అన్వేషించండి

iPhone Fold: యాపిల్ నుంచి అదిరిపోయే ఫోన్ - 2025లో మార్కెట్లోకి ‘ఐఫోన్ ఫోల్డ్‘ గ్రాండ్ ఎంట్రీ!

యాపిల్ నుంచి సరికొత్త ఫోన్ అందుబాటులోకి రాబోతోంది. ‘ఐఫోన్ ఫోల్డ్’గా పిలువబడే ఈ మోబైల్ 2025లో మార్కెట్లోకి అడుగు పెట్టే అవకాశం ఉంది.

ప్రపంచ టెక్ దిగ్గజం యాపిల్ నుంచి సరికొత్త స్మార్ట్ ఫోన్ ను రూపొందించే పనిలోపడింది. ఇప్పటికే Samsung, Huawei, Oppoతో సహా అనేక స్మార్ట్‌ ఫోన్ తయారీ కంపెనీలు ఫోల్డబుల్ స్మార్ట్‌ ఫోన్ సెగ్మెంట్‌లోకి అడుగు పెట్టాయి. ప్రస్తుతం ఆపిల్ కూడా తన పోల్డబుల్ ఫోన్ ను 2025లో లాంచ్  చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ కు ‘ఐఫోన్ ఫోల్డ్’ అని పేరు పెట్టబోతున్నట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. డిస్ప్లే సప్లై చైన్ కన్సల్టెంట్స్ (DSCC) విశ్లేషకుడు రాస్ యంగ్ సైతం ఇదే విషయాన్ని వెల్లడించారు. Apple తన ఫోల్డబుల్ ఐఫోన్ 2025లో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలిపారు.  

ఫోల్డబుల్ ఫోన్ ఎలా ఉండబోతోందంటే?

ఇక ఈ ఫోల్డబుల్ ఫోన్ లో ఓఎల్ఈడీ డిస్ ప్లే ఉండబోతున్నట్లు తెలుస్తోంది. USB-C పోర్టును కలిగి ఉండనున్నట్లు సమాచారం. అంతేకాదు, మాగ్ సేఫ్ ఫీచర్ ఈ ఐఫోన్ లో ఫోల్డ్ సపోర్టు చేసే అవకాశం ఉంది. టచ్ ఐడీతో పాటు ఫేస్ ఐడీని కూడా అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. సామ్ సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ ను పోలిన డిజైన్ ఉండబోతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. అంతేకాదు, ఈ ఫోన్ కు క్లామ్ షెల్ డిజైన్ ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.   

అల్ట్రా థిన్ కవర్ గ్లాస్‌ కోసం LGతో పనిచేస్తున్న యాపిల్

ఇక Apple ఫోల్డబుల్ ఫోన్ లో ఉపయోగించే  అల్ట్రా థిన్ కవర్ గ్లాస్‌ను రూపొందించడానికి LGతో కలిసి పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం, Apple iPhone, iPad కోసం స్వంత కస్టమ్ చిప్‌లను డిజైన్ చేస్తోంది. అయినప్పటికీ, ఇది 5G కనెక్టివిటీకి సపోర్టు చేయడానికి అనుమతించే మోడెమ్‌ల కోసం చిప్‌ మేకర్ క్వాల్‌ కామ్‌పై ఆధారపడుతోంది.

ఫోల్డబుల్ మ్యాక్‌ బుక్స్‌ పైనా ఫోకస్

మరోవైపు  Apple ప్రస్తుతం 20-అంగుళాల ఫోల్డబుల్ డిస్‌ప్లే గురించి సరఫరాదారులతో చర్చలు జరుపుతోంది. దీన్నిబట్టి యాపిల్ కంపెనీ ఫోల్డబుల్ మ్యాక్‌ బుక్స్‌ కోసం పని చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మ్యా క్‌బుక్ మోడల్‌లు 2026 లేదంటే 2027లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. గత నివేదికల ప్రకారం, 8-అంగుళాలు ఉండే అవకాశం ఉంది. మెయిన్ స్క్రీన్ Samsung డిస్‌ప్లేతో కూడిన WQD + ఫ్లెక్సిబుల్ OLED డిస్‌ప్లేతో రావచ్చని తెలుస్తోంది. కుపెర్టినో టెక్ మేజర్ ఫోల్డబుల్ ఐఫోన్ స్క్రీన్ కోసం సిల్వర్ నానోవైర్ టచ్ సొల్యూషన్‌ను ఉపయోగించవచ్చని సమాచారం. తద్వారా Samsung Y-Octa డిస్‌ప్లేపై అంచుని కలిగి ఉంటుంది. భవిష్యత్తులో మల్టిపుల్ ఫోల్డ్‌ లను కలిగి ఉండే ఫోల్డబుల్ డివైజ్‌లకు ఇది సహాయకరంగా ఉండబోతోంది. ఈ ‘ఐఫోన్ ఫోల్డ్’ ఫంకీ కలర్ ఆప్షన్‌లలో రావచ్చని తెలుస్తోంది. ఇది యంగ్ వినియోగదారులను మరింత ఆకట్టుకునే అవకాశం ఉంది.  త్వరలోనే ఈ ఫోన్ కు సంబంధించిన మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.

Read Also: ఈ స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారా? అయితే, ఇక నుంచి వాట్సాప్ పనిచేయదు!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana: 20-25 ఎకరాలలో ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం
20-25 ఎకరాలలో ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం
Secunderabad To Goa Train: హైదరాబాద్ నుంచి గోవా వెళ్లేవారికి గుడ్ న్యూస్- కొత్త రైలు ప్రారంభించిన కిషన్ రెడ్డి
హైదరాబాద్ నుంచి గోవా వెళ్లేవారికి గుడ్ న్యూస్- కొత్త రైలు ప్రారంభించిన కిషన్ రెడ్డి
Crime News: ఏపీలో దారుణాలు - ఓ చోట స్థల వివాదంతో సొంత బాబాయ్ హత్య, మరోచోట తమ్ముడిని కత్తితో నరికేసిన అన్న
ఏపీలో దారుణాలు - ఓ చోట స్థల వివాదంతో సొంత బాబాయ్ హత్య, మరోచోట తమ్ముడిని కత్తితో నరికేసిన అన్న
Prakash Raj: డిప్యూటీ సీఎం అంటే ఉదయనిధి స్టాలిన్‌లా ఉండాలి - పవన్ కళ్యాణ్‌కు ప్రకాష్ రాజ్ మరో కౌంటర్
డిప్యూటీ సీఎం అంటే ఉదయనిధి స్టాలిన్‌లా ఉండాలి - పవన్ కళ్యాణ్‌కు ప్రకాష్ రాజ్ మరో కౌంటర్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Prakash Raj Counters Pawan Kalyan | తమిళనాడులో పవన్ కళ్యాణ్ పరువు తీసిన ప్రకాశ్ రాజ్ | ABP Desamపసిపాపకి పాలు పట్టేందుకు అవస్థలు పడుతున్న తల్లిNirmal Man Returned from Kuwait: కువైట్‌లో గోట్‌లైఫ్ బతుకు! ఒక్క పోస్ట్‌తో సేఫ్‌గా సొంతూరికిRajendra Prasad: నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana: 20-25 ఎకరాలలో ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం
20-25 ఎకరాలలో ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం
Secunderabad To Goa Train: హైదరాబాద్ నుంచి గోవా వెళ్లేవారికి గుడ్ న్యూస్- కొత్త రైలు ప్రారంభించిన కిషన్ రెడ్డి
హైదరాబాద్ నుంచి గోవా వెళ్లేవారికి గుడ్ న్యూస్- కొత్త రైలు ప్రారంభించిన కిషన్ రెడ్డి
Crime News: ఏపీలో దారుణాలు - ఓ చోట స్థల వివాదంతో సొంత బాబాయ్ హత్య, మరోచోట తమ్ముడిని కత్తితో నరికేసిన అన్న
ఏపీలో దారుణాలు - ఓ చోట స్థల వివాదంతో సొంత బాబాయ్ హత్య, మరోచోట తమ్ముడిని కత్తితో నరికేసిన అన్న
Prakash Raj: డిప్యూటీ సీఎం అంటే ఉదయనిధి స్టాలిన్‌లా ఉండాలి - పవన్ కళ్యాణ్‌కు ప్రకాష్ రాజ్ మరో కౌంటర్
డిప్యూటీ సీఎం అంటే ఉదయనిధి స్టాలిన్‌లా ఉండాలి - పవన్ కళ్యాణ్‌కు ప్రకాష్ రాజ్ మరో కౌంటర్
Sobhita Dhulipala: సమంత నా సోల్‌మేట్‌ - నాగార్జునకు కాబోయే కోడలు శోభితా ధూళిపాళ కామెంట్స్ వైరల్!
సమంత నా సోల్‌మేట్‌ - నాగార్జునకు కాబోయే కోడలు శోభితా ధూళిపాళ కామెంట్స్ వైరల్!
Revanth Reddy : వైఎస్, కేసీఆర్ చేతకాక వదిలేశారు - రేవంత్‌కూ ఎన్నో సమస్యలు - సాధించగలరా  ?
వైఎస్, కేసీఆర్ చేతకాక వదిలేశారు - రేవంత్‌కూ ఎన్నో సమస్యలు - సాధించగలరా ?
AP Politics: క్రిస్టియన్ తో పెళ్లి, హిందూ మతం పేరుతో రాజకీయాలా?- పవన్ కళ్యాణ్‌పై గోరంట్ల మాధవ్ ఫైర్
క్రిస్టియన్ తో పెళ్లి, హిందూ మతం పేరుతో రాజకీయాలా?- పవన్ కళ్యాణ్‌పై గోరంట్ల మాధవ్ ఫైర్
Viswam Trailer: యాక్షన్, ఫన్‌తో నిండిపోయిన ‘విశ్వం’ ట్రైలర్ - బ్లాక్‌బస్టర్ వైబ్స్ కనిపిస్తున్నాయా?
యాక్షన్, ఫన్‌తో నిండిపోయిన ‘విశ్వం’ ట్రైలర్ - బ్లాక్‌బస్టర్ వైబ్స్ కనిపిస్తున్నాయా?
Embed widget