అన్వేషించండి

IPL Ban: టీమిండియా ప్లేయర్లు రూల్స్ పాటించాల్సిందే.. లేకపోతే ఐపీఎల్ నుంచి బ్యాన్..! బీసీసీఐ సంచలన నిర్ణయం!

ఆటగాళ్ల పట్ల కాస్త కఠినంగా వ్యవహరించాలని బీసీసీఐ నిర్ణయించింది. చూసి చూడనట్లుగా వదిలేసిన కొన్ని నిబంధనలను ఫిక్స్ చేసింది. వాటిని అతిక్రమించిన ప్లేయర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని తాజాగా వెల్లడించింది. 

BCCI Strict Guidelines: టీమిండియా ఆటగాళ్లను క్రమశిక్షణలో పెట్టేందుకు గాను బీసీసీఐ కొన్ని కఠిన నిబంధనలను రూపొందించింది. వాటిని దిక్కరిస్తే కఠినమైన చర్యలు తీసుకునేందుకు కూడా వెనుకాడబోనని స్పష్టంగా హెచ్చరించింది. తాము రూపొందించిన గైడ్ లైన్లను అతిక్రమిస్తే మ్యాచ్ ఫీజులో కోత విధించడంతోపాటు సస్పెండ్ చేయడం లేదా ఐపీఎల్ లాంటి బీసీసీఐ నిర్వహించే టోర్నీలలో పాల్గొనకుండా చేయాలని నిర్ణయించింది. గతేడాది సెకండ్ హాఫ్ నుంచి టీమిండియా టెస్టుల్లో ప్రదర్శన పేలవంగా ఉన్న సంగతి తెలిసిందే. సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో ఓడిపోవడంతోపాటు క్లీన్ స్వీప్ కు గురైంది. అలాగే ఆసీస్ టూర్లో 1-3తో సిరీస్ కోల్పోయి పదేళ్ల తర్వాత బోర్డర్-గావస్కర్ ట్రోఫీని కోల్పోయింది. దీంతో ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ రేసు నుంచి నిష్క్రమించింది. దీంతో బీసీసీఐ తాజాగా దిద్దుబాటు చర్యలకు దిగింది. 

అలాంటివి ఇకపై కుదరదు..
టీమిండియా ఆటగాళ్లకు ఇప్పటివరకు బోర్డు ఎన్నో వెసులుబాటులు కల్పించింది. ఇకపై నుంచి అలాంటి వాటికి చోటు ఉండదని ప్రకటించింది. ముఖ్యంగా సిరీస్ మధ్యలో వెళ్లిపోవడం, ప్రాక్టీస్ సెషన్ మొత్తం గడప కుండా ఉండటం వాటికి చెల్లుచీటీ పడింది. అలాగే దేశవాళీల్లో పాల్గొనడం కూడా తప్పనిసరి చేయనుంది. దీని ద్వారా యువ ఆటగాళ్లకు దిగ్గజాలతో కలిసి పనిచేసే అవకాశం దక్కుతుందని తెలుస్తోంది. మరోవైపు టూర్లలో తమ సహాయక సిబ్బందిని తెచ్చుకునే వెసులుబాటును కూడా ఉపసంహరించుకుంది. మేనేజర్, చెఫ్, సహాయకులు, భద్రతా సిబ్బంది  తదితర సౌకర్యాలను ఉపయోగించడానికి వీలు లేదని స్పష్టం చేసింది. జట్టులో అందరూ సమానంగా ఉండాల్సిందేనని, ఎవరికీ ఎలాంటి మినహాయింపులు ఉండబోవని తేల్చి చెప్పింది. అలాగే పర్యటనల్లో వ్యక్తిగత షూట్లు, ఎండార్స్ చేయకూడదని తెలిపింది. బీసీసీఐ రూపొందించే అన్ని షూట్లలోనూ ప్లేయర్లంతా పాల్గొనాల్సిందేనని కండీషన్లు పెట్టింది. ఇక ఆటపై ఎక్కువ ఫోకస్ పెట్టే విధంగా రానున్న రోజుల్లో మరిన్ని నిబంధనలు అమలు చేయనున్నట్లు బోర్డు వర్గాలు పేర్కొంటున్నాయి. 

టూర్లలో కూడా ఆంక్షలు..
తమ కుటుంబ సభ్యులను విదేశాలకు టూర్లతో సహా క్రికెటర్ల తీసుకెళుతుండేవారు. ఇకపై టూర్ మొత్తం కాకుండా నిర్ణీత సమయం వరకే అవకాశం లభించనుంది. అలాగే ఆటగాళ్లందరూ కలిసి ఉండాలని, స్పెషల్ సౌకర్యాలంటూ ఉండవంటూ తేల్చి చెప్పింది. ఇక ప్రయాణ సమయాల్లో కూడా వ్యక్తిగతంగా కాకుండా, అందరూ కలిసి ప్రయాణించాల్సిందేనని తేల్చింది. లగేజీ విషయంలో కూడా 150 కేజీల వరకే చెల్లింపులు చేస్తామని, అది దాటితే ప్లేయర్లే ఖర్చులు భరించాలని తేల్చింది.

ఇక పై నిబంధనల్లో అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే మినహాయింపులు ఉంటాయని, దానికి హెడ్ కోచ్, చీఫ్ సెలెక్టర్, కొన్నిసార్లు బోర్డు పెద్దల నుంచి అనుమతి తప్పనిసరిగా ఉండాల్సిందేనని పేర్కొంది. అలాగే వీటిని అతిక్రమించినట్లయితే క్రమ శిక్షణా చర్యలు కఠినంగా ఉండబోతున్నాయని వెల్లడించింది. ఏదేమైనా ఇప్పటికైనా ఆటగాళ్ల పట్ల బోర్డు కఠినంగా వ్యవహరించనుందని, అల్టిమేట్ గా ఇది ఆటకు మేలు జరిగేలా ఉండ బోతుందని పలువురు మాజీ అభివర్ణిస్తున్నారు. ఈ నిబంధనలు తీసుకురాబోయే మార్పులు సమీప భవిష్యత్తులో తెలియనున్నాయి. 

Also Read: BCCI Vs Gambhir: గంభీర్ కోచింగ్ స్టాఫ్‌పై బీసీసీఐ నజర్..! డేంజర్లో వారిద్దరూ.. త్వరలో బ్యాటింగ్ కోచ్ నియమించనున్న బోర్డు!!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Latest News: చార్మినార్‌ చంద్ర‌బాబు క‌ట్టారా? మా పెట్టుబడులు మోదీ ఎత్తుకెళ్తున్నారు- రేవంత్ సంచలన కామెంట్స్
చార్మినార్‌ చంద్ర‌బాబు క‌ట్టారా? మా పెట్టుబడులు మోదీ ఎత్తుకెళ్తున్నారు- రేవంత్ సంచలన కామెంట్స్
Free Bus Scheme in Andhra Pradesh :రాష్ట్రమంతటా కాదు జిల్లాల్లోనే ఫ్రీ- ఏపీ మహిళలకు షాక్- ఉచిత బస్ ప్రయాణం పథకంపై కీలక అప్‌డేట్ !
రాష్ట్రమంతటా కాదు జిల్లాల్లోనే ఫ్రీ- ఏపీ మహిళలకు షాక్- ఉచిత బస్ ప్రయాణం పథకంపై కీలక అప్‌డేట్ !
Telangana Latest News: వరంగల్‌లో లక్షల మందితో భారీ బహిరంగ సభ - కేసీఆర్ కీలక నిర్ణయం
వరంగల్‌లో లక్షల మందితో భారీ బహిరంగ సభ - కేసీఆర్ కీలక నిర్ణయం
AP Assembly: అప్పటి వరకు మీరు సభకు రావొద్దు ఇది నా రూలింగ్ - మంత్రి నిమ్మలపై రఘురామ సీరియస్ నిర్ణయం
అప్పటి వరకు మీరు సభకు రావొద్దు ఇది నా రూలింగ్ - మంత్రి నిమ్మలపై రఘురామ సీరియస్ నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Surya Kumar Yadav on Rohit Sharma Fitness | నాలుగేళ్లలో నాలుసార్లు ఐసీసీ ఈవెంట్స్ ఫైనల్ కి తీసుకువెళ్లాడు | ABP DesamMinister Atchannaidu Special Bike | కార్లు తిరగలేని చోట కూడా తిరగాలని అచ్చెన్న బైక్ ను ఇలా మార్చేశారు | ABP DesamSVSC Re Release Fans Craze | శ్రీకాంత్ అడ్డాల కల నిజమైంది..SVSC రీరిలీజ్ కు బ్రహ్మరథం | ABP DesamConsumer Forum on Water Bottles Case | మంచినీళ్లపై ఎక్స్ ట్రా ఛార్జ్..లక్షల్లో ఫైన్ వేసిన కన్జ్యూమర్స్ ఫోరం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Latest News: చార్మినార్‌ చంద్ర‌బాబు క‌ట్టారా? మా పెట్టుబడులు మోదీ ఎత్తుకెళ్తున్నారు- రేవంత్ సంచలన కామెంట్స్
చార్మినార్‌ చంద్ర‌బాబు క‌ట్టారా? మా పెట్టుబడులు మోదీ ఎత్తుకెళ్తున్నారు- రేవంత్ సంచలన కామెంట్స్
Free Bus Scheme in Andhra Pradesh :రాష్ట్రమంతటా కాదు జిల్లాల్లోనే ఫ్రీ- ఏపీ మహిళలకు షాక్- ఉచిత బస్ ప్రయాణం పథకంపై కీలక అప్‌డేట్ !
రాష్ట్రమంతటా కాదు జిల్లాల్లోనే ఫ్రీ- ఏపీ మహిళలకు షాక్- ఉచిత బస్ ప్రయాణం పథకంపై కీలక అప్‌డేట్ !
Telangana Latest News: వరంగల్‌లో లక్షల మందితో భారీ బహిరంగ సభ - కేసీఆర్ కీలక నిర్ణయం
వరంగల్‌లో లక్షల మందితో భారీ బహిరంగ సభ - కేసీఆర్ కీలక నిర్ణయం
AP Assembly: అప్పటి వరకు మీరు సభకు రావొద్దు ఇది నా రూలింగ్ - మంత్రి నిమ్మలపై రఘురామ సీరియస్ నిర్ణయం
అప్పటి వరకు మీరు సభకు రావొద్దు ఇది నా రూలింగ్ - మంత్రి నిమ్మలపై రఘురామ సీరియస్ నిర్ణయం
Karnataka:  సినీ పరిశ్రమకు చెప్పినట్లుగానే నట్లు బిగిస్తున్న కర్ణాటక ప్రభుత్వం  - మల్టీప్లెక్స్‌ల్లో అయినా సరే టిక్కెట్ రేటు రూ. 200 మాత్రమే !
సినీ పరిశ్రమకు చెప్పినట్లుగానే నట్లు బిగిస్తున్న కర్ణాటక ప్రభుత్వం - మల్టీప్లెక్స్‌ల్లో అయినా సరే టిక్కెట్ రేటు రూ. 200 మాత్రమే !
Consumer Forum on Water Bottles Case | మంచినీళ్లపై ఎక్స్ ట్రా ఛార్జ్..లక్షల్లో ఫైన్ వేసిన కన్జ్యూమర్స్ ఫోరం | ABP Desam
Consumer Forum on Water Bottles Case | మంచినీళ్లపై ఎక్స్ ట్రా ఛార్జ్..లక్షల్లో ఫైన్ వేసిన కన్జ్యూమర్స్ ఫోరం | ABP Desam
TGPSC: టీజీపీఎస్సీ పరీక్షల ఫలితాలు వచ్చేస్తున్నాయ్, గ్రూప్-1,2,3 రిజల్ట్స్ ఎప్పుడంటే?
టీజీపీఎస్సీ పరీక్షల ఫలితాలు వచ్చేస్తున్నాయ్, గ్రూప్-1,2,3 రిజల్ట్స్ ఎప్పుడంటే?
Tesla: ట్రంప్ దెబ్బకు పడిపోతున్న టెస్లా షేర్లు -ఎలాన్ మస్క్ ఒక్క నెలలో ఎన్ని లక్షల కోట్లు నష్టపోయారో తెలుసా ?
ట్రంప్ దెబ్బకు పడిపోతున్న టెస్లా షేర్లు -ఎలాన్ మస్క్ ఒక్క నెలలో ఎన్ని లక్షల కోట్లు నష్టపోయారో తెలుసా ?
Embed widget