అన్వేషించండి

Nothing Phone 2a: రూ.20 వేలలోపే నథింగ్ ఫోన్ 2ఏ - ఈ ధరలో బెస్ట్ ఫోన్ - వావ్ అనిపించే ఫీచర్లు!

Nothing Phone 2a Launched: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ నథింగ్ తన కొత్త ఫోన్‌ను మనదేశంలో లాంచ్ చేసింది. అదే నథింగ్ ఫోన్ 2ఏ.

Nothing New Phone: నథింగ్ ఫోన్ 2ఏ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. నథింగ్ కంపెనీ స్థాపించాక లాంచ్ చేసిన మూడో ఫోన్ ఇది. మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రో ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. 120 హెర్ట్జ్ అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేసే అమోఎల్ఈడీ డిస్‌ప్లేను ఈ ఫోన్‌లో అందించనున్నారు. ఫోన్ వెనకవైపు రెండు 50 మెగాపిక్సెల్ కెమెరాలు ఉన్నాయి. ఐపీ54 రేటెడ్ బిల్డ్‌తో ఈ ఫోన్ మార్కెట్లో ఎంట్రీ ఇచ్చింది. కంపెనీ ట్రేడ్‌మార్క్ ట్రాన్స్‌పరెంట్ డిజైన్ తరహా గ్లిఫ్ ఇంటర్‌ఫేస్‌ను నథింగ్ ఫోన్ 2ఏలో కూడా చూడవచ్చు.

నథింగ్ ఫోన్ 2ఏ ధర (Nothing Phone 2a Price in India)
ఈ స్మార్ట్ ఫోన్‌లో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.23,999గా నిర్ణయించారు. ఇక 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.27,999గా ఉంది. వైట్, బ్లాక్ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. మార్చి 12వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో దీని సేల్ ప్రారంభం కానుంది.

స్పెషల్ లాంచ్ ఆఫర్ కింద మార్చి 12వ తేదీన ఈ ఫోన్‌ను రూ.19,999కే కొనుగోలు చేయవచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.2,000 క్యాష్‌బ్యాక్ కూడా లభించనుంది. దీంతోపాటు ఎక్స్‌ఛేంజ్‌పై రూ.2,000 అదనపు తగ్గింపు అందించనున్నారు. తొమ్మిది నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది.

నథింగ్ ఫోన్ 2ఏ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు (Nothing Phone 2a Specifications)
ఆండ్రాయిడ్ 14 ఆధారిత నథింగ్ ఓఎస్ 2.5 ఆపరేటింగ్ సిస్టంపై నథింగ్ ఫోన్ 2ఏ పని చేయనుంది. మూడు సంవత్సరాల పాటు ఆండ్రాయిడ్ అప్‌డేట్స్, నాలుగు సంవత్సరాల పాటు సెక్యూరిటీ ప్యాచ్‌లు అందిస్తామని నథింగ్ ప్రకటించింది. ఇందులో 6.72 అంగుళాల అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ 30 హెర్ట్జ్ నుంచి 120 హెర్ట్జ్ మధ్య ఉండనుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5... డిస్‌ప్లేకు ప్రొటెక్షన్ అందించనుంది. హెచ్‌డీఆర్10+ సపోర్ట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఆక్టాకోర్ 4 ఎన్ఎం మీడియాటెక్ డైమెన్సిటీ డైమెన్సిటీ 7200 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ రన్ కానుంది. 12 జీబీ వరకు ర్యామ్‌ను కూడా ఈ ఫోన్‌లో అందించారు.

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు రెండు 50 మెగాపిక్సెల్ కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఒక 50 మెగాపిక్సెల్ సెన్సార్ ప్రధాన కెమెరా కాగా, మరో 50 మెగాపిక్సెల్ సెన్సార్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కావడం విశేషం. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌ను ప్రధాన కెమెరా సపోర్ట్ చేయనుంది. అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ 114 డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూను డెలివర్ చేయనుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అందుబాటులో ఉంది.

256 జీబీ వరకు ఇన్‌బిల్ట్ స్టోరేజ్‌ను ఇందులో అందించారు. 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6, వైఫై 6 డైరెక్ట్, బ్లూటూత్ వీ5.3, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, గ్లోనాస్, గెలీలియో, క్యూజెడ్ఎస్ఎస్, 360 డిగ్రీ యాంటెన్నా, యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్ కూడా అందించారు. ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్ ద్వారా నథింగ్ ఫోన్ 2ఏను అన్‌లాక్ చేయవచ్చు. హైడెఫినిషయన్ మైక్రోఫోన్లు, డ్యూయల్ స్టీరియో స్పీకర్లు ఇందులో ఉన్నాయి.

ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. 45W ఫాస్ట్ ఛార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే రెండు రోజుల బ్యాటరీ బ్యాకప్‌ను ఈ ఫోన్ అందించనుందని కంపెనీ అంటోంది. ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ద్వారా 59 నిమిషాల్లోనే ఫోన్ పూర్తిగా ఛార్జ్ కానుంది. దీని మందం 0.85 సెంటీమీటర్లు కాగా, బరువు 190 గ్రాములుగా ఉంది. ఇంతకు ముందు రెండు ఫోన్ల తరహాలోనే ట్రాన్స్‌పరెంట్ గ్లిఫ్ డిజైన్‌తో నథింగ్ ఫోన్ 2ఏ మార్కెట్లో లాంచ్ అయింది.

Also Read: నోకియా ఫోన్లు ఇక కనిపించవా? - కంపెనీ కొత్త ప్రకటనకు అర్థం ఏంటి?

Also Read: వాట్సాప్ ఛాట్ బ్యాకప్ చేస్తున్నారా? - అయితే త్వరలో రానున్న ఈ రూల్ తెలుసా?

టాప్ హెడ్ లైన్స్

Cement Corporation of India: ఆదిలాబాద్‌లో సిమెంట్ పరిశ్రమ పునరుద్ధరణపై జోగు రామన్న అల్టిమేటం - ఆగస్టు 31లోగా తేల్చకపోతే ఆమరణ నిరాహార దీక్ష!
ఆదిలాబాద్‌లో సిమెంట్ పరిశ్రమ పునరుద్ధరణపై జోగు రామన్న అల్టిమేటం - ఆగస్టు 31లోగా తేల్చకపోతే ఆమరణ నిరాహార దీక్ష!
Oneplus: వన్‌ప్లస్ భారత్ మార్కెట్ నుంచి తప్పుకుటుందా? జరుగుతున్న ప్రచారంలో వాస్తవమేంటీ?
వన్‌ప్లస్ భారత్ మార్కెట్ నుంచి తప్పుకుటుందా? జరుగుతున్న ప్రచారంలో వాస్తవమేంటీ?
Notice To Telegram: పైరసీ సినిమాలపై టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు! 15 రోజులే గడువు!  
పైరసీ సినిమాలపై టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు! 15 రోజులే గడువు!  
WhatsApp Usernames Cyber Security Risks: వాట్సాప్ యూజర్ నేమ్ ఫీచర్‌పై కేంద్రం సీరియస్.. అసలు అభ్యంతరాలేంటి? మెటా వాదన ఏంటి?
వాట్సాప్ యూజర్ నేమ్ ఫీచర్‌పై కేంద్రం సీరియస్.. అసలు అభ్యంతరాలేంటి? మెటా వాదన ఏంటి?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sonam Wangchuk:సోనమ్‌ వాంగ్‌చుక్‌ దీక్ష విరమణ- జంతర్‌మంతర్‌ వద్ద హైటెనషన్
సోనమ్‌ వాంగ్‌చుక్‌ దీక్ష విరమణ- జంతర్‌మంతర్‌ వద్ద హైటెనషన్
Prashant Kadiyam: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ చందు.. క్రికెట్ అంటే పిచ్చి.. సాఫ్ట్ వేర్ నుంచి బుల్లితెర వైపు
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ చందు.. క్రికెట్ అంటే పిచ్చి.. సాఫ్ట్ వేర్ నుంచి బుల్లితెర వైపు
కుప్పం vs మంగళగిరి: మా నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది - నారా లోకేష్
కుప్పం vs మంగళగిరి: మా నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది - నారా లోకేష్
YS Jagan Digital Politics: డిజిటల్ లూప్‌లో వైఎస్సార్‌సీపీ - ఫీల్డ్ వదిలి యాప్స్‌ను నమ్ముకుంటే రాజకీయాల్లో రాత మారుతుందా?
డిజిటల్ లూప్‌లో వైఎస్సార్‌సీపీ - ఫీల్డ్ వదిలి యాప్స్‌ను నమ్ముకుంటే రాజకీయాల్లో రాత మారుతుందా?
సోనమ్‌ వాంగ్‌చుక్ దీక్ష భగ్నం - ఆరోగ్యం క్షీణించంతో ఆసుపత్రికి తరలింపు 
సోనమ్‌ వాంగ్‌చుక్ దీక్ష భగ్నం - ఆరోగ్యం క్షీణించంతో ఆసుపత్రికి తరలింపు 
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
Hydrogen Cars and Buses:హైడ్రోజన్‌తో నడిచే రైలు మాదిరిగానే కార్లు, బస్‌లు, టూవీలర్స్‌ వస్తాయా? సీఎన్జీతో పోల్చుకుంటే వ్యత్యాసం ఏంటీ?
హైడ్రోజన్‌తో నడిచే రైలు మాదిరిగానే కార్లు, బస్‌లు, టూవీలర్స్‌ వస్తాయా? సీఎన్జీతో పోల్చుకుంటే వ్యత్యాసం ఏంటీ?
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
Embed widget