అన్వేషించండి

INDvsPAK: పూటకో మాట మారుస్తున్న పాక్ - వరల్డ్ కప్‌లో పాల్గొనడంపై అనిశ్చితి - అంత భయమెందుకన్న అఫ్రిది

ఈ ఏడాది భారత్ వేదికగా అక్టోబర్ నుంచి జరుగబోయే వన్డే వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ ఆడేదీ లేనిదీ ఇంకా తేలలేదు. దీనిపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) పూటకో మాట మారుస్తున్నది.

INDvsPAK: సుమారు 9 నెలలుగా  చర్చోపచర్చలు, వాదోపవాదాల నడుమ ఆసియా కప్ - 2023 నిర్వహణ వివాదం ఇటీవలే  ముగియడంతో భారత్ - పాకిస్తాన్  క్రికెట్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఆసియా కప్‌కు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ప్రతిపాదించిన హైబ్రిడ్ మోడల్‌ (పాక్‌లో 4 మ్యాచ్‌లు, శ్రీలంకలో 9 మ్యాచ్‌లు) కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కూడా  అంగీకారం తెలపడంతో   ఈ ఏడాది అక్టోబర్  నుంచి జరుగబోయే వన్డే  వరల్డ్ కప్‌లో  పాకిస్తాన్  కూడా ఇండియాకు  వస్తుందని, రెండు దేశాల క్రికెట్ బోర్డుల మధ్య సయోధ్య కుదిరినట్టేనని అంతా భావిస్తున్న తరుణంలో పీసీబీ చీఫ్ నజమ్ సేథీ చేసిన వ్యాఖ్యలు కొత్త అనుమానాలకు తావిస్తున్నాయి. 

ప్రభుత్వ నిర్ణయమే మా నిర్ణయం.. 

శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో  నజమ్ సేథీ మాట్లాడుతూ.. ‘భారత్ - పాకిస్తాన్ మ్యాచ్‌లకు సంబంధించి మేం (బీసీసీఐ, పీసీబీ) సొంతంగా నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం లేదు. అది ప్రభుత్వాల చేతుల్లో ఉన్న అంశం. ఆసియా కప్ ఆడేందుకు తమకు భద్రతా కారణాలున్నాయన్న బీసీసీఐ పరిస్థితిని మేం అర్థం చేసుకోగలం. ఇప్పుడు వన్డే వరల్డ్ కప్ లో మా పరిస్థితి కూడా అంతే.. మేం అక్కడికి వెళ్లాలన్నా మా ప్రభుత్వం అనుమతించాలి... 

అహ్మదాబాద్‌లో ఆడతామా..? లేదా..? అన్న దానికంటే  ముందు మేం అక్కడికి వెళ్తామా..? లేదా..? అన్నది మా ప్రభుత్వం తేల్చాలి.  ఒకవేళ ప్రభుత్వం అనుమతించకుంటే మాత్రం అక్కడికి వెళ్లి ఎలా ఆడగలం..? ఇదే విషయంపై మేం గతంలో కూడా మా నిర్ణయాన్ని స్పష్టంగా చెప్పాం.  మా ప్రభుత్వం నిర్ణయంపై మా నిర్ణయం ఆధారపడి ఉంటుంది..’అని చెప్పాడు. 

ఎందుకంత భయం..? 

కాగా  పీసీబీ చీఫ్ చేసిన వ్యాఖ్యలపై ఆ జట్టు మాజీ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది ఘాటుగా స్పందించాడు. ప్రభుత్వ నిర్ణయంపై ఆయన ఎలాంటి కామెంట్స్ చేయకపోయినా అహ్మదాబాద్‌లో ఆడటం, ఆడకపోవడంపై ఆయన  మాట్లాడాడు. ‘అహ్మదాబాద్‌లో ఎందుకు ఆడకుంటదని అనుకుంటున్నారు..?  అదేమైనా నిప్పులు కురిపిస్తుందా..? లేక మిమ్మల్ని వెంటాడుతుందా..? మీరు అక్కడికి వెళ్లి ఆడాలి.  గెలవాలి. మీరు ఊహించిన సవాళ్లను అధిగమించాలి. టీమిండియాను  వాళ్ల వేలాది సొంత ప్రేక్షకుల మధ్య  ఓడించడానికి వచ్చిన అవకాశాలపై   పీసీబీ దృష్టి సారించాలి గానీ వెనుకడుగు వేయకూడదు. పీసీబీ సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలి. భారత్‌ను  సొంతగడ్డపై వారి ప్రేక్షకుల మధ్య ఓడిస్తే ఆ మజానే వేరు..’ అని  అఫ్రిది  తెలిపాడు. అధికారిక షెడ్యూల్ విడుదల కాకపోయినా భారత్ - పాక్ మ్యాచ్‌ అక్టోబర్ 15న అహ్మదాబాద్‌లో జరిపించేందుకు బీసీసీఐ, ఐసీసీ  ప్రయత్నాలు చేస్తున్నది. 

ఐసీసీ డైలామా..

భారత్ - పాకిస్తాన్‌తో పాటు అఫ్గానిస్తాన్‌తో జరుగబోయే మ్యాచ్‌ వేదికను కూడా మార్చాలని  పీసీబీ.. ఐసీసీని కోరినట్టు తెలుస్తున్నది.   బీసీసీఐ ముసాయిదా షెడ్యూల్ ప్రకారం ఈ ఇరు జట్ల మధ్య మ్యాచ్‌ను  చెన్నైలో జరిపించేందుకు   బీసీసీఐ షెడ్యూల్‌లో ప్రతిపాదించింది. అయితే చెన్నై పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది. అఫ్గాన్ జట్టులో రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ముజీబ్ ఉర్ రెహ్మాన్ వంటి నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారు. ఇది  తమకు ముప్పు తీసుకొస్తుందని పీసీబీ భావిస్తున్నట్టు సమాచారం. ఈ మ్యాచ్ వేదికను కూడా మార్చాలని  పీసీబీ.. ఐసీసీని కోరిందని తెలుస్తున్నది.  

పూటకో మాట మారుస్తున్న పాకిస్తాన్  వైఖరితో  ఐసీసీ, బీసీసీఐలు డైలమాలో పడ్డాయి.  ఇదివరకే వరల్డ్ కప్ షెడ్యూల్‌ను  ప్రకటించాల్సి ఉన్నా పాక్ వైఖరితో  ఇది వాయిదా పడుతోంది. వాస్తవానికి బీసీసీఐ.. ఐపీఎల్ - 16 ఫైనల్ ముగిసిన తర్వాతే వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల చేయాలని భావించింది.  ఇది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ తర్వాత అయినా తేలుతుందనుకుంటే  ఇప్పుడు పాక్ వ్యవహరిస్తున్న తీరుతో అది మరింత ముందుకు జరుగుతోంది. 

టాప్ హెడ్ లైన్స్

Shubman Gill Ranking Surge: నంబర్ వన్ ర్యాంక్ కి ఒక్క అడుగు దూరంలో గిల్.. విరాట్, రోహిత్ ల క్రేజీ రేస్, ఐసీసీ ర్యాంకింగ్స్ లో భార‌త బ్యాట‌ర్ల జోరు!
నంబర్ వన్ ర్యాంక్ కి ఒక్క అడుగు దూరంలో గిల్.. విరాట్, రోహిత్ ల క్రేజీ రేస్, ఐసీసీ ర్యాంకింగ్స్ లో భార‌త బ్యాట‌ర్ల జోరు!
Vaibhav Sooryavanshi Confident: డ్రాప్ చేసినా కాన్ఫిడెన్స్ త‌గ్గేది లేదంటున్న  వైభవ్ సూర్యవంశీ.. జింబాబ్వేలో స‌త్తా చాటుతాన‌ని, ఇక్క‌డ తీపి జ్ఞాప‌కాలున్న‌య‌ని వెల్ల‌డి!
డ్రాప్ చేసినా కాన్ఫిడెన్స్ త‌గ్గేది లేదంటున్న  వైభవ్ సూర్యవంశీ.. జింబాబ్వేలో స‌త్తా చాటుతాన‌ని, ఇక్క‌డ తీపి జ్ఞాప‌కాలున్న‌య‌ని వెల్ల‌డి!
Sanju Samson Vs Rohit Sharma: రోహిత్  కు సారీ చెప్పిన సంజూ శాంస‌న్.. ! అస‌లేం జ‌రిగిందంటే..!!
రోహిత్ శర్మ కు సారీ చెప్పిన సంజూ శాంస‌న్.. ! అస‌లేం జ‌రిగిందంటే..!!
Tilak Varma Clarity: తన స్ట్రైక్ రేట్ పై వస్తున్న విమర్శలపై తిలక్ వర్మ క్లారిటీ, జింబాబ్వే టి20 సిరీస్ కు ముందు సంచలన ట్విస్ట్!
తన స్ట్రైక్ రేట్ పై వస్తున్న విమర్శలపై తిలక్ వర్మ క్లారిటీ, జింబాబ్వే టి20 సిరీస్ కు ముందు సంచలన ట్విస్ట్!

వీడియోలు

NTR Sister In Law Politics Entry Rumours | నందమూరి ఫ్యామిలీ నుంచి మరో పొలిటికల్ ఎంట్రీ?
How Kohli’s Advice Changed PV Sindhu Career | సింధు విజయం వెనుక కోహ్లీ సీక్రెట్ సలహా
Sanju Samson vs Rohit Sharma | రోహిత్ కు సారీ చెప్పిన సంజూ శాంస‌న్
Telugu Serial Actor Debjani Modak Biography | ఎన్నెన్నో జన్మల బంధం' వేద అన్‌సీన్ లైఫ్
Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan On Panchadarla Land Issue: పంచదార్ల భూముల వివాదంపై పవన్ సంచలన నిర్ణయం- వైసీపీ పోరాటంతో దిగొచ్చిన ప్రభుత్వం
పంచదార్ల భూముల వివాదంపై పవన్ సంచలన నిర్ణయం- వైసీపీ పోరాటంతో దిగొచ్చిన ప్రభుత్వం
Tirumala Anjaneya Swamy Idol Stolen Case: తిరుమల విగ్రహం చోరీ కేసును 15 గంటల్లోనే ఛేదించిన పోలీసులు- ఒంగోలు రైల్వేస్టేషన్‌లో నిందితుడు అరెస్టు 
తిరుమల విగ్రహం చోరీ కేసును 15 గంటల్లోనే ఛేదించిన పోలీసులు- ఒంగోలు రైల్వేస్టేషన్‌లో నిందితుడు అరెస్టు 
Telangana Schools Bandh On Friday: తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
Bigg Boss 10: బిగ్‌బాస్ 10 కోసం మంచిర్యాల యువకుడి పాదయాత్ర! అవకాశం ఇవ్వాలని నాగార్జునకు రిక్వస్ట్‌!
బిగ్‌బాస్ కోసం మంచిర్యాల యువకుడి పాదయాత్ర! అవకాశం ఇవ్వాలని నాగార్జునకు రిక్వస్ట్‌!
Mee Bhoomi Blockchain Project:ఏపీలో భూములకు టెక్నాలజీ ఫెన్సింగ్‌!
ఏపీలో భూములకు టెక్నాలజీ ఫెన్సింగ్‌! "మీ భూమి–బ్లాక్‌ చెయిన్" ప్రాజెక్టు ప్రయోజనమేంటి?
Sonam Wangchuk Letter:సోనమ్‌ వాంగ్‌చుక్‌ కేంద్రానికి లేఖ! నిరాహార దీక్ విరమణకు షరతులు!
సోనమ్‌ వాంగ్‌చుక్‌ కేంద్రానికి లేఖ రాశారు! నిరాహార దీక్ విరమణకు షరతులు విధించారు!
Adilabad Latest News:
"ఆదిలాబాద్‌ సీసీఐ కర్మాగార పునరుద్ధరణకు రూ.250 కోట్లు కేటాయించలేరా?" రేవంత్ రెడ్డికి కేటీఆర్ లేఖ!
Rahul Gandhi: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..మోదీ క్షమాపణ చెప్పాలి - రాహుల్ గాంధీ డిమాండ్
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..మోదీ క్షమాపణ చెప్పాలి - రాహుల్ గాంధీ డిమాండ్
Embed widget