అన్వేషించండి

T20 World Cup 2024: కుంభకర్ణుడిలా పడుకుని మ్యాచ్‌కు దూరమయ్యాడు, క్రికెట్‌ చరిత్రలో వింత సంఘటన

Bangladesh's veteran pacer Taskin Ahmed : ప్రతిష్టాత్మక టీ 20 మ్యాచ్ లో ఓ వింత సంఘటన జరిగింది. ఒక బంగ్లాదేశ్ ఆటగాడు చక్కగా నిద్రపోయి ప్రపంచ కప్ మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఆ వివరాలేంటంటే

Taskin missed team bus for sleep before India match : అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటివరకూ ఎవరూ కనివినీ ఎరుగని ఘటన టీ 20 ప్రపంచకప్‌ (T20 World Cup)లో జరిగింది. ఫిట్‌నెస్‌ లేకనో... గాయపడడం వల్లో... లేక ఫైనల్‌ 11లో సమతూకం లేకపోవడం వల్లో ఏ  ఆటగాడినైనా జట్టులోకి తీసుకోకపోవడం మనం విని ఉంటాం. కానీ ఇప్పుడు మనం చదివేది అలాంటి ఇలాంటి ఘటన కాదు. నిద్రపోవడం వల్ల ఓ ఆటగాడు మ్యాచ్‌కు దూరమయ్యాడంటే మీరు నమ్మగలరా... కానీ నమ్మి తీరాలి. మ్యాచ్‌ సమయం వరకూ నిద్రపోతూనే ఉండడం వల్ల ఓ క్రికెటర్‌ భారత్‌తో జరిగిన కీలక మ్యాచ్‌కు దూరమయ్యాడు. మరి అది అలాంటి ఇలాంటి మ్యాచ్‌ కాదు. ప్రపంచకప్‌లో కీలక మ్యాచ్‌లో బంగ్లాదేశీ క్రికెటర్‌ నిద్ర పోవడం వల్ల మ్యాచ్‌కు దూరమయ్యాడంటూ బంగ్లా క్రికెట్‌ బోర్డు అధికారి ఒకరు వెల్లడించడం ఇప్పుడు క్రికెట్‌ ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసింది. 


కుంభకర్ణుడి బాబు
 టీ20 ప్రపంచకప్‌లో భారత్‌-బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓ ఆసక్తికర విషయం వెలుగు చూసింది. బంగ్లాదేశ్ జట్టుకు సంబంధించిన ఓ వింత ఘటన వెలుగులోకి రావడం ఇప్పుడు క్రికెట్‌ ప్రపంచాన్ని విస్మయపరుస్తోంది. టీ 20 ప్రపంచ కప్‌లో బంగ్లాదేశ్‌ జట్టు ప్రధాన ఫాస్ట్ బౌలర్లలో తస్కిన్ అహ్మద్( Taskin Ahmed ) ఒకడు. కానీ భారత్‌తో జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో తస్కిన్‌ అహ్మద్‌ ఆడలేదు. గాయం వల్లో... జట్టు సమతూకంలో భాగంగానే తస్కిన్ అహ్మద్‌ను పక్కన పెట్టారని అందరూ అనుకున్నారు.

కానీ ఇప్పుడు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధికారి ఒకరు సంచలన ప్రకటన చేశారు. భారత్‌తో జరిగిన మ్యాచ్‌  రోజు తస్కిన్ అహ్మద్ చాలా సేపు నిద్రపోయాడని... అందుకే అతను టీమ్ బస్‌ను సకాలంలో ఎక్కలేదని బంగ్లా క్రికెట్‌ బోర్డు అధికారి ఒకరు తెలిపారు. బస్‌ మిస్‌ అయిన తర్వాత నిద్ర లేచిన తస్కిన్‌ అహ్మద్‌ క్షమాపణలు చెప్పాడని కూడా వెల్లడించారు.

బంగ్లాదేశ్‌- భారత్‌ మ్యాచ్ జరగాల్సిన రోజు తస్కిన్ అహ్మద్ ఆలస్యంగా నిద్రపోయాడని... చాలా ఆలస్యంగా నిద్ర లేచాడని దీంతో టీమ్ బస్సు అతడు లేకుండానే బయలుదేరిందని ఆ అధికారి తెలిపారు. జట్టు సభ్యులు... బోర్డు అధికారులు ఫోన్‌ చేసినా తస్కిన్‌ అహ్మద్‌ ఫోన్‌ ఎత్తలేదని... దీంతో టీమ్ మేనేజ్ మెంట్ అధికారి హోటల్లోనే ఉండాల్సి వచ్చిందని వివరించారు. భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ తంజిమ్ హసన్ షకీబ్, ముస్తాఫిజుర్ రెహమాన్‌లతో ఇద్దరు ఫాస్ట్ బౌలర్లతో మాత్రమే ఆడింది.

తస్కిన్ ఆలస్యంగా మైదానానికి చేరుకున్నప్పుటికీ అతనిని ప్లేయింగ్ లెవన్‌లోకి తీసుకోలేదు. తస్కిన్‌ అంటే కోచ్‌కు కోపం ఉందని అందుకే అతనిని జట్టులోకి తీసుకోలేదని ఆరోపణలు వచ్చాయి. అయితే దీనిని బంగ్లా అధికారులు ఖండించారు. కోచ్‌కి తస్కిన్‌పై కోపం ఉంటే అఫ్గాన్‌తో జరిగిన తదుపరి మ్యాచ్‌లో ప్లేయింగ్ లెవన్‌లో ఎందుకు ఉంటాడని ప్రశ్నించారు. తాను ఆలస్యంగా నిద్ర లేవడంపై తోటి ఆటగాళ్లకు, మేనేజ్‌మెంట్‌కు తస్కిన్‌ క్షమాపణలు కూడా చెప్పాడు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana: ఫామ్‌హౌస్ కేసు దగ్గరకు వెళ్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు - బీజేపీకి ఇరకాటంలో పెట్టే ప్లానేనా ?
ఫామ్‌హౌస్ కేసు దగ్గరకు వెళ్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు - బీజేపీకి ఇరకాటంలో పెట్టే ప్లానేనా ?
Andhra Loan Politics: అప్పులపై చంద్రబాబు, జగన్ తలో వాదన - అసెంబ్లీలో తేల్చుకునేందుకు ప్రతిపక్ష నేత వస్తారా ?
అప్పులపై చంద్రబాబు, జగన్ తలో వాదన - అసెంబ్లీలో తేల్చుకునేందుకు ప్రతిపక్ష నేత వస్తారా ?
Rohit Sharma: మరోసారి తండ్రైన రోహిత్ శర్మ, బాబుకు జన్మనిచ్చిన రితికా - ఆస్ట్రేలియాకు హిట్ మ్యాన్ !
మరోసారి తండ్రైన రోహిత్ శర్మ, బాబుకు జన్మనిచ్చిన రితికా - ఆస్ట్రేలియాకు హిట్ మ్యాన్ !
Jhansi Fire Accident: యూపీలోని ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం, 10 మంది చిన్నారులు సజీవదహనం
యూపీలోని ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం, 10 మంది చిన్నారులు సజీవదహనం -
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana: ఫామ్‌హౌస్ కేసు దగ్గరకు వెళ్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు - బీజేపీకి ఇరకాటంలో పెట్టే ప్లానేనా ?
ఫామ్‌హౌస్ కేసు దగ్గరకు వెళ్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు - బీజేపీకి ఇరకాటంలో పెట్టే ప్లానేనా ?
Andhra Loan Politics: అప్పులపై చంద్రబాబు, జగన్ తలో వాదన - అసెంబ్లీలో తేల్చుకునేందుకు ప్రతిపక్ష నేత వస్తారా ?
అప్పులపై చంద్రబాబు, జగన్ తలో వాదన - అసెంబ్లీలో తేల్చుకునేందుకు ప్రతిపక్ష నేత వస్తారా ?
Rohit Sharma: మరోసారి తండ్రైన రోహిత్ శర్మ, బాబుకు జన్మనిచ్చిన రితికా - ఆస్ట్రేలియాకు హిట్ మ్యాన్ !
మరోసారి తండ్రైన రోహిత్ శర్మ, బాబుకు జన్మనిచ్చిన రితికా - ఆస్ట్రేలియాకు హిట్ మ్యాన్ !
Jhansi Fire Accident: యూపీలోని ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం, 10 మంది చిన్నారులు సజీవదహనం
యూపీలోని ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం, 10 మంది చిన్నారులు సజీవదహనం -
IND vs SA 4th T20I Highlights: తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
Rains Update: బలహీనపడిన అల్పపీడనం, నేడు ఏపీలో ఈ జిల్లాల్లో వర్షాలు- తెలంగాణలో వాతావరణం ఇలా
బలహీనపడిన అల్పపీడనం, నేడు ఏపీలో ఈ జిల్లాల్లో వర్షాలు- తెలంగాణలో వాతావరణం ఇలా
Indiramma Houses: అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు, రైతుల నుంచి ప్రతి గింజ కొంటాం: మంత్రి పొంగులేటి
అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు, రైతుల నుంచి ప్రతి గింజ కొంటాం: మంత్రి పొంగులేటి
Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
Embed widget