అన్వేషించండి

PAK vs ENG: కోహ్లీసేనే కాదు.. కివీస్‌, ఇంగ్లాండ్‌ కూడా మా శత్రువులే: రమీజ్‌ రాజా

మెగా టోర్నీలో పొరుగుదేశం టీమ్‌ఇండియా ఒక్కటే మా లక్ష్యం కాదు. న్యూజిలాండ్‌, ఇంగ్లాండ్‌ రూపంలో మాకు మరో ఇద్దరు శత్రువులు తోడయ్యారు. మేం వారిని వదిలిపెట్టం అంటున్నాడు రమీజ్ రాజా

పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు ఛైర్మన్‌ రమీజ్‌ రాజా సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా మాత్రమే తమ లక్ష్యం కాదని వెల్లడించాడు. ఇకపై ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌నూ లక్ష్యంగా ఎంచుకుంటామని ప్రకటించాడు. ఎలాంటి భద్రతా లోపాలు లేకున్నా వారు పర్యటనలు రద్దు చేసుకున్నారని పేర్కొన్నాడు. మెగా టోర్నీలో తమ ఆటగాళ్లంతా కసిగా ఆడతారని స్పష్టం చేశాడు.

Also Read: IPL 2021, DC vs SRH: బెబ్బులి దిల్లీపై సన్‌రైజర్స్‌ గెలిచేనా? బాహుబలి వార్నర్‌ మెరుపులు చూస్తామా!

'పాక్‌ పర్యటన నుంచి ఇంగ్లాండ్‌ తప్పుకోవడం నిరాశపరిచింది. పశ్చిమ దేశాల కూటమి మళ్లీ ఒక్కటైంది. మాకు కోపం వస్తోంది. ఎందుకంటే ఎలాంటి ముప్పు పొంచివుందో చెప్పకుండానే న్యూజిలాండ్‌ వెళ్లిపోయింది. ఆంగ్లేయులు తప్పుకుంటారనని మేం ముందుగానే ఊహించాం. ఇది మాకో పాఠం. ఎందుకంటే వారు మా దేశంలో పర్యటించినప్పుడు గారాబంగా చూసుకుంటున్నాం. కానీ మేం వారి దేశాలకు వెళ్లినప్పుడు కఠిన క్వారంటైన్‌ అనుభవించాం. ఇప్పట్నుంచి మా ప్రయోజనాల మేరకే నడుచుకుంటాం' అని రమీజ్‌ అన్నాడు.

Also Read: PBKS vs RR, Match Highlights: కార్తీక్‌ 'కరేజియస్‌' బౌలింగ్‌.. 2 పరుగుల తేడాతో రాజస్థాన్‌ విక్టరీ

క్రికెట్‌ ప్రపంచం తమ దేశాన్ని పట్టించుకోకపోయినా ముందుకు సాగుతామని రమీజ్‌ తెలిపాడు. 'న్యూజిలాండ్‌, ఇంగ్లాండ్‌ చేసిన పనితో ఇప్పుడు వెస్టిండీస్‌పై ప్రభావం పడుతుంది. ఇప్పటికే ఆస్ట్రేలియా పునరాలోచనలో పడింది. ఇంగ్లాండ్‌, ఆసీస్‌, న్యూజిలాండ్‌ ఒక కూటమి. వీరిపై ఎవరికి ఫిర్యాదు చేయగలం. మేం వారిని మా వాళ్లుగా భావించాం. కానీ వాళ్లు అలా అనుకోలేదు. పీఎస్‌ఎల్‌ కోసం ఆ దేశ ఆటగాళ్లు ఇక్కడికొచ్చినప్పుడు సౌకర్యంగా ఉంటారు. ఒకే జట్టుగా ఆడినప్పుడు మాత్రం పాక్‌పై వారి మనసు మారుతుంది' అని విమర్శించాడు.

Also Read: Mithali Raj Record: వారెవ్వా మిథాలీ.. అంతర్జాతీయ క్రికెట్లో 20వేల పరుగులతో రికార్డు

ఇప్పుడు తమకు వస్తున్న కోపాన్ని తమ ప్రదర్శనలో చూపిస్తామని రమీజ్‌ వెల్లడించాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో కసిగా ఆడతామని వెల్లడించాడు. 'మెగా టోర్నీలో పొరుగుదేశం టీమ్‌ఇండియా ఒక్కటే మా లక్ష్యం కాదు. న్యూజిలాండ్‌, ఇంగ్లాండ్‌ రూపంలో మాకు మరో ఇద్దరు శత్రువులు తోడయ్యారు. మేం వారిని వదిలిపెట్టం. ఎందుకంటే వారు మా పట్ల సరైనతీరులో నడుచుకోలేదు. అందుకే మైదానంలో తప్పక మేం పగ తీర్చుకుంటాం' అని ఆయన స్పష్టం చేశాడు

 

 

 

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Adilabad: మద్యం మానేస్తేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు- కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన ప్రకటన 
మద్యం మానేస్తేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు- కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన ప్రకటన 
Moto G75 5G: కొత్త 5జీ ఫోన్ లాంచ్ చేసిన మోటొరోలా - మార్కెట్లోకి మోటో జీ75 5జీ ఎంట్రీ - ధర ఎంత?
కొత్త 5జీ ఫోన్ లాంచ్ చేసిన మోటొరోలా - మార్కెట్లోకి మోటో జీ75 5జీ ఎంట్రీ - ధర ఎంత?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Adilabad: మద్యం మానేస్తేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు- కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన ప్రకటన 
మద్యం మానేస్తేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు- కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన ప్రకటన 
Moto G75 5G: కొత్త 5జీ ఫోన్ లాంచ్ చేసిన మోటొరోలా - మార్కెట్లోకి మోటో జీ75 5జీ ఎంట్రీ - ధర ఎంత?
కొత్త 5జీ ఫోన్ లాంచ్ చేసిన మోటొరోలా - మార్కెట్లోకి మోటో జీ75 5జీ ఎంట్రీ - ధర ఎంత?
Pawan Kalyan Varahi : ప్రాయశ్చిత దీక్ష విరమించిన పవన్ - డిక్లరేషన్ బుక్‌కు పూజలు - వారాహి సభలో సంచలన ప్రకటనలే
ప్రాయశ్చిత దీక్ష విరమించిన పవన్ - డిక్లరేషన్ బుక్‌కు పూజలు - వారాహి సభలో సంచలన ప్రకటనలే
Tripti Dimri Controversy: 5 లక్షలు తీసుకుని ఎగొట్టింది... కొత్త వివాదంలో 'యానిమల్' బ్యూటీ - ఆమె సినిమా బాయ్ కాట్ చేస్తారా?  
5 లక్షలు తీసుకుని ఎగొట్టింది... కొత్త వివాదంలో 'యానిమల్' బ్యూటీ - ఆమె సినిమా బాయ్ కాట్ చేస్తారా?
PPF Rules: పీపీఎఫ్‌ రూల్స్‌ మారాయి - ఇప్పుడు ఎంత వడ్డీ ఇస్తున్నారో తెలుసా?
పీపీఎఫ్‌ రూల్స్‌ మారాయి - ఇప్పుడు ఎంత వడ్డీ ఇస్తున్నారో తెలుసా?
తిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?
తిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?
Embed widget