అన్వేషించండి

Neeraj Chopra Silver: ఒలింపిక్స్ లో రజతం సాధించిన నీరజ్ చోప్రాకు మోదీ ఫోన్ - వైరల్ వీడియో

Paris Olympics 2024: నీరజ్ చోప్రాతో ప్రధాని మోదీ ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా పారిస్ ఒలింపిక్స్ 2024లో రజత పతకం సాధించిన నీరజ్‌ని పీఎం అభినందించారు.

Neeraj Chopra Silver:  పారిస్ ఒలింపిక్స్ 2024లో జావెలిన్ త్రో ఫైనల్లో భారత అథ్లెట్ నీరజ్ చోప్రా రజత పతకాన్ని గెలుచుకున్నాడు. ఈ మ్యాచ్ స్టేడ్ డి ఫ్రాన్స్ స్టేడియంలో జరిగింది. అనంతరం నీరజ్ చోప్రాతో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌లో మాట్లాడారు. రజత పతకం సాధించిన నీరజ్‌ను అభినందించారు. పారిస్ ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన నీరజ్ చోప్రాను అభినందిస్తూ.. ఆయన బాగోగులను కూడా ప్రధాని మోదీ అడిగి తెలుసుకున్నారు. వారిద్దరూ కొంత సేపు మాట్లాడుకున్నారు. ప్రధాని నీరజ్ చోప్రా నుండి అతని గాయం గురించి కూడా తెలుసుకున్నారు.  దీనితో పాటు నీరజ్ తల్లి క్రీడా స్ఫూర్తిని కూడా మెచ్చుకున్నారు. 

మీ ప్రతిభను మళ్లీ మళ్లీ చూపించారు 
ఫోన్‌లో మాట్లాడే ముందు కూడా, పీఏ మోదీ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ఒక పోస్ట్ ద్వారా నీరజ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. రజత పతకం సాధించినందుకు అభినందనలు అంటూ తన పోస్ట్‌లో రాశాడు. భవిష్యతులో రాబోయే లెక్కలేనటు వంటి అథ్లెట్లు వారి కలలను నెరవేర్చుకోవడానికి, మన దేశం గర్వపడేలా చేయడానికి ఎంతో స్పూర్తిని అందించావంటూ కొనియాడారు.  26 ఏళ్ల నీరజ్ ఒలింపిక్స్‌లో అథ్లెటిక్స్ విభాగంలో రెండు పతకాలు సాధించిన తొలి భారతీయ అథ్లెట్‌గా నిలిచారు. అంతకుముందు, నీరజ్ చోప్రా 2020 సంవత్సరంలో జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో బంగారు పతకాన్ని గెలుచుకున్నారు.

తన రికార్డును తానే బద్దలు కొట్టిన నీరజ్
నీరజ్ వరుసగా రెండో ఒలింపిక్స్‌లో పతకం సాధించారు. నీరజ్ పారిస్ ఒలింపిక్స్‌లో తన రికార్డును తానే బద్దలు కొట్టారు. గత ఒలింపిక్స్‌లో అతను 87.58 మీటర్ల త్రోతో బంగారు పతకాన్ని గెలుచుకున్నారు. అయితే అతను ఈసారి 89.45 మీటర్లు విసిరారు. నీరజ్ చోప్రా మ్యాచ్ కోసం.. అతని స్వగ్రామం పానిపట్‌లో పెద్ద స్క్రీన్‌ను అమర్చారు.. ఇది మాత్రమే కాకుండా.. అతను పతకం గెలిచినప్పుడు గ్రామం మొత్తం బాణసంచా కాల్చారు. పతకం గెలిచినట్లు ప్రకటించడంతో అతని ఊరంతా ఆనందంతో ఎగిరి గంతేసింది.  అందరూ లడ్డూలు పంచుతున్నారు.  బాణాసంచా కాల్చారు. కాగా, అర్థరాత్రి వరకు డీజే పాటలకు అనుగుణంగా డ్యాన్స్ చేస్తూ నీరజ్ రజత పతకాన్ని సాధించినందుకు సంబరాలు చేసుకున్నారు.


నీరజ్ రజతం సాధించడం ద్వారా నాలుగో పతకాన్ని అందించిన అథ్లెట్ గా నిలిచారు. కాగా, పాకిస్థాన్‌కు చెందిన అర్షద్ నదీమ్ స్వర్ణ పతకాన్ని సాధించాడు. దీని తర్వాత విక్కీ కౌశల్, ఆర్ మాధవన్, మలైకా అరోరా వంటి బాలీవుడ్ స్టార్లు నీరజ్ చోప్రాను అభినందించారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

టీ20లో టీమిండియా నెంబర్ 1 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. రోహిత్ శర్మను వెనక్కి నెట్టిన SKY
టీ20లో టీమిండియా నెంబర్ 1 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. రోహిత్ శర్మను వెనక్కి నెట్టిన SKY
Pakistan Cricket Board: T20 ప్రపంచ కప్ 2026లో ఎగ్జిట్ అయిన పాకిస్తాన్ ప్లేయర్లకు షాక్! ఆటగాళ్లకు ఫైన్ వేసిన పీసీబీ!
T20 ప్రపంచ కప్ 2026లో ఎగ్జిట్ అయిన పాకిస్తాన్ ప్లేయర్లకు షాక్! ఆటగాళ్లకు ఫైన్ వేసిన పీసీబీ!
Ind vs Afg Series: భారత్- ఆఫ్ఘనిస్తాన్ మధ్య తొలిసారి వన్డే సిరీస్.. BCCI అధికారిక షెడ్యూల్ విడుదల
భారత్- ఆఫ్ఘనిస్తాన్ మధ్య తొలిసారి వన్డే సిరీస్.. BCCI అధికారిక షెడ్యూల్ విడుదల
Sanju Samson: విండీస్‌పై హీరోచిత ఇన్నింగ్స్ తరువాత సంజూ శాంసన్ 5 గోల్డెన్ మూమెంట్స్ ఇవే..
విండీస్‌పై హీరోచిత ఇన్నింగ్స్ తరువాత సంజూ శాంసన్ 5 గోల్డెన్ మూమెంట్స్ ఇవే..

వీడియోలు

Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Sanju Emotional Speech After 97 vs West Indies | సంజూ శాంసన్ ఎమోషనల్ స్పీచ్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Guntur Mirchi: ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
Kolikapudi controversy: చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
YS Jagan: కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
ఇరాన్‌-అమెరికా యుద్ధం: బ్యారెల్‌కు ఒక్క డాలర్‌ పెరిగినా ₹12,000 కోట్ల అదనపు భారం - మన పెట్రోల్‌ బడ్జెట్‌పై ప్రభావం ఎంత?
ఇరాన్‌-అమెరికా యుద్ధం: ఇండియాలో పెట్రోల్, డీజిల్‌ ధరలు పెరుగుతాయా? ఆటో ఇండస్ట్రీకి హెచ్చరిక సంకేతాలు
Andhra Pradesh Latest News: ఏపీ రాజకీయాల్లో మండలి సెగ; ఛైర్మన్‌ మోషేన్‌ రాజుపై అవిశ్వాసం పెట్టే యోచనలో వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్సీలు!
ఏపీ రాజకీయాల్లో మండలి సెగ; ఛైర్మన్‌ మోషేన్‌ రాజుపై అవిశ్వాసం పెట్టే యోచనలో వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్సీలు!
Balka Suman Released : ఆదిలాబాద్ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల! భారీగా తరలి వచ్చిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు 
ఆదిలాబాద్ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల! భారీగా తరలి వచ్చిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు 
US Shooting: అమెరికాలో ఇరాన్ జెండా టీ-షర్ట్ ధరించిన వ్యక్తి కాల్పులు! భారతీయ విద్యార్థి సహా ముగ్గురు మృతి!
అమెరికాలో ఇరాన్ జెండా టీ-షర్ట్ ధరించిన వ్యక్తి కాల్పులు! భారతీయ విద్యార్థి సహా ముగ్గురు మృతి!
Palamaner Latest News:తిరుమల వెళ్తుండగా తీరని విషాదం; పలమనేరు వద్ద ఘోర ప్రమాదం! ఐదుగురు బెంగళూరు వాసులు మృతి!
తిరుమల వెళ్తుండగా తీరని విషాదం; పలమనేరు వద్ద ఘోర ప్రమాదం! ఐదుగురు బెంగళూరు వాసులు మృతి!
Embed widget