By: ABP Desam | Updated at : 15 Feb 2023 10:55 PM (IST)
Edited By: nagavarapu
విజయానందంలో భారత మహిళల జట్టు (source: twitter)
IND vs WI, WT20: మహిళల టీ20 ప్రపంచకప్ లో భారత అమ్మాయిల జట్టు దూసుకెళ్తోంది. ఈ మెగా టోర్నీలో మన అమ్మాయిలు మరోసారి అదరగొట్టారు. వరుసగా రెండో విజయాన్ని నమోదు చేశారు. తొలి మ్యాచ్ లో దాయాది పాకిస్థాన్ పై విజయం సాధించిన టీమిండియా మహిళల జట్టు.. నేడు విండిస్ పై గెలిచింది. బుధవారం వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో భారత మహిళలు 6 వికెట్ల తేడాతో విజయం సాధించారు.
భారత బౌలింగ్ ధాటికి విండీస్ విలవిల
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్ మహిళల జట్టు.. భారత బౌలర్ల ధాటికి విలవిల్లాడింది. విండీస్ కెప్టెన్ హేలీ మాథ్యూస్ (2) రెండో ఓవర్లోనే వెనుదిరిగింది. అయితే మరో ఓపెనర్ టేలర్ (42), వన్ డౌన్ బ్యాటర్ క్యాంప్ బెల్లె (30) తో కలిగి ఇన్నింగ్స్ ను నిర్మించింది. వీరిద్దరూ రెండో వికెట్ కు 72 పరుగులు జోడించారు. దీంతో 13.3 ఓవర్లలో 2 వికెట్లకు 77 పరుగులతో ఉన్న ఆ జట్టు భారీ స్కోరు చేసేలా కనిపించింది. అయితే బలపడుతున్న వీరి భాగస్వామ్యాన్ని క్యాంప్ బెల్ ను ఔట్ చేయడం ద్వారా దీప్తి శర్మ విడదీసింది. తర్వాత విండీస్ వరుసగా వికెట్లు కోల్పోయింది. మధ్యలో చెబియన్ (21), షబికా (15) మాత్రమే రాణించారు. భారత బౌలర్ల ధాటికి నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయిన వెస్టిండీస్ జట్టు 118 పరుగులు చేసింది. దీప్తి శర్మ 3 వికెట్లు తీయగా.. రేణుకా సింగ్, పూజ వస్త్రాకర్ తలా ఒక వికెట్ పడగొట్టారు.
.@13richaghosh scored an unbeaten 44*(32) in a successful chase for #TeamIndia and was our Top Performer from the second innings 👏🏻👏🏻
A look at her batting summary 👌🏻
Scorecard ▶️ https://t.co/OwonYGMAQX…#INDvWI | #T20WorldCup pic.twitter.com/utRm5T2lUJ — BCCI Women (@BCCIWomen) February 15, 2023
119 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు ఆచితూచి ఆడుతూ లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్లు షెఫాలీ వర్మ, స్మృతి మంధాన చెలరేగటంతో 3.3 ఓవర్లలోనే 32 పరుగులు సాధించింది. అయితే తర్వాత పుంజుకున్న విండీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేశారు. దీంతో భారత్ వరుస వికెట్లు కోల్పోయింది. 11 పరుగుల వ్యవధిలో మంధాన (10), జెమీమా రోడ్రిగ్స్ (1), షెఫాలీ (28) ల వికెట్లు చేజార్చుకుంది. అయితే కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (42 బంతుల్లో 33), రిచా ఘోష్ (32 బంతుల్లో 44) రాణించటంతో 18.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. దీప్తి శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
దీప్తి రికార్డ్
వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో 3 వికెట్లు పడగొట్టిన భారత బౌలర్ దీప్తి శర్మ అరుదైన రికార్డును అందుకుంది. అంతర్జాతీయ టీ20ల్లో 100 వికెట్లు తీసిన భారత తొలి మహిళా క్రికెటర్ గా నిలిచింది.
.
#TeamIndia register their second consecutive victory in the #T20WorldCup! 👌🏻
— BCCI Women (@BCCIWomen) February 15, 2023
For her economical three-wicket haul, @Deepti_Sharma06 receives the Player of the Match award 👏🏻👏🏻
Scorecard ▶️ https://t.co/OwonYGMAQX…#INDvWI pic.twitter.com/epH7XjwABJ
Indore Stadium Pitch Rating: బీసీసీఐ అప్పీల్ - ఇండోర్ పిచ్ రేటింగ్ను మార్చిన ఐసీసీ!
WPL: ముంబైకి భారీ ప్రైజ్ మనీ.. పాకిస్తాన్ సూపర్ లీగ్ కంటే డబుల్
అఫ్గాన్ అదుర్స్- పసికూన చేతిలో పరువు పోగొట్టుకున్న పాకిస్తాన్..
ఢిల్లీ కెప్టెన్గా వార్నర్.. అక్షర్ పటేల్కు వైస్ కెప్టెన్సీ
BCCI Central Contracts: బీసీసీఐ కాంట్రాక్ట్స్ - జడ్డూకు ప్రమోషన్.. రాహుల్కు డిమోషన్
KTR Convoy: సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ కు నిరసన సెగ - కాన్వాయ్ ను అడ్డుకున్న ఏబీవీపీ కార్యకర్తలు, ఉద్రిక్తత
Nellore YSRCP: నెల్లూరు వైసీపీలో నాలుగో వికెట్ ? ప్రచారం మూమూలుగా లేదుగా !!
Game Changer First Look: స్టైలిష్ లుక్ లో రామ్ చరణ్, ఇరగదీసిన ‘గేమ్ చేంజర్’ పోస్టర్
Rapaka Varaprasad: నేను దొంగ ఓట్ల వల్లే గెలిచా, ఒక్కొక్కరు 10 దాకా ఫేక్ ఓట్లేశారు - ఎమ్మెల్యే రాపాక