అన్వేషించండి

Emergency alerts on Android and iPhone: ప్రభుత్వం నుంచి మీ ఫోన్‌కే ఎమర్జెన్సీ అలర్ట్.. అందుకోసం మీరు ఏం చేయాలంటే

How to activate government alerts on Android and iPhone | ప్రభుత్వాల నుంచి ఎమర్జెన్సీ అలర్ట్స్ పొందడానికి ఆండ్రాయిడ్ యూజర్లతో పాటు ఐఫోన్ యూజర్లకు అవకాశం ఉంది.

India Pakistan Emergency Alerts: భారతదేశం, పాకిస్తాన్  ఉద్రిక్తతలను తగ్గించడంలో భాగంగా కాల్పుల విరమణకు శనివారం అంగీకరించాయి. కానీ కొన్ని గంటల్లోనే పాకిస్తాన్ కాల్పుల విరమణను ఉల్లంఘించి తన వక్రబుద్ధి నిరూపించుకుంది. కాల్పుల విమరణ ప్రకటన అనంతరం జమ్మూ, శ్రీనగర్‌తో సహా పలుచోట్ల డ్రోన్ దాడులకు ప్రయత్నించగా, భారత బలగాలు వారి ప్రయత్నాన్ని తిప్పికొట్టారు. 

ఇలాంటి సమయంలో ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్ ప్రాంతాలలో టెన్షన్ వాతావరణం నెలకొంటుంది. ప్రభుత్వాలు, అధికారులు వారి ప్రజలను బ్లాక్ అవుట్ సహా ఎయిర్ సైరన్ల గురించి.. ఆ సమయంలో తీసుకోవాల్సిన చర్యల గురించి అప్రమత్తం చేస్తున్నారు. ఈ సంక్షోభ సమయాల్లో ప్రజలు ప్రభుత్వాల నుంచి, అధికారుల నుంచి నేరుగా ఎమర్జెన్సీ అలర్ట్స్ పొందడం ద్వారా ప్రయోజనం కలుగుతుంది. దాంతో మీరు ఇంట్లోని ఉండి నేరుగా మీ ఫోన్ ద్వారా ఎమర్జెన్సీ అలర్ట్స్ పొందవచ్చు. అందుకోసం Android, iPhone యూజర్లు కొన్ని సెట్టింగ్స్ ఆన్ చేసుకోవాలి. అది ఎలాం చేయాలో ఇక్కడ స్టెప్ బై స్టెప్ తెలుసుకోండి.

ఆండ్రాయిడ్ యూజర్ల (Android sers) కోసం అత్యవసర హెచ్చరికలు
స్టెప్ 1: మీ ఆండ్రాయిస్ ఫోన్‌లో సెట్టింగ్స్ ఆప్షన్ ఓపెన్ చేయండి. 
స్టెప్ 2: సెట్టింగ్స్‌లోకి వెళ్లాక మీరు Safety and Emergency లేదా Emergency alerts ఆప్షన్లలో ఏమైనా ఉందేమో చెక్ చేసి క్లిక్ చేయాలి. 
స్టెప్ 3: తరువాత మీరు వైర్‌లెస్ అత్యవసర హెచ్చరికలు (Wireless emergency alerts) పై క్లిక్ చేయండి
స్టెప్ 4: అందులో మీకు అందుబాటులో ఉన్న అన్ని ఆప్షన్లను యాక్టివేట్ చేసుకోండి. 
అయితే ఫోన్ల బ్రాండ్లను బట్టి ఆండ్రాయిడ్ యూజర్లకు భిన్నమైన ఆప్షన్లు కనిపిస్తాయి. కొన్ని మోడల్స్‌లో అడ్వాన్స్‌డ్ సెట్టింగ్స్‌లోకి వెళ్లాక, లేక మోర్ సెట్టింగ్స్ లేదా సెల్ బ్రాడ్‌కాస్ట్ ఆప్షన్ క్లిక్ చేశాక “వైర్‌లెస్ అత్యవసర హెచ్చరికలు” (Wireless emergency alerts)  ఉండవచ్చు.

ఐఫోన్ యూజర్లు (iPhone Users) కోసం అత్యవసర హెచ్చరికలు
స్టెప్ 1: మీ ఐఫోన్లో సెట్టింగ్స్ ఆప్షన్ ఓపెన్ చేయండి. 
స్టెప్ 2: సెట్టింగ్స్‌లో నోటిఫికేషన్స్ ఆప్షన్ సెలక్ట్ చేయాలి. 
స్టెప్ 3: తరువాత “ప్రభుత్వ హెచ్చరికలు” (Government Alerts) కోసం కిందకు స్క్రోల్ చేయండి
స్టెప్ 4: ప్రభుత్వం నుండి ఇలాంటి ఎమర్జెన్సీ అలర్ట్స్ పొందేందుకు ‘టెస్ట్ అలర్ట్స్’ బటన్‌ను ఎంచుకోండి.

ఇవి ప్రభుత్వం నుచి నేరుగా వచ్చే అలర్ట్స్. భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత, భూకంపాలు, ఘోర విపత్తులు లాంటి అత్యవసర పరిస్థితిలో అలర్ట్స్ పొందడం ద్వారా ఎన్నో ప్రాంతాల ప్రజలకు ప్రయోజనం కలుగుతుంది. కొన్ని సందర్భాలలో ప్రాణ నష్టం సైతం జరగకుండా నివారించే అవకాశం ఉంటుంది. 

భారతదేశం, పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందం
పాకిస్తాన్‌, భారత్ కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకున్నాయి. శనివారం సాయంత్రం 5 గంటలకు కాల్పుల విరమణపై ప్రకటన చేశారు. పాకిస్తాన్ DGMO (డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్) శనివారం మధ్యాహ్నం 3.35 గంటలకు భారత DGMOకి ఫోన్ చేసి కాల్పుల విమరణకు చర్చించారు. వారి రిక్వెస్ట్ మేరకు భారత డీజీఎంవో కాల్పుల విరమణతో పాటు ఆర్మీ యాక్షన్ నిలిపివేయాలని   ఒప్పందం కుదిరిందని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ అన్నారు. కానీ కొన్ని గంటలకే పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కాల్పులు జరిపింది, కొన్నిచోట్ల డ్రోన్ దాడులు చేసింది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Asaduddin Owaisi:  మదర్సా గది కూడా కట్టలేని దళారులు అమోనియం నైట్రేట్‌తో దేశంపై దాడి చేస్తున్నారు - ఉగ్రవాదులపై ఓవైసీ తీవ్ర ఆగ్రహం
మదర్సా గది కూడా కట్టలేని దళారులు అమోనియం నైట్రేట్‌తో దేశంపై దాడి చేస్తున్నారు - ఉగ్రవాదులపై ఓవైసీ తీవ్ర ఆగ్రహం
Tirumala: తిరుమలలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు! టోకెన్లు ఎలా తీసుకోవాలి? పూర్తి వివరాలు ఇవిగో!
తిరుమలలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు! టోకెన్లు ఎలా తీసుకోవాలి? పూర్తి వివరాలు ఇవిగో!
Telangana Future City: రెండేళ్లలో అడుగు ముందుకు పడని ఫ్యూచర్ సిటీ - అక్కడే పెట్టుబడులకు సీఎం ప్రోత్సాహం -  కాని మాస్టర్ ప్లానేది?
రెండేళ్లలో అడుగు ముందుకు పడని ఫ్యూచర్ సిటీ - అక్కడే పెట్టుబడులకు సీఎం ప్రోత్సాహం - కాని మాస్టర్ ప్లానేది?
Ayodhya Ram Mandir : అంతా రామమయం! అయోధ్య రామమందిరం శిఖరంపై ధర్మధ్వజం ఎగురవేసిన తర్వాత మోదీ ఏమన్నారంటే!
అంతా రామమయం! అయోధ్య రామమందిరం శిఖరంపై ధర్మధ్వజం ఎగురవేసిన తర్వాత మోదీ ఏమన్నారంటే!
Advertisement

వీడియోలు

Tamilnadu Deputy CM Udhayanidhi Stalin Full Speech | ABP Southern Rising Summit 2025 లో ఉదయనిధి స్టాలిన్ పూర్తి ప్రసంగం | ABP Desam
Tamil Nadu Deputy CM Udhayanidhi Stalin Dravidian Algorithm ABP Southern Rising Summit 2025 | ద్రవిడయన్ ఆల్గారిథంపై మాట్లాడిన డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్
Tamil Nadu Deputy CM Udhayanidhi Stalin Speech | ABP Southern Rising Summit 2025 లో తమిళనాడు గవర్నర్ పై డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ఫైర్  | ABP Desam
ABP Director Dhruba Mukherjee Speech | ABP Southern Rising Summit 2025 లో ప్రారంభోపన్యాసం చేసిన ఏబీపీ న్యూస్ డైరెక్టర్ ధ్రుబ ముఖర్జీ | ABP Desam
ABP Southern Rising Summit 2025 Begins | ప్రారంభమైన ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్ 2025 | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Asaduddin Owaisi:  మదర్సా గది కూడా కట్టలేని దళారులు అమోనియం నైట్రేట్‌తో దేశంపై దాడి చేస్తున్నారు - ఉగ్రవాదులపై ఓవైసీ తీవ్ర ఆగ్రహం
మదర్సా గది కూడా కట్టలేని దళారులు అమోనియం నైట్రేట్‌తో దేశంపై దాడి చేస్తున్నారు - ఉగ్రవాదులపై ఓవైసీ తీవ్ర ఆగ్రహం
Tirumala: తిరుమలలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు! టోకెన్లు ఎలా తీసుకోవాలి? పూర్తి వివరాలు ఇవిగో!
తిరుమలలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు! టోకెన్లు ఎలా తీసుకోవాలి? పూర్తి వివరాలు ఇవిగో!
Telangana Future City: రెండేళ్లలో అడుగు ముందుకు పడని ఫ్యూచర్ సిటీ - అక్కడే పెట్టుబడులకు సీఎం ప్రోత్సాహం -  కాని మాస్టర్ ప్లానేది?
రెండేళ్లలో అడుగు ముందుకు పడని ఫ్యూచర్ సిటీ - అక్కడే పెట్టుబడులకు సీఎం ప్రోత్సాహం - కాని మాస్టర్ ప్లానేది?
Ayodhya Ram Mandir : అంతా రామమయం! అయోధ్య రామమందిరం శిఖరంపై ధర్మధ్వజం ఎగురవేసిన తర్వాత మోదీ ఏమన్నారంటే!
అంతా రామమయం! అయోధ్య రామమందిరం శిఖరంపై ధర్మధ్వజం ఎగురవేసిన తర్వాత మోదీ ఏమన్నారంటే!
Andhra Pradesh News: మెరుగైన పౌర సేవల కోసం ఏపీ ప్రభుత్వం అవేర్ యాప్.. 42 అంశాలపై సమాచారం
మెరుగైన పౌర సేవల కోసం ఏపీ ప్రభుత్వం అవేర్ యాప్.. 42 అంశాలపై సమాచారం
నెలకు 1000 km డ్రైవ్‌ చేసే సీనియర్‌ సిటిజన్లకు రూ.15 లక్షల్లో పర్‌ఫెక్ట్‌ ఆటోమేటిక్‌ కార్‌ - దీనిని మిస్‌ అవ్వొద్దు!
సీనియర్‌ సిటిజన్లు ఈజీగా హ్యాండిల్‌ చేయగల సేఫ్‌, ఆటోమేటిక్‌ కార్‌ - రూ.15 లక్షల బడ్జెట్‌లో
Secunderabad- Tirupati Vande Bharat Express: తిరుపతి వందే భారత్ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రేపటి నుండి కొత్త మార్పు
తిరుపతి వందే భారత్ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రేపటి నుండి కొత్త మార్పు
Snack for Weight Loss : ప్రతిరోజూ బెల్లం-శనగలు తింటే కలిగే లాభాలివే.. బరువు తగ్గడంతో పాటు ఎన్నో ప్రయోజనాలు
ప్రతిరోజూ బెల్లం-శనగలు తింటే కలిగే లాభాలివే.. బరువు తగ్గడంతో పాటు ఎన్నో ప్రయోజనాలు
Embed widget