అన్వేషించండి

IPL 2024: ఢిల్లీకి దిమ్మతిరిగే షాక్‌, పంత్‌పై నిషేధం

Rishabh Pant: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్‌కు ఎదురుదెబ్బ తగిలింది. అతడు ఒక మ్యాచ్‌ ఆడకుండా సస్పెండ్ చేసినట్లు బీసీసీఐ ప్రకటించింది.

 Rishabh Pant Slapped With 1 Match Ban and  Hefty Fine : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB)) జరగబోయే అత్యంత కీలక మ్యాచ్‌కి ముందు ఢిల్లీ క్యాపిటల్స్(DC) జట్టుకి భారీ దెబ్బ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ రిషభ్ పంత్‌(Rishabh Pant)పై ఒక మ్యాచ్ నిషేధం పడింది. రూ.30 లక్షల జరిమానా విధించడంతో పాటు ఒక మ్యాచ్ ఆడకుండా నిషేధం విధించిన ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ వెల్లడించింది.  ఈ నిర్ణయంతో ప్లేఆఫ్స్‌ చేరాలంటే మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో కచ్చితంగా గెలవాల్సిన క్లిష్ట పరిస్థితుల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు షాక్‌ తగిలింది. డీసీ జట్టు ఇప్పటికే రెండుసార్లు స్లో ఓవర్‌ రేట్‌కు పాల్పడగా, గత మంగళవారం రాజస్థాన్‌పై కూడా పునరావృతమైంది. దీంతో ఐపీఎల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ను ఉల్లంఘించినందుకు పంత్‌కు రూ.30 లక్షల జరిమానాతో పాటు ఓ మ్యాచ్‌ నిషేధం విధించారు. అలాగే ఇతర ఆటగాళ్లు కూడా రూ.12 లక్షలు లేదా మ్యాచ్‌ ఫీజులో 50శాతం.. వీటిలో ఏది తక్కువైతే దానిని ఫైన్‌గా కట్టాల్సి ఉంటుందని పాలకమండలి వెల్లడించింది. మరోవైపు ఢిల్లీ జట్టు మ్యాచ్‌ రెఫరీ నిర్ణయాన్ని సవాల్‌ చేసినా ఫలితం లేకపోయింది. కాగా ఆదివారం బెంగళూరు జట్టుతో జరిగే మ్యాచ్‌కు పంత్‌ స్థానంలో అక్షర్‌ పటేల్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించారు. . దీంతో ఇవాళ్టీ మ్యాచ్‌లో పంత్ లేకుండానే ఢిల్లీ బరిలోకి దిగనుంది. 


తొలి ఆటగాడు పంతే
ఐపీఎల్ 17వ సీజన్‌లో ఒక మ్యాచ్‌ వేటుపడిన తొలి ఆటగాడు రిషభ్‌ పంత్‌. కీలక దశలో ఆడే అవకాశం లేకపోవడంతో ఢిల్లీ ప్లేఆఫ్స్‌ ఛాన్స్‌లు ప్రమాదంలో పడినట్లేనని క్రికెట్ విశ్లేషకుల అభిప్రాయం. బెంగళూరుతో కాకుండా లక్నోతో మే 14న ఢిల్లీ తలపడనుంది. 

కీలక మ్యాచ్‌లో పాపం ఇలా...
ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరగబోయే మ్యాచ్‌లో వరుసగా ఐదో విజయంపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కన్నేసింది. ఈ సీజన్‌ను ఓటములతో ఆరంభించిన బెంగళూరు రెండో అర్ధ భాగంలో వరుస విజయాలతో దూసుకుపోతోంది. వరుసగా నాలుగు విజయాలతో ప్లే ఆఫ్‌ ఆశలను సజీవంగా నిలుపుకుంటూ వస్తోంది. గత మ్యాచ్‌లో పంజాబ్‌పై గెలిచి బెంగళూరు పాయింట్ల పట్టికలో ఏడో స్థానానికి చేరింది. విరాట్ కోహ్లీ భీకర ఫామ్‌లో ఉన్నాడు. గత మ్యాచ్‌లో కోహ్లీ 47 బంతుల్లో 92 పరుగులు చేసి సత్తా చాటాడు. మహ్మద్ సిరాజ్ మూడు వికెట్ల ప్రదర్శనతో రాణించాడు. దీంతో పంజాబ్‌ను 60 పరుగులతో చిత్తు చేసిన బెంగళూరు... ఈ మ్యాచ్‌లోనూ ఢిల్లీకి షాక్‌ ఇవ్వాలని చూస్తోంది. మరోవైపు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఈ కీలక మ్యాచ్ జరగనుంది. ఢిల్లీ కూడా గత నాలుగు మ్యాచ్‌ల్లో మూడు విజయాలతో పుంజుకుంది. గత మ్యాచ్‌లో పటిష్టమైన రాజస్థాన్ రాయల్స్‌ను ఢిల్లీ ఓడించింది. జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్, అభిషేక్ పోరెల్ చెలరేగిపోతున్నారు. ఇప్పుడు బెంగళూరుపై అదే ప్రదర్శనను పునరావృతం చేయాలని ఢిల్లీ చూస్తోంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Venkateswara Swamy Temple : అమరావతిలోని వేంకటేశ్వరస్వామి ఆలయ విస్తరణకు శంకుస్థాపన- రెండేళ్లలో పూర్తి చేస్తామని హామీ 
అమరావతిలోని వేంకటేశ్వరస్వామి ఆలయ విస్తరణకు శంకుస్థాపన- రెండేళ్లలో పూర్తి చేస్తామని హామీ 
తెలంగాణ పంచాయతీ ఎన్నికల సమరం: కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రత్యేక వ్యూహాలు..గ్రామాల్లో విజయం ఎవరిదో?
తెలంగాణ పంచాయతీ ఎన్నికల సమరం: కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రత్యేక వ్యూహాలు..గ్రామాల్లో విజయం ఎవరిదో?
Vaikunta Dwara Darshan Tokens Registration: తిరుమలేశుడి భక్తులకు గుడ్ న్యూస్- వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం 
తిరుమలేశుడి భక్తులకు గుడ్ న్యూస్- వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం 
US Shooting: వైట్ హౌస్ దగ్గర ఆప్ఘన్‌ యువకుడి కాల్పులు! ఇద్దరు నేషనల్ గార్డ్ సైనికులకు గాయాలు!
వైట్ హౌస్ దగ్గర ఆప్ఘన్‌ యువకుడి కాల్పులు! ఇద్దరు నేషనల్ గార్డ్ సైనికులకు గాయాలు!
Advertisement

వీడియోలు

Gambhir Comments on Head Coach Position | గంభీర్ సెన్సేషనల్ స్టేట్‌మెంట్
World Test Championship Points Table | టెస్టు ఛాంపియన్‌షిప్ లో భారత్ స్థానం ఇదే
Reason for Team India Failure | భారత్ ఓటమికి కారణాలు ఇవే !
Rohit Sharma First Place in ICC ODI Rankings | అగ్రస్థానంలో
South Africa whitewashed India | రెండో టెస్ట్ ఓడిపోయిన టీమ్ ఇండియా
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Venkateswara Swamy Temple : అమరావతిలోని వేంకటేశ్వరస్వామి ఆలయ విస్తరణకు శంకుస్థాపన- రెండేళ్లలో పూర్తి చేస్తామని హామీ 
అమరావతిలోని వేంకటేశ్వరస్వామి ఆలయ విస్తరణకు శంకుస్థాపన- రెండేళ్లలో పూర్తి చేస్తామని హామీ 
తెలంగాణ పంచాయతీ ఎన్నికల సమరం: కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రత్యేక వ్యూహాలు..గ్రామాల్లో విజయం ఎవరిదో?
తెలంగాణ పంచాయతీ ఎన్నికల సమరం: కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రత్యేక వ్యూహాలు..గ్రామాల్లో విజయం ఎవరిదో?
Vaikunta Dwara Darshan Tokens Registration: తిరుమలేశుడి భక్తులకు గుడ్ న్యూస్- వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం 
తిరుమలేశుడి భక్తులకు గుడ్ న్యూస్- వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం 
US Shooting: వైట్ హౌస్ దగ్గర ఆప్ఘన్‌ యువకుడి కాల్పులు! ఇద్దరు నేషనల్ గార్డ్ సైనికులకు గాయాలు!
వైట్ హౌస్ దగ్గర ఆప్ఘన్‌ యువకుడి కాల్పులు! ఇద్దరు నేషనల్ గార్డ్ సైనికులకు గాయాలు!
Andhra King Taluka OTT : రామ్ 'ఆంధ్ర కింగ్ తాలూకా' ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్ - ఎందులో చూడొచ్చంటే?
రామ్ 'ఆంధ్ర కింగ్ తాలూకా' ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్ - ఎందులో చూడొచ్చంటే?
Smriti Mandhana–Palash Muchhal Wedding Row: స్మృతి మంధాన పెళ్లిపై మేరీ డి'కోస్టా సంచలన పోస్టు! పలాష్ ముచ్చల్‌తో సంబంధంపై క్లారిటీ!
స్మృతి మంధాన పెళ్లిపై మేరీ డి'కోస్టా సంచలన పోస్టు! పలాష్ ముచ్చల్‌తో సంబంధంపై క్లారిటీ!
South Central Railway : ఇంటి నుంచే దేశం నలుమూలలకు పార్శిల్ పంపేయొచ్చు- కొత్త సర్వీస్ ప్రారంభించనున్న దక్షిణ మధ్య రైల్వే
ఇంటి నుంచే దేశం నలుమూలలకు పార్శిల్ పంపేయొచ్చు- కొత్త సర్వీస్ ప్రారంభించనున్న దక్షిణ మధ్య రైల్వే
India Wedding Season: 44 రోజుల్లో 46 లక్షల వివాహాలు... ఎక్కువ పెళ్లిళ్లు ఏ రాష్ట్రంలో జరుగుతున్నాయో తెలుసా?
44 రోజుల్లో 46 లక్షల వివాహాలు... ఎక్కువ పెళ్లిళ్లు ఏ రాష్ట్రంలో జరుగుతున్నాయో తెలుసా?
Embed widget