అన్వేషించండి

Spirituality: ఆంధ్రప్రదేశ్ లో సప్త శ్రీనివాసక్షేత్రాలివే - తిరుమల తర్వాత అంతగా ప్రసిద్ధి చెందిన ఆలయాలు!

Spirituality: ఈ భూమి మీద మొత్తం 108 తిరుపతులు ఉన్నాయి. ఇవన్నీ దర్శించుకున్నారంటే అదంతా పూర్వజన్మసుకృతమే. అన్నీ దర్శించుకోలేకపోయినా ఈ 7 స్వయంభు క్షేత్రాలను చూసొచ్చినా అదే ఫలితం దక్కుతుందంటారు...

Swayam Vyakta Kshetras of Lord Sri venkateswara:   కలియుగంలో ఏ స్వామిని దర్శించుకుంటే బాధలు మటుమాయం అవుతాయో...ఏ స్వామిరూపం చూస్తే సమస్యలు తొలగి మనశ్సాంతి లభిస్తుందో... ఏ స్వామి దర్శనంతో జన్మధన్యం అవుతుందని భావిస్తారో ...ఈ రూపాన్ని పూజిస్తే ఆయురారోగ్యఐశ్వర్యాలకు లోటుండదో ఆయనే శ్రీ వేంకటేశ్వరుడు. కలియుగప్రత్యక్షదైవంగా పూజలందుకుంటున్న వేంకటేశ్వరస్వామి స్వామి తిరుమలలో కొలువైఉన్నాడు. నిత్యకళ్యాణం పచ్చతోరణంగా వెలిగే ఈ క్షేత్రం తర్వాత  వేంకటేశుడికి సంబంధించి 7 స్వయంభు క్షేత్రాలున్నాయి...వీటినే సప్త శ్రీనివాస క్షేత్రాలు అంటారు. ఇన్నీ ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నాయి...

వేంకటేశ్వర స్వామి వాడపల్లి (కోనసీమ జిల్లా ఆంధ్రప్రదేశ్)

వందల ఏళ్లక్రితం నాసిక్ ప్రాంతంలో నారద మహర్షి..ఎర్రచందనరూపుడైన వేంకటేశ్వరస్వామికి పూజించి ఆ రూపాన్ని ఓ పెట్టెలో పెట్టి గోదావరిలో నిమజ్జనం చేశారట. వందలకిలోమీటర్లు కొట్టుకువచ్చిన ఆ ప్రతిమ కోనసీమ జిల్లా వాడపల్లికి చేరింది. ఓబ్రాహ్మణుడి కలలో స్వామివారు కనిపించి చెప్పడంతో...రెండు రోజుల పాటూ వెతికి ఆ విగ్రహాన్ని గుర్తించి ఆ తర్వాత ప్రతిష్టించారు. వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి ఆలయం చుట్టూ ఏడు వారాల పాటూ ఒక్కోసారి ఏడు ప్రదిక్షిణలు చేసి మనసులో కోర్కెలు చెప్పుకుంటే తప్పకుండా నెరవేరుతుందని భక్తుల విశ్వాసం

Also Read: నారసింహస్వామి ఆలయం ఉన్న ఊర్లో కాకులుండవా - ఇందులో నిజమెంత!

కళ్యాణ వేంకటేశ్వర స్వామి (అన్నవరప్పాడు, పశ్చిమగోదావరి జిల్లా )

రావులాపాలెం నుంచి తణుకు హైవే మార్గంలో ఉంటుంది కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం. పవిత్ర గోదావరీ నదీ తీరాన ఉన్న ఈ ప్రదేశంలో కశ్యప ప్రజాపతి తపమాచరించారని చెబుతారు.  ఆయన అభీష్టం మేరకే ఈ ఆలయం నిర్మించారని... ఇక్కడ కళ్యాణ వేంకటేశ్వరస్వామిని దర్శించుకుంటే వివాహానికి సంబంధించి జాతకంలో ఉండే దోషాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ప్రతి నెల శ్రవణ నక్షత్రంలో స్వామి వారికి ఇక్కడ కళ్యాణం జరిపిస్తారు.

బాల బాలాజి స్వామి(అప్పనపల్లి)

గోదావరి జిల్లాలోనే ఉన్న సప్త శ్రీనివాసక్షేత్రాల్లో అప్పనపల్లి ఒకటి. ఇక్కడి వెంకటేశ్వర స్వామిని బాల బాలాజీ అని పిలుస్తారు. ఈ దేవస్థాన నిర్మాత  మొల్లేటి రామస్వామి కొబ్బరి వ్యాపారి. ఓ రోజు కొబ్బరిరాశిలో ఓ కాయలో శ్రీ వేంకటేశ్వరుడి తిరునామాలు కనిపించాయి. స్వామివారే అలా వచ్చారని భావించి ఆ కొబ్బరికాయను ప్రతిష్టించి పూజలు చేయడం ప్రారంభించారు. ఆ తర్వాత భక్తుల తాకిడితో పెద్ద క్షేత్రంగా మారింది.  ప్రధాన దేవస్థానమునకు కొంచెం దూరములో పురాతన దేవాలయము ఉంది..అప్పనముని అక్కడే తపస్సు చేసుకున్నారని ఆయన పేరుమీదుగానే అప్పనపల్లి వచ్చిందని చెబుతారు. అమలాపురం నుంచి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆలయం

Also Read: పాములకు రెండు నాలుకలు ఎందుకుంటాయి - సర్పజాతి పుట్టుకకు మూలం ఎవరు!

మీసాల వేంకటేశ్వరస్వామి (యానాం)

సప్త వేంకటేశ్వరస్వామి క్షేత్రాల్లో నాలుగోది యానాంలో ఉన్న మీసాల వేంకటేశ్వరస్వామి. ఇక్కడ శ్రీ వేంకటేశ్వరుడి మీసాలు ఉండడంతో మీసాల వెంకన్నగా పిలుచుకుంటారు భక్తులు. తెల్లవారు జామునే మత్స్యకారులు వేటకు వెళ్లే ముందు వెంకటేశ్వరస్వామికి చద్దన్నం ప్రసాదంగా సమర్పించేవారని అందుకే చల్దికూడు వెంకన్న అని కూడా అంటారు. 15వ శతాబ్దానికి చెందిన రెడ్డిరాజులు నిర్మించిన ఈ ఆలయంలో ఏటా కళ్యాణోత్సవం, రథయాత్ర కన్నులపండువగా జరుగుతుంది.  

సప్తవేంకటేశ్వర క్షేత్రాల్లో ఐదోది మండపేటలో ఉన్న శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం...ఇక్కడకు రావులపాలెం, రాజమండ్రి మీదుగా చేరుకోవచ్చు

ఆరో క్షేత్రం కొడమంచిలి వేంకటేశ్వరస్వామి...ఈ ఆలయానికి వెళ్లేందుకు పశ్చిమగోదావరి జిల్లా సిద్ధాంతం వరకూ బస్సులో ఆ తర్వాత ఏదైనా వాహనం మాట్లాడుకుని వెళ్లొచ్చు

సప్త వేంకటేశ్వర క్షేత్రాల్లో ఏడోది పశ్చిమగోదావరి జిల్లా అబ్బరాజుపాలెంలో ఉంది.  కొడమంచిలి వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నాక అక్కడి నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆలయం...

ఏటా మార్గశిరమాసంలో ఈ సప్త శ్రీనివాసక్షేత్రాలకు ట్రావెల్స్ వారు ప్రత్యేక బస్సులు ఏర్పాటుచేస్తారు. వీటితో పాటూ నవ జనార్ధన క్షేత్రాలైన ధవళేశ్వరం, మడికి, జొన్నాడ, ఆలమూరు, మండపేట, కపిలేశ్వరం, మాచర, కోటిపల్లి, కోరుమిల్లి ప్రాంతాలను దర్శించుకోవచ్చు...

 

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

15-08-2026 శనివారం స్వాతంత్ర్య దినోత్సవం మీ రాశిఫలాలు!
15-08-2026 శనివారం స్వాతంత్ర్య దినోత్సవం మీ రాశిఫలాలు!
శుక్రవారం లక్ష్మీపూజలో భాగంగా సాయంత్రం పాటించాల్సిన 5 పరిహారాలు తెలుసుకోండి!
శుక్రవారం లక్ష్మీపూజలో భాగంగా సాయంత్రం పాటించాల్సిన 5 పరిహారాలు తెలుసుకోండి!
నాగ పంచమి 2026: సకల దోషాలు తొలగి, శుభాలు కలిగే పూజా విధానం, మంత్రాలు!
నాగ పంచమి 2026: సకల దోషాలు తొలగి, శుభాలు కలిగే పూజా విధానం, మంత్రాలు!
మిథున రాశి ఆగస్టు 16-22 వారఫలం
మిథున రాశి ఆగస్టు 16-22 వారఫలం

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Manasa Varanasi : తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
Sharwanand George Krish : శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
Embed widget