అన్వేషించండి

Spirituality: నారసింహస్వామి ఆలయం ఉన్న ఊర్లో కాకులుండవా - ఇందులో నిజమెంత!

Spirituality: తెలుగు నేలపై అడుగడుగునా నారసింహస్వామి క్షేత్రాలున్నాయి. రామాలయాలు, శివాలయాలు, వేంకటేశ్వర ఆలయాలతో పాటూ నారసింహ క్షేత్రాలు కూడా చాలా ఉన్నాయి. ఈ ఆలయాలున్న ఊర్లో కాకులుండవా? ఇది నిజమేనా?

Lakshmi Narasimha Swamy Temple:  హిరణ్యకశిపుడిని సంహరించేందుకు ప్రహ్లాదుడి భక్తికి మెచ్చి ప్రత్యక్షమైన నారసింహస్వామి...తన అవతార ఆంతర్యం ముగిసిన తర్వాత దండకారణ్యం అంతా తిరిగాడు. అలా స్వామివారు అడుగుపెట్టిన ప్రతి అణువూ పవిత్రప్రదేశంగా మారింది. స్వామి స్వయంభువుగా వెలిసిన క్షేత్రాలు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో ఉన్నాయి. కొండల్లో మీసా దేవుడిగా, పొలిమేరల్లో చల్లని చూపులు ప్రసరించే దైవంగా, వనాల్లో, పట్టణాల్లో భక్తుల కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా పూజలందుకుంటున్నాడు. దేశవ్యాప్తంగా నారసింహ క్షేత్రాలున్నప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఆలయాలు మరింత ప్రత్యేకం.  ఈ దేవాలయాల్లో వేటి ప్రాశస్త్యం వాటిదే అయినప్పటికీ...నారసింహ స్వామి కొలువైన ఊర్లో కాకులుండవు అనే ప్రచారం ఉంది. ఇది నిజమా? అవును - కాదు అని సమాధానం చెప్పాలి. ఎందుకంటే నృసింహస్వామి కొలువైన కొన్ని ప్రత్యేక క్షేత్రాల్లో కాకులు లేవన్నది నిజమే ... అయితే ఇది అన్ని క్షేత్రాలకు వర్తించదు...

Also Read: పాములకు రెండు నాలుకలు ఎందుకుంటాయి - సర్పజాతి పుట్టుకకు మూలం ఎవరు!

కాకులు కనిపించని నారసింహ క్షేత్రాలివే!

​​యాగంటి ఉమామహేశ్వరాలయం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా యాగంటి దేవాలయం ప్రాంగణంలో కాకులు కనిపించవు. దీనివెనుక ఓ కథ ప్రచారంలో ఉంది. వాస్తవానికి ఇక్కడ వేంకటేశ్వరస్వామి విగ్రహం ప్రతిష్టించాలి అనుకున్నాడు అగస్యమహాముని. ఆ విగ్రహం బొటనవేలు విరగడంతో తన తప్పిదం తెలుసుకునేందుకు తపస్సు చేసిన అగస్త్యుడికి కాకులు తపోభంగం కలిగించాయి. దీంతో ఆగ్రహించిన మహాముని ఆ ప్రాంతంలో ఒక్క కాకి కూడా కనిపించకూడదని శాపం ఇచ్చాడు. ఫలితంగా యాగంటి ఆలయం సమీపంలో కాకులే కనిపించవు. అయితే కాకి శని దేవుడి వాహనం... అందుకే కాకుల్ని నిషేధించిన ప్రాంతంలో తానుండను అన్నాడ శనీశ్వరుడు. అందుకే ఆ ప్రాంతంలో కాకులు కనిపించవు.  

వెయ్యినూతుల కోన లక్ష్మీనరసింహస్వామి

వైఎస్‌ఆర్‌ జిల్లా పెండ్లిమర్రి మండలం చిన్న దాసరపల్లెలో ఉండే  ఈ ఆలయంలో వెలసిన లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుంటే సకల శుభాలూ కలుగుతాయని భక్తుల విశ్వాసం. ఈ క్షేత్రంలో కూడా కాకులూ, గద్దలూ సంచరించకపోవడం వెనక ఆసక్తికర కథనం చెబుతారు. శ్రీరాముడు సీతా సమేతంగా వచ్చి సేదతీరుతున్న సమయంలో కాకాసురుడు అనే రాక్షసుడు సీతాదేవికి నిద్రాభంగం చేశాడట. ఆగ్రహించిన రాముడు కాకాసురుడిపై బ్రహ్మాస్త్రం సంధించాడు. దానిని తప్పించుకునేందుకు దేవతలను శరణువేడినా ఫలితం లేకపోయింది. అప్పుడు శ్రీరాముడు..ఈ క్షేత్రం చుట్టూ ఓ గీత గీసి లోపలికి ప్రవేశించవద్దని చెప్పాడని..అందుకే ఈ నృసింహ క్షేత్రంలో కాకులు కనిపించవని చెబుతారు.  

Also Read: నరకం అంటే ఏంటి - ఇక్కడకు ఎవరెళతారు!

ఈ రెండు నారసింహస్వామి క్షేత్రాలతో పాటూ కాకులు కనిపించని మరికొన్ని ఆలయాలున్నాయి..

​కోటప్పకొండ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాలో ఉన్న త్రికోటేశ్వరుని ఆలయం సమీపంలో కూడా కాకులు కనిపించవు. పురాణాల ప్రకారం ఈ కొండపై ఉన్న 3 శిఖరాలను త్రిమూర్తులుగా పరిగణిస్తారు..అందుకే త్రికూటం అని పేరొచ్చింది. పరమేశ్వరుడి భక్తురాలు స్వామివారికి నిత్యం ప్రసాదం తీసుకొచ్చి పెట్టేది. ఓ రోజు కుండలో పెరుగుతీసుకొస్తూ మెట్లపై కూర్చుంది...ఆ సమయంలో ఆ పెరుగును ఓ కాకి నేలపాలు చేసింది. విచారంలో ఉన్న ఆ భక్తురాలిని కరుణించి వృద్ధుడి రూపంలో వచ్చిన పరమేశ్వరుడు..ఇకపై ఆ కొండపై కాకులు వాలవని వరమిచ్చాడట.  

​జగన్నాథ ఆలయం

ఒడిశా రాష్ట్రం పూరీ జగన్నాథ ఆలయంలో కాకులే కాదు పక్షులు కూడా ఎగరదు. ఈ ఆలయ ప్రాంగణంలో పక్షులు ఎగరకపోవడం ఓ మిస్టరీగా మారింది. దీంతో పాటూ జగన్నాథుడి ఆలయంలో చాలా మిస్టరీలున్నాయి. ఆలయంపై ఉన్న  సుదర్శన చక్రం మీరు ఎటువైపు  చూసినా అది మీ వైపే తిరిగినట్టు కనిపిస్తుంది. ఈ గోపురం నీడ కూడా కనిపించదు. గోపురంపై ఉన్న జెండా గాలికి వ్యతిరేక దిశలో వీస్తుంది.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

Dakshinayanam 2026: ఏడాదికి 2 రోజులు మాత్రమే సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు! ఇది అర్థం కావాలంటే దక్షిణాయనం, ఉత్తరాయణం గురించి తెలుసుకోవాలి!
ఏడాదికి 2 రోజులు మాత్రమే సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు! ఇది అర్థం కావాలంటే దక్షిణాయనం, ఉత్తరాయణం గురించి తెలుసుకోవాలి!
నవగ్రహాలు: శివాలయాల్లో ఎందుకు, విష్ణు ఆలయాల్లో ఎందుకుండవు? జ్యోతిష్య రహస్యం!
నవగ్రహాలు: శివాలయాల్లో ఎందుకు, విష్ణు ఆలయాల్లో ఎందుకుండవు? జ్యోతిష్య రహస్యం!
సింహ రాశి అర్థ సంవత్సర ఫలితాలు 2026 - జూలై నుంచి డిసెంబర్ మధ్య మీ జీవితంలో ఊహించని మార్పులు!
సింహ రాశి అర్థ సంవత్సర ఫలితాలు 2026 - జూలై నుంచి డిసెంబర్ మధ్య మీ జీవితంలో ఊహించని మార్పులు!
Jagannath Rath Yatra 2026: జగన్నాథ స్వామి రథంలో కాదు పడవలో ప్రయాణించేవారు! 700 ఏళ్ల నాటి రహస్యాన్ని వెల్లడించిన ఐఐటి ఖరగ్‌పూర్ పరిశోధన
జగన్నాథ స్వామి రథంలో కాదు పడవలో ప్రయాణించేవారు! 700 ఏళ్ల నాటి రహస్యాన్ని వెల్లడించిన ఐఐటి ఖరగ్‌పూర్ పరిశోధన

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: బెంగాల్‌లో ఘోర ప్రమాదం.. స్కూల్‌ బస్సును ఢీకొట్టిన రైలు- ముగ్గురి మృతి, పలువురికి గాయాలు
బెంగాల్‌లో ఘోర ప్రమాదం.. స్కూల్‌ బస్సును ఢీకొట్టిన రైలు- ముగ్గురి మృతి, పలువురికి గాయాలు
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
Rains In AP And Telangana: అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు.. తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి జల్లులు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు.. తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి జల్లులు
Re-NEET UG 2026 Result: నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
Embed widget