By: ABP Desam | Updated at : 13 Jan 2022 04:35 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
అర్థ సెంచరీ అనంతరం అభివాదం చేస్తున్న రిషబ్ పంత్(Source: BCCI)
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో భారత్ పట్టుబిగించే దిశగా సాగుతోంది. మూడో రోజు లంచ్ సమయానికి నాలుగు వికెట్లు నష్టపోయి 130 పరుగులు చేసింది. దీంతో మొత్తంగా 143 పరుగుల ఆధిక్యం సాధించింది. రిషబ్ పంత్ (51 బ్యాటింగ్: 60 బంతుల్లో నాలుగు ఫోర్లు, ), విరాట్ కోహ్లీ (28: 127 బంతుల్లో, నాలుగు ఫోర్లు) క్రీజులో ఉన్నారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో రబడ, జాన్సెన్లకు చెరో రెండు వికెట్లు దక్కాయి.
57-2 ఓవర్నైట్ స్కోరుతో బ్యాటింగ్కు దిగిన భారత్కు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బలు తగిలాయి. ఆట ప్రారంభమైన మొదటి ఓవర్లో పుజారా, రెండో ఓవర్లో రహానే వికెట్లను టీమిండియా కోల్పోయింది. దీంతో ఆ తర్వాత వచ్చిన పంత్, విరాట్ కోహ్లీ జాగ్రత్తగా ఆడారు.
పంత్ వన్డే క్రికెట్ తరహాలో దూకుడుగా ఆడగా.. విరాట్ మాత్రం చాలా నెమ్మదిగా ఆడాడు. ఒకానొక దశలో విరాట్ 61 బంతుల్లో కేవలం నాలుగు పరుగులు మాత్రమే చేశాడు. మరోవైపు పంత్ మాత్రం షాట్లు కొడుతూ, సింగిల్స్ తీస్తూ స్కోర్ బోర్డును ముందుకు కదిలించాడు. వీరిద్దరూ ఐదో వికెట్కు 72 పరుగులు జోడించారు.
సరిగ్గా లంచ్కు ముందు ఓవర్లో పంత్ అర్థ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. కేవలం 58 బంతుల్లోనే తన అర్థసెంచరీ పూర్తయింది. ఈ సెషన్లో కూడా వీరిద్దరూ వికెట్ పడకుండా ఆడితే భారత్ కచ్చితంగా భారీ స్కోరు సాధించగలదు. అప్పుడు మ్యాచ్పై పట్టు లభిస్తుంది.
Lunch on Day 3 of the 3rd Test.
— BCCI (@BCCI) January 13, 2022
After losing two early wickets in the morning session, @imVkohli and @RishabhPant17 steady ship for #TeamIndia. Lead by 143 runs.
Scorecard - https://t.co/rr2tvATzkl #SAvIND pic.twitter.com/6a2aLCUA3Q
Lunch! 🍛
— ICC (@ICC) January 13, 2022
South Africa started the day brilliantly, before India fought back through Kohli and Pant.
They lead by 143.
Watch #SAvIND live on https://t.co/CPDKNxpgZ3 (in select regions)#WTC23 | https://t.co/Wbb1FE2mW1 pic.twitter.com/MHDmw9Vy9d
Also Read: IPL New Sponsor: వివో ఔట్! ఇకపై 'టాటా ఐపీఎల్'! చైనా కంపెనీకి గుడ్బై!!
Also Read: IPL Auction 2022 Date: క్రికెటర్లూ కాచుకోండి! ఇక డబ్బుల పండగే!! ఫిబ్రవరి 12, 13న ఐపీఎల్ మెగా వేలం
Starc-Maxwell Ruled Out: ఆరంభానికి ముందే అపశకునం - కంగారూలకు బిగ్ షాక్ - ఇద్దరు కీలక ఆటగాళ్లు దూరం
IND vs AUS: అసలు పోరుకు ముందు ఆఖరి మోక - కళ్లన్నీ వారిమీదే!
ODI World Cup 2023 : వన్డే వరల్డ్ కప్లో అత్యధిక సెంచరీలు చేసింది వీళ్లే - టాప్-5లో ఇద్దరూ మనోళ్లే
Nortje-Magala Ruled Out: తలచినదే జరిగినది! - సఫారీ జట్టుకు వరుస షాకులు
ODI World Cup 2023: నెదర్లాండ్స్ టీమ్కు నెట్ బౌలర్గా స్విగ్గీ డెలివరీ బాయ్ - పెద్ద ప్లానింగే!
Purandeshwari: వైన్ షాప్లోనికి వెళ్లి పురందేశ్వరి ఆకస్మిక తనిఖీలు - కీలక విషయాలు బయటపెట్టి ఆందోళన
Motorola Edge 40 Neo: కిల్లర్ ఫోన్ లాంచ్ చేసిన మోటొరోలా - రూ.20 వేలలో వావ్ అనిపించే ఫీచర్లు!
TTD News: కమనీయం శ్రీవారి బ్రహ్మోత్సవ వైభవం, గరుడ సేవకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు
Hyundai Alcazar Facelift: హ్యుందాయ్ అల్కజార్ను అప్డేట్ చేయనున్న కంపెనీ - ధర ఎంత ఉండవచ్చు? ఏం మారుతుంది?
/body>