CSK Captain Ruturaj Gaikwad Fined: CSKపై ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ కఠిన చర్యలు- కెప్టెన్ గైక్వాడ్ పై భారీ జరిమానా
గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ లో స్లో ఓవర్ రేట్ మెయింటైన్ చేసినందుకు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్తో పాటు టీమ్ మెంబర్స్ అందరికీ భారీ ఫైన్ పడింది.

CSK Captain Ruturaj Gaikwad Fined 24 Lakhs for Slow Over Rate: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ప్రయాణం చేదు జ్ఞాపకంతో ముగిసింది. గురువారం గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్ లో శుభ్మన్ గిల్ టీమ్ చేతిలో 89 పరుగుల తేడాతో ఓడిపోయిన సీఎస్కే, ప్లేఆఫ్స్ రేసు నుండి అధికారికంగా నిష్క్రమించింది. ఈ ఘోర పరాజయం తర్వాత చెన్నై జట్టుకు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మరో షాక్ ఇచ్చింది. మ్యాచ్ లో నిర్ణీత సమయానికి ఓవర్ల కోటాను పూర్తి చేయనందుకు (Slow Over-Rate) కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్కు రూ. 24 లక్షల భారీ జరిమానా విధించింది. ఈ సీజన్ లో చెన్నై జట్టుకు ఇది రెండో తప్పు కావడంతో కెప్టెన్తో పాటు ప్లేయింగ్ ఎలెవన్ లోని మిగతా ఆటగాళ్లందరిపైనా పెనాల్టీ పడింది.
Read Also: Phil Salt Return To RCB Team: ఆర్సీబీకి గుడ్ న్యూస్.. అందుబాటులోకి విధ్వంసక ఓవర్సీస్ ప్లేయర్..!
రెండోసారి రూల్స్ బ్రేక్ చేసిన చెన్నై..
అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన మ్యాచ్ 66 లో ఐపీఎల్ కోడ్ ఆఫ్ కాండక్ట్లోని ఆర్టికల్ 2.22 ప్రకారం కనీస ఓవర్ రేట్ నిబంధనను సీఎస్కే ఉల్లంఘించింది. అంతకుముందు లీగ్ లోని 18వ మ్యాచ్ లో కూడా ఈ టీమ్ ఇదే తప్పు చేసింది. రెండోసారి నిబంధనలు అతిక్రమించినందుకు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్కు రూ. 24 లక్షల ఫైన్ విధించగా, మ్యాచ్ ఆడిన మిగిలిన టీమ్ మెంబర్స్ అందరికీ, ఇంపాక్ట్ ప్లేయర్తో సహా ఒక్కొక్కరికి రూ. 6 లక్షలు లేదా వారి మ్యాచ్ ఫీజులో 25 శాతం (ఏది తక్కువైతే అది) జరిమానాగా ప్రకటించారు. ఈ మేరకు ఐపీఎల్ యాజమాన్యం అధికారిక ప్రకటన విడుదల చేసింది.
Read Also: Ram Charan at Uppal Stadium IPL 2026 | ఐపీఎల్ మ్యాచ్లో పెద్ది టీమ్ ప్రమోషన్స్
బ్యాటింగ్ లో ఘోర వైఫల్యం..
ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ నిర్దేశించిన 230 పరుగుల భారీ టార్గెట్ను ఛేజ్ చేసే క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ లైనప్ పూర్తిగా విఫలమైంది. ఇన్నింగ్స్ ఆరంభంలోనే వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ పరుగులేమీ చేయకుండా గోల్డెన్ డక్గా అవుట్ కావడంతో జట్టు భారీ దెబ్బతింది. మిడిలార్డర్ బ్యాటర్ శివమ్ దూబే కేవలం 17 బంతుల్లో 47 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడి కాసేపు ఆశలు రేకెత్తించినా, మిగతా ప్లేయర్స్ నుండి సపోర్ట్ లభించలేదు. దీంతో చెన్నై ఘోర పరాజయాన్ని చవిచూసి టోర్నమెంట్ నుండి అవుట్ అయింది.
భారీ మార్పులకు అవకాశం
ఈ పరాజయంతో చెన్నై సూపర్ కింగ్స్ ఈ ఏడాది లీగ్ నుండి నిష్క్రమించింది. లెజెండరీ ప్లేయర్ ఎంఎస్ ధోనీ భవిష్యత్తుపై ఇంకా స్పష్టత రాని తరుణంలో, చాలా మంది కీలక ఆటగాళ్లు తమ ఫామ్ను నిరూపించుకోవడంలో ఘోరంగా విఫలమయ్యారు. ఈ ఓటమి, ప్లేఆఫ్స్ రేసు నుండి తప్పుకోవడం వంటి పరిణామాల నేపథ్యంలో వచ్చే ఐపీఎల్ సీజన్ నాటికి చెన్నై టీమ్ మేనేజ్మెంట్ జట్టులో భారీ మార్పులు చేసే అవకాశం కనిపిస్తోంది. కొత్త బ్లూప్రింట్ తో జట్టును రీబిల్డ్ చేయడానికి సీఎస్కే యాజమాన్యం కసరత్తులు ప్రారంభించనుంది.
Before You Go
Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
ట్రెండింగ్ వార్తలు



















