అన్వేషించండి

Virat kohli Future Plans: టెస్ట్ క్రికెట్ కం బ్యాక్, వన్డే వరల్డ్ కప్ అంశాలపై విరాట్ కోహ్లీ క్లారిటీ ఇచ్చేశాడా?

Virat Kohli to Play 2027 ODI World Cup | దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో సెంచరీ సాధించిన కోహ్లీ టెస్ట్ క్రికెట్‌లోకి తిరిగి వచ్చేది లేదని స్పష్టం చేశాడు. వన్డేలే తన ఫ్యూచర్ అన్నాడు.న

దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌‌ను విరాట్ కోహ్లీ అద్భుతమైన సెంచరీతో మొదలుపెట్టాడు. వన్డే కెరీర్ లో కోహ్లీకిది 52వ సెంచరీ. మ్యాచ్ తర్వాత, అతను టెస్ట్ క్రికెట్‌లోకి తిరిగి వస్తాడా? అని గత కొంతకాలం నుంచి అడుగుతున్న ప్రశ్నకు సమాధానం చెప్పాడు. 

రాంచీలో జరిగిన తొలి వన్డేలో 135 పరుగులు చేసి, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచిన తర్వాత, కోహ్లీ ప్రస్తుతం వన్డే ఫార్మాట్‌పై మాత్రమే దృష్టి పెడుతున్నానని స్పష్టం చేశాడు. "ఇది ఇలాగే ఉండబోతోంది, నేను ఒకే ఫార్మాట్ ఆడుతున్నాను" అని కోహ్లీ చేసిన ఈ ప్రకటన రన్ మేషిన్ ఫ్యూచర్ ప్లాన్ ఏంటన్నది తేలిపోయింది. 

తన వైఖరిని తెలిపిన కోహ్లీ

రాంచీలో జరిగిన తొలి మ్యాచ్‌లో కోహ్లీ 120 బంతుల్లో 135 పరుగులు చేసి తన 52వ వన్డే సెంచరీని పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఇప్పటికీ వైట్ బాల్ కింగ్‌ తానేనని మరోసారి నిరూపించాడు. అతని ఇన్నింగ్స్ భారత్‌ను పటిష్ట స్థితికి వెళ్లడంతో పాటు ఉత్కంఠపోరులో విజయాన్ని అందించింది. మ్యాచ్ అనంతరం జరిగిన కార్యక్రమంలో టెస్ట్ క్రికెట్‌లోకి మళ్లీ వస్తారా అని ప్రశ్నించగా, కోహ్లీ ఏమాత్రం సంకోచించకుండా, ఇప్పుడు తన శరీరం, మనసు అవసరాలను అర్థం చేసుకున్నానని, ప్రస్తుతం ఒకటి కంటే ఎక్కువ ఫార్మాట్‌లు ఆడటం సాధ్యం కాదని స్పష్టం చేశాడు. టెస్టుల్లో కం బ్యాక్ ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పేశాడు.

తాజా నివేదికలకు చెక్

కొద్ది రోజుల క్రితం, BCCI కొంతమంది అనుభవజ్ఞులైన ఆటగాళ్లను తిరిగి టెస్ట్ జట్టులోకి తిరిగి తీసుకురావాలని యోచిస్తోందని వార్తలు వచ్చాయి. ఇందులో కోహ్లీ, రోహిత్ పేర్లు ఉన్నాయి. 37 ఏళ్ల వయసులో కోహ్లీ మునుపటిలా అన్ని ఫార్మాట్లలో కొనసాగలేనని భావిస్తున్నాడు. మ్యాచ్‌కు ఒక రోజు ముందు తాను పూర్తిగా విశ్రాంతి తీసుకున్నానని, తద్వారా ఎనర్జీ నిలుపుకున్నానని చెప్పాడు. తన మనస్సు చురుకుగా ఉన్నంత వరకు, శరీరం ఫిట్‌గా ఉన్నంత వరకు, ఆట మరింత సులభం అనిపిస్తుందని" కోహ్లీ పేర్కొన్నాడు.

'అనుభవమే అతిపెద్ద ఆయుధం'-కోహ్లీ

పిచ్ ప్రారంభంలో బ్యాటింగ్‌కు ఈజీ అనిపించిందని, కానీ తర్వాత నెమ్మదించింది. అటువంటి పరిస్థితిలో, అవగాహన, షాట్ సెలక్షన్, అనుభవం చాలా ఉపయోగపడ్డాయి. ప్రాక్టీస్‌పై నమ్మకం ఉంచనని, తన మానసిక బలం, ఆటపై ఉన్న ఇష్టం, డెడికేషన్‌పై నమ్మకం ఉంచుతానని’ కోహ్లీ స్పష్టం చేశాడు. తాను కేవలం వన్డేలు మాత్రమే ఆడాలని భావిస్తున్నట్లు కోహ్లీ స్వయంగా ప్రకటించాడు. అంటే 2027 వన్డే వరల్డ్ కప్ కోసం ఒక్క ఫార్మాట్లోనే కొనసాగుతున్నట్లు ఇండైరెక్టుగా కోహ్లీ చెప్పకనే చెప్పేశాడు. దాంతో వన్డే వరల్డ్ కప్ వరకు కోహ్లీ ఆడతాడా అనే ఊహాగానాలకు చెక్ పెట్టాడు.

కోహ్లీ ఇదే ఫిట్ నెస్ మెయింటైన్ చేస్తే ఈజీగా మరో మూడేళ్లు క్రికెట్ ఆటగలడు. అందులోనూ కేవలం ఒకే ఫార్మాట్లో ఆడుతున్నందున అంతగా ఒత్తిడి, అలసట సైతం అనిపించవు. మధ్యలో ఏడాదికి రెండు నెలలపాటు ఐపీఎల్ సీజన్ తో బిజీగా ఉంటాడు. కనుక వచ్చే వరల్డ్ కప్ కోహ్లీ లక్ష్యమని తేలిపోయింది. తొలి వన్డేలో రోహిత్ శర్మతో కలిసి 135 పరుగుల శతక భాగస్వామ్యం భారత ఇన్నింగ్స్ ను నిలబెట్టింది. కోహ్లీ సెంచరీ అయితే మరో లెవల్ అనిపించింది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Messi mania in Hyderabad: హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
Vizag Economic Zone: విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
Atal-Modi Good Governance Bus Tour: ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి వేడుకలు ప్రారంభం
ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ప్రారంభం
Sandesara brothers: సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
Advertisement

వీడియోలు

USA investing In Pakistan | భారత్‌పై కోపంతో పాక్‌లో పెట్టుబడులకు రెడీ అయిన ట్రంప్ | ABP Desam
Ind vs SA T20 Suryakumar Press Meet | ఓటమిపై సూర్య కుమార్ యాదవ్ కామెంట్స్
Shubman Gill Golden Duck in Ind vs SA | రెండో టీ20లో గిల్ గోల్డెన్ డకౌట్
Arshdeep 7 Wides in Ind vs SA T20 | అర్షదీప్ సింగ్ చెత్త రికార్డు !
India vs South Africa 2nd T20 | టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా!
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Messi mania in Hyderabad: హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
Vizag Economic Zone: విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
Atal-Modi Good Governance Bus Tour: ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి వేడుకలు ప్రారంభం
ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ప్రారంభం
Sandesara brothers: సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
Census 2027: జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
Divi Vadthya Bikini Pics: బికినీలో బిగ్ బాస్ దివి... ఇంటర్‌నెట్‌ను షేక్ చేస్తున్న ఫోటోలు
బికినీలో బిగ్ బాస్ దివి... ఇంటర్‌నెట్‌ను షేక్ చేస్తున్న ఫోటోలు
Akhanda 2 Premiere Show Collection: 'అఖండ 2' ప్రీమియర్స్... గురువారం రాత్రి బాలయ్య సినిమా కలెక్షన్స్ ఎంతంటే?
'అఖండ 2' ప్రీమియర్స్... గురువారం రాత్రి బాలయ్య సినిమా కలెక్షన్స్ ఎంతంటే?
Cognizants Campus in Visakhapatnam: ఏడాదిలోనే విశాఖకు కాగ్నిజెంట్.. తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్ 
ఏడాదిలోనే విశాఖకు కాగ్నిజెంట్.. తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్ 
Embed widget