అన్వేషించండి

Garuda Purana : నరకం అంటే ఏంటి - ఇక్కడకు ఎవరెళతారు!

Garuda Purana: గరుడపురాణంలో ప్రస్తావించిన నరకం ఉందా? నరకం అంటే ఏంటి? ఎలాంటివారు నరకానికి వెళతారు? వైతరణి నది గురించి శ్రీ మహావిష్ణువు ఏం చెప్పాడు?

Garuda Purana: శ్రీ మహావిష్ణువు గరుత్మంతునికి తీర్చిన సందేహాలే గరుడపురాణం. జీవుడి పుట్టుక నుంచి మరణం...మరణానంతరం ఆత్మ ప్రయాణం...స్వర్గం, నరకం వరకూ ప్రతి విషయం గురించి శ్రీ మహావిష్ణువు గరుడుడికి వివరించాడు. గరుడపురాణంలో ఓ అధ్యాయంలో పూర్తిగా నరకం, వైతరణి నది గురించి గరుత్మంతుడికి వివరించాడు శ్రీ మహావిష్ణువు. నరకం అంటే ఏంటి? నరకం ఎవరికి ప్రాప్తిస్తుంది? దాన్నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలి? అనే విషయాలను స్పష్టంగా వివరించాడు. పాపాత్ములు మాత్రమే యమపురి దక్షిణ ద్వారం నుంచి నరకంలో అడుగుపెడతారు. ఈ మార్గంలోనే వైతరణి నది ఉంటుంది.

Also Read: అమ్మ కడుపులో ఉన్నప్పుడే నరకం మొదలైపోతుందా, గరుడ పురాణం ఏం చెబుతోంది

ఈ పాపాలు చేస్తే దక్షిణద్వారమే
మనిషిగా పుట్టి చేయకూడని పాపాలు చేసినవారు నరకంలోకి వెళ్లకతప్పదు. గరుడపురాణం ప్రకారం ఆ పాపాలు ఏంటంటే.. 

బ్రహ్మహత్య, శిశుహత్య, గోహత్య, స్త్రీహత్య, గర్భపాతం చేసేవారూ, రహస్యంగా పాపపు పని చేసేవారూ, గురువులు పండితులను దూషించేవారు, శిశువులను చంపేవారు, తీసుకున్న అప్పు తీర్చకపోయినా వేరొకరి ద్రవ్యాన్ని అపహరించినా, విషం పెట్టి చంపేవారు నరకానికి వెళ్లాల్సిందే..

తప్పులు చేసేవారు..తప్పులు చేసేవారిని సమర్థించేవారు, మంచివారిని నిందించేవారు, దుర్మార్గులతో స్నేహం చేసేవారు..మంచివారిని నిందించేవారు, పుణ్యక్షేత్రంలో అస్సలు అడుగుపెట్టనివారు, వేదాలను నిందించేవారు, ఇతరుల సంతోషాన్ని చూసి ఏడ్చేవారు వైతరణి దాటి దక్షిణద్వారం ద్వారా నరకంలోకి అడుగుపెడతారు

చెడు మాటలు మాట్లాడేవారు, పెద్దలు మంచి చెప్పినా పట్టించుకోని వారు, తమని తాము పొగుడుకుని ఇతరులని తిట్టేవారు, అధర్మాన్ని మాత్రమే ఆచరించేవారు, పతివ్రత అయిన భార్యను దూషించేవాడు, మాట తప్పేవాడు, దానం ఇచ్చిన తర్వాత బాధపడేవాడికి నరకం తప్పదు...

Also Read: గరుడ పురాణం ఇంట్లో ఉండొచ్చా-ఉండకూడదా!

మంచి కార్యాలను అడ్డుకునేవారు,ఇతరుల భూములను ఆస్తులను స్వాధీనం చేసుకుేనవారు, పశువులకు మేతలేకుండా చేసిన వారు, గోవులను హింసించేవారు, అబద్ధపు సాక్ష్యం చెప్పేవారు, అన్యాయంగా సంపాదించేవారు, దొంగతనం చేసేవారు, పూలు పండ్ల తోటల్ని ధ్వంసం చేసేవారు  నరకానికే వెళతారు...

ఈ పాపాలు చేసేవారందర్నీ...యమధర్మరాజు ఆజ్ఞ మేరకు యమభటులు వైతరణి నదిలోకి తోసేస్తారు. పాపాత్ములు ముందుగా వైతరణిలో పడి బాధలు అనుభవించిన తర్వాత వారి వారి పాపాలకు విడిగా శిక్షలుంటాయి. 

Also Read: పక్కవాళ్లకు స్వీట్ ఇవ్వకుండా తింటే కూడా పాపమే? గరుడ పురాణంలో ఘోరమైన శిక్ష?

వాస్తవానికి గరుడ పురాణం అంటే మరణం, స్వర్గం, నరకం గురించి మాత్రమే కాదు..గర్భంలో శిశువు పడినప్పటి నుంచి పుట్టుక... ఆ తర్వాత ఆచరించాల్సిన కర్మలు...మరణం..మరణానంతరం ఆత్మ ప్రయాణం..శిక్షలు...పాప ఫలితంగా మరో జన్మ..ఇలా మొత్తం జీవన ప్రయాణం  గరుడపురాణంలో ఉంటుంది. పుణ్యకార్యాలు చేసేవారికి మరో జన్మ ఉండదు...పాపాత్ములకు మరో జన్మ తప్పదు. పురుషుని రేతస్సుని ఆధారంగా చేసుకుని కర్మను అనుసరించి అందుకు అనుగుణమైన స్త్రీ గర్భంలో ప్రవేశిస్తారు. ఫలితం అనుభవించడం గర్భంలో ఉన్నప్పుడే మొదలైపోతుంది...అందుకే ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒక్కసారైనా గరుడపురాణం చదివితే కొన్ని పాపాలను అయినా చేయకుండా ఉంటారు... కొన్నైనా పుణ్యకార్యాలు చేస్తారని చెబుతారు...

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

KTR Slams Revanth Reddy: రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిని ఎన్నిసార్లు ఉరి తీయాలి- హామీల అమలుపై కేటీఆర్ ఫైర్
రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిని ఎన్నిసార్లు ఉరి తీయాలి- హామీల అమలుపై కేటీఆర్ ఫైర్
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?

వీడియోలు

Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్
Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Slams Revanth Reddy: రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిని ఎన్నిసార్లు ఉరి తీయాలి- హామీల అమలుపై కేటీఆర్ ఫైర్
రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిని ఎన్నిసార్లు ఉరి తీయాలి- హామీల అమలుపై కేటీఆర్ ఫైర్
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
Bondi Beach Shooting: బాండీ బీచ్ ఘటన హీరోలకు క్రికెట్ ఆస్ట్రేలియా గార్డ్ ఆఫ్ హానర్.. చప్పట్లతో మార్మోగిన స్టేడియం
బాండీ బీచ్ ఘటన హీరోలకు క్రికెట్ ఆస్ట్రేలియా గార్డ్ ఆఫ్ హానర్.. చప్పట్లతో మార్మోగిన స్టేడియం
Draupathi 2 Movie : 'ద్రౌపది 2'లో ముగ్గురు విలన్స్ - మహ్మద్ బిన్ తుగ్లక్‌‌గా చిరాగ్... ఫస్ట్ లుక్ రిలీజ్
'ద్రౌపది 2'లో ముగ్గురు విలన్స్ - మహ్మద్ బిన్ తుగ్లక్‌‌గా చిరాగ్... ఫస్ట్ లుక్ రిలీజ్
Mana Shankara Vara Prasad Garu Trailer: ట్రైలర్ లాంచ్‌కు చిరు & నయన్ వెళ్లట్లేదు... మరి చీఫ్ గెస్ట్ ఎవరు? MSG Trailer ఈవెంట్ డీటెయిల్స్‌ తెలుసుకోండి
ట్రైలర్ లాంచ్‌కు చిరు & నయన్ వెళ్లట్లేదు... మరి చీఫ్ గెస్ట్ ఎవరు? MSG Trailer ఈవెంట్ డీటెయిల్స్‌ తెలుసుకోండి
Soldier Suicide: కూల్‌గా కూర్చున్నాడు, రైలు రాగానే పట్టాలపై తలపెట్టి జవాను ఆత్మహత్య
కూల్‌గా కూర్చున్నాడు, రైలు రాగానే పట్టాలపై తలపెట్టి జవాను ఆత్మహత్య
Embed widget