అన్వేషించండి

Simhachalam Temple: తిరుమల ఎఫెక్ట్..సింహాచలంలో వెనక్కు తగ్గిన భక్తులు..సాఫీగా సాగిన వైకుంఠ ద్వార దర్శనాలు!

Tirupati Stampede Effect: తిరుమల వైకుంఠ ద్వార దర్శనాల టోకెన్ల తొక్కిసలాట ఎఫెక్టా? చలిగాలల తీవ్రతా? సింహాచలంలో వైకుంఠ ఏకాదశి క్యూలైన్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయ్..

Varaha Lakshmi Narasimha temple Simhachalam

భక్తుల్లో నిజంగా ఇంత మార్పొచ్చిందా? 

తిరుమల ఘటన భయపెట్టిందా?

వాతావరణం వణికించిందా?

కారణాలు ఏమైనా కానీ సింహాచల క్షేత్రంలో ఉత్తరద్వార దర్శనాల క్యూ లైన్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయ్. 

కళ తప్పిన విశాఖ సింహాచల క్షేత్ర ఉత్తర ద్వార దర్శనాలు, వెలవెలబోతున్న క్యూలైన్లు అని అంటున్నారు కానీ.. వాస్తవానికి భక్తులు ప్రశాంతంగా ఉత్తర ద్వార దర్శనాలు చేసుకున్నారని అనుకోవాలేమో. 

ఇది నిజంగా మంచి పరిణామమే. ఎందుకంటే తిరుమలలో జరిగిన తొక్కిసలాట ఘటన చూసిన తర్వాత... పెద్ద పెద్ద క్షేత్రాలకు వెళ్లి భారీ రద్దీలో తోసుకుంటూ, జరగండి జరగండి అనే అరుపుల మధ్య భగవంతుడిని ప్రశాంతంగా చూసే అవకాశం లేనప్పుడు ఇంటికి సమీపంలో ఉన్న ఆలయాల్లో దర్శించుకోవడం మంచిదని కూడా అనుకుని ఉండొచ్చు. 

Also Read: వైకుంఠ ద్వార దర్శనం కోసం ప్రాణాల మీదకు తెచ్చుకోవాలా..ఇది నిజంగా భక్తేనా..?

మరోవైపు చలి విపరీతంగా పెరిగింది. తెల్లవారుజామునే దర్శనాలకు వెళితే చలి..ఆ తర్వాత వెళదాం అంటే రద్దీ..అందుకే భక్తులు ప్రశాంతంగా ఇంటికి సమీపంలో ఉండే ఆలయాల్లో ఉత్తరద్వార దర్శనాలు చేసుకుని ఉండొచ్చు. సింహాచలంలో భక్తుల రద్దీ తగ్గేందుకు ఇదీ ఓ కారణం అయి ఉండొచ్చు..
 
గతంలో వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనాలు అంటే భారీగా భక్తులు పోటెత్తేవారు. అందుకే దేవస్థానం అధికారులు కూడా ముందస్తు ఏర్పాట్లు చేశారు.  సింహాచలం వరాహ లక్ష్మీనృసింహస్వామి ఉత్తర ద్వార దర్శన ఏర్పాట్లను ముందుగానే పరిశీలించారు అధికారులు.  స్వామి దర్శనానికి వచ్చే భక్తులు సంయమనంతో ఉండాలని..అప్పుడే ప్రశాంతంగా దర్శనం జరుగుతుందని చెప్పారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా అంతరాలయ దర్శనాలు, రాజగోపుర ప్రవేశ దర్శనాలను పూర్తిగా నిలిపేశామని  దేవస్థానం ఈవో శ్రీనివాసమూర్తి చెప్పారు. భక్తులంతా టికెట్ తీసుకుని దర్శనాలకు రావాలని ఉచిత పాస్ లు జారీ చేయలేమని స్పష్టం చేశారు. 

Also Read: భోగ భాగ్యాలనిచ్చే భోగి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి!

ముక్కోటి ఏకాదశి  శుక్రవారం తెల్లవారుజామున ఒంటి గంటకు సుప్రభాత సేవ ఆ తర్వాత ప్రభాత ఆరాధనలు నిర్వహించారు. 3 గంటలకు స్వామివారి సేవ, మేలి ముసుగులతో బేడా తిరువీధి నిర్వహించారు. 4.15 గంటలకు ఉత్తర ద్వారంలో ప్రత్యేక పూజలు చేసి ముందుగా అనువంశిక ధర్మకర్త, వారి కుటుంబ సభ్యులకు తొలిదర్శనం కల్పించారు. 5  నుంచి 11.30  వరకు ఉత్తర రాజగోపురంలో ఉన్న పుష్పవేదిక పై  వైకుంఠవాసుడి అలంకారంలో స్వామి దర్శనం కల్పించారు. 12 గంటల నుంచి మాడవీధుల్లో తిరువీధి ఉత్సవం నిర్వహించి.. మధ్యాహ్నం 2 గంటలకు మహా నివేదన చేశారు. మధ్యాహ్నంన 2 నుంచి 4 గంటలవరకూ మహానివేదన సందర్భంగా దర్శనాలకు భక్తులను అనుమతించలేదు. తిరిగి 4 గంటల నుంచి సాయంత్రం 6 వరకూ భక్తులు స్వామివారిని దర్శించుకోవచ్చు. రాత్రి 7 గంటలకు ఆరాధన సందర్భంగా భక్తులకు దర్శనాలు నిలిపేస్తారు. ప్రత్యేక ఉత్సవాల సందర్భంగా వైకుంఠ ఏకాదశి రోజు ఆర్జితసేవలన్నీ రద్దు చేశారు. కేవలం అనువంశిక ధర్మకర్త, ఆయన కుటుంబ సభ్యులకు మినహా ఇంకెవరీకీ అంతరాలయ ప్రవేశం ఉండదు. శుక్రవారం తెల్లవారుజామున  3 గంటల నుంచి  500 రూపాయల ఉత్సవ ప్రత్యేక దర్శన టికెట్లు విక్రయించారు. ఇక భక్తుల కోసం లక్ష లడ్డూ సిద్ధం చేశారు. అన్న ప్రసాద వితరణ కొనసాగుతోంది. వైకుంఠ ఉత్సవాన్ని పురస్కరించుకుని ఉత్తర రాజగోపురంతో పాటూ ఆలయాన్ని పూలతో అందంగా అలంకరించారు.

కారణాలు ఏమైనా కానీ భక్తుల రద్దీ తగ్గడం అంటే భక్తి తగ్గిందని కాదు.. భక్తుల్లో అవగాహన పెరుగుతోంది, ప్రాణాలను హరించే రద్దీలో కాకుండా ప్రశాంతంగా దర్శనం చేసుకునేందుకే ఆసక్తి చూపిస్తున్నారని అనుకోవాలేమో. ఈ ప్రభావంతోనే గతంలో కిక్కిరిసి కనిపించే క్యూలైన్లు ఈ ఏడాది ఖాళీగా కనిపించాయ్.. 

Also Read: 600 కోట్ల ఖర్చు.. 7జన్మలకు గుర్తుగా 7ద్వారాలు.. మిల్లు కార్మికుడి కొడుకు కట్టిన అద్భుతమైన స్వర్ణ దేవాలయం!

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Chaitra Purnima 2026: చైత్ర పౌర్ణమి ఎప్పుడు? ఈ రోజు ఉపవాసం, దానధర్మాల ప్రాముఖ్యత  తెలుసుకోండి.
చైత్ర పౌర్ణమి 2026: చైత్ర పౌర్ణమి ఎప్పుడు? ఈ రోజు ఉపవాసం, దానధర్మాల ప్రాముఖ్యత  తెలుసుకోండి.
Mahakaleshwar Temple: భస్మ హారతి నుంచి దర్శనం వరకు ఉజ్జయినిలో 2-3 రోజులు ఎలా ప్లాన్ చేసుకోవాలి? దర్శనం ఎలా, ఎప్పుడు, పూర్తి గైడ్!
భస్మ హారతి నుంచి దర్శనం వరకు ఉజ్జయినిలో 2-3 రోజులు ఎలా ప్లాన్ చేసుకోవాలి? దర్శనం ఎలా, ఎప్పుడు, పూర్తి గైడ్!
2026 మార్చి 29 రాశిఫలాలు: మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారికి ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ ఫలితాలు!
2026 మార్చి 29 రాశిఫలాలు: మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారికి ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ ఫలితాలు!
Marriage Muhurat 2026: ఏప్రిల్-మే నెలల్లో పెళ్లి ముహూర్తాలు ఇవే! సరైన తేదీలు , సమయం తెలుసుకోండి!
2026 ఏప్రిల్-మే నెలల్లో పెళ్లి ముహూర్తాలు ఇవే! సరైన తేదీలు సమయం తెలుసుకోండి!

వీడియోలు

IPL 2026 Opening Ceremony | ఆర్సీబీ, సన్ రైజర్స్ మ్యాచ్ కి ముందు ఎలాంటి హంగామా ఉండదు | ABP Desam
MS Dhoni Injury CSK IPL 2026 Update | మొదటి మ్యాచ్ కి ముందే తలా అభిమానులకు భారీ షాక్ | ABP Desam
RCB vs SRH Match Preview IPL 2026 | నేటి నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 19వ సీజన్ | ABP Desam
Vaibhav Sooryavanshi Turned 15 IPL 2026 | బీసీసీఐ నిబంధనలకు అర్హుడయ్యాడు...సీనియర్స్ టీమ్ లో చోటే తరువాయి | ABP Desam
Surya Tilak in Ayodhya on Ram Navami | అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Airports in AP and Telangana: ఉడాన్‌ 2.0తో తెలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్.. ఆదిలాబాద్, నాగార్జునసాగర్‌లలో ఎయిర్‌పోర్టులు
తెలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్.. ఆదిలాబాద్, నాగార్జునసాగర్‌లలో ఎయిర్‌పోర్టులు!
Summer Special Trains: సికింద్రాబాద్ -శ్రీ కాకుళం మధ్య సమ్మర్ స్పెషల్ ట్రైన్స్.. తేదీలు,టైమింగ్స్ ఇవే
సికింద్రాబాద్ -శ్రీ కాకుళం మధ్య సమ్మర్ స్పెషల్ ట్రైన్స్.. తేదీలు,టైమింగ్స్ ఇవే
IPL 2026: అయ్యగారు…అదరగొట్టారు…  కౌంట్‌డౌన్ మొదలుపెట్టిన కోహ్లీ.. ఇక రికార్డుల మోతే.. 
అయ్యగారు…అదరగొట్టారు…  కౌంట్‌డౌన్ మొదలుపెట్టిన కోహ్లీ.. ఇక రికార్డుల మోతే.. 
Samuthirakani: క్రెడిట్ కార్డ్స్, ఈఎంఐలు, మిడిల్ క్లాస్ కష్టాలే మెయిన్ పాయింట్... సముద్రఖని ఏం చెప్పారంటే?
క్రెడిట్ కార్డ్స్, ఈఎంఐలు, మిడిల్ క్లాస్ కష్టాలే మెయిన్ పాయింట్... సముద్రఖని ఏం చెప్పారంటే?
Food Poisoning: శ్రీరామనవమి వేడుకలో ఫుడ్ పాయిజన్.. 50 మందికి అస్వస్థత- ఎన్టీఆర్ జిల్లాలో ఘటన
శ్రీరామనవమి వేడుకలో ఫుడ్ పాయిజన్.. 50 మందికి అస్వస్థత- ఎన్టీఆర్ జిల్లాలో ఘటన
CM Revanth Reddy Assembly: అక్రమ మైనింగ్ లో ఎవరున్నా వదిలి పెట్టం - కీలక నేతల కంపెనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
అక్రమ మైనింగ్ లో ఎవరున్నా వదిలి పెట్టం - కీలక నేతల కంపెనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
Khammam Devarapalli Greenfield Highway: ఖమ్మం -దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే రెడీ! హైదరాబాద్ -వైజాగ్ మధ్య 56 km తగ్గనున్న దూరం
ఖమ్మం -దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే రెడీ! హైదరాబాద్ -వైజాగ్ మధ్య 56 km తగ్గనున్న దూరం
War Crimes: ఇరాన్‌పై దాడి ద్వారా అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ నేరానికి పాల్పడ్డాయా? అందుకు శిక్ష తప్పదా ?
ఇరాన్‌పై దాడి ద్వారా అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ నేరానికి పాల్పడ్డాయా? అందుకు శిక్ష తప్పదా ?
Embed widget