అన్వేషించండి

Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్... త్వరలో సర్వదర్శనం ఆఫ్ లైన్ టికెట్లు...!

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. భక్తులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఆఫ్ లైన్ టికెట్లను వచ్చే నెల 15 తర్వాత జారీ చేసే ఆలోచన చేస్తుంది.

తిరుమల శ్రీవారి దర్శనానికి ప్రతి నిత్యం లక్షల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఇలా తిరుమలకు వచ్చిన భక్తులకు వివిధ రూపాల్లో టీటీడీ స్వామి వారి దర్శనం కల్పిస్తుంది. అయితే సర్వదర్శనం, దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం, వీఐపీ బ్రేక్ దర్శనం, శ్రీవాణి ట్రస్టు, ఆర్జిత సేవల ద్వారా స్వామి వారిని భక్తులు దర్శించుకుంటారు. కరోనా‌ మహమ్మారి విజృంభించ ముందు వరకు ఇలా ఉండేంది. కోవిడ్ తరువాత తిరుమలలో పరిస్థితులు మారిపోయాయి. పరిమిత సంఖ్యలోనే భక్తులను స్వామి వారి దర్శనానికి అనుమతిస్తోంది టీటీడీ. పరిమిత సంఖ్యలో ఆన్లైన్ లో విడుదల చేసిన ప్రత్యేక ప్రవేశ దర్శనం, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారుల సిపార్సు లేఖలు, శ్రీవాణి ట్రస్టు, వర్చువల్ ఆర్జిత సేవ టిక్కెట్లు కలిగిన భక్తులను అనుమతిస్తోంది. కోవిడ్ మహమ్మారి కారణంగా సర్వదర్శనాన్ని టీటీడీ‌ గత ఏడాది సెప్టెంబరు 25వ తేదీ‌ నుంచి పూర్తిగా నిలిపి వేసింది. తిరుమలకు చేరుకుని అఖిలాండం వద్ద నుంచి స్వామి వారిని ప్రార్ధించాలనే ఉద్దేశంతో కొందరు భక్తులు తిరుపతికి చేరుకుంటున్నారు. ఇలా తిరుపతికి చేరుకున్న భక్తులు అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద విజిలెన్స్ సిబ్బంది నిలిపి వేస్తుంది. అయితే టీటీడీ ఈవో, టీటీడీ ఛైర్మన్ కు ఫోన్ ద్వారా విన్నతి పత్రాల రూపంలో భారీగా సామాన్య భక్తులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆఫ్ లైన్ ద్వారా సర్వదర్శనాన్ని పునః ప్రారంభించాలని టీటీడీ నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఇటీవల్ల టీటీడీ పాలకమండలి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సామాన్య భక్తులకు దర్శనభాగ్యం కలిగేలా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.

ఫిబ్రవరి 15 తర్వాత ఆఫ్ లైన్ టికెట్లు...!

ఈ నెల 29వ తేదీన సామాన్య భక్తుల‌ కోసం ఆన్లైన్ లో సర్వదర్శనం టోకెన్లను రోజుకు ఐదు వేల చొప్పున ఫిబ్రవరి 15వ తేదీ వరకూ జారీ చేయనుంది. కోవిడ్ వ్యాప్తి కారణంగా తిరుపతిలో ఆఫ్ లైన్ ద్వారా సర్వ దర్శనం టోకెన్లు జారీ విధానాన్ని గత ఏడాది సెప్టెంబర్ 25వ తేదీ నుంచి రద్దు చేసింది టీటీడీ. ప్రస్తుతం ఆన్లైన్లో సర్వ దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నప్పటికీ అవి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న సామాన్య భక్తులకు అందడం లేదన్నది భక్తుల ఆవేదన. ఈ క్రమంలో సామాన్య భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా తిరుపతిలో ఆఫ్లైన్ విధానంలో సర్వ దర్శనం టోకెన్లు జారీ చేయాలని అనేకసార్లు భావించిన కోవిడ్ తీవ్రత కారణంగా వాయిదా వేస్తూ వచ్చింది. అయితే ఫిబ్రవరి 15వ తేదీ నాటికి ఒమిక్రాన్ తీవ్రత తగ్గుముఖం పడుతుందని నిపుణులు చెప్తున్న కారణంగా ప్రస్తుతం ఆన్లైన్లో ఫిబ్రవరి 15వ తేదీ వరకు రేపు ఉదయం 9 గంటలకు సర్వ దర్శనం టోకెన్ లను జారీ చేయనుంది టీటీడీ. అటు తర్వాత ఫిబ్రవరి 15వ తేదీ వరకు కోవిడ్ వ్యాప్తి పరిస్థితిని అంచనా వేసి సర్వదర్శనం టోకెన్లను సామాన్య భక్తులకు సులభతరంగా అందేలా ఆఫ్లైన్ విధానంలో జారీ చేసేందుకు నిర్ణయం తీసుకుంటామని టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి ప్రకటించారు. అయితే ఆఫ్ లైన్ ద్వారా అందిస్తున్న సర్వదర్శనం టోకెన్లు చిత్తూరు జిల్లా వాసులకే పరిమితం చేయాలా లేక ఏపీ ప్రజలకు మాత్రమే టికెట్లను పరిమితం చేయాలా అనే అంశంపై టీటీడీ చర్చించి నిర్ణయం తీసుకోనుంది. 

టాప్ హెడ్ లైన్స్

బిడ్డ పుట్టకముందే వస్తువులు కొనొద్దు: మూఢనమ్మకమా, ఆరోగ్య జాగ్రత్తా?
బిడ్డ పుట్టకముందే వస్తువులు కొనొద్దు: మూఢనమ్మకమా, ఆరోగ్య జాగ్రత్తా?
కర్కాటక రాశి జాతకం జూలై నుంచి డిసెంబర్ 2026 వరకు! ఇల్లు, ఉద్యోగం, డబ్బు విషయంలో ప్రధాన మార్పుల సమయం!
కర్కాటక రాశి జాతకం జూలై నుంచి డిసెంబర్ 2026 వరకు! ఇల్లు, ఉద్యోగం, డబ్బు విషయంలో ప్రధాన మార్పుల సమయం!
ప్రకృతి ఒడిలో కొలువైన ఈ ఆలయాలు వర్షాకాలంలో స్వర్గంలా ఉంటాయ్! శ్రావణ మాసంలో తప్పకుండా సందర్శించాలి!
ప్రకృతి ఒడిలో కొలువైన ఈ ఆలయాలు వర్షాకాలంలో స్వర్గంలా ఉంటాయ్! శ్రావణ మాసంలో తప్పకుండా సందర్శించాలి!
మీ వేళ్లపై నల్లటి మచ్చలు: సాముద్రిక శాస్త్రం చెప్పే ప్రమాద హెచ్చరికలు!
మీ వేళ్లపై నల్లటి మచ్చలు: సాముద్రిక శాస్త్రం చెప్పే ప్రమాద హెచ్చరికలు!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: సొంత ఖర్చులతోనే పవన్ కల్యాణ్ సర్జరీలు! డిప్యూటీ సీఎం ఆఫీస్ కీలక ప్రకటన!
సొంత ఖర్చులతోనే పవన్ కల్యాణ్ సర్జరీలు! డిప్యూటీ సీఎం ఆఫీస్ కీలక ప్రకటన!
Mudragada Padmanabham Funeral:ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో వివాదం! కుమార్తె రాకను అడ్డుకున్న కుటుంబం! కిర్లంపూడిలో ఉద్రిక్తత!
ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో వివాదం! కుమార్తె రాకను అడ్డుకున్న కుటుంబం! కిర్లంపూడిలో ఉద్రిక్తత!
Varanasi Update : స్లో మోషన్స్ జంప్స్ చేశా - 14 నెలలుగా వారణాసి షూటింగ్‌లోనే... విజువల్ వండర్‌పై మందాకిని రియాక్షన్
స్లో మోషన్స్ జంప్స్ చేశా - 14 నెలలుగా వారణాసి షూటింగ్‌లోనే... విజువల్ వండర్‌పై మందాకిని రియాక్షన్
Pallichattambi OTT : పళ్లిచట్టంబి ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
పళ్లిచట్టంబి ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
2027 ODI World Cup Plan: వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ కు బీసీసీఐ రోడ్ మ్యాప్ సిద్ధం.. తొలి వ‌న్డే ముగిశాక దీనిపై గిల్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు.. కోహ్లీ, రోహిత్ స్థానాలపై..
వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ కు బీసీసీఐ రోడ్ మ్యాప్ సిద్ధం.. తొలి వ‌న్డే ముగిశాక దీనిపై గిల్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు.. కోహ్లీ, రోహిత్ స్థానాలపై..
Posani Krishna Murali : మీరు మారిపోయారు సార్ - అరెస్ట్ చేస్తారని భయమా రాజా?
మీరు మారిపోయారు సార్ - అరెస్ట్ చేస్తారని భయమా రాజా?
HYDRAA Demolitions: హైడ్రా టార్గెట్ చేస్తున్న ప్రాజెక్టులన్నీ కేటీఆర్ సన్నిహితులవేనా ? - తెలంగాణ రాజకీయాల్లో తెర వెనుక ఏం జరుగుతోంది?
హైడ్రా టార్గెట్ చేస్తున్న ప్రాజెక్టులన్నీ కేటీఆర్ సన్నిహితులవేనా ? - తెలంగాణ రాజకీయాల్లో తెర వెనుక ఏం జరుగుతోంది?
Eesha OTT : మరో ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 నెలల తర్వాత స్ట్రీమింగ్... స్పెషల్ ఏంటో తెలుసా?
మరో ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 నెలల తర్వాత స్ట్రీమింగ్... స్పెషల్ ఏంటో తెలుసా?
Embed widget