అన్వేషించండి

Telangna Lands Issue: ప్రజల్లో చర్చ పెట్టకుండా కీలక నిర్ణయాలు - అందుకే స్కామ్‌ల ఆరోపణలు - తెలంగాణ సర్కార్ ఇరుక్కుపోతోందా?

HILT: ఇండస్ట్రియల్ భూముల రెగ్యులరైజ్ చేసే క్రమంలో ఐదు లక్షల కోట్ల స్కాం జరిగిందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. దీన్ని డిఫెండ్ చేసుకోవడానికి కాంగ్రెస్ తంటాలు పడుతోంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • HILT పాలసీతో పారిశ్రామిక భూములను బహుళ వినియోగ జోన్లుగా మారుస్తున్నారు.
  • సబ్-రిజిస్ట్రార్ రేట్లలో 30% చెల్లింపుతో భూముల రెగ్యులరైజేషన్ అంటున్నారు.
  • బీఆర్ఎస్, బీజేపీలు దీనిని 5 లక్షల కోట్ల స్కాంగా ఆరోపిస్తున్నాయి.
  • వివాదాస్పద పాలసీపై ప్రజల్లో చర్చ జరగలేదని విమర్శలు వస్తున్నాయి.

HILT Land scam Allegations:  తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన  హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్‌ఫర్మేషన్ పాలసీ  రాజకీయగా కలకలం రేపుతోంది. బీఆర్‌ఎస్, బీజేపీ నేతలు దీన్ని  5 లక్షల కోట్ల స్కాంగా ఆరోపిస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్ లోపల 9,292 ఎకరాల ఇండస్ట్రియల్ భూములను మల్టీ-యూజ్ జోన్లుగా మార్చడం, సబ్-రిజిస్ట్రార్ ఆఫీస్  రేట్లలో కేవలం 30 నుంచి 0 శాతం చెల్లింపుతో రెగ్యులరైజేషన్ అనుమతించడం ఈ పాలసీలో కీలకం. 

సున్నితమైన అంశం.. కేబినెట్‌లో పెద్దగా ప్రచారం లేకుండా ఆమోదం 

HILTP అంటే హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్‌ఫర్మేషన్ పాలసీ. ఇటీవల మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.  ORR లోపల బలానగర్, జీడిమెట్ల, సనత్‌నగర్, ఆజమాబాద్ వంటి ప్రాంతాల్లో 22 ఇండస్ట్రియల్ ఎస్టేట్లు, పార్కుల్లో 9,292 ఎకరాల భూములను మల్టీ-యూజ్ జోన్లుగా అంటే  రెసిడెన్షియల్, కమర్షియల్, మిక్స్డ్-యూజ్  మార్చడానికి అనుమతించే పాలసీ. పాత ఇండస్ట్రియల్ క్లస్టర్లను ఆధునికీకరించి, ఉపాధి, ఆర్థికాభివృద్ధికి అనుకూలంగా మారుస్తమమని ప్రభుత్వం చెబుతోంది.  భూమి యజమానులకు ఫ్రీహోల్డ్ హక్కులు, మల్టీ-యూజ్ అనుమతులు ఇస్తారు.  అప్లికేషన్లు 7 రోజుల్లో ప్రాసెస్, 7 రోజుల్లో అప్రూవల్, 45 రోజుల్లో పూర్తి రెగ్యులరైజేషన్ చేస్తారు. 

దశాబ్దాల కిందట కేటాయించిన భూములు 
 
తెలంగాణలో  పారిశ్రామిక సంస్థలకు ప్రభుత్వం  భూములు 1960ల నుంచి  ఇస్తున్నారు. హైదరాబాద్ స్టేట్ సమయంలో పారిశ్రామిక అభివృద్ధికి భూములు సబ్సిడీ రేట్లకు కేటాయించారు. అప్పట్లో పెట్టిన షరతు ప్రకారం వాటిని పారిశ్రామిక వినియోగానికి మాత్రమే ఉపయోగించాలి.  2 బీఆర్‌ఎస్ పాలనలో ఇలాంటి భూములు 'ఫ్రీహోల్డ్' హక్కులతో మార్చారు. కానీ మల్టీ-యూజ్ కన్వర్షన్‌లకు కఠిన నిబంధనలు విధించారు.  ఇప్పుడు  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  తక్కువ ధరకు.. మల్టీ యూజ్ కు అనుమతులు ఇవ్వాలని నిర్ణియంచారు.  ఇండస్ట్రియల్ భూముల్లో టాక్సిక్ పొల్యూషన్ ఉందని అందుకే  మా పాలసీలో ఇన్‌ఫ్రా, గ్రీన్ స్పేస్‌లు బిల్డ్ చేస్తాం అని ప్రభుత్వం చెబుతోంది.   HILTP అమలు అయితే, రాష్ట్రానికి పన్నెండు వేల కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉంది. 

స్కాం అని ఆరోపిస్తున్న బీఆర్ఎస్, బీజేపీ

అయితే ఈ భూములను మార్కెట్ రేటులో  ముఫ్పై శాతం   మొత్తానికే ఇవ్వడం స్కాం అని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది.  ఇలా తక్కువ ధరకే రిజిస్ట్రేషన్ చేయడం వల్ల 5  నుంచి 6 లక్షల కోట్ల నష్టం స్తుందని చెబుతున్నారు. రాజకీయంగా కాంగ్రెస్‌కు సవాలుగా మారింది. పంచాయతీ ఎన్నికల ముందు వివాదం తీవ్రమవుతోంది.   ఫ్రీహోల్డ్ పేరుతో బీఆర్ఎస్ జీవోలుఇచ్చిందని మంత్రి శ్రీధర్ బాబు వాటిని బయట పెట్టారు. 

ప్రజల్లో చర్చ పెట్టిన తర్వాతే నిర్ణయం తీసుకుంటే సమస్య ఉండదు !

ప్రభుత్వాలు నిజంగా కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు వాటి గురించి ప్రజలేమనుకుంటున్నారన్నదానిపై చర్చ పెడతారు. ప్రజల మద్దతు లభిస్తుందనుకుంటే దైర్యంగా ముందడుగు వేస్తారు. కానీ ప్రభుత్వం వివాదాస్పదం అవుతుందని తెలిసి కూడా..విపక్ష పార్టీలు బయట పెట్టే వరకూ ప్రజలకు తెలియకుండా సీక్రెసీ మెయిన్ టెయిన్ చేస్తోంది. ఫలితంగానే ప్రభుత్వానికి చిక్కులు వస్తున్నాయి.   ఫలితంగా  సమర్థించుకోలేకపోతోంది. స్కాం జరుగుతుందేమో అని సామాన్య ప్రజలు భావించేలా చేస్తోంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Breaking News: తుమ్మిడిహెట్టి వివాదంపై చర్చలకు సిద్ధమని మహారాష్ట్ర సీఎంకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి లేఖ
తుమ్మిడిహెట్టి వివాదంపై చర్చలకు సిద్ధమని మహారాష్ట్ర సీఎంకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి లేఖ
Bandi Bhagirath POCSO Case: పోక్సో కేసులో సీన్ రీ-కన్స్ట్రక్షన్ - బండి భగీరథ్ ను మొయినాబాద్ ఫాంహౌస్‌కు తీసుకెళ్లి పోలీసుల సోదాలు!
పోక్సో కేసులో సీన్ రీ-కన్స్ట్రక్షన్ - బండి భగీరథ్ ను మొయినాబాద్ ఫాంహౌస్‌కు తీసుకెళ్లి పోలీసుల సోదాలు!
Gandhi Bhavan Fight: గాంధీ భవన్‌లో గలాటా - గల్లాలు పట్టుకుని కొట్టుకున్న నేతలు - మంత్రుల ఎదుటే !
గాంధీ భవన్‌లో గలాటా - గల్లాలు పట్టుకుని కొట్టుకున్న నేతలు - మంత్రుల ఎదుటే ! వీడియో
Uppal Real Estate: ఉప్పల్‌లో రివర్స్ గేర్ వేసిన రియల్ భూమ్.. ప్లాట్లు కొనేందుకు వెనకాడుతున్న జనం, కారణం అదేనా?
ఉప్పల్‌లో రివర్స్ గేర్ వేసిన రియల్ భూమ్.. ప్లాట్లు కొనేందుకు వెనకాడుతున్న జనం, కారణం అదేనా?

వీడియోలు

Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
Student Jokes On MI Nita Ambani | నీతా అంబానీ ముందే ముంబై ఇండియన్స్‌పై పంచ్
RCB vs GT IPL Match 2026 Prediction | నేడు బెంగళూరుతో తలపడుతున్న గుజరాత్ టైటాన్స్
Hardik Pandya Decoding 07:07 Insta Post | ముంబైని వీడుతున్న హార్దిక్ పాండ్యా ?
RR vs MI Match Playoffs IPL 2026 | కెప్టెన్సీపై రియాన్ పరాగ్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gandhi Bhavan Fight: గాంధీ భవన్‌లో గలాటా - గల్లాలు పట్టుకుని కొట్టుకున్న నేతలు - మంత్రుల ఎదుటే !
గాంధీ భవన్‌లో గలాటా - గల్లాలు పట్టుకుని కొట్టుకున్న నేతలు - మంత్రుల ఎదుటే ! వీడియో
Madhura Sreedhar Reddy: సమస్యల పేరుతో పరువు తీయకండి... సినిమా వర్కవుట్ కాకపోతే వెళ్ళిపోండి - మధుర శ్రీధర్ రెడ్డి
సమస్యల పేరుతో పరువు తీయకండి... సినిమా వర్కవుట్ కాకపోతే వెళ్ళిపోండి - మధుర శ్రీధర్ రెడ్డి
Remote Robotic Surgery : హైదరాబాద్‌లో రోగికి చైనా నుంచి ఆపరేషన్.. రోబోటిక్ టెలిసర్జరీతో చరిత్ర సృష్టించిన వైద్యులు
హైదరాబాద్‌లో రోగికి చైనా నుంచి ఆపరేషన్.. రోబోటిక్ టెలిసర్జరీతో చరిత్ర సృష్టించిన వైద్యులు
YS Jagan Key Comments: ఓట్లు తగ్గినా, పెరిగినా డేంజరే -స్థానికల్లో పోటీ చేసి తీరాలి - పార్టీ నేతలకు జగన్ దిశానిర్దేశం
ఓట్లు తగ్గినా, పెరిగినా డేంజరే -స్థానికల్లో పోటీ చేసి తీరాలి - పార్టీ నేతలకు జగన్ దిశానిర్దేశం
Uppal Real Estate: ఉప్పల్‌లో రివర్స్ గేర్ వేసిన రియల్ భూమ్.. ప్లాట్లు కొనేందుకు వెనకాడుతున్న జనం, కారణం అదేనా?
ఉప్పల్‌లో రివర్స్ గేర్ వేసిన రియల్ భూమ్.. ప్లాట్లు కొనేందుకు వెనకాడుతున్న జనం, కారణం అదేనా?
Pune Porsche Crash Case: పుణె పోర్షే ప్రమాదం కేసులో నిందితులకు బెయిల్ - సంబరాల వీడియోల వైరల్ - బాధితులకు వ్యవస్థలపై నమ్మకం ఎలా?
పుణె పోర్షే ప్రమాదం కేసులో నిందితులకు బెయిల్ - సంబరాల వీడియోల వైరల్ - బాధితులకు వ్యవస్థలపై నమ్మకం ఎలా?
Battery as a Service India: ఈవీ మార్కెట్‌లో కొత్త
ఈవీ మార్కెట్‌లో కొత్త "బాస్‌"! సగం ధరకే విద్యుత్‌ కార్లు! నిజంగానే ఇది సామాన్యుడికి వరమేనా?
ED Raids Kerala: కేరళలో ఈడీ అధికారులపై సీపీఎం కార్యకర్తల దాడి - మాజీ సీఎం విజయన్ ఇంట్లో సోదాలు చేశారని ఆగ్రహం
కేరళలో ఈడీ అధికారులపై సీపీఎం కార్యకర్తల దాడి - మాజీ సీఎం విజయన్ ఇంట్లో సోదాలు చేశారని ఆగ్రహం
Embed widget