అన్వేషించండి

T20 World Cup 2024: భయం లేని ఆట చూపిస్తాం, సెమీస్‌కు ముందు హిట్‌మ్యాన్‌

Rohit Sharma : టీ20 ప్రపంచకప్‌ రెండవ సెమీఫైనల్‌ లో భారత్‌, ఇంగ్లాండ్‌ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో అనుసరించే వ్యూహాల పై కెప్టెన్‌ రోహిత్‌ స్పందించాడు.

Rohit Sharma Game Plan:  గయానా(Gayana)లోని ప్రొవిడెన్స్‌లో ఇవాళ జరిగే టీ 20 ప్రపంచకప్(T20 World Cup) రెండో సెమీ-ఫైనల్‌(Semi Final)లో ఇంగ్లండ్‌(England)తో తలపడేందుకు టీమిండియా సిద్ధమవుతోంది. ఇంగ్లాండ్‌తో కీలకమైన సెమీఫైనల్‌ మ్యాచ్‌కు ముందు రోహిత్‌ శర్మ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ మ్యాచ్‌లో ఒత్తిడి ఉంటుందని... దాని గురించి పదేపదే మాట్లాడడం తనకు ఇష్టం లేదని హిట్‌మ్యాన్‌ అన్నాడు. ఈ మ్యాచ్‌కు ముందు జట్టులు వాతావరణాన్ని సాధారణంగా ఉండేలా చూడడం... జట్టు సభ్యులను ప్రశాంతంగా ఉండడం ముఖ్యమని రోహిత్ అన్నాడు. ఈ మ్యాచ్‌ విషయంలో తాము స్పష్టమైన ఆలోచనలతో ఉన్నామని కూడా హిట్‌మ్యాన్‌ తెలిపాడు. ఈ మెగా టోర్నమెంట్‌లో ఇది మరొక మ్యాచ్‌గానే తాము భావిస్తున్నామని రోహిత్ వివరించాడు. ఈ మ్యాచ్‌లో గెలిచి ఫైనల్‌కు చేరాలన్న పట్టుదలతో ఉన్నామని కూడా వెల్లడించాడు. మ్యాచ్‌ గురించి మరీ ఎక్కువ ఆలోచిస్తే ఒత్తిడి పెరుగుతుందని.. ఇది సెమీఫైనల్‌ మ్యాచ్‌ అని అందరికీ తెలుసని.... కానీ దాని గురించే మళ్లీ మళ్లీ మాట్లడడం మంచిదికాదని రోహిత్ తెలిపాడు. జట్టంతా ఒక మంచి మానసిక స్థితిలో ఉందన్న రోహిత్‌.. ఒక జట్టుగా తాము బాగా ఆడుతున్నామని... ప్రతీ మ్యాచ్‌ను ఆస్వాదిస్తున్నామని అన్నాడు. జట్టులో ఒకరి విజయాన్ని మరొకరు ఆస్వాదిస్తున్నారని, ఈ టోర్నమెంట్‌లో కొన్నిసార్లు తాము ఒత్తిడికి గురయ్యామని అయినా దానినుంచి బయటపడ్డామని హిట్‌మాన్‌ గుర్తు చేశాడు. 


జట్టుగా ఏం చేయాలో తెలుసు
 తాము అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు ఎంత బాగా ఆడగలమో అంత బాగా ఆడేందుకు సిద్ధంగా ఉన్నామని రోహిత్‌ తెలిపాడు. జట్టుగా మేం ఏం చేయగలమో మాత్రమే ఆలోచిస్తున్నామని.. కొన్నిసార్లు ఎక్కువగా ఆలోచిస్తే మీరు సరైన నిర్ణయాలు తీసుకోలేరని రోహిత్ తెలిపాడు. ఫీల్డ్‌లో ఏం చేయాలో తమకు బాగా తెలుసని... జట్టులోని ప్రతీ ఆటగాడికి వారి బాధ్యత స్పష్టంగా తెలుసని టీమిండియా సారధి తెలిపాడు. భారత్‌-ఇంగ్లాండ్‌ రెండో టీ 20 ప్రపంచకప్‌లో మొదటిసారిగా ప్రొవిడెన్స్‌లో ఆడనున్నాయి. ఇక్కడి వాతావరణ పరిస్థితులపై ఇరు జట్లకు సమానమైన అవగాహన ఉందని రోహిత్ చెప్పాడు. ఈ పిచ్‌పై ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనే దాన్ని అర్థం చేసుకుని బ్యాటింగ్‌ చేయాల్సి ఉందన్నాడు. 


పిచ్‌ను బట్టే...
 ఇప్పుడు జట్టులో ఉన్న ప్రతీ ఆటగాడు ఇక్కడి పరిస్థితులకు అలవాటు పడ్డాడని.. కాబట్టి అందరిపై తమకు పూర్తి నమ్మకం ఉందని రోహిత్‌ తెలిపాడు. ఈ మ్యాచ్‌లోనూ దూకుడు విధానాన్ని అవలంభిస్తారా అన్న ప్రశ్నకు రోహిత్‌ ఆసక్తికర సమాధానం చెప్పాడు. ఈ ప్రశ్నకు బంగ్లాదేశ్‌తో జరిగిన సూపర్ ఎయిట్ మ్యాచ్‌ను రోహిత్‌ సమాధానంగా చెప్పాడు. ఆ మ్యాచ్‌లో భారత్ 5 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసిందని.. హార్దిక్ పాండ్యా  ఒక్కడే 40 కంటే ఎక్కువ పరుగులు చేశాడని గుర్తు చేశాడు. జట్టులో ఎవరూ 50 పరుగులు చేయకపోయినా భారీ స్కోరు చేశామని... రోహిత్‌ అన్నాడు. ఆ మ్యాచ్‌లో టీమిండియా 50 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లోనూ భయం లేకుండా ఆడతామని రోహిత్ చెప్పాడు. గత కొన్నేళ్లుగా తాము భయం లేని క్రికెట్‌ ఆడుతున్నామని... ఇప్పుడు అదే చేస్తామని వెల్లడించాడు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Aravali Contraversi: ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
YSRCP activist arrest: రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
Harish Rao: తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
Shambhala Review : బడ్జెట్... హార్డ్ వర్క్ నో కాంప్రమైజ్ - 'శంబాల' థియేటర్స్‌లో చూస్తేనే ఫీల్... హీరో ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ
బడ్జెట్... హార్డ్ వర్క్ నో కాంప్రమైజ్ - 'శంబాల' థియేటర్స్‌లో చూస్తేనే ఫీల్... హీరో ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ

వీడియోలు

Delhi Bangladesh High Commissionerate | బంగ్లాదేశ్ హైకమిషనరేట్‌ను ముట్టడించిన హిందూ సంఘాలు | ABP
1 Crore to Pak U-19 Players | పాక్ ఆటగాళ్లకి ఒక్కొక్కరికీ కోటి రూపాయలు | ABP Desam
Shubman Gill vs Yashasvi Jaiswal | t20 వరల్డ్ కప్ 2026 ఇండియన్ స్క్వాడ్ లో జైస్వాల్ కి చోటు దక్కల్సింది | ABP Desam
Virat Kohli Under Pant Captaincy | పంత్ కెప్టెన్సీలో బరిలోకి దిగబోతున్న విరాట్ కోహ్లీ | ABP Desam
Vaibhav Suryavanshi Shoe Controversy | పాక్ పేసర్‌కు వైభవ్ సూర్యవంశీ షూ చూపించిన ఘటనపై క్లారిటీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Aravali Contraversi: ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
YSRCP activist arrest: రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
Harish Rao: తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
Shambhala Review : బడ్జెట్... హార్డ్ వర్క్ నో కాంప్రమైజ్ - 'శంబాల' థియేటర్స్‌లో చూస్తేనే ఫీల్... హీరో ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ
బడ్జెట్... హార్డ్ వర్క్ నో కాంప్రమైజ్ - 'శంబాల' థియేటర్స్‌లో చూస్తేనే ఫీల్... హీరో ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ
Tirupati Govindarajaswamy Temple: వైసీపీ హయాంలో గోవిందరాజస్వామి ఆలయంలో 50 కేజీల బంగారం గోల్ మాల్ ఆరోపణలు - విజిలెన్స్ విచారణ
వైసీపీ హయాంలో గోవిందరాజస్వామి ఆలయంలో 50 కేజీల బంగారం గోల్ మాల్ ఆరోపణలు - విజిలెన్స్ విచారణ
Phone Tapping case: ఫోన్ టాపింగ్ కేస్ లో బిగ్ ట్విస్ట్! కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు సిట్ నోటీసులు?
ఫోన్ టాపింగ్ కేస్ లో బిగ్ ట్విస్ట్! కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు సిట్ నోటీసులు?
Delhi : ఢిల్లీలో పొల్యూషన్ ఎఫెక్ట్‌! ట్రాఫిక్ నియంత్రణలో కీలక మార్పులు- ఈవీలకు ప్రత్యేక రూట్‌
ఢిల్లీలో పొల్యూషన్ ఎఫెక్ట్‌! ట్రాఫిక్ నియంత్రణలో కీలక మార్పులు- ఈవీలకు ప్రత్యేక రూట్‌
Stranger Things Series Season 5 OTT : అవెయిటెడ్ 'స్ట్రేంజర్ థింగ్స్' వెబ్ సిరీస్ - ఫైనల్ సీజన్ ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
అవెయిటెడ్ 'స్ట్రేంజర్ థింగ్స్' వెబ్ సిరీస్ - ఫైనల్ సీజన్ ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Embed widget