అన్వేషించండి

Spirituality: ఆంధ్రప్రదేశ్ లో సప్త శ్రీనివాసక్షేత్రాలివే - తిరుమల తర్వాత అంతగా ప్రసిద్ధి చెందిన ఆలయాలు!

Spirituality: ఈ భూమి మీద మొత్తం 108 తిరుపతులు ఉన్నాయి. ఇవన్నీ దర్శించుకున్నారంటే అదంతా పూర్వజన్మసుకృతమే. అన్నీ దర్శించుకోలేకపోయినా ఈ 7 స్వయంభు క్షేత్రాలను చూసొచ్చినా అదే ఫలితం దక్కుతుందంటారు...

Swayam Vyakta Kshetras of Lord Sri venkateswara:   కలియుగంలో ఏ స్వామిని దర్శించుకుంటే బాధలు మటుమాయం అవుతాయో...ఏ స్వామిరూపం చూస్తే సమస్యలు తొలగి మనశ్సాంతి లభిస్తుందో... ఏ స్వామి దర్శనంతో జన్మధన్యం అవుతుందని భావిస్తారో ...ఈ రూపాన్ని పూజిస్తే ఆయురారోగ్యఐశ్వర్యాలకు లోటుండదో ఆయనే శ్రీ వేంకటేశ్వరుడు. కలియుగప్రత్యక్షదైవంగా పూజలందుకుంటున్న వేంకటేశ్వరస్వామి స్వామి తిరుమలలో కొలువైఉన్నాడు. నిత్యకళ్యాణం పచ్చతోరణంగా వెలిగే ఈ క్షేత్రం తర్వాత  వేంకటేశుడికి సంబంధించి 7 స్వయంభు క్షేత్రాలున్నాయి...వీటినే సప్త శ్రీనివాస క్షేత్రాలు అంటారు. ఇన్నీ ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నాయి...

వేంకటేశ్వర స్వామి వాడపల్లి (కోనసీమ జిల్లా ఆంధ్రప్రదేశ్)

వందల ఏళ్లక్రితం నాసిక్ ప్రాంతంలో నారద మహర్షి..ఎర్రచందనరూపుడైన వేంకటేశ్వరస్వామికి పూజించి ఆ రూపాన్ని ఓ పెట్టెలో పెట్టి గోదావరిలో నిమజ్జనం చేశారట. వందలకిలోమీటర్లు కొట్టుకువచ్చిన ఆ ప్రతిమ కోనసీమ జిల్లా వాడపల్లికి చేరింది. ఓబ్రాహ్మణుడి కలలో స్వామివారు కనిపించి చెప్పడంతో...రెండు రోజుల పాటూ వెతికి ఆ విగ్రహాన్ని గుర్తించి ఆ తర్వాత ప్రతిష్టించారు. వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి ఆలయం చుట్టూ ఏడు వారాల పాటూ ఒక్కోసారి ఏడు ప్రదిక్షిణలు చేసి మనసులో కోర్కెలు చెప్పుకుంటే తప్పకుండా నెరవేరుతుందని భక్తుల విశ్వాసం

Also Read: నారసింహస్వామి ఆలయం ఉన్న ఊర్లో కాకులుండవా - ఇందులో నిజమెంత!

కళ్యాణ వేంకటేశ్వర స్వామి (అన్నవరప్పాడు, పశ్చిమగోదావరి జిల్లా )

రావులాపాలెం నుంచి తణుకు హైవే మార్గంలో ఉంటుంది కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం. పవిత్ర గోదావరీ నదీ తీరాన ఉన్న ఈ ప్రదేశంలో కశ్యప ప్రజాపతి తపమాచరించారని చెబుతారు.  ఆయన అభీష్టం మేరకే ఈ ఆలయం నిర్మించారని... ఇక్కడ కళ్యాణ వేంకటేశ్వరస్వామిని దర్శించుకుంటే వివాహానికి సంబంధించి జాతకంలో ఉండే దోషాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ప్రతి నెల శ్రవణ నక్షత్రంలో స్వామి వారికి ఇక్కడ కళ్యాణం జరిపిస్తారు.

బాల బాలాజి స్వామి(అప్పనపల్లి)

గోదావరి జిల్లాలోనే ఉన్న సప్త శ్రీనివాసక్షేత్రాల్లో అప్పనపల్లి ఒకటి. ఇక్కడి వెంకటేశ్వర స్వామిని బాల బాలాజీ అని పిలుస్తారు. ఈ దేవస్థాన నిర్మాత  మొల్లేటి రామస్వామి కొబ్బరి వ్యాపారి. ఓ రోజు కొబ్బరిరాశిలో ఓ కాయలో శ్రీ వేంకటేశ్వరుడి తిరునామాలు కనిపించాయి. స్వామివారే అలా వచ్చారని భావించి ఆ కొబ్బరికాయను ప్రతిష్టించి పూజలు చేయడం ప్రారంభించారు. ఆ తర్వాత భక్తుల తాకిడితో పెద్ద క్షేత్రంగా మారింది.  ప్రధాన దేవస్థానమునకు కొంచెం దూరములో పురాతన దేవాలయము ఉంది..అప్పనముని అక్కడే తపస్సు చేసుకున్నారని ఆయన పేరుమీదుగానే అప్పనపల్లి వచ్చిందని చెబుతారు. అమలాపురం నుంచి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆలయం

Also Read: పాములకు రెండు నాలుకలు ఎందుకుంటాయి - సర్పజాతి పుట్టుకకు మూలం ఎవరు!

మీసాల వేంకటేశ్వరస్వామి (యానాం)

సప్త వేంకటేశ్వరస్వామి క్షేత్రాల్లో నాలుగోది యానాంలో ఉన్న మీసాల వేంకటేశ్వరస్వామి. ఇక్కడ శ్రీ వేంకటేశ్వరుడి మీసాలు ఉండడంతో మీసాల వెంకన్నగా పిలుచుకుంటారు భక్తులు. తెల్లవారు జామునే మత్స్యకారులు వేటకు వెళ్లే ముందు వెంకటేశ్వరస్వామికి చద్దన్నం ప్రసాదంగా సమర్పించేవారని అందుకే చల్దికూడు వెంకన్న అని కూడా అంటారు. 15వ శతాబ్దానికి చెందిన రెడ్డిరాజులు నిర్మించిన ఈ ఆలయంలో ఏటా కళ్యాణోత్సవం, రథయాత్ర కన్నులపండువగా జరుగుతుంది.  

సప్తవేంకటేశ్వర క్షేత్రాల్లో ఐదోది మండపేటలో ఉన్న శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం...ఇక్కడకు రావులపాలెం, రాజమండ్రి మీదుగా చేరుకోవచ్చు

ఆరో క్షేత్రం కొడమంచిలి వేంకటేశ్వరస్వామి...ఈ ఆలయానికి వెళ్లేందుకు పశ్చిమగోదావరి జిల్లా సిద్ధాంతం వరకూ బస్సులో ఆ తర్వాత ఏదైనా వాహనం మాట్లాడుకుని వెళ్లొచ్చు

సప్త వేంకటేశ్వర క్షేత్రాల్లో ఏడోది పశ్చిమగోదావరి జిల్లా అబ్బరాజుపాలెంలో ఉంది.  కొడమంచిలి వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నాక అక్కడి నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆలయం...

ఏటా మార్గశిరమాసంలో ఈ సప్త శ్రీనివాసక్షేత్రాలకు ట్రావెల్స్ వారు ప్రత్యేక బస్సులు ఏర్పాటుచేస్తారు. వీటితో పాటూ నవ జనార్ధన క్షేత్రాలైన ధవళేశ్వరం, మడికి, జొన్నాడ, ఆలమూరు, మండపేట, కపిలేశ్వరం, మాచర, కోటిపల్లి, కోరుమిల్లి ప్రాంతాలను దర్శించుకోవచ్చు...

 

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

కర్కాటక రాశి వారఫలాలు ఆగస్టు 9-15: మాటల్లో సంయమనం, ఆర్థిక జాగ్రత్త అవసరం!
కర్కాటక రాశి వారఫలాలు ఆగస్టు 9-15: మాటల్లో సంయమనం, ఆర్థిక జాగ్రత్త అవసరం!
మిథున రాశి 2026 ఆగస్టు 09 - 05 వారఫలం: ఈ వారం పెద్ద ఒప్పందాలు, కొత్త పరిచయాలు , ఆశ్చర్యాలతో నిండి ఉంటుంది!
మిథున రాశి 2026 ఆగస్టు 09 - 05 వారఫలం: ఈ వారం పెద్ద ఒప్పందాలు, కొత్త పరిచయాలు , ఆశ్చర్యాలతో నిండి ఉంటుంది!
ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ 2026: మీ రాశి ప్రకారం ఏం కొనుక్కుంటే మంచిది , ఏవి కొనొద్దు!
ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ 2026: మీ రాశి ప్రకారం ఏం కొనుక్కుంటే మంచిది , ఏవి కొనొద్దు!
జెన్-జెడ్ తుఫాన్: సీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతుందా? 2027లో భారత రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి?
జెన్-జెడ్ తుఫాన్: సీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతుందా? 2027లో భారత రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి?బోతున్నాయి?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirupati Latest News:
"వైఎస్ జగన్ ఇంటి ముందే కుటుంబంతో ఆ*త్మ*హత్య చేసుకుంటా" భూమన బాధితుడి హెచ్చరిక!
PM Modi:
"క్యాంపస్ లైఫ్‌కు, బయటి ప్రపంచానికి చాలా తేడా ఉంది, ప్రశ్న గుర్తించి సమాధానాలు వెతుక్కోవాలి" ఐఐటి ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రసంగం 
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Cheyutha Pensions: తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
Amaravati Latest News: అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
Rishabh Pant Tweet: అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
Kavitha BC Vote Bank: బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
Embed widget