అన్వేషించండి

6జీ లాంచ్ గురించి మాట్లాడిన మోదీ - ఎప్పుడు వస్తుందో కూడా చెప్పేశారు!

మనదేశంలో 6జీ లాంచ్ గురించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాట్లాడారు.

అక్టోబర్ నుంచి మనదేశంలో 5జీ సేవలు ప్రారంభం కానున్నాయి. అయితే 5జీ సేవలు ప్రారంభం కావడానికి ముందే దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 6జీ సేవల గురించి వ్యాఖ్యానించారు. 2030 చివరి నాటికి మనదేశంలో 6జీ సేవలను ప్రారంభించేలా ప్రణాళికలు చేస్తున్నట్లు మోదీ తెలిపారు.

స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ 2022 గ్రాండ్ ఫినాలేలో ఈ ప్రకటన వచ్చింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. ఈ దశాబ్దం చివరికి 6జీ లాంచ్ చేయాలని ప్రయత్నిస్తున్నామని తెలిపారు. గేమింగ్, ఎంటర్‌టైన్‌మెంట్ రంగాల్లో భారతీయ సొల్యూషన్స్ తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.

ఇక మనదేశంలో 5జీ రోల్‌అవుట్ మనదేశంలో అక్టోబర్‌లో ప్రారంభం కానుంది. అక్టోబర్ 12వ తేదీ కల్లా 5జీ సేవలు మనదేశంలో ప్రారంభం అవుతాయని టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్ గతంలో తెలిపారు. ఈ మేరకు సర్వీస్ ప్రొవైడర్లకు సమాచారం కూడా ఇచ్చారు. మొదటగా 13 నగరాల్లో 5జీ సేవలను అందించనున్నారు.

అహ్మదాబాద్, బెంగళూరు, చండీగర్, చెన్నై, ఢిల్లీ, గాంధీనగర్, గురుగ్రామ్, హైదరాబాద్, జామ్‌నగర్, కోల్‌కతా, లక్నో, ముంబై, పుణే నగరాల్లో 5జీ సర్వీసులు మొదటగా ప్రారంభం కానున్నాయి. భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో, అదానీ డేటా నెట్‌వర్క్స్, వొడాఫోన్ ఐడియాల నుంచి టెలికాం శాఖకు ఇప్పటికే రూ.17,876 కోట్ల మొత్తం అందింది.

పైన పేర్కొన్న 13 నగరాల్లో 5జీ మొదటగా ప్రారంభం కానుంది. ఆ తర్వాత 5జీని దశల వారీగా అందుబాటులోకి తీసుకురానున్నారు. పూర్తిగా దేశం మొత్తం 5జీ కవరేజ్ రావాలంటే కనీసం రెండు సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. దేశంలో 5జీ టెస్టింగ్ అయితే ఇప్పటికే ప్రారంభం అయింది.

కేంద్ర ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ ఇంతవరకు 4జీని అందుబాటులోకి తీసుకురాలేదు. అయితే 5జీని త్వరలో బీఎస్ఎన్ఎల్ తీసుకురానుందని తెలుస్తోంది. 5జీ సర్వీసుల కోసం బీఎస్ఎన్ఎల్ ఇటీవలే టెలికమ్యూనికేషన్స్ డిపార్టెమెంట్ (డీఓటీ) పర్మిషన్ కోరింది. ఈ పర్మిషన్ వస్తే త్వరలో బీఎస్ఎన్ఎల్ 4జీ, 5జీ అందుబాటులోకి రానున్నాయి.

5జీ ఎన్ఎస్ఏతో రానున్న బీఎస్ఎన్ఎల్
బీఎస్ఎన్ఎల్ 5జీ ఎన్ఎస్ఏ నెట్‌వర్క్స్‌తో ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. పూర్తిగా బేస్ 4జీ కోర్ నెట్‌వర్క్‌ను నిర్మించడం ద్వారా ఇది సాధ్యం అవుతుంది. 5జీ ఎస్ఏ కంటే 5జీ ఎన్ఎస్ఏ బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండనుంది. ఎందుకంటే 5జీ ఎస్ఏకు పూర్తిగా కొత్త ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అవసరం. అంత బడ్జెట్ బీఎస్ఎన్ఎల్ దగ్గర ఉందో లేదో తెలియరాలేదు.

ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే, బీఎస్ఎన్ఎల్ 5జీ 2023లోనే లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అది బీఎస్ఎన్ఎల్‌కు మంచిదనే చెప్పాలి. 4జీ ఆలస్యం కావడంతో బీఎస్ఎన్ఎల్‌కు చాలా డ్యామేజ్ జరిగింది. దీంతో ప్రభుత్వానికి, బీఎస్ఎన్ఎల్‌కు అప్‌గ్రేడ్ అవ్వడం అత్యవసరం అని తెలిసి ఉంటుంది. ప్రస్తుతం మొబైల్ నెట్‌వర్క్ ప్లాన్లలో బీఎస్ఎన్ఎల్ ప్లాన్లే తక్కువ ధరలో ఉన్నాయి. 5జీలో కూడా చవకైన ప్లాన్లు తీసుకొస్తే బీఎస్ఎన్ఎల్ తిరిగి టెలికాం రంగంలో ముందుకు వచ్చే అవకాశం ఉంది.

ఎఫ్ఈ కథనం ప్రకారం బీఎస్ఎన్ఎల్ 70 మెగాహెర్ట్జ్ బ్యాండ్ కోసం దరఖాస్తు చేసుకుంటే 40 మెగాహెర్ట్జ్ బ్యాండ్‌కు మాత్రమే అనుమతి వచ్చినట్లు తెలుస్తోంది. డిజిటల్ కమ్యూనికేషన్స్ కమిషన్ సిఫారసులనే టెలికాం డిపార్ట్‌మెంట్ ఫాలో అవుతుంది. 70 మెగాహెర్ట్జ్ ఎయిర్ వేవ్స్‌ను బీఎస్ఎన్ఎల్ కోసం రిజర్వ్ చేస్తే ప్రైవేట్ టెలికాం సంస్థలకు 5జీ ఎయిర్ వేవ్స్ కొరత ఏర్పడుతుంది టెలికాం డిపార్ట్‌మెంట్ అభిప్రాయపడుతోంది.

Also Read: Samsung Galaxy Z Fold 4: 16 జీబీ ర్యామ్‌తో శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ - లాంచ్ త్వరలోనే!

Also Read: 200 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ కొత్త ఫోన్ - ఫొటోలు అదిరిపోతాయ్!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Leopard In Tirumala: తిరుమలలో మరోసారి చిరుత కలకలం, మెట్టు మార్గంలో చూసినట్లు చెబుతున్న భక్తులు
తిరుమలలో మరోసారి చిరుత కలకలం, మెట్టు మార్గంలో చూసినట్లు చెబుతున్న భక్తులు
KTR: కాళేశ్వరానికి 80వేల కోట్లంటే గగ్గోలు పెట్టారు, మూసీకి రూ.1.50లక్షల కోట్లా ?: కేటీఆర్‌
కాళేశ్వరానికి 80వేల కోట్లంటే గగ్గోలు పెట్టారు, మూసీకి రూ.1.50లక్షల కోట్లా ?: కేటీఆర్‌
Tamil Nadu: తమిళనాడు కేబినెట్‌లో మార్పులు- డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్, ప్రమాణానికి ముహూర్తం ఫిక్స్
తమిళనాడు కేబినెట్‌లో మార్పులు- డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్, ప్రమాణానికి ముహూర్తం ఫిక్స్
Viral News: ఆ బాడీగార్డ్‌కు సీఈఓలను మించిన వేతనం- కింగ్‌ కోహ్లీ సెక్యూరిటీ గార్డ్ గురించి ఆసక్తికర విషయాలు
ఆ బాడీగార్డ్‌కు సీఈఓలను మించిన వేతనం- కింగ్‌ కోహ్లీ సెక్యూరిటీ గార్డ్ గురించి ఆసక్తికర విషయాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కేరళలో చోరీ, తమిళనాడులో ఎన్‌కౌంటర్ - భారీ యాక్షన్ డ్రామాSecond Moon: భూమికి చిన్న చందమామ వస్తున్నాడు - రెండో చంద్రుడు ఎలా సాధ్యం?Ponguleti Srinivas: పొంగులేటి శ్రీనివాస్ ఇంట్లో ఈడీ సోదాలుహిందువులు మేల్కోవాల్సిన సమయం వచ్చింది, బీజేపీ నేత మాధవీ లత

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Leopard In Tirumala: తిరుమలలో మరోసారి చిరుత కలకలం, మెట్టు మార్గంలో చూసినట్లు చెబుతున్న భక్తులు
తిరుమలలో మరోసారి చిరుత కలకలం, మెట్టు మార్గంలో చూసినట్లు చెబుతున్న భక్తులు
KTR: కాళేశ్వరానికి 80వేల కోట్లంటే గగ్గోలు పెట్టారు, మూసీకి రూ.1.50లక్షల కోట్లా ?: కేటీఆర్‌
కాళేశ్వరానికి 80వేల కోట్లంటే గగ్గోలు పెట్టారు, మూసీకి రూ.1.50లక్షల కోట్లా ?: కేటీఆర్‌
Tamil Nadu: తమిళనాడు కేబినెట్‌లో మార్పులు- డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్, ప్రమాణానికి ముహూర్తం ఫిక్స్
తమిళనాడు కేబినెట్‌లో మార్పులు- డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్, ప్రమాణానికి ముహూర్తం ఫిక్స్
Viral News: ఆ బాడీగార్డ్‌కు సీఈఓలను మించిన వేతనం- కింగ్‌ కోహ్లీ సెక్యూరిటీ గార్డ్ గురించి ఆసక్తికర విషయాలు
ఆ బాడీగార్డ్‌కు సీఈఓలను మించిన వేతనం- కింగ్‌ కోహ్లీ సెక్యూరిటీ గార్డ్ గురించి ఆసక్తికర విషయాలు
Team India Squad: బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ, ఓ వేదికగా హైదరాబాద్
బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ, ఓ వేదికగా హైదరాబాద్
CM Chandrababu: రాష్ట్రంలో పెట్టుబడులకు లులు గ్రూప్ ఆసక్తి - స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు సహకరిస్తామన్న సీఎం చంద్రబాబు
రాష్ట్రంలో పెట్టుబడులకు లులు గ్రూప్ ఆసక్తి - స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు సహకరిస్తామన్న సీఎం చంద్రబాబు
Telangana Digital Cards: ఫ్యామిలీ డిజిటల్ కార్డులో మ‌హిళే య‌జ‌మాని - అక్టోబ‌రు 3 నుంచి పైలెట్‌ ప్రాజెక్టు: రేవంత్ రెడ్డి
ఫ్యామిలీ డిజిటల్ కార్డులో మ‌హిళే య‌జ‌మాని - అక్టోబ‌రు 3 నుంచి పైలెట్‌ ప్రాజెక్టు: రేవంత్ రెడ్డి
ATM Robbery: సినిమా సీన్లను మించేలా ఛేజింగ్, ఆపై ఎన్‌కౌంటర్‌ - కేరళలో చోరీ చేసి తమిళనాడులో దొరికిన గ్యాంగ్
సినిమా సీన్లను మించేలా ఛేజింగ్, ఆపై ఎన్‌కౌంటర్‌ - కేరళలో చోరీ చేసి తమిళనాడులో దొరికిన గ్యాంగ్
Embed widget