అన్వేషించండి

WTC 2025 Prize Money: WTC ఫైనల్ విజేతకు భారీ ప్రైజ్‌మనీ ప్రకటించిన ICC-అన్ని జట్లకు ఇవ్వాలని నిర్ణయం

WTC 2025 Final Prize Money: 2025 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య జరగనుంది. ఇందులో గెలిచిన టీంకు ICC భారీ ప్రైజ్‌మనీ ప్రకటించింది.

WTC 2025 Final Prize Money: 2025 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ప్రైజ్ మనీ రివీల్ అయింది. జూన్ 11-15 తేదీల మధ్య ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య ఇంగ్లాండ్ లోని లార్డ్స్ మైదానంలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈసారి WTC విజేత కోసం రికార్డు స్థాయి ప్రైజ్ మనీని ప్రకటించింది ఐసీసీ. ఈసారి WTC కోసం కోట్ల రూపాయల ప్రైజ్ పూల్ ఉంచారు, ఇది గతసారి కంటే 125 శాతం ఎక్కువ.

విజేతకు భారీ ప్రైజ్ మనీ

దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య జరిగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ విజేతకు దాదాపు 30 కోట్ల 8 లక్షల రూపాయల ప్రైజ్ మనీ లభించనుంది. అయితే ఫైనల్‌లో ఓడిపోయిన జట్టు లేదా రన్నర్‌కు దాదాపు 18.5 కోట్ల రూపాయలు లభిస్తాయి. గతంలో రన్నర్‌కు కేవలం 6.8 కోట్ల రూపాయలు మాత్రమే బహుమతిగా లభించేది. 

టెస్ట్ క్రికెట్‌ను ప్రోత్సహించడానికి ICC ఈ నిర్ణయం తీసుకుంది. ప్రైజ్ మనీని భారీగా పెంచేందుకు ప్రయత్నించింది. మూడో, నాలుగో స్థానం నుంచి చివరి స్థానం వరకు ఏ జట్టు ఖాళీ చేతులతో తిరిగి వెళ్ళదు. గత రెండు ఫైనల్స్ ఆడిన భారత జట్టు ఈసారి మూడో స్థానంలో నిలిచింది. మూడో స్థానం లభించినందుకు 12 కోట్ల రూపాయలు బహుమతిగా లభించనుంది. 

మిగిలిన జట్లకు కూడా డబ్బు

ICC విన్నర్ రన్నర్‌కే కాకుండా  ఇతర జట్లకు కూడా ప్రైజ్‌మనీ ప్రకటించింది. మూడో స్థానంలో ఉన్న టీం ఇండియాకు 12 కోట్లు , టేబుల్‌లో తొమ్మిదవ స్థానంలో ఉన్న పాకిస్తాన్‌కు దాదాపు 41 లక్షల రూపాయలు లభించనున్నాయి. అయితే 2021 ఫైనల్ విజేత , ఈసారి నాలుగో స్థానంలో ఉన్న న్యూజిలాండ్‌కు దాదాపు 10.2 కోట్ల రూపాయలు లభిస్తాయి. 

ఐదో స్థానంలో ఉన్న ఇంగ్లాండ్‌కు 8.2 కోట్లు, ఆరో స్థానంలో ఉన్న శ్రీలంకకు 7.1 కోట్లు, ఏడవ స్థానంలో ఉన్న బంగ్లాదేశ్‌కు 6.1 కోట్లు, ఎనిమిదవ స్థానంలో ఉన్న వెస్టిండీస్‌కు 5.1 కోట్ల రూపాయలు లభిస్తాయి. 2021 - 2023లో వరల్డ్ ఛాంపియన్‌షిప్ విజేతకు దాదాపు 13.7 కోట్ల రూపాయల బహుమతి లభించింది.

టెస్ట్ ఛాంపియన్ షిప్ ఎప్పుడు మొదలైంది

టెస్టులకు ప్రాధాన్యత ఇవ్వాలనే లక్ష్యంతో 2019లో ఐసీసీ కొత్త ఫార్మాట్‌ తీసుకొచ్చింది. అదే టెస్ట్ ఛాంపియన్ షిప్. ఈ టెస్టు ఛాంపియన్ షిప్ సైకిల్‌ జూన్‌ నుంచి ప్రారంభమవుతుంది. ఆప్పటి నుంచి వచ్చే రెండేళ్ల వరకు టెస్టు హోదా కలిగిన జట్లు ఆడిన టెస్టు మ్యాచ్‌లు ఆధారంగా, గెలిచిన మ్యాచ్‌లు ఆధారంగా పాయిట్లు కేటాయిస్తారు. ప్రస్తుతానికి టెస్టు హోదా కలిసిన జట్లు 9 మాత్రమే ఉన్నాయి. వీళ్లంతా ఒకరిపై ఒకరు టెస్టు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. ఒక్కో జట్టు ఆరు సిరీస్‌లు ఆడుతుంది. ఇందులో స్వదేశంలో మూడు ఆడితే విదేశాల్లో మూడు ఆడాలి. ఒక్కో సిరీస్‌లో రెండు నుంచి ఐదు టెస్టులు వరకు ఉండొచ్చు. 

టెస్టులో గెలిస్తే 12 పాయింట్లు ఇస్తారు. డ్రా అయితే నాలుగుపాయింట్లు, టై అయితే ఆరు పాయింట్లు ఇస్తారు. ఇలా రెండేళ్లపాటు ఎక్కువ పాయింట్లు సాధించిన టాప్ టూ జట్లు ఫైనల్ ఆడతాయి. ఇప్పుడున్న సైకిల్‌లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా టాప్‌లో ఉన్నందన ఆ రెండు జట్లు WTC ఫైనల్ ఆడతాయి. 

ఇప్పటి వరకు మూడు WTC ఫైనల్ మ్యాచ్‌లు జరిగాయి. 2019-21 మధ్య కాలంలో టాప్‌ టూ జట్లుగా భారత్ న్యూజిలాండ్ నిలిచాయి. ఆ ఫైనల్‌లో భారత్ ఓటమి పాలైంది. తర్వాత 2021-23 సైకిల్‌లో మరో ఫైనల్‌ 2023 జూన్‌లో జరిగింది. అప్పుడు కూడా భారత్ ఫైనల్‌కు వచ్చింది. ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైంది. ఈసారి మాత్రం భారత్ ఫైనల్‌కు రాలేకపోయింది. మొదటి WTC ఫైనల్‌కు విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా వ్యవహరిస్తే రెండోసారి రోహిత్‌ శర్మ కెప్టెన్‌గా ఉన్నాడు. ఇప్పుడు ఈ ఇద్దరు కూడా టెస్టు ఫార్మాట్‌కు బైబై చెప్పేశారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

KTR Slams Revanth Reddy: రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిని ఎన్నిసార్లు ఉరి తీయాలి- హామీల అమలుపై కేటీఆర్ ఫైర్
రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిని ఎన్నిసార్లు ఉరి తీయాలి- హామీల అమలుపై కేటీఆర్ ఫైర్
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?

వీడియోలు

Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్
Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Slams Revanth Reddy: రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిని ఎన్నిసార్లు ఉరి తీయాలి- హామీల అమలుపై కేటీఆర్ ఫైర్
రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిని ఎన్నిసార్లు ఉరి తీయాలి- హామీల అమలుపై కేటీఆర్ ఫైర్
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
Bondi Beach Shooting: బాండీ బీచ్ ఘటన హీరోలకు క్రికెట్ ఆస్ట్రేలియా గార్డ్ ఆఫ్ హానర్.. చప్పట్లతో మార్మోగిన స్టేడియం
బాండీ బీచ్ ఘటన హీరోలకు క్రికెట్ ఆస్ట్రేలియా గార్డ్ ఆఫ్ హానర్.. చప్పట్లతో మార్మోగిన స్టేడియం
Draupathi 2 Movie : 'ద్రౌపది 2'లో ముగ్గురు విలన్స్ - మహ్మద్ బిన్ తుగ్లక్‌‌గా చిరాగ్... ఫస్ట్ లుక్ రిలీజ్
'ద్రౌపది 2'లో ముగ్గురు విలన్స్ - మహ్మద్ బిన్ తుగ్లక్‌‌గా చిరాగ్... ఫస్ట్ లుక్ రిలీజ్
Mana Shankara Vara Prasad Garu Trailer: ట్రైలర్ లాంచ్‌కు చిరు & నయన్ వెళ్లట్లేదు... మరి చీఫ్ గెస్ట్ ఎవరు? MSG Trailer ఈవెంట్ డీటెయిల్స్‌ తెలుసుకోండి
ట్రైలర్ లాంచ్‌కు చిరు & నయన్ వెళ్లట్లేదు... మరి చీఫ్ గెస్ట్ ఎవరు? MSG Trailer ఈవెంట్ డీటెయిల్స్‌ తెలుసుకోండి
Soldier Suicide: కూల్‌గా కూర్చున్నాడు, రైలు రాగానే పట్టాలపై తలపెట్టి జవాను ఆత్మహత్య
కూల్‌గా కూర్చున్నాడు, రైలు రాగానే పట్టాలపై తలపెట్టి జవాను ఆత్మహత్య
Embed widget