![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
World Cup Tickets: వన్డే వరల్డ్ కప్ టికెట్లు ట్రై చేసినా దొరకలేదా - రెండో దశ టికెట్ల అమ్మకాలు ఎప్పుడంటే?
వన్డే వరల్డ్ కప్ 2023 రెండో దశ టికెట్లను సెప్టెంబర్ 8వ తేదీ నుంచి విక్రయించనున్నట్లు బీసీసీఐ తెలిపింది.
![World Cup Tickets: వన్డే వరల్డ్ కప్ టికెట్లు ట్రై చేసినా దొరకలేదా - రెండో దశ టికెట్ల అమ్మకాలు ఎప్పుడంటే? BCCI Announced Second Phase Of ICC World Cup 2023 Tickets To Start From September 8th World Cup Tickets: వన్డే వరల్డ్ కప్ టికెట్లు ట్రై చేసినా దొరకలేదా - రెండో దశ టికెట్ల అమ్మకాలు ఎప్పుడంటే?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/06/4eef32988bdcdc0d6b02842d8ed6d75d1693977799108786_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
World Cup Online Tickets: క్రికెట్ అభిమానులకు శుభవార్త. రాబోయే ప్రపంచ కప్ 2023 మ్యాచ్లకు సంబంధించి తదుపరి దశలో మరో నాలుగు లక్షల టిక్కెట్లను విక్రయించనుంది. క్రికెట్ అభిమానులు ఆన్లైన్లో టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. బీసీసీఐ దీనికి సంబంధించి ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. వరల్డ్కప్ టిక్కెట్లకు చాలా డిమాండ్ ఉందని ఇందులో పేర్కొన్నారు. దీని కోసం సుమారు నాలుగు లక్షల టిక్కెట్లను అందుబాటులో ఉంచాలని నిర్ణయించుకున్నామని తెలిపారు.
బీసీసీఐ టికెట్ల సంఖ్యను ఎందుకు పెంచింది?
స్టేట్స్ అసోసియేషన్, సంబంధిత వ్యక్తులను సంప్రదించిన తర్వాత తాము టిక్కెట్ల సంఖ్యను పెంచాలని నిర్ణయించుకున్నామని బీసీసీఐ తెలిపింది. ఈ కారణంగా తదుపరి దశలో ఆన్లైన్లో సుమారు నాలుగు లక్షల టిక్కెట్లను విక్రయించబోతున్నామని పేర్కొన్నారు.
వీలైనంత ఎక్కువ మంది క్రికెట్ అభిమానులు ప్రపంచకప్ మ్యాచ్లను వీక్షించేందుకు మైదానానికి చేరుకునేలా చేయడమే తమ ప్రయత్నం అని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఈ టిక్కెట్ల ఆన్లైన్ బుకింగ్ సెప్టెంబర్ 8వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.
ప్రపంచకప్ మ్యాచ్లకు ఆన్లైన్లో టిక్కెట్లను బుక్ చేసుకోవడం ఎలా?
క్రికెట్ అభిమానులు బుక్మైషో ద్వారా ఆన్లైన్లో టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. ఈ టిక్కెట్లు సెప్టెంబర్ 8వ తేదీ రాత్రి ఎనిమిది గంటల నుండి అందుబాటులో ఉంటాయి. ఇది రెండో దశ టిక్కెట్ బుకింగ్. దీని తర్వాత మూడో దశకు టికెట్ బుకింగ్ ఉంటే దాన్ని కూడా త్వరలో తెలియజేస్తారు.
అక్టోబర్ 5వ తేదీ నుంచి ప్రపంచకప్ ప్రారంభం కానుంది. ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్తో భారత జట్టు తన ప్రస్థానాన్ని ప్రారంభించనుంది. అక్టోబరు 8వ తేదీన చెన్నైలో భారత్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ టోర్నీ ఫైనల్ మ్యాచ్ నవంబర్ 19వ తేదీన అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)