అన్వేషించండి

PAK vs ENG: కోహ్లీసేనే కాదు.. కివీస్‌, ఇంగ్లాండ్‌ కూడా మా శత్రువులే: రమీజ్‌ రాజా

మెగా టోర్నీలో పొరుగుదేశం టీమ్‌ఇండియా ఒక్కటే మా లక్ష్యం కాదు. న్యూజిలాండ్‌, ఇంగ్లాండ్‌ రూపంలో మాకు మరో ఇద్దరు శత్రువులు తోడయ్యారు. మేం వారిని వదిలిపెట్టం అంటున్నాడు రమీజ్ రాజా

పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు ఛైర్మన్‌ రమీజ్‌ రాజా సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా మాత్రమే తమ లక్ష్యం కాదని వెల్లడించాడు. ఇకపై ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌నూ లక్ష్యంగా ఎంచుకుంటామని ప్రకటించాడు. ఎలాంటి భద్రతా లోపాలు లేకున్నా వారు పర్యటనలు రద్దు చేసుకున్నారని పేర్కొన్నాడు. మెగా టోర్నీలో తమ ఆటగాళ్లంతా కసిగా ఆడతారని స్పష్టం చేశాడు.

Also Read: IPL 2021, DC vs SRH: బెబ్బులి దిల్లీపై సన్‌రైజర్స్‌ గెలిచేనా? బాహుబలి వార్నర్‌ మెరుపులు చూస్తామా!

'పాక్‌ పర్యటన నుంచి ఇంగ్లాండ్‌ తప్పుకోవడం నిరాశపరిచింది. పశ్చిమ దేశాల కూటమి మళ్లీ ఒక్కటైంది. మాకు కోపం వస్తోంది. ఎందుకంటే ఎలాంటి ముప్పు పొంచివుందో చెప్పకుండానే న్యూజిలాండ్‌ వెళ్లిపోయింది. ఆంగ్లేయులు తప్పుకుంటారనని మేం ముందుగానే ఊహించాం. ఇది మాకో పాఠం. ఎందుకంటే వారు మా దేశంలో పర్యటించినప్పుడు గారాబంగా చూసుకుంటున్నాం. కానీ మేం వారి దేశాలకు వెళ్లినప్పుడు కఠిన క్వారంటైన్‌ అనుభవించాం. ఇప్పట్నుంచి మా ప్రయోజనాల మేరకే నడుచుకుంటాం' అని రమీజ్‌ అన్నాడు.

Also Read: PBKS vs RR, Match Highlights: కార్తీక్‌ 'కరేజియస్‌' బౌలింగ్‌.. 2 పరుగుల తేడాతో రాజస్థాన్‌ విక్టరీ

క్రికెట్‌ ప్రపంచం తమ దేశాన్ని పట్టించుకోకపోయినా ముందుకు సాగుతామని రమీజ్‌ తెలిపాడు. 'న్యూజిలాండ్‌, ఇంగ్లాండ్‌ చేసిన పనితో ఇప్పుడు వెస్టిండీస్‌పై ప్రభావం పడుతుంది. ఇప్పటికే ఆస్ట్రేలియా పునరాలోచనలో పడింది. ఇంగ్లాండ్‌, ఆసీస్‌, న్యూజిలాండ్‌ ఒక కూటమి. వీరిపై ఎవరికి ఫిర్యాదు చేయగలం. మేం వారిని మా వాళ్లుగా భావించాం. కానీ వాళ్లు అలా అనుకోలేదు. పీఎస్‌ఎల్‌ కోసం ఆ దేశ ఆటగాళ్లు ఇక్కడికొచ్చినప్పుడు సౌకర్యంగా ఉంటారు. ఒకే జట్టుగా ఆడినప్పుడు మాత్రం పాక్‌పై వారి మనసు మారుతుంది' అని విమర్శించాడు.

Also Read: Mithali Raj Record: వారెవ్వా మిథాలీ.. అంతర్జాతీయ క్రికెట్లో 20వేల పరుగులతో రికార్డు

ఇప్పుడు తమకు వస్తున్న కోపాన్ని తమ ప్రదర్శనలో చూపిస్తామని రమీజ్‌ వెల్లడించాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో కసిగా ఆడతామని వెల్లడించాడు. 'మెగా టోర్నీలో పొరుగుదేశం టీమ్‌ఇండియా ఒక్కటే మా లక్ష్యం కాదు. న్యూజిలాండ్‌, ఇంగ్లాండ్‌ రూపంలో మాకు మరో ఇద్దరు శత్రువులు తోడయ్యారు. మేం వారిని వదిలిపెట్టం. ఎందుకంటే వారు మా పట్ల సరైనతీరులో నడుచుకోలేదు. అందుకే మైదానంలో తప్పక మేం పగ తీర్చుకుంటాం' అని ఆయన స్పష్టం చేశాడు

 

 

 

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Budget 2025 Income Tax:బడ్జెట్‌ 2025లో ప్రకటించిన కొత్త ఐటీ శ్లాబ్‌ల ప్రకారం ఎవరికి ఎంత జీతం ఆదా అవుతుంది?
బడ్జెట్‌ 2025లో ప్రకటించిన కొత్త ఐటీ శ్లాబ్‌ల ప్రకారం ఎవరికి ఎంత జీతం ఆదా అవుతుంది?
Incometax Memes: వేతన జీవికి ఇది స్వీట్ షాక్ - ఇన్‌కంట్యాక్స్‌ రిలీఫ్‌పై సోషల్ మీడియా స్పందన ఎలా ఉందంటే ?
వేతన జీవికి ఇది స్వీట్ షాక్ - ఇన్‌కంట్యాక్స్‌ రిలీఫ్‌పై సోషల్ మీడియా స్పందన ఎలా ఉందంటే ?
Chhattishgarh: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ - 8 మంది మావోయిస్టులు మృతి
Chhattishgarh: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ - 8 మంది మావోయిస్టులు మృతి
Budget Highlights In Telugu: రూ. 50.65,345 కోట్లతో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన నిర్మలా సీతారామన్‌ ఏ శాఖకు ఎంత కేటాయించారంటే...?
రూ. 50.65,345 కోట్లతో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన నిర్మలా సీతారామన్‌ ఏ శాఖకు ఎంత కేటాయించారంటే...?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nirmala Sitharaman Budget Day Saree | నిర్మలా సీతారామన్ కట్టుకున్న చీరకు ఇంత హిస్టరీ ఉంది | ABP DesamMEIL Director Sudha Reddy on Budget 2025 | మధ్యతరగతి మహిళ పారిశ్రామిక వేత్తగా ఎదగాలంటే.? | ABP DesamMEIL Director Sudha Reddy on Budget 2025 | నిర్మలా సీతారామన్ బడ్జెట్ లో మహిళలను పట్టించుకుంటున్నారా..!? | ABP DesamUnion Budget 2025 PM Modi Lakshmi Japam | బడ్జెట్ కి ముందు లక్ష్మీ జపం చేసిన మోదీ..రీజన్ ఏంటో.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Budget 2025 Income Tax:బడ్జెట్‌ 2025లో ప్రకటించిన కొత్త ఐటీ శ్లాబ్‌ల ప్రకారం ఎవరికి ఎంత జీతం ఆదా అవుతుంది?
బడ్జెట్‌ 2025లో ప్రకటించిన కొత్త ఐటీ శ్లాబ్‌ల ప్రకారం ఎవరికి ఎంత జీతం ఆదా అవుతుంది?
Incometax Memes: వేతన జీవికి ఇది స్వీట్ షాక్ - ఇన్‌కంట్యాక్స్‌ రిలీఫ్‌పై సోషల్ మీడియా స్పందన ఎలా ఉందంటే ?
వేతన జీవికి ఇది స్వీట్ షాక్ - ఇన్‌కంట్యాక్స్‌ రిలీఫ్‌పై సోషల్ మీడియా స్పందన ఎలా ఉందంటే ?
Chhattishgarh: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ - 8 మంది మావోయిస్టులు మృతి
Chhattishgarh: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ - 8 మంది మావోయిస్టులు మృతి
Budget Highlights In Telugu: రూ. 50.65,345 కోట్లతో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన నిర్మలా సీతారామన్‌ ఏ శాఖకు ఎంత కేటాయించారంటే...?
రూ. 50.65,345 కోట్లతో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన నిర్మలా సీతారామన్‌ ఏ శాఖకు ఎంత కేటాయించారంటే...?
Araku Airport: అరకు, పాడేరుకు బడ్జెట్‌లో కీలక ప్రకటన - ఉడాన్ పథకాన్ని సవరించిన కేంద్ర ప్రభుత్వం
అరకు, పాడేరుకు బడ్జెట్‌లో కీలక ప్రకటన - ఉడాన్ పథకాన్ని సవరించిన కేంద్ర ప్రభుత్వం
Good News For AP: బడ్జెట్ రోజు ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్, పోలవరం ప్రాజెక్ట్ వ్యయం సవరణకు ఆమోదం
Good News For AP: బడ్జెట్ రోజు ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్, పోలవరం ప్రాజెక్ట్ వ్యయం సవరణకు ఆమోదం
Budget 2025 : ఏటికొప్పాక బొమ్మలకు మహర్దశ - కేంద్ర బడ్జెట్‌లో కీలక ప్రకటన చేసిన ఆర్థిక మంత్రి
ఏటికొప్పాక బొమ్మలకు మహర్దశ - కేంద్ర బడ్జెట్‌లో కీలక ప్రకటన చేసిన ఆర్థిక మంత్రి
Budget 2025: బడ్జెట్‌తో ధరలు పెరిగే వస్తువులేంటీ? రేట్లు తగ్గే గూడ్స్ ఏంటీ?
బడ్జెట్‌తో ధరలు పెరిగే వస్తువులేంటీ? రేట్లు తగ్గే గూడ్స్ ఏంటీ?
Embed widget