అన్వేషించండి

Parag Agrawal: ట్విట్టర్ నుంచి బయటకు వెళ్తూ, పరాగ్ అగర్వాల్ ఎంత డబ్బు తీసుకెళ్తారో తెలుసా?

ట్విట్టర్ ఎట్టకేలకు ఎలన్ మస్క్ సొంతమైంది. 44 బిలియన్ డాలర్ల ట్విట్టర్ టేకోవర్ ఒప్పందం కంప్లీట్ అయినట్లు యుఎస్ మీడియా వెల్లడించింది. ఈ మేరకు ‘పక్షికి విముక్తి లభించింది’ అని మస్క్ ట్వీట్ చేశాడు.

ట్విట్టర్ పిట్టను కొనుగోలు చేసిన ఎలన్ మస్క్, వెను వెంటనే కీలక నిర్ణయాలు తీసుకున్నారు. భారతీయ సంతతికి చెందిన ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్ తో సహా కీలక పదవుల్లో కొనసాగుతున్న వాళ్లకు ఉద్వాసన పలికారు. ట్విట్టర్ లీగల్, పాలసీ అండ్ ట్రస్ట్ హెడ్ విజయ గద్దె, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నెడ్ సెగల్, 2012 నుంచి ట్విట్టర్‌ న్యాయవాదిగా కొనసాగుతున్నన సీన్ ఎడ్జెట్ ను పదవుల నుంచి తప్పించారు. అనంతం 'ది బర్డ్ ఈజ్ ఫ్రీడ్’ అంటూ మస్క్ ట్వీట్ చేశారు. 

పరాగ్ అగర్వాల్ కు ఎంత చెల్లించాలంటే?

ఈ ఏడాది ఏప్రిల్‌లో మస్క్ ట్విట్టర్‌ని కొనుగోలు చేయాలనుకుంటున్నట్లు వెల్లడించారు. దానికంటే కొద్ది రోజుల ముందు పరాగ్, మస్క్ మధ్య  ట్విట్టర్ వేదికగా మాటల తూటాలు పేలాయి. మస్క్ ట్విట్టర్ కొనుగోలు అంశాన్ని తెరమీదకు తీసుకురాగానే, పరాగ్ బయటకు వెళ్లక తప్పదు అనే ఊహాగానాలు వచ్చాయి. ప్రస్తుతం అవి వాస్తవం అని తేలాయి. అయితే, కంపెనీ నుంచి పరాగ్ బయటకు వెళ్తున్న నేపథ్యంలో సుమారు $42 మిలియన్లు (ప్రస్తుత మారకపు విలువ ప్రకారం రూ.3,457,145,328) పొందుతారని రాయిటర్స్ వార్తా సంస్థ నివేదించింది. Twitter ఇటీవలి ప్రాక్సీ స్టేట్‌మెంట్‌లోని నిబంధనల ప్రకారం ఒక్కో షేరు విలువ $54.20 ఆధారంగా అంచనా వేశారు.

పరాగ్ తో వివాదామే ట్విట్టర్ కొనుగోలుకు కారణం!

ట్విట్టర్‌లో చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా ఉన్న అగర్వాల్‌ను నవంబర్ 2021లో సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సే CEOగా నియమించారు. ఐఐటీ బాంబే, స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీ పూర్వ విద్యార్థి అయిన అగర్వాల్, ట్విట్టర్ ఏర్పడిన వెంటనే జాయిన్ అయ్యాడు. వాస్తవానికి మస్క్ ట్విట్టర్ ను కొనుగోలు చేయబోతున్నట్లు ప్రకటించగానే CEOగా నిష్క్రమణ ఖాయం అనిపించింది. తనకు ప్రస్తుత మేనేజ్మెంట్ మీద నమ్మకం లేదని ఏప్రిల్ 14న మస్క్ సెక్యూరిటీస్ ఫైలింగ్‌లో చెప్పాడు. మేలో, కంపెనీ యూజర్ మెట్రిక్‌లను సమర్థించుకునేందుకు అగర్వాల్ పోస్ట్ చేసిన థ్రెడ్‌కు మస్క్ పూప్ ఎమోజితో రిప్లై ఇచ్చాడు. అంతేకాదు, ఇద్దరి మధ్య  ట్వీట్ వార్ కూడా నడిచింది. మస్క్, పరాగ్ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. తాజాగా వీరి మధ్య జరిగిన అంతర్గత సంభాషణ వివరాలు బయటకు వచ్చాయి.

పరాగ్, మస్క్.. మధ్యలో డోర్సే!

వాస్తవానికి ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు డోర్సే, మస్క్ చిరకాల మిత్రులు. మస్క్, పరాగ్ మధ్య చెలరేగిన వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు  ప్రయత్నించాడు. ఇద్దరు కలిసి ఉంటే మంచిదని చెప్పుకొచ్చాడు. కానీ, అది సాధ్యం కాలేదు. చివరకు మస్క్ ట్విట్టర్ ను చేజిక్కించుకోవడంతో పరాగ్ బయటకు వెళ్లకతప్పని పరిస్థితి ఏర్పడింది.

Read Also: మీ వాట్సాప్ డౌన్ అయ్యిందా? కంగారు పడొద్దు, ఈ 5 యాప్స్ వాడుకోండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

IndiGo financial losses: ఇండిగో ఆర్థిక పునాదులపై గట్టి దెబ్బ - కోలుకోవడం కష్టమేనా ?
ఇండిగో ఆర్థిక పునాదులపై గట్టి దెబ్బ - కోలుకోవడం కష్టమేనా ?
​​Telangana Rising Global Summit 2025 : ఫీనిక్స్ పక్షి స్పూర్తితోనే తెలంగాణ రైజింగ్ ఆలోచన ! గ్లోబల్ సమ్మిట్‌లో మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు!
ఫీనిక్స్ పక్షి స్పూర్తితోనే తెలంగాణ రైజింగ్ ఆలోచన ! గ్లోబల్ సమ్మిట్‌లో మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు!
AP CM Chandrababu: కూటమి అధికారంలోకి వచ్చాక దారిన పడుతున్న ఆంధ్రా ఆర్థిక పరిస్థితి - లెక్కలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు
కూటమి అధికారంలోకి వచ్చాక దారిన పడుతున్న ఆంధ్రా ఆర్థిక పరిస్థితి - లెక్కలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు
IAS Kata Amrapali: తెలంగాణకు వచ్చేందుకు ఐఏఎస్ అమ్రపాలి ప్రయత్నాలు మళ్లీ విఫలం - క్యాట్ ఉత్తర్వులపై హైకోర్టు స్టే
తెలంగాణకు వచ్చేందుకు ఐఏఎస్ అమ్రపాలి ప్రయత్నాలు మళ్లీ విఫలం - క్యాట్ ఉత్తర్వులపై హైకోర్టు స్టే

వీడియోలు

Gambhir Warning to DC Owner | ఐపీఎల్ ఓనర్ కు గంభీర్ వార్నింగ్
DK Shivakumar Chinnaswamy Stadium IPL 2026 | ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ పై శివకుమార్ ట్వీట్
Ravi Shastri Comments on Team India | టీమిండియాపై రవిశాస్త్రి ఫైర్
Coach Gautam Gambhir About Ro - Ko | రో - కో జోడీపై గంభీర్ షాకింగ్ కామెంట్స్
మాపై ఎందుకు పగబట్టారు..? మేం ఎలా బ్రతకాలో చెప్పండి..!

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IndiGo financial losses: ఇండిగో ఆర్థిక పునాదులపై గట్టి దెబ్బ - కోలుకోవడం కష్టమేనా ?
ఇండిగో ఆర్థిక పునాదులపై గట్టి దెబ్బ - కోలుకోవడం కష్టమేనా ?
​​Telangana Rising Global Summit 2025 : ఫీనిక్స్ పక్షి స్పూర్తితోనే తెలంగాణ రైజింగ్ ఆలోచన ! గ్లోబల్ సమ్మిట్‌లో మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు!
ఫీనిక్స్ పక్షి స్పూర్తితోనే తెలంగాణ రైజింగ్ ఆలోచన ! గ్లోబల్ సమ్మిట్‌లో మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు!
AP CM Chandrababu: కూటమి అధికారంలోకి వచ్చాక దారిన పడుతున్న ఆంధ్రా ఆర్థిక పరిస్థితి - లెక్కలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు
కూటమి అధికారంలోకి వచ్చాక దారిన పడుతున్న ఆంధ్రా ఆర్థిక పరిస్థితి - లెక్కలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు
IAS Kata Amrapali: తెలంగాణకు వచ్చేందుకు ఐఏఎస్ అమ్రపాలి ప్రయత్నాలు మళ్లీ విఫలం - క్యాట్ ఉత్తర్వులపై హైకోర్టు స్టే
తెలంగాణకు వచ్చేందుకు ఐఏఎస్ అమ్రపాలి ప్రయత్నాలు మళ్లీ విఫలం - క్యాట్ ఉత్తర్వులపై హైకోర్టు స్టే
IndiGo crisis: ఇండిగోనే తప్పు చేసింది - సమస్యను మేం పర్యవేక్షించడం లేదు - చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
ఇండిగోనే తప్పు చేసింది - సమస్యను మేం పర్యవేక్షించడం లేదు - చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
IndiGo Crisis: ఇండిగో మరోసారి నిర్లక్ష్యం చేయకుండా శిక్షిస్తాం - పార్లమెంట్‌లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటన
ఇండిగో మరోసారి నిర్లక్ష్యం చేయకుండా శిక్షిస్తాం - పార్లమెంట్‌లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటన
IndiGo Flights Cancellation: ఇండిగో విమానాల రద్దుతో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికులకు వింత కష్టాలు..!
ఇండిగో విమానాల రద్దుతో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికులకు వింత కష్టాలు..!
PM Modi In Lok Sabha: వందేమాతరం నినాదంతో ఎందరో ప్రాణత్యాగం చేశారు.. పార్లమెంటులో చర్చలో ప్రధాని మోదీ
వందేమాతరం నినాదంతో ఎందరో ప్రాణత్యాగం చేశారు.. పార్లమెంటులో చర్చలో ప్రధాని మోదీ
Embed widget