అన్వేషించండి

Jio Airfiber: వైర్ లేకుండానే వైఫై - ఎయిర్‌ఫైబర్ డివైస్‌ను లాంచ్ చేయనున్న జియో!

జియో ఎయిర్‌ఫైబర్ డివైస్ త్వరలో మార్కెట్లోకి లాంచ్ కానుందని సమాచారం.

రిలయన్స్ జియో రిటైల్ కస్టమర్ల కోసం ఫిక్స్‌డ్ వైర్‌లెస్ యాక్సెస్ (ఎఫ్‌డబ్ల్యూఏ) డివైస్‌ను లాంచ్ చేయనుంది. జియో ఎయిర్‌ఫైబర్ మార్కెట్ రేటు కంటే 20 శాతం వరకు తగ్గింపుతో లాంచ్ కానుంది. ఈ వైర్‌లెస్ హై స్పీడ్ ఇంటర్నెట్ పరికరం (జియో ఎఫ్‌డబ్ల్యూఏ) వినియోగదారుల మార్కెట్‌లో సందడి చేయడానికి సిద్ధం అవుతోంది. ఈ డివైస్‌ను ఆగస్టు 28వ తేదీన లాంచ్ కావచ్చని వార్తలు వస్తున్నాయి. దీని ద్వారా వైర్ అవసరం లేకుండా ఇంటికి వైఫై పెట్టించుకోవచ్చన్న మాట.

మార్కెట్లో వినిపిస్తున్న వార్తల ప్రకారం డేటా టాప్ ప్యాక్ తర్వాత 5జీ నుంచి సంపాదించడానికి జియో చేస్తున్న ప్రధాన ప్రయత్నం ఇదే. ఎకనామిక్ టైమ్స్ వార్తల ప్రకారం రాబోయే ఏజీఎం (వార్షిక సాధారణ సమావేశం) సమయంలో ఈ లాంచ్‌ను చూడవచ్చని తెలుస్తోంది. జియో ఇప్పటివరకు లాంచ్ చేసిన డివైస్‌లన్నీ గొప్ప ఆఫర్‌లతోనే మార్కెట్లోకి వచ్చాయి. జియో లాంచ్ చేయనున్న ఫిక్స్‌డ్ వైర్‌లెస్ యాక్సెస్ భిన్నంగా ఏమీ ఉండదు. 

రిలయన్స్ జియో తన 5జీ రోల్‌అవుట్ పూర్తయిన,స్టెబిలైజ్ అయిన నగరాల్లో కస్టమర్ ట్రయల్స్ ప్రారంభించినట్లు సమాచారం. లాంచ్ కోసం సన్నాహకంగా ఇంటి వాతావరణంలో ట్రయల్స్ కోసం ఎంపిక చేసిన కొంత మంది ఉద్యోగులకు డివైస్‌ను కూడా పంపిందని తెలుస్తోంది. ఎకనామిక్ టైమ్స్ వార్తల ప్రకారం జియో ఎఫ్‌డబ్ల్యూఏ డివైస్ వివిధ 5జీ ఎయిర్‌వేవ్‌లను ఉపయోగించి డేటా పాత్‌వేని సృష్టించే క్యారియర్ అగ్రిగేషన్ టెక్నిక్‌ను ఉపయోగిస్తుంది. ఇందుకోసం గతేడాది వేలంలో 700 మెగాహెర్ట్జ్, 3300 మెగాహెర్ట్జ్, 26 గిగాహెర్ట్జ్‌లను టెల్కో కొనుగోలు చేసింది.

ఇప్పటికే లాంచ్ చేసిన ఎయిర్‌టెల్
భారతి ఎయిర్‌టెల్ తన ఎఫ్‌డబ్ల్యూఏ డివైస్ అయిన ఎక్స్‌స్ట్రీమ్ ఎయిర్‌ఫైబర్‌ను ముంబై, ఢిల్లీ నగరాల్లో ఈ నెలలో ప్రారంభించింది. ఈ డివైస్ ధర రూ. 2,500గా ఉంది. దీని నెలవారీ సబ్‌స్క్రిప్షన్ రూ. 799గా ఉంది. ఎయిర్‌టెల్ ప్రస్తుతం ఆరు నెలల బ్లాక్‌లలో మాత్రమే సబ్‌స్క్రిప్షన్‌లను అందిస్తోంది. అంటే వినియోగదారులు ప్రారంభంలో కనీసం రూ.7,300 ఖర్చు చేయాలన్న మాట.

స్వీడిష్ టెలికాం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్ ఎరిక్సన్ ప్రకారం అంతర్జాతీయ స్థాయిలో 2022 సంవత్సరంలో 10 కోట్ల ఎఫ్‌డబ్ల్యూఏ కనెక్షన్‌లు ఉన్నాయి. 2028 సంవత్సరం చివరి నాటికి ఈ సంఖ్య 300 మిలియన్లకు పెరుగుతుందని అంచనా. దీనిలో 80 శాతం కనెక్షన్లు 5జీ కనెక్టివిటీని ఉపయోగిస్తాయని అంచనా.

Read Also: సెకండ్ హ్యాండ్ ఐఫోన్‌ కొంటున్నారా? ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!

Read Also: మీ స్మార్ట్ ఫోన్ ఊరికే స్లో అయిపోతుందా? - అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AI for Income : AIతో నెలకు లక్షల్లో సంపాదించవచ్చు.. ఇలా వాడితే డబ్బే డబ్బు
AIతో నెలకు లక్షల్లో సంపాదించవచ్చు.. ఇలా వాడితే డబ్బే డబ్బు
iPhone 17e Launched: 48 MP కెమెరా, శాటిలైట్ ఫీచర్లతో వచ్చిన iPhone 17e.. ధర, పూర్తి వివరాలు
48 MP కెమెరా, శాటిలైట్ ఫీచర్లతో వచ్చిన iPhone 17e.. ధర, పూర్తి వివరాలు
Iran War: US-ఇజ్రాయెల్ త్రిముఖ వ్యూహం: ఇరాన్ ఎయిర్‌ డిఫెన్స్ ఎందకు ఆపలేకపోయిందంటే..!
యూఎస్-ఇజ్రాయెల్ త్రిముఖ వ్యూహం; ఆకాశం మూగబోయింది..ఇరాన్ రక్షణ వ్యవస్థ కూలిపోయింది. 
Screen Time Impact On Brain: అదే పనిగా మొబైల్‌ చూస్తూ ఉంటే బుద్ధిహీనత! బ్రెయిన్ రాట్ మెమొరీ లాస్‌!
అదే పనిగా మొబైల్‌ చూస్తూ ఉంటే బుద్ధిహీనత! బ్రెయిన్ రాట్ మెమొరీ లాస్‌!

వీడియోలు

Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Sanju Emotional Speech After 97 vs West Indies | సంజూ శాంసన్ ఎమోషనల్ స్పీచ్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Guntur Mirchi: ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
Kolikapudi controversy: చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
YS Jagan: కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
ఇరాన్‌-అమెరికా యుద్ధం: బ్యారెల్‌కు ఒక్క డాలర్‌ పెరిగినా ₹12,000 కోట్ల అదనపు భారం - మన పెట్రోల్‌ బడ్జెట్‌పై ప్రభావం ఎంత?
ఇరాన్‌-అమెరికా యుద్ధం: ఇండియాలో పెట్రోల్, డీజిల్‌ ధరలు పెరుగుతాయా? ఆటో ఇండస్ట్రీకి హెచ్చరిక సంకేతాలు
Andhra Pradesh Latest News: ఏపీ రాజకీయాల్లో మండలి సెగ; ఛైర్మన్‌ మోషేన్‌ రాజుపై అవిశ్వాసం పెట్టే యోచనలో వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్సీలు!
ఏపీ రాజకీయాల్లో మండలి సెగ; ఛైర్మన్‌ మోషేన్‌ రాజుపై అవిశ్వాసం పెట్టే యోచనలో వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్సీలు!
Balka Suman Released : ఆదిలాబాద్ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల! భారీగా తరలి వచ్చిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు 
ఆదిలాబాద్ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల! భారీగా తరలి వచ్చిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు 
US Shooting: అమెరికాలో ఇరాన్ జెండా టీ-షర్ట్ ధరించిన వ్యక్తి కాల్పులు! భారతీయ విద్యార్థి సహా ముగ్గురు మృతి!
అమెరికాలో ఇరాన్ జెండా టీ-షర్ట్ ధరించిన వ్యక్తి కాల్పులు! భారతీయ విద్యార్థి సహా ముగ్గురు మృతి!
Palamaner Latest News:తిరుమల వెళ్తుండగా తీరని విషాదం; పలమనేరు వద్ద ఘోర ప్రమాదం! ఐదుగురు బెంగళూరు వాసులు మృతి!
తిరుమల వెళ్తుండగా తీరని విషాదం; పలమనేరు వద్ద ఘోర ప్రమాదం! ఐదుగురు బెంగళూరు వాసులు మృతి!
Embed widget