అన్వేషించండి

Twitter Blue Tick: ట్విట్టర్ బ్లూ టిక్‌తో మళ్లీ వస్తున్నాం - అధికారికంగా ప్రకటించిన ఎలాన్ మస్క్ - ఎప్పుడు రానుందంటే?

ట్విట్టర్ బ్లూ టిక్ సబ్‌స్క్రిప్షన్‌ను నవంబర్ 29వ తేదీన తిరిగి లాంచ్ చేయనున్నట్లు ఎలాన్ మస్క్ ప్రకటించాడు.

ప్రస్తుతానికి నిలిపివేసిన ట్విట్టర్ బ్లూ టిక్ సబ్‌స్క్రిప్షన్‌ను నవంబర్ 29వ తేదీన తిరిగి ప్రారంభిస్తామని ట్విట్టర్ చీఫ్ ఎలాన్ మస్క్ బుధవారం ప్రకటించారు. ట్విట్టర్‌ అప్‌డేట్‌ను షేర్ చేస్తూ ఎలాన్ మస్క్ "బ్లూ వెరిఫైడ్ రీలాంచ్ నవంబర్ 29వ తేదీన జరగనుంది. ఈసారి దాన్ని రాక్ సాలిడ్ అని నిర్ణయించుకున్నాకనే తీసుకువస్తాం." అని తెలిపాడు.

చాలా చర్చలకు దారి తీసిన ట్విట్టర్ సబ్‌స్క్రిప్షన్ ఆధారిత బ్లూ టిక్ వెరిఫికేషన్ లేబుల్‌లను నవంబర్‌ 11వ తేదీన తాత్కాలికంగా నిలిపివేశారు. వెరిఫికేషన్ బ్యాడ్జ్‌ని కోరుకునే వినియోగదారుల నుంచి నెలకు 8 డాలర్లను ట్విట్టర్ వసూలు చేయడం ప్రారంభించింది. అయినప్పటికీ ట్విట్టర్‌లో అనేక నకిలీ "వెరిఫైడ్" ఖాతాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. దీంతో ఎలాన్ మస్క్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవలసి వచ్చింది. ఫేక్ అకౌంట్‌పై ఎదురుదాడికి దిగిన మస్క్, వేరొకరిలా నటించడానికి ప్రయత్నించే ఏ ఖాతా అయినా అది పేరడీ ఖాతాగా ప్రకటించకపోతే డిజేబుల్ అవుతుందని ట్వీట్ చేశాడు.

ట్విట్టర్ తను తొలగించిన ఉద్యోగుల్లో కొందరిని తిరిగి సంప్రదించినట్లు తెలుస్తోంది. వారిని పొరపాటున తీసేశామని చెప్తున్నట్లు బ్లూమ్‌బెర్గ్ తన కథనంలో పేర్కొంది. మస్క్ ఊహించిన కొత్త ఫీచర్లను రూపొందించడానికి వారి అనుభవం అవసరమని మేనేజ్‌మెంట్ గ్రహించకముందే కొందరిని తీసేశారని బ్లూమ్‌బర్గ్ తెలిపింది.

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ గత వారం ఈమెయిల్ ద్వారా దాదాపు 3,700 మంది వ్యక్తులను తొలగించింది. ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ను టేకోవర్ చేసిన తర్వాత ఖర్చులను తగ్గించే ప్రయత్నంలో ఉంది. ఈ-మెయిల్, స్లాక్ వంటి కంపెనీ సిస్టమ్‌లకు వారి యాక్సెస్‌ను అకస్మాత్తుగా సస్పెండ్ చేసిన తర్వాత చాలా మంది ఉద్యోగులు ఈ నిర్ణయం గురించి తెలుసుకున్నారు. ఇప్పుడు కొందరిని తిరిగి రమ్మనడం ఉద్యోగులను తొలగించే విషయంలో కంపెనీ ఎంత అస్తవ్యస్తమైన ప్రక్రియను పాటించిందో తెలియజేస్తుంది.

"Twitterలో ఉద్యోగులను తగ్గించడం గురించి చూస్తే కంపెనీ రోజుకు 4 మిలియన్ డాలర్లకు పైగా నష్టపోతున్నప్పుడు మరో ఆప్షన్ లేదు." అని మస్క్ గతంలో ట్వీట్ చేశారు. ట్విటర్‌లో ప్రస్తుతం దాదాపు 3,700 మంది ఉద్యోగులు మిగిలి ఉన్నారు.

వీరిని మస్క్ కొత్త ఫీచర్‌లను అమలు చేయడానికి కంపెనీలో ఉంచారు. కొన్ని సందర్భాల్లో ఉద్యోగులు టార్గెట్లను చేరుకోవడానికి కార్యాలయంలోనే పడుకున్నారు. "పేరడీ అని స్పష్టంగా పేర్కొనకుండా ఎవరైనా మరొకరి ట్విట్టర్ హ్యాండిల్‌ను అనుకరించే ఖాతా తెరిస్తే దాన్ని శాశ్వతంగా నిలిపివేస్తాం." అని ఎలాన్ మస్క్ ట్వీట్ చేశాడు.

Also Read: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Fast Printout: జిరాక్స్ షాప్ వద్ద క్యూ లైన్ ఉందా? QwikPrint మెషిన్ కనిపిస్తే ప్రింటౌట్ తీసుకోండి
జిరాక్స్ షాప్ వద్ద క్యూ లైన్ ఉందా? QwikPrint మెషిన్ కనిపిస్తే ప్రింటౌట్ తీసుకోండి
Google Maps: గూగుల్ మ్యాప్స్‌లో బిగ్ అప్‌డేట్! ఏఐ అప్‌గ్రేడ్‌తో మారిన నావిగేషన్ రూపురేఖలు!
గూగుల్ మ్యాప్స్‌లో బిగ్ అప్‌డేట్! ఏఐ అప్‌గ్రేడ్‌తో మారిన నావిగేషన్ రూపురేఖలు!
Telugu Innovation: రెగ్యులర్‌ పనుల కోసం డజన్లు కొద్దీ వెబ్‌సైట్లు అవసరం లేదు! ఒకే ప్లాట్‌ఫామ్‌పై అన్ని సర్వీస్‌లు అందిస్తున్న MiOffice.ai 
రెగ్యులర్‌ పనుల కోసం డజన్లు కొద్దీ వెబ్‌సైట్లు అవసరం లేదు! ఒకే ప్లాట్‌ఫామ్‌పై అన్ని సర్వీస్‌లు అందిస్తున్న MiOffice.ai 
Internet Data Tax: ఇంటర్నెట్ డేటాపై పన్ను! సన్నాహాలు చేస్తున్న మోదీ ప్రభుత్వం!
ఇంటర్నెట్ డేటాపై పన్ను! సన్నాహాలు చేస్తున్న మోదీ ప్రభుత్వం!

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
PM Modi Telangana Tour: ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
Dhurandhar 2 : ఆరేళ్ల పిల్లాడు RGV శివ చూసి ఇన్‌స్పైర్ అయ్యాడు - కట్ చేస్తే నేషనల్ అవార్డ్ డైరెక్టర్
ఆరేళ్ల పిల్లాడు RGV శివ చూసి ఇన్‌స్పైర్ అయ్యాడు - కట్ చేస్తే నేషనల్ అవార్డ్ డైరెక్టర్
AP Nandi Awards: నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
Embed widget