అన్వేషించండి

Thrissur Pooram 2022: ఆధ్యాత్మిక సౌరభం-భక్తిభావం పెంచే సంప్రదాయం, కన్నుల పండువగా పూరమ్ వేడుకలు

అదో మహోత్సవం, భక్తిభావాన్ని పెంపొందించే సంప్రదాయం, చెక్కుచెదరని సాంస్కృతిక చిహ్నం. అదే కేరళలో ప్రఖ్యాతి గాంచిన త్రిసూర్ పూరం. కరోనా కారణంగా రెండేళ్ల అంతరాయం తర్వాత ఈ ఏడాది కన్నుల పండువగా సాగుతోంది

కేరళ రాష్ట్రంలో ఏటా నిర్వహించే అతి పెద్ద పండుగ తిసూర్ పూరం. లాక్ డౌన్ కారణంగా రెండేళ్ళ నుంచి ఈ ఉత్సవం జరగలేదు. ఈ ఏడాది కరోనా కేసులు తగ్గడంతో త్రిసూర్ పూరం ఉత్సవం వైభవోపేతంగా జరుగుతోంది.

త్రిసూర్ పూరం 18వ శతాబ్ధపు కొచ్చి రాజు శక్తి తంపురాన్ ప్రారంభించిన వార్షిక పండుగగా చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. 36 గంటలపాటు తెక్కింకాడు మైదానంలో కన్నుల పండుగా నిర్వహిస్తారు. త్రిసూర్ పూరం అనేది కేరళ వ్యాప్తంగా ఉన్న 10 ఆలయాలకు చెందిన దేవతల సమావేశం గురించింది. కానీ ఇప్పుడు తిరువాంబడి, పరమెక్కావు ఆలయాలు మాత్రమే ప్రధాన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. 

అద్భుతంగా అలంకరించినన ఏనుగులు, వీనుల విందైన సంగీతం, ఉత్సాహభరితమైన పెద్ద పెద్ద గొడుగుల ప్రదర్శన, బాణాసంచా ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. ఏడాదంతా ఎక్కడున్నా ఈ త్రిసూర్ పూరం ఉత్సవానికి మాత్రం కేరళ చేరుకుంటారు. వేద పండితుల మంత్రోచ్ఛారణలు, వేలాది భక్తుల హర్షధ్వానాల మధ్య శివకుమార్ అనే ఏనుగు ఆలయ దక్షిణ ద్వారాన్ని తెరవడంతో.. ఆ తర్వాత నీతిలక్కవిళమ్మ విగ్రహాన్ని ఏనుగుపై ఊరేగించడంతో ఆదివారం ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది. దీనిని పూర విలంబరం అంటారు.కరోనా వల్ల మొదటిసారి ఉత్సవం రద్దయింది. ఇండో-చైనా యుద్ధం జరిగిన 1962లో కూడా ఈ ఉత్సవం నిరాటంకంగా నిర్వహించారంటే ఈ ఉత్సవానికి వున్న ప్రాధాన్యతను మనం అర్థం చేసుకోవచ్చు.

Also Read: యమలోకంలో ఎంట్రీ ఉండకూడదంటే ఈ దానాలు చేయమన్న గరుడపురాణం

త్రిసూర్‌ పూరం వేడుక ఆవిర్భావమే ఆసక్తికరం
ఒకప్పుడు త్రిసూర్‌ జాల్లాలోని ఆలయాలన్నీ ఆరట్టుపుళ పూరంలో పాల్గొనేవి. ఓ ఏడాది భారీ వర్షాలు కురిశాయి. ఈ కారణంగా శ్రీవడక్కునాథన్‌ ఆలయ సిబ్బంది సమయానికి ఆరట్టుపుళకు చేరుకోలేకపోయింది. కారణమేంటో తెలుసుకోకుండా త్రిసూర్‌కు చెందిన బృందాన్ని వేడుకల నుంచి బహిష్కరించారు. దీన్ని అవమానంగా భావించారు వడక్కునాథన్‌ ఆలయ అధికారులు. అప్పుడే తమ ఆలయానికి ప్రత్యేకంగా పూరం జరుపుకోవాలని తీర్మానించుకున్నారు. అయితే వీరితో మిగతా ఆలయాల అధికారులు కలిసిరాలేదు.. దాంతో ఈ పూరం ఎక్కవకాలం నిలువలేకపోయింది. 18వ శతాబ్దం ఆరంభంలో కొచ్చిన్‌ రాజవంశానికి చెందిన శ్రీరామవర్మ పాలన ప్రారంభమయ్యింది.త్రిసూర్‌ పూరం గురించి తెలుసుకున్న ఆయన తిరిగి ఆ పండుగను నిర్వహించడానికి పూనుకున్నారు. అలా త్రిసూర్‌పూరం పున:ప్రారంభమయ్యింది. రెండు వందల సంవత్సరాలుగా నిరాటంకంగా కొనసాగుతోంది. 

పదిహేను రోజుల ముందునుంచే ఏర్పాట్లు మొదలవుతాయి. కేరళలో పేరొందిన కళాకారులంతా త్రిసూర్‌కు వస్తారు. పంచవాద్య, చెండామేళం కళాకారుల బృందాలు సాధనలో నిమగ్నమవుతాయి. ఏటా జరిగే ఉత్సవమే అయినా ఏటికేడు రెట్టించిన ఉత్సాహం, అనిర్వచనీయమైన ఆనందం.. అదే త్రిసూర్‌ పూరం ప్రత్యేకం.పూరం అంటే పర్వం కాదు. పూరం అంటే సమ్మేళనం, సంపూర్ణం. అందరూ కలిసి చేసుకునే అపురూప సంబరం. పూరం అంటే సమూహమని అర్థం. చుట్టుపక్కల గ్రామాల ప్రజలంతా స్థానికులతో కలిసి సమూహంగా ఏర్పడి ఏడాదికోసారి పరమేశ్వరుడిని సేవించుకోవడమే పూరం అర్థం.

Also Read:  విలువైన వస్తువులు, పత్రాలు పోగొట్టుకుంటే ఈ అమ్మవారిని ప్రార్థిస్తే దొరుకుతాయట

టాప్ హెడ్ లైన్స్

Varahi Navaratri Dates2026: వారాహి నవరాత్రుల పూజా విధానం, విశిష్టత, ప్రయోజనాలు తెలుసుకోండి
వారాహి నవరాత్రులు 2026 తేదీలు, పూజా విధానం, విశిష్టత, ప్రయోజనాలు తెలుసుకోండి
Unique Traditions: ఈ గ్రామంలో మహిళలు దుస్తులు ధరించరు, శతాబ్దాలుగా అనుసరిస్తున్న 'నిర్వస్త్ర వ్రతం' వెనుక వింత ఆచారం
ఈ గ్రామంలో మహిళలు దుస్తులు ధరించరు, శతాబ్దాలుగా అనుసరిస్తున్న 'నిర్వస్త్ర వ్రతం' వెనుక వింత ఆచారం
Dakshinayanam 2026: ఏడాదికి 2 రోజులు మాత్రమే సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు! ఇది అర్థం కావాలంటే దక్షిణాయనం, ఉత్తరాయణం గురించి తెలుసుకోవాలి!
ఏడాదికి 2 రోజులు మాత్రమే సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు! ఇది అర్థం కావాలంటే దక్షిణాయనం, ఉత్తరాయణం గురించి తెలుసుకోవాలి!
నవగ్రహాలు: శివాలయాల్లో ఎందుకు, విష్ణు ఆలయాల్లో ఎందుకుండవు? జ్యోతిష్య రహస్యం!
నవగ్రహాలు: శివాలయాల్లో ఎందుకు, విష్ణు ఆలయాల్లో ఎందుకుండవు? జ్యోతిష్య రహస్యం!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
RBI Plastic Currency: ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
Embed widget