అన్వేషించండి

IND vs SL: ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌ రెండో టెస్టుకు స్టేడియాల్లో ఎంట్రీ - కానీ కోహ్లీ!

India vs Sri Lanka Test series: టీమ్‌ఇండియా మ్యాచులను ప్రత్యక్షంగా ఎంజాయ్‌ చేసే రోజులు వచ్చేస్తున్నాయి. శ్రీలంకతో రెండో టెస్టు మ్యాచుకు ఫ్యాన్స్‌ను అనుమతించేందుకు కర్ణాటక క్రికెట్‌ సంఘం నిర్ణయం తీసుకుంది.

IND vs SL Test series, Virat Kohli 100th test: క్రికెట్‌ అభిమానులకు గుడ్‌న్యూస్‌! ఇకపై టీమ్‌ఇండియా మ్యాచులను ప్రత్యక్షంగా ఎంజాయ్‌ చేసే రోజులు వచ్చేస్తున్నాయి. శ్రీలంకతో జరిగే రెండో టెస్టు మ్యాచుకు ఫ్యాన్స్‌ను అనుమతించేందుకు కర్ణాటక క్రికెట్‌ సంఘం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే టికెట్లనూ సేల్‌ చేస్తున్నట్టు తెలిసింది. అయితే టీమ్‌ఇండియా మాజీ సారథి విరాట్‌ కోహ్లీ వందో టెస్టును మాత్రం ప్రత్యక్షంగా వీక్షించేందుకు అవకాశం లేదు.

టీ20 తర్వాత టెస్టు సిరీస్‌

భారత్‌, శ్రీలంక జట్లు ఇప్పుడు టీ20 సిరీసు ఆడుతున్నాయి. ఆదివారం మూడో మ్యాచుతో సిరీస్‌ ముగుస్తుంది. వెంటనే రెండు జట్లు మొహాలికి చేరుకుంటాయి. స్వల్ప విరామం తర్వాత ఈ మ్యాచ్‌ జరగనుంది. మార్చి 4 నుంచి 8 వరకు కొవిడ్‌ ఆంక్షలకు లోబడే ఈ మ్యాచ్‌ నిర్వహిస్తారు. ఇది కోహ్లీకి వందో టెస్టు మ్యాచు. దీనిని వీక్షించేందుకు అభిమానులను అనుమతించడం లేదని తెలిసింది.

చిన్నస్వామిలో రెండో మ్యాచ్‌

బెంగళూరులో జరిగే డే/నైట్‌ క్రికెట్‌ మ్యాచుకు మాత్రం 50 శాతం ప్రేక్షకులను అనుమతించనున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే కర్ణాటక క్రికెట్‌ సంఘం (KSCA) అధికారి ఒకరు మీడియాకు చెప్పారు. ఇప్పటికే టికెట్ల సేల్‌ మొదలు పెట్టారని తెలిసింది. మొహాలిలో ఫ్యాన్స్‌ను అనుమతించకపోవడానికి, బెంగళూరులో నిబంధనలు మార్చడానికి రెండు కారణాలు కనిపిస్తున్నాయి. రెండో టెస్టు తర్వాత టీమ్‌ఇండియా క్రికెట్‌ మ్యాచులు లేవు. ఆటగాళ్లంతా సంబంధిత ఫ్రాంచైజీ శిబిరాలకు వెళ్లిపోతారు. ఒకవేళ బెంగళూరులో కొవిడ్‌ వచ్చినా కోలుకొనేందుకు కొంత సమయం ఉంటుంది. పైగా ఒక బబుల్‌ నుంచి మరో బబుల్‌కు వెళ్తారు కాబట్టి సమస్య ఉండదు. మొహలి విషయంలో అలా లేదు.

కానీ తప్పదు!

'అవును, బీసీసీఐ ఆదేశాల మేరకు టెస్టు మ్యాచుకు సంబంధించిన వారిని తప్ప సాధారణ అభిమానులను స్టేడియంలోకి అనుమతించడం లేదు' అని పంజాబ్‌ క్రికెట్‌ సంఘం ట్రెజరర్‌ ఆర్పీ సింగ్లా అన్నారు. 'ఇప్పటికీ మొహాలి చుట్టుపక్కల కొవిడ్‌ కేసులు పెరుగుతున్నాయి. అందుకే భద్రతా నియమాలు పాటించడం ముఖ్యం. మొహలిలో మూడేళ్ల తర్వాత జరుగుతున్న అంతర్జాతీయ మ్యాచ్‌ను అభిమానులు మిస్సవుతారన్నది నిజమే' అని ఆయన అంటున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh: టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
Group 1 Results: గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
Jon Landau Death: ‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
The Cave Pub Case: కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Bobbili Maharaja Vintage Cars and Weapons | ఇలాంటి పాత, ఖరీదైన కార్లు మీకు ఎక్కడా కనిపించవు.! | ABPSingirikona Narasimha Swamy Temple | సింగిరికోన అడవిలో మహిమాన్విత నారసింహుడి ఆలయం చూశారా.! | ABP80 Years Old Man Completes 21 PGs | చదువు మీద ఈ పెద్దాయనకున్న గౌరవం చూస్తుంటే ముచ్చటేస్తుందిCM Chandrababu CM Revanth Reddy Meeting | అందరి కళ్లూ... తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపైనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh: టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
Group 1 Results: గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
Jon Landau Death: ‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
The Cave Pub Case: కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
Free Sand Scheme: ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
Gudivada News: బట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు - గుడివాడలో బెదిరిపోయిన జనం!
బట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు - గుడివాడలో బెదిరిపోయిన జనం!
Hyderabad: మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
Andhra Pradesh: ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
Embed widget