అన్వేషించండి

WTC 2025 Prize Money: WTC ఫైనల్ విజేతకు భారీ ప్రైజ్‌మనీ ప్రకటించిన ICC-అన్ని జట్లకు ఇవ్వాలని నిర్ణయం

WTC 2025 Final Prize Money: 2025 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య జరగనుంది. ఇందులో గెలిచిన టీంకు ICC భారీ ప్రైజ్‌మనీ ప్రకటించింది.

WTC 2025 Final Prize Money: 2025 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ప్రైజ్ మనీ రివీల్ అయింది. జూన్ 11-15 తేదీల మధ్య ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య ఇంగ్లాండ్ లోని లార్డ్స్ మైదానంలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈసారి WTC విజేత కోసం రికార్డు స్థాయి ప్రైజ్ మనీని ప్రకటించింది ఐసీసీ. ఈసారి WTC కోసం కోట్ల రూపాయల ప్రైజ్ పూల్ ఉంచారు, ఇది గతసారి కంటే 125 శాతం ఎక్కువ.

విజేతకు భారీ ప్రైజ్ మనీ

దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య జరిగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ విజేతకు దాదాపు 30 కోట్ల 8 లక్షల రూపాయల ప్రైజ్ మనీ లభించనుంది. అయితే ఫైనల్‌లో ఓడిపోయిన జట్టు లేదా రన్నర్‌కు దాదాపు 18.5 కోట్ల రూపాయలు లభిస్తాయి. గతంలో రన్నర్‌కు కేవలం 6.8 కోట్ల రూపాయలు మాత్రమే బహుమతిగా లభించేది. 

టెస్ట్ క్రికెట్‌ను ప్రోత్సహించడానికి ICC ఈ నిర్ణయం తీసుకుంది. ప్రైజ్ మనీని భారీగా పెంచేందుకు ప్రయత్నించింది. మూడో, నాలుగో స్థానం నుంచి చివరి స్థానం వరకు ఏ జట్టు ఖాళీ చేతులతో తిరిగి వెళ్ళదు. గత రెండు ఫైనల్స్ ఆడిన భారత జట్టు ఈసారి మూడో స్థానంలో నిలిచింది. మూడో స్థానం లభించినందుకు 12 కోట్ల రూపాయలు బహుమతిగా లభించనుంది. 

మిగిలిన జట్లకు కూడా డబ్బు

ICC విన్నర్ రన్నర్‌కే కాకుండా  ఇతర జట్లకు కూడా ప్రైజ్‌మనీ ప్రకటించింది. మూడో స్థానంలో ఉన్న టీం ఇండియాకు 12 కోట్లు , టేబుల్‌లో తొమ్మిదవ స్థానంలో ఉన్న పాకిస్తాన్‌కు దాదాపు 41 లక్షల రూపాయలు లభించనున్నాయి. అయితే 2021 ఫైనల్ విజేత , ఈసారి నాలుగో స్థానంలో ఉన్న న్యూజిలాండ్‌కు దాదాపు 10.2 కోట్ల రూపాయలు లభిస్తాయి. 

ఐదో స్థానంలో ఉన్న ఇంగ్లాండ్‌కు 8.2 కోట్లు, ఆరో స్థానంలో ఉన్న శ్రీలంకకు 7.1 కోట్లు, ఏడవ స్థానంలో ఉన్న బంగ్లాదేశ్‌కు 6.1 కోట్లు, ఎనిమిదవ స్థానంలో ఉన్న వెస్టిండీస్‌కు 5.1 కోట్ల రూపాయలు లభిస్తాయి. 2021 - 2023లో వరల్డ్ ఛాంపియన్‌షిప్ విజేతకు దాదాపు 13.7 కోట్ల రూపాయల బహుమతి లభించింది.

టెస్ట్ ఛాంపియన్ షిప్ ఎప్పుడు మొదలైంది

టెస్టులకు ప్రాధాన్యత ఇవ్వాలనే లక్ష్యంతో 2019లో ఐసీసీ కొత్త ఫార్మాట్‌ తీసుకొచ్చింది. అదే టెస్ట్ ఛాంపియన్ షిప్. ఈ టెస్టు ఛాంపియన్ షిప్ సైకిల్‌ జూన్‌ నుంచి ప్రారంభమవుతుంది. ఆప్పటి నుంచి వచ్చే రెండేళ్ల వరకు టెస్టు హోదా కలిగిన జట్లు ఆడిన టెస్టు మ్యాచ్‌లు ఆధారంగా, గెలిచిన మ్యాచ్‌లు ఆధారంగా పాయిట్లు కేటాయిస్తారు. ప్రస్తుతానికి టెస్టు హోదా కలిసిన జట్లు 9 మాత్రమే ఉన్నాయి. వీళ్లంతా ఒకరిపై ఒకరు టెస్టు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. ఒక్కో జట్టు ఆరు సిరీస్‌లు ఆడుతుంది. ఇందులో స్వదేశంలో మూడు ఆడితే విదేశాల్లో మూడు ఆడాలి. ఒక్కో సిరీస్‌లో రెండు నుంచి ఐదు టెస్టులు వరకు ఉండొచ్చు. 

టెస్టులో గెలిస్తే 12 పాయింట్లు ఇస్తారు. డ్రా అయితే నాలుగుపాయింట్లు, టై అయితే ఆరు పాయింట్లు ఇస్తారు. ఇలా రెండేళ్లపాటు ఎక్కువ పాయింట్లు సాధించిన టాప్ టూ జట్లు ఫైనల్ ఆడతాయి. ఇప్పుడున్న సైకిల్‌లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా టాప్‌లో ఉన్నందన ఆ రెండు జట్లు WTC ఫైనల్ ఆడతాయి. 

ఇప్పటి వరకు మూడు WTC ఫైనల్ మ్యాచ్‌లు జరిగాయి. 2019-21 మధ్య కాలంలో టాప్‌ టూ జట్లుగా భారత్ న్యూజిలాండ్ నిలిచాయి. ఆ ఫైనల్‌లో భారత్ ఓటమి పాలైంది. తర్వాత 2021-23 సైకిల్‌లో మరో ఫైనల్‌ 2023 జూన్‌లో జరిగింది. అప్పుడు కూడా భారత్ ఫైనల్‌కు వచ్చింది. ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైంది. ఈసారి మాత్రం భారత్ ఫైనల్‌కు రాలేకపోయింది. మొదటి WTC ఫైనల్‌కు విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా వ్యవహరిస్తే రెండోసారి రోహిత్‌ శర్మ కెప్టెన్‌గా ఉన్నాడు. ఇప్పుడు ఈ ఇద్దరు కూడా టెస్టు ఫార్మాట్‌కు బైబై చెప్పేశారు. 

టాప్ హెడ్ లైన్స్

CSK Coaching Crisis: ఫ్లెమింగ్ బాటలోనే మరో సిఎస్కే లెజెండ్.. హస్సీకి ఇంగ్లాండ్ టీమ్ ఆఫర్, చెన్నై క్యాంప్ లో క‌ల‌క‌లం!
ఫ్లెమింగ్ బాటలోనే మరో సిఎస్కే లెజెండ్.. ఆ దిగ్గజానికి ఇంగ్లాండ్ టీమ్ ఆఫర్, చెన్నై క్యాంప్ లో క‌ల‌క‌లం!
Virat T20 Origin:  కోహ్లీ ఫస్ట్ టి20 ఇన్నింగ్స్ ను చూసి ఫిదా అయిన ఆర్సీబీ స్కౌట్.. ఐపీఎల్ వేలంలో ఢిల్లీ మిస్టేక్ ను ఎన్ క్యాష్ చేసుకున్న ఆర్సీబీ మేనేజ్మెంట్!
కోహ్లీ ఫస్ట్ టి20 ఇన్నింగ్స్ ను చూసి ఫిదా అయిన ఆర్సీబీ స్కౌట్.. ఐపీఎల్ వేలంలో ఢిల్లీ మిస్టేక్ ను ఎన్ క్యాష్ చేసుకున్న ఆర్సీబీ మేనేజ్మెంట్!
BCCI Selection Twist: అగార్కర్ పై వేటు వేసేందుకు బిసిసిఐ ప్లాన్..! లక్ష్మణ్ కి చీఫ్ సెలెక్టర్ పగ్గాలు, రోహిత్ రిటైర్మెంట్ వివాదంలో ఊహించ‌ని ట్విస్ట్!
అగార్కర్ పై వేటు వేసేందుకు బిసిసిఐ ప్లాన్..! లక్ష్మణ్ కి చీఫ్ సెలెక్టర్ పగ్గాలు, రోహిత్ రిటైర్మెంట్ వివాదంలో ఊహించ‌ని ట్విస్ట్!
IND vs SL Test Series Updates: లంకలో ల్యాండైన టీమ్ ఇండియా.. ఫ్లైట్ ఎక్కని టాపార్డ‌ర్ బ్యాటర్, తొలి టెస్టు ఆడ‌టంపై సందిగ్ధం !
లంకలో ల్యాండైన టీమ్ ఇండియా.. ఫ్లైట్ ఎక్కని టాపార్డ‌ర్ బ్యాటర్, తొలి టెస్టు ఆడ‌టంపై సందిగ్ధం !

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Budget Friendly Bikes: మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
Embed widget