2G Tariff Plans: కీప్యాడ్ ఫోన్ల కోసం ప్రత్యేక ప్రీపెయిడ్ ప్లాన్లు ఉంటాయా? - ప్రభుత్వం ఏం అంటోంది?
Keypad Phone Tariff Plans: ప్రస్తుతం మనదేశంలో కీప్యాడ్ ఫోన్ల కోసం ప్రత్యేకమైన ప్రీపెయిడ్ ప్లాన్లు అందుబాటులో లేవు. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి కూడా ప్రశ్న ఎదురైంది. అప్పుడు ప్రభుత్వం ఏం బదులిచ్చింది?

Tariff Plans For Keypad Phone Users: స్మార్ట్ఫోన్లను ఉపయోగించని వారికి అంటే కీప్యాడ్ ఫోన్లు వాడే వినియోగదారులకు ఉపశమనం కలిగించడానికి ప్రభుత్వం లేదా టెలికాం కంపెనీలు ఏదైనా ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్లను రూపొందిస్తున్నాయా? అనే ప్రశ్న మీకు ఎప్పుడైనా తలెత్తిందా? కానీ లోక్సభలో ప్రభుత్వానికి ఈ ప్రశ్న ఎదురైంది. ఈ ప్రశ్నకు సమాధానంగా కేంద్ర టెలికాం మంత్రిత్వ శాఖ ప్రస్తుతం అలాంటి ప్లాన్పై పని చేయడం లేదని సర్వీస్ ప్రొవైడర్కు ఎటువంటి సూచనలను జారీ చేయలేదని స్పష్టంగా చెప్పింది.
ప్రభుత్వం ఏం చెప్పింది?
లోక్సభలో అడిగిన ఒక ప్రశ్నలో స్మార్ట్ఫోన్లు ఉపయోగించని వినియోగదారులు చాలా మంది ఉన్నారని, వారికి ఎలాంటి డేటా లేదా ఇతర సౌకర్యాలు అవసరం లేని ప్రత్యేక టారిఫ్ ప్లాన్ జారీ చేయడం గురించి ఏదైనా చర్చ జరిగిందా అని అడిగారు. ఈ ప్రశ్నకు కేంద్ర టెలికాం మంత్రిత్వ శాఖ బదులిస్తూ ప్రస్తుతం అలాంటి ప్లాన్పై ఎలాంటి పని జరగడం లేదని సమాధానం ఇచ్చింది.
Also Read: వన్ప్లస్ 11ఆర్ 5జీపై భారీ ఆఫర్ - ఏకంగా రూ.8 వేల వరకు తగ్గింపు!
స్మార్ట్ఫోన్ హోల్డర్లు, నాన్-స్మార్ట్ఫోన్ హోల్డర్ల కోసం మొబైల్ టారిఫ్లు అలాగే కొనసాగుతాయని కేంద్ర టెలికమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ ప్రశ్నకు సమాధానం అర్థం స్పష్టంగా ఉంది. అంటే మీరు స్మార్ట్ఫోన్ని ఉపయోగించకుండా, సాధారణ (కీప్యాడ్) ఫోన్ని ఉపయోగిస్తుంటే మీ కోసం డేటా లాభాలు లేని ప్రత్యేక ప్లాన్ని టెలికాం కంపెనీలు అందించబోవన్న మాట. అలాంటి టారిఫ్ ప్లాన్ని తీసుకురావాలనే ఆలోచన కూడా లేదు.
కొన్ని నెలల క్రితం పెరిగిన ప్లాన్ల ధరలు...
దేశంలోని ప్రైవేట్ టెలికాం కంపెనీలు రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా కొంతకాలం క్రితం రీఛార్జ్ ప్లాన్ల ధరలను పెంచాయి. ఈ పెరుగుదల తర్వాత ప్రజలు ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ వైపు మొగ్గు చూపడం ప్రారంభించారు. బీఎస్ఎన్ఎల్ దేశంలో తన నెట్వర్క్ను చాలా వేగంగా విస్తరిస్తోంది. 2025 చివరి నాటికి కంపెనీ దేశంలో 5జీ సేవలను కూడా ప్రారంభించగలదు.
Also Read: ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఆండ్రాయిడ్ ఫోన్లు - టాప్ మోడల్ రేటెంతో తెలుసా?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

