్రూప్-2 2019 ర్యాంకర్లకు గురువారం భారీ ఊరట లభించింది. 2019 సెలెక్షన్ లిస్ట్‌ను రద్దు చేస్తూ నవంబర్ 18న సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది. మెరిట్ లిస్ట్ చెల్లదని ప్రకటించిన సింగిల్ బెంచ్ ఆదేశాలను  నిలిపివేసి  ర్యాంకర్లకు తాత్కాలిక రక్షణ అందించింది. తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసిన డివిజన్ బెంచ్, ఈ కేసులో మరిన్ని వాదనలు వినాలని నిర్ణయించింది.            
 
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) 2015లో 1,032 గ్రూప్-2 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది. 2016 నవంబర్‌లో జరిగిన పరీక్షల ఫలితాలు 2019 అక్టోబర్ 24న విడుదలయ్యాయి. అయితే, ఈ ఫలితాలపై తీవ్ర వివాదాలు ఏర్పడ్డాయి. ఓఎమ్‌ఆర్ షీట్లలో  అవకతవకలు, వైటెనర్ ఉపయోగం, ఎరేసర్ మార్కులు, డబుల్ బబులింగ్ వంటివి జరిగాయని గుర్తించారు.  ప్రభుత్వం నియమించిన సాంకేతిక కమిటీ 2017లో ఇలాంటి షీట్లను మూల్యాంకనం చేయకూడదని సిఫారసు చేసింది. కానీ టీజీపీఎస్సీ ఈ మార్గదర్శకాలను పాటించకపోవడంతో, అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు.                  

ఈ విషయంలో సింగిల్ బెంచ్ జస్టిస్ నాగేష్ భీమపాక నవంబర్ 18న కీలక తీర్పు ఇచ్చారు. 2019 సెలెక్షన్ లిస్ట్‌ను   రద్దు చేస్తూ తీరపు ఇచ్చారు.  మునుపటి డివిజన్ బెంచ్ తీర్పు ,  సాంకేతిక కమిటీ సిఫారసులకు అనుగుణంగా పునఃమూల్యాంకనం చేయాలని, అర్హ అభ్యర్థుల జాబితాను విడుదల చేసి నియామకాలు పూర్తి చేయాలని ఆదేశించింది. ఈ ప్రక్రియను ఎనిమిది వారాల్లో పూర్తి చేయాలని  గడువు విధించింది. ఈ తీర్పు 1,032 మంది ఎంపికైన అధికారులకు షాక్‌గా నిలిచింది.                             

సింగిల్ బెంచ్ తీర్పును సవాలు చేస్తూ, పలువురు ర్యాంకర్లు , టీజీపీఎస్సీ డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించారు. గురువారం జరిగిన విచారణలో, డివిజన్ బెంచ్ సింగిల్ బెంచ్ ఆదేశాలను మధ్యంతరంగా సస్పెండ్ చేసింది. మెరిట్ లిస్ట్‌ను తాత్కాలికంగా పునరుద్ధరించడం ద్వారా, ర్యాంకర్లు తమ స్థానాలను కోల్పోకుండా ఉండేలా చేసింది. ఈ మధ్యంతర ఉత్తర్వులు ర్యాంకర్లకు పెద్ద ఊరటగా మారాయి, ఎందుకంటే ఇప్పటికే వారు ఉద్యోగాల్లో కొనసాగుతున్నారు. తదుపరి విచారణను జనవరి  మొదటి వారంలో చేపడతారు.  రెండు వైపులా వాదనలు మరింత వివరంగా వినాలని, అందరి హక్కులను రక్షించేలా తీర్పు ఇవ్వాలని బెంచ్ సూచించింది.                                         
 
ఈ వివాదం 2019లోనే మొదలైంది. ఓఎమ్‌ఆర్ షీట్లలో పార్ట్-ఎ మాత్రమే మూల్యాంకనం చేయాలని సాంకేతిక కమిటీ సిఫారసు చేసినా, టీజీపీఎస్సీ పార్ట్-బీని కూడా పరిగణలోకి తీసుకుంది. ఇది మునుపటి డివిజన్ బెంచ్ ఆదేశాలకు విరుద్ధమని అభ్యర్థులు వాదించారు.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Andhra Praedesh News: ప్రభుత్వరంగ సంస్థలు, గురుకుల సొసైటీ స్కూల్ ఉద్యోగుల ఏజ్ లిమిట్ పెంపు
ప్రభుత్వరంగ సంస్థలు, గురుకుల సొసైటీ స్కూల్ ఉద్యోగుల ఏజ్ లిమిట్ పెంపు
Andhra Pradesh Job Calendar 2026: ఆంధ్రప్రదేశ్‌లో పదివేల పోస్టులతో జాబ్‌ క్యాలెండర్ విడుదల - ఏటా ఉగాదికి ఉద్యోగాల జాతర!
ఆంధ్రప్రదేశ్‌లో పదివేల పోస్టులతో జాబ్‌ క్యాలెండర్ విడుదల - ఏటా ఉగాదికి ఉద్యోగాల జాతర!
AP DSC Notification: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 3004 పోస్టులతో ఏపీ సర్కార్ DSC నోటిఫికేషన్!
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 3004 పోస్టులతో ఏపీ సర్కార్ DSC నోటిఫికేషన్!
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Iran US War Updates: శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
CM Chandrababu: ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
SRH Playing 11: ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. సన్‌రైజర్స్ ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. SRH ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
Embed widget