అన్వేషించండి

Spirituality: ఆంధ్రప్రదేశ్ లో సప్త శ్రీనివాసక్షేత్రాలివే - తిరుమల తర్వాత అంతగా ప్రసిద్ధి చెందిన ఆలయాలు!

Spirituality: ఈ భూమి మీద మొత్తం 108 తిరుపతులు ఉన్నాయి. ఇవన్నీ దర్శించుకున్నారంటే అదంతా పూర్వజన్మసుకృతమే. అన్నీ దర్శించుకోలేకపోయినా ఈ 7 స్వయంభు క్షేత్రాలను చూసొచ్చినా అదే ఫలితం దక్కుతుందంటారు...

Swayam Vyakta Kshetras of Lord Sri venkateswara:   కలియుగంలో ఏ స్వామిని దర్శించుకుంటే బాధలు మటుమాయం అవుతాయో...ఏ స్వామిరూపం చూస్తే సమస్యలు తొలగి మనశ్సాంతి లభిస్తుందో... ఏ స్వామి దర్శనంతో జన్మధన్యం అవుతుందని భావిస్తారో ...ఈ రూపాన్ని పూజిస్తే ఆయురారోగ్యఐశ్వర్యాలకు లోటుండదో ఆయనే శ్రీ వేంకటేశ్వరుడు. కలియుగప్రత్యక్షదైవంగా పూజలందుకుంటున్న వేంకటేశ్వరస్వామి స్వామి తిరుమలలో కొలువైఉన్నాడు. నిత్యకళ్యాణం పచ్చతోరణంగా వెలిగే ఈ క్షేత్రం తర్వాత  వేంకటేశుడికి సంబంధించి 7 స్వయంభు క్షేత్రాలున్నాయి...వీటినే సప్త శ్రీనివాస క్షేత్రాలు అంటారు. ఇన్నీ ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నాయి...

వేంకటేశ్వర స్వామి వాడపల్లి (కోనసీమ జిల్లా ఆంధ్రప్రదేశ్)

వందల ఏళ్లక్రితం నాసిక్ ప్రాంతంలో నారద మహర్షి..ఎర్రచందనరూపుడైన వేంకటేశ్వరస్వామికి పూజించి ఆ రూపాన్ని ఓ పెట్టెలో పెట్టి గోదావరిలో నిమజ్జనం చేశారట. వందలకిలోమీటర్లు కొట్టుకువచ్చిన ఆ ప్రతిమ కోనసీమ జిల్లా వాడపల్లికి చేరింది. ఓబ్రాహ్మణుడి కలలో స్వామివారు కనిపించి చెప్పడంతో...రెండు రోజుల పాటూ వెతికి ఆ విగ్రహాన్ని గుర్తించి ఆ తర్వాత ప్రతిష్టించారు. వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి ఆలయం చుట్టూ ఏడు వారాల పాటూ ఒక్కోసారి ఏడు ప్రదిక్షిణలు చేసి మనసులో కోర్కెలు చెప్పుకుంటే తప్పకుండా నెరవేరుతుందని భక్తుల విశ్వాసం

Also Read: నారసింహస్వామి ఆలయం ఉన్న ఊర్లో కాకులుండవా - ఇందులో నిజమెంత!

కళ్యాణ వేంకటేశ్వర స్వామి (అన్నవరప్పాడు, పశ్చిమగోదావరి జిల్లా )

రావులాపాలెం నుంచి తణుకు హైవే మార్గంలో ఉంటుంది కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం. పవిత్ర గోదావరీ నదీ తీరాన ఉన్న ఈ ప్రదేశంలో కశ్యప ప్రజాపతి తపమాచరించారని చెబుతారు.  ఆయన అభీష్టం మేరకే ఈ ఆలయం నిర్మించారని... ఇక్కడ కళ్యాణ వేంకటేశ్వరస్వామిని దర్శించుకుంటే వివాహానికి సంబంధించి జాతకంలో ఉండే దోషాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ప్రతి నెల శ్రవణ నక్షత్రంలో స్వామి వారికి ఇక్కడ కళ్యాణం జరిపిస్తారు.

బాల బాలాజి స్వామి(అప్పనపల్లి)

గోదావరి జిల్లాలోనే ఉన్న సప్త శ్రీనివాసక్షేత్రాల్లో అప్పనపల్లి ఒకటి. ఇక్కడి వెంకటేశ్వర స్వామిని బాల బాలాజీ అని పిలుస్తారు. ఈ దేవస్థాన నిర్మాత  మొల్లేటి రామస్వామి కొబ్బరి వ్యాపారి. ఓ రోజు కొబ్బరిరాశిలో ఓ కాయలో శ్రీ వేంకటేశ్వరుడి తిరునామాలు కనిపించాయి. స్వామివారే అలా వచ్చారని భావించి ఆ కొబ్బరికాయను ప్రతిష్టించి పూజలు చేయడం ప్రారంభించారు. ఆ తర్వాత భక్తుల తాకిడితో పెద్ద క్షేత్రంగా మారింది.  ప్రధాన దేవస్థానమునకు కొంచెం దూరములో పురాతన దేవాలయము ఉంది..అప్పనముని అక్కడే తపస్సు చేసుకున్నారని ఆయన పేరుమీదుగానే అప్పనపల్లి వచ్చిందని చెబుతారు. అమలాపురం నుంచి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆలయం

Also Read: పాములకు రెండు నాలుకలు ఎందుకుంటాయి - సర్పజాతి పుట్టుకకు మూలం ఎవరు!

మీసాల వేంకటేశ్వరస్వామి (యానాం)

సప్త వేంకటేశ్వరస్వామి క్షేత్రాల్లో నాలుగోది యానాంలో ఉన్న మీసాల వేంకటేశ్వరస్వామి. ఇక్కడ శ్రీ వేంకటేశ్వరుడి మీసాలు ఉండడంతో మీసాల వెంకన్నగా పిలుచుకుంటారు భక్తులు. తెల్లవారు జామునే మత్స్యకారులు వేటకు వెళ్లే ముందు వెంకటేశ్వరస్వామికి చద్దన్నం ప్రసాదంగా సమర్పించేవారని అందుకే చల్దికూడు వెంకన్న అని కూడా అంటారు. 15వ శతాబ్దానికి చెందిన రెడ్డిరాజులు నిర్మించిన ఈ ఆలయంలో ఏటా కళ్యాణోత్సవం, రథయాత్ర కన్నులపండువగా జరుగుతుంది.  

సప్తవేంకటేశ్వర క్షేత్రాల్లో ఐదోది మండపేటలో ఉన్న శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం...ఇక్కడకు రావులపాలెం, రాజమండ్రి మీదుగా చేరుకోవచ్చు

ఆరో క్షేత్రం కొడమంచిలి వేంకటేశ్వరస్వామి...ఈ ఆలయానికి వెళ్లేందుకు పశ్చిమగోదావరి జిల్లా సిద్ధాంతం వరకూ బస్సులో ఆ తర్వాత ఏదైనా వాహనం మాట్లాడుకుని వెళ్లొచ్చు

సప్త వేంకటేశ్వర క్షేత్రాల్లో ఏడోది పశ్చిమగోదావరి జిల్లా అబ్బరాజుపాలెంలో ఉంది.  కొడమంచిలి వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నాక అక్కడి నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆలయం...

ఏటా మార్గశిరమాసంలో ఈ సప్త శ్రీనివాసక్షేత్రాలకు ట్రావెల్స్ వారు ప్రత్యేక బస్సులు ఏర్పాటుచేస్తారు. వీటితో పాటూ నవ జనార్ధన క్షేత్రాలైన ధవళేశ్వరం, మడికి, జొన్నాడ, ఆలమూరు, మండపేట, కపిలేశ్వరం, మాచర, కోటిపల్లి, కోరుమిల్లి ప్రాంతాలను దర్శించుకోవచ్చు...

 

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

12-08-2026 బుధవారం మీ రాశిఫలాలు!
12-08-2026 బుధవారం మీ రాశిఫలాలు!
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
అంతర్గత అంధకారాన్ని తొలగించే అమావాస్య ! ఆగష్టు 12 సూర్యగ్రహణం..ఈ రోజు ఏం చేయాలి? ఏం చేయకూడదు?
అంతర్గత అంధకారాన్ని తొలగించే అమావాస్య ! ఆగష్టు 12 సూర్యగ్రహణం..ఈ రోజు ఏం చేయాలి? ఏం చేయకూడదు?
సూర్య గ్రహణం రోజు ఆరుద్ర నక్షత్రంలోకి కుజుడు! 3 రాశులవారికి ప్రయోజనం!
సూర్య గ్రహణం రోజు ఆరుద్ర నక్షత్రంలోకి కుజుడు! 3 రాశులవారికి ప్రయోజనం!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
Kalki 2: ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
Murali Mohan: హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
Khudiram Bose:18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
Embed widget