అన్వేషించండి

Reliance Jio 5G Services: ఉచితంగా జియో 5G సేవలు పొందవచ్చు, కానీ ఈ షరతులు వర్తిస్తాయి!

రిలయన్స్ జియో దసరా నుంచి 5G సేవలను ప్రారంభించింది. ఈ సేవలను తమ వినియోగదారులు ప్రస్తుతానికి ఉచితంగా పొందే అవకాశం ఉన్నట్లు తెలిపింది. అయితే, షరతులు వర్తిస్తాయని వెల్లడించింది.

దేశీయ దిగ్గజ టెలికాం సంస్థ రిలయన్స్ జియో(Reliance Jio) ‘True 5G’ సేవలను ప్రారంభించింది. దసరా నుంచి 5 నగరాల్లో ఎంపిక చేసిన వినియోగదారులకు ఈ సేవలను ఉచితంగా అందిస్తోంది. అయితే, ఇది పూర్తి స్థాయి 5G సేవలను ప్రారంభించినట్లు కాదని జియో వెల్లడించింది. మాస్ రోల్ అవుట్ కు మరికాస్త సమయం పడుతుందని తెలిపింది.  ప్రస్తుతానికి, ఎంపిక చేసిన నగరాల్లోని కొంతమంది Jio వినియోగదారులు మాత్రమే Jio 5Gని ఇస్తున్నట్లు ప్రకటించింది. అది కూడా ఇన్విటేషన్  ద్వారా మాత్రమే అందిస్తున్నట్లు తెలిపింది.

ఇన్విటేషన్ అంటే?: జియో కంపెనీ నుంచి మిమ్మల్ని 5G సర్వీసులోకి ఆహ్వానిస్తున్నట్లు ఓ మెసేజ్ వస్తుంది. ఈ మెసేజ్ అందుకున్న వెంటనే  మీరు ఆటోమేటిక్ అప్‌గ్రేడ్‌ అవుతారు. ఒకవేళ మీ హ్యాండ్ సెట్ 5Gకి సపోర్టు చేస్తే అదనపు ఛార్జీ లేకుండానే ఈ సేవలను పొందే అవకాశం ఉంటుంది.

ఒకేసారి 5G సేవలను అందుబాటులోకి తీసుకురాకుండా.. ఎంపిక చేసిన వారికి మాత్రమే ఎందుకు అందిస్తుందనే విషయంపై కంపెనీ క్లారిటీ ఇచ్చింది. కస్టమర్ల నుంచి ఫీడ్‌బ్యాక్‌ని పొందేందుకు ఈ రకమైన పద్దతి పాటిస్తున్నట్లు వెల్లడించింది.  జియో తన 4G సేవలను విడుదల చేసే సమయంలో కూడా ఇలాగే చేసింది. అయితే, గతంలో సిమ్ మార్చుకోవాల్సిన అవసరం ఉండగా.. ఇప్పుడు మాత్రం కొత్త సిమ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రస్తుత Jio 4G SIM కార్డు 5G సేవలకు కూడా సపోర్టు చేస్తుంది.

Jio True 5G వెల్కమ్ ఆఫర్

జియో ట్రయల్ 5G సేవలను ఉపయోగించాలంటే.. Jio వినియోగదారులై ఉండాలి. జియో True 5G  సేవలను అందుబాటులోకి తెచ్చిన 5 నగరాల్లో మీరు ఉండాలి. అప్పుడే జియో నుంచి మీకు True 5G  సేవలకు అప్ గ్రేడ్ అయ్యేలా ఇన్విటేషన్ వస్తుంది. Jio వెల్‌కమ్ ఆఫర్‌ని అందుకున్న వారు ప్రస్తుత Jio SIM లేదంటే 5G హ్యాండ్‌సెట్‌ను మార్చాల్సిన అవసరం లేకుండానే Jio true 5G సేవలును పొందేలా అప్‌గ్రేడ్ చేయబడుతుంది.   జియో 4G నెట్‌వర్క్‌పై జీరో డిపెండెన్సీతో స్వతంత్ర 5G సేవలను అందిస్తున్నది. ఎయిర్‌టెల్ వంటి ప్రత్యర్థులు మాత్రం నాన్-స్టాండలోన్ 5Gని అందిస్తున్నారు. 

ఇక ప్రస్తుతం అందుబాటులో ఉన్న జియో అన్ని హ్యాండ్‌ సెట్ లలో 5G సేవలతో సజావుగా పని చేసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు జియో తెలిపింది. జియో ఫోన్లు అన్నీ 5Gకి మద్దతు ఇచ్చినప్పటికీ, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ను ఫుషింగ్ అవుట్ చేయడం ద్వారా  OEMను అన్ లాక్ చేయాలి. అప్పుడే ఈ సేవలను పొందే అవకాశం ఉంటుంది.  పలు టెల్కోలకు ఇది భిన్నంగా ఉంటుంది. Samsung, Apple సహా ఇతర ఫోన్ల వినియోగదారులు బ్యాండ్ రకాన్ని బట్టి మార్చుకోవాల్సి ఉంటుంది.   

జియో 5G సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిన తర్వాత వినియోగదారులు 1 Gbps+ వేగంతో అపరిమిత 5G డేటాను పొందుతారని Jio తెలిపింది.  5G  ప్లాన్‌లు, టారిఫ్‌లు, ధర ఇంకా ప్రకటించలేదు. ప్రస్తుతానికి ఈ సేవలను ఉచితంగానే పొందే అవకాశం ఉంది.    

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Iran Israel Conflict: గల్ఫ్ దేశాల్లోని ఏపీ ప్రజలు ఆందోళన చెందొద్దు.. హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు
గల్ఫ్ దేశాల్లోని ఏపీ ప్రజలు ఆందోళన చెందొద్దు.. హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు
AP Judicial Academy: ఏపీ జ్యుడీషియల్ అకాడమీకి శంకుస్థాపన చేసిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, రూ.165 కోట్లతో నిర్మాణం
ఏపీ జ్యుడీషియల్ అకాడమీకి శంకుస్థాపన చేసిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, రూ.165 కోట్లతో నిర్మాణం
Virosh Couple : సీఎం రేవంత్ ఫ్యామిలీని కలిసిన రష్మిక - వివాహ రిసెప్షన్‌కు ఆహ్వానం
సీఎం రేవంత్ ఫ్యామిలీని కలిసిన రష్మిక - వివాహ రిసెప్షన్‌కు ఆహ్వానం
TTD Chairman BR Naidu: అలాంటి వీడియోలకు భయపడే వ్యక్తిని కాదు.. వాళ్ల బాగోతం బయటపెడతా: బీఆర్ నాయుడు
అలాంటి వీడియోలకు భయపడే వ్యక్తిని కాదు.. వాళ్ల బాగోతం బయటపెడతా: బీఆర్ నాయుడు

వీడియోలు

Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|
Pakistan Out of T20 World Cup 2026 | టీ20 వరల్డ్ కప్ నుంచి పాకిస్థాన్ అవుట్
India vs West Indies T20 World Cup Team India Batting Lineup | భార‌త అసిస్టెంట్ కోచ్ కీల‌క వ్యాఖ్య‌లు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Iran Israel Conflict: గల్ఫ్ దేశాల్లోని ఏపీ ప్రజలు ఆందోళన చెందొద్దు.. హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు
గల్ఫ్ దేశాల్లోని ఏపీ ప్రజలు ఆందోళన చెందొద్దు.. హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు
AP Judicial Academy: ఏపీ జ్యుడీషియల్ అకాడమీకి శంకుస్థాపన చేసిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, రూ.165 కోట్లతో నిర్మాణం
ఏపీ జ్యుడీషియల్ అకాడమీకి శంకుస్థాపన చేసిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, రూ.165 కోట్లతో నిర్మాణం
Virosh Couple : సీఎం రేవంత్ ఫ్యామిలీని కలిసిన రష్మిక - వివాహ రిసెప్షన్‌కు ఆహ్వానం
సీఎం రేవంత్ ఫ్యామిలీని కలిసిన రష్మిక - వివాహ రిసెప్షన్‌కు ఆహ్వానం
TTD Chairman BR Naidu: అలాంటి వీడియోలకు భయపడే వ్యక్తిని కాదు.. వాళ్ల బాగోతం బయటపెడతా: బీఆర్ నాయుడు
అలాంటి వీడియోలకు భయపడే వ్యక్తిని కాదు.. వాళ్ల బాగోతం బయటపెడతా: బీఆర్ నాయుడు
Money Laundering Case: జైలులో జీవితం నరకమే... తీహార్‌లో చావు కోసం చూశానని నటి ఆవేదన
జైలులో జీవితం నరకమే... తీహార్‌లో చావు కోసం చూశానని నటి ఆవేదన
Iran New Supreme Leader: ఖమేనీ మృతి తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్ ఎవరు? ఈ కీలక బాధ్యతలు ముళ్ల కిరీటమే!
ఖమేనీ మృతి తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్ ఎవరు? ఈ కీలక బాధ్యతలు ముళ్ల కిరీటమే!
Nawab Cafe OTT : ఆ ఓటీటీలోకి నవాబ్ కేఫ్ - నెల రోజుల్లోపే స్ట్రీమింగ్... ఎప్పుడు, ఏ ప్లాట్ ఫాంలో అంటే?
ఆ ఓటీటీలోకి నవాబ్ కేఫ్ - నెల రోజుల్లోపే స్ట్రీమింగ్... ఎప్పుడు, ఏ ప్లాట్ ఫాంలో అంటే?
Affordable Mileage Bikes: 70 కి.మీ మైలేజ్, అద్భుతమైన ఫీచర్లు.. బడ్జెట్ ధరలో టాప్ 5 బైక్స్ ఇవే
70 కి.మీ మైలేజ్, అద్భుతమైన ఫీచర్లు.. బడ్జెట్ ధరలో టాప్ 5 బైక్స్ ఇవే
Embed widget