అన్వేషించండి

Sabarimala Ayyappa Darshanam : శబరిమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. ఈ ఏడాది అయ్యప్ప దర్శనం మరింత వేగంగా!

Sabarimala: గతేడాది శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు..చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.ఈ విషయంలో దేవస్థానం బోర్డు ఎన్నో విమర్శలు ఎదుర్కొంది. అందుకే ఈ ఏడాది చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది

Travancore Devaswom Board Sabarimala Ayyappa Darshanam: డిసెంబరు 26 వరకూ రెండు నెలల పాటూ మండల మకరువిళక్కు పూజలో భాగంగా శబరిమల అయ్యప్ప ఆలయం తెరుచుకుంది. రెగ్యులర్ టైమ్ కన్నా ఓ గంట ముందే ఆలయం తెరిచి ప్రత్యేక పూజలు చేసి భక్తులను దర్శనానికి అనుమతించారు.

అయ్యప్ప స్వామి దర్శనార్థం భారీగా భక్తులు శబరిమల చేరుకున్నారు. అయితే గతేడాది అయ్యప్ప దర్శనానికి వెళ్లిన భక్తులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. క్యూ లైన్లు నిర్వహించడం, భక్తులందరకీ దర్శనం కల్పించడంలో దేవస్థానం చాలా విమర్శలు ఎదుర్కొంది. అందుకే ఈ ఏడాది ఆ పొరపాట్లు రిపీట్ కాకూడదని నిర్ణయించుకుంది ట్రావెన్స్ కోర్ దేవస్థానం

భారీగా తరలివచ్చిన భక్తులు ప్రశాంతంగా దర్శనం చేసుకునేందుకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు.  పోలీస్ చీఫ్ కోఆర్డినేటర్ ఏడీజీపీ ఎస్.శ్రీజిత్ ఈ బాధ్యతలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. గతేడాది పరిస్థితులు రిపీట్ కాకుండా ఉండేందుకు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు

Also Read: అయ్యప్ప మాల వేసిన స్వాములకు బిగ్ అలర్ట్‌- ఇలా చేస్తే దేవుని దర్శనం మరింత సులభం

గతేడాది సరైన శిక్షణ లేని పోలీసులను అక్కడ నియమించడం వల్ల భక్తులకు ఇబ్బందులు తప్పలేదని భావించిన ఏడీజీపీ శ్రీజిత్ .. ఈ సంవత్సరం పదునెట్టాంబడి వద్ద విధులు నిర్వర్తించేందుకు ఆసక్తిగా ఉన్న పోలీసులకు ముందుగా శిక్షణ ఇచ్చారు. అందులే గతేడాది  స్వామివారి 18 మెట్లు నిముషానికి మ్యాగ్జిమం 60 మందికి మాత్రమే అనుమతి ఉండేది.. ఈ ఏడాది ఆ సంఖ్య మరో 20 పెరిగింది.  నిముషానికి 80 నుంచి 90 మంది భక్తులు పదునెట్టాంబడి ఎక్కుతున్నారు. 

అయ్యప్ప ఆలయం తెరిచిన నాలుగు రోజుల్లోనే దాదాపు 2 లక్షల 30వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. గడిచిన సీజన్లతో పోల్చితే ఈ సీజన్లో దర్శనం సమయం పొడిగించారు. రోజూ తెల్లవారు జామున 3 నుంచి మధ్యాహ్నం ఒంటిగంటవరకూ...మధ్యాహ్నం మూడు నుంచి రాత్రి 11 గంటల వరకూ 18 గంటల పాటూ అయ్యప్ప దర్శనాలకు భక్తులను అనుమతిస్తున్నారు. 

స్వామి దర్శనార్థం వచ్చే మహిళలు, చిన్నారులు, దివ్యాంగులు, వృద్ధుల కోసం ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేశారు. వలియ నడపంతల్ నుంచి ప్రారంభమయ్యే ఈ క్యూ లైన్ ద్వారా డైరెక్ట్ గా పదునెట్టాంబడికి చేరుకునేలా ఏర్పాటు చేశారు.  చిన్నారులు, వృద్ధులకు తోడుగా ఒకర్ని అనుమతిస్తారు..

Also Read:  ఇరుముడి అంటే ఏంటి, అయ్యప్ప స్వామి దర్శనానికి ఇరుముడి ఎందుకు!

మరోవైపు శబరిమలకు వచ్చే భక్తుల కోసం కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ  మొదటి దశలో భాగంగా నిలక్కల్ నుంచి పంపా మధ్య  383 బస్సులు నడుపుతోంది.  మరో 192 బస్సులు సిద్ధంగా ఉన్నాయ్...రెండో దశలో ఈ బస్సల సంఖ్య 550కి పెంచుతూ..భక్తుల రద్దీ ఆధారంగా మార్పులుంటాయని KSRTC పేర్కొంది.

శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే  మొత్తం 26 ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసింది.  నవంబర్ 17 నుంచి డిసెంబర్ 2 వరకు ఈ ట్రైన్స్ అందుబాటులో ఉంటాయి. సికింద్రాబాద్, కాచిగూడ, మౌలాలి, కొట్టాయం, కొచ్చి నుంచి ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయి..

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

2026 మార్చి 14 రాశిఫలాలు: ఈరోజు మీ రాశికి శుభమా? అదృష్టం ఎలా ఉండబోతోంది?
2026 మార్చి 14 రాశిఫలాలు: ఈరోజు మీ రాశికి శుభమా? అదృష్టం ఎలా ఉండబోతోంది?
Ugadi Panchangam 2026: మకర రాశివారికి ఈ ఏడాది శని బలం, అదృష్టం మీ సొంతం! సెప్టెంబర్ తర్వాత అన్నీ అద్భుతాలే! ఉగాది పంచాంగం 2026- 2027
ఉగాది పంచాంగం 2026- 2027: మకర రాశివారికి ఈ ఏడాది శని బలం, అదృష్టం మీ సొంతం! సెప్టెంబర్ తర్వాత అన్నీ అద్భుతాలే!
Ugadi Panchangam 2026: ధనస్సు రాశికి శని దోషం ఉన్నా గురు బలంతో అదృష్టం వరిస్తుంది! పరాభవ నామ సంవత్సరం ఉద్యోగం, వ్యాపారం, విద్య ఫలితాలు!
ఉగాది పంచాంగం 2026- 2027: ధనస్సు రాశికి శని దోషం ఉన్నా గురు బలంతో అదృష్టం వరిస్తుంది! పరాభవ నామ సంవత్సరం ఉద్యోగం, వ్యాపారం, విద్య ఫలితాలు!
Ghost: దయ్యాలు తమ రూపాలను మార్చుకుంటాయా? అవి నిజంగా మనుషుల దగ్గరికి రాగలవా?
దయ్యాలు తమ రూపాలను మార్చుకుంటాయా? అవి నిజంగా మనుషుల దగ్గరికి రాగలవా?

వీడియోలు

Gas Cylinders Effect | హాస్టల్స్ లో వివాదంగా మారిన సాంబార్ రైస్..! వెరైటీ టిఫిన్స్ బంద్ | ABP Desam
Josh Hazlewood to Miss IPL 2026 | ఐపీఎల్ 2026కు స్టార్ పేసర్ దూరం? | ABP Desam
Surya Kumar Yadav Apologizes to Axar Patel | అక్షర్ పటేల్‌కు క్షమాపణలు చెప్పిన సూర్య | ABP Desam
Did Dhoni Ruin Yuvraj Singh’s Career? | యువరాజ్ కెరీర్‌ను ధోనీ నాశనం చేశాడా? | ABP Desam
IPL 2026 First Phase Schedule | ఐపీఎల్ 2026 సమరానికి షెడ్యూల్ ఖరారు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Janasena Formation Day: గిరిజనుల మధ్య జనసేన ఆవిర్భావ దినోత్సవం - పవన్ కల్యాణ్ ప్రత్యేక కార్యక్రమం
గిరిజనుల మధ్య జనసేన ఆవిర్భావ దినోత్సవం - పవన్ కల్యాణ్ ప్రత్యేక కార్యక్రమం
Telangana Tenth Class Exams: తెలంగాణ పదో తరగతి పరీక్షలకు అంతా సిద్ధం! ఈ రూల్స్ తెలుసుకోకుంటే ఎగ్జామ్ రాయలేరు!
తెలంగాణ పదో తరగతి పరీక్షలకు అంతా సిద్ధం! ఈ రూల్స్ తెలుసుకోకుంటే ఎగ్జామ్ రాయలేరు!
Telangana RTC Protest : మార్చి 26 నుంచి ఆర్టీసీ బస్‌లకు బదులు రోడ్డెక్కనున్న సిబ్బంది! 31 డిమాండ్‌లతో సర్కారుకు సమ్మె నోటీసు!
మార్చి 26 నుంచి ఆర్టీసీ బస్‌లకు బదులు రోడ్డెక్కనున్న సిబ్బంది! 31 డిమాండ్‌లతో సర్కారుకు సమ్మె నోటీసు!
Womens History Month.. తీర్మానంపై ట్రంప్ సంతకాలు
Womens History Month.. తీర్మానంపై ట్రంప్ సంతకాలు
Ustaad Bhagat Singh Ticket Rates : ఉస్తాద్ భగత్ సింగ్ టికెట్ రేట్స్ పెంపు - బెనిఫిట్ షో టైమింగ్స్ ఇవే!
ఉస్తాద్ భగత్ సింగ్ టికెట్ రేట్స్ పెంపు - బెనిఫిట్ షో టైమింగ్స్ ఇవే!
Farmer admired by CM Chandrababu: ప్రకృతి సేద్యపు ఋషి - 75 సెంట్లలో 52 పంటల అద్భుతం - చంద్రబాబు మెచ్చిన రైతు రోశయ్య
ప్రకృతి సేద్యపు ఋషి - 75 సెంట్లలో 52 పంటల అద్భుతం - చంద్రబాబు మెచ్చిన రైతు రోశయ్య
Aaya Sher Song: ఆయా షేర్ కోసం రెండున్నర ఎకరాల్లో సెట్స్... సాంగ్ సెట్ స్టోరీ తెలుసా?
ఆయా షేర్ కోసం రెండున్నర ఎకరాల్లో సెట్స్... సాంగ్ సెట్ స్టోరీ తెలుసా?
KTR Letter to Amit Shah: రేవంత్ రెడ్డి బినామీ అక్రమాల కేటీఆర్ ఆరోపణలు - అమిత్ షాకు లేఖ- సీబీఐ, ఈడీ విచారణకు డిమాండ్
రేవంత్ రెడ్డి బినామీ అక్రమాల కేటీఆర్ ఆరోపణలు - అమిత్ షాకు లేఖ- సీబీఐ, ఈడీ విచారణకు డిమాండ్
Embed widget