అన్వేషించండి

Ramateertham: చెరువులో దొరికిన రాముడు- అందుకే ఆ క్షేత్రానికి ఆ పేరు వచ్చింది

ఉత్తరాంధ్ర  భద్రాద్రిగా పేరుపొందిన  రామతీర్థం రెండేళ్ల తర్వాత భక్తుల మధ్య శ్రీ రామనవమి జరుపుకోవడానికి సిద్దమైంది. రామతీర్థం అనే పేరు ఎలావచ్చింది, ఈ ఆలయం ప్రత్యేకత ఏంటి... 

రామతీర్థం అనే పేరు ఎలావచ్చిందంటే..

విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల మండలంలో  ఉన్న రామతీర్ధం ఆలయానికి చాలా ప్రాముఖ్యత ఉంది. మొదటి విక్రమేంద్రవర్మ పుత్రుడు ఇంద్రభట్టారక వర్మ  469-496 AD మధ్యకాలంలో ఇక్కడ రాజ్యపాలన చేసినట్లు, ఆ సమయంలోనే ఇక్కడో చిన్న ఆలయం ఉండేదని  చరిత్ర చెబుతుంది. కొన్నేళ్ల తర్వాత ఆ ఆ ఆలయ జాడ కనుమరుగైపోయిందట. మళ్లీ 16వ శతాబ్దంలో  ఓ వృద్ధురాలికి ఇక్కడి చెరువులో శ్రీరామునితో సహా ఇతర దేవతా మూర్తులు  విగ్రహాలు దొరికాయి . ఈ విషయం తెలుసుకున్న అప్పటి పూసపాటి వంశానికి చెందిన మహారాజు భారీ ఆలయం నిర్మించి విగ్రహాలు ప్రతిష్టించారు.  చెరువులో దొరికిన విగ్రహాలు కావడం వల్లే రామతీర్థం అనే పేరు వచ్చింది. ఈ ఆలయాన్ని నిర్మించి విగ్రహాలు ప్రతిష్టించడమే కాదు...ఆలయ నిర్వహణకోసం కొన్ని భూములు ఇనానంగా ఇచ్చారు.  అప్పటి నుంచి ఆయన ఇచ్చిన ఆ భూముల ఆదాయంతోనే ఇప్పటివరకూ ఆలయంలో పూజలు నిర్వహిస్తున్నారు. ఏటా ఇక్కడ జరిగే శ్రీరామనవమి ఉత్సవాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.  నీలాచల కొండకు ,భాస్కర పుష్కరిణి మధ్య పచ్చటి వాతావరణం మధ్యలో ఈ దేవాలయం నిర్మించారు . పురాతన విజయనగర వాస్తు కళకు ఈ ఆలయం ఒక ఉదాహరణ. ఇక్కడ ఉగాది నుంచి శ్రీరామనవమి వరకూ జరిగే ఉత్సవాలకు ఉత్తరాంధ్ర నుంచే కాదు పక్క రాష్ట్రాల నుంచి కూడా భారీగా భక్తులు హాజరవుతారు. 

Also Read: రాముడి కోదండం ఆకారంలో ఆలయం, చుట్టూ రామాయణ ఘట్టాలు, ఈ అద్భుత ఆలయాన్ని ఒక్కసారైనా చూసితీరాల్సిందే

  • రామతీర్ధం ఆలయం రెండుభాగాలుగా ఉంటుంది. మొదటిభాగం కొండకింద విజయనగర రాజులు నిర్మించిన రామతీర్ధం ఆలయం కాగా దాని ఎదురుగా ఉన్న ఎత్తైన కొండపై కోదండరామ స్వామి ఆలయం ఉంటుంది . ఈ కొండనే నీలాచలం అనీ బోధి కొండని కూడా పిలుస్తారు .
  • ద్వాపరయుగంలో పాండవులు వనవాస సమయంలో ఈ ప్రాంతంలో సంచరించారని ప్రతీతి. ఆ సమయంలో కృష్ణుడిని కూడా తమతో రమ్మని పాండవులు కోరితే.. సీతారామలక్ష్మణుల విగ్రహాలను వారికి అందజేసి తన బదులుగా పూజించమని చెప్పాడట. ఇక్కడి భీముని గృహం ఉండడం వారు సంచరించరనడానికి ఆనవాళ్లని చరిత్రకారులు చెబుతారు. 
  • రాముడు ఇక్కడ కొంతకాలం వనవాసం చేశాడని, అప్పుడు శివుడి మంత్రం జపించాడని పురాణాల్లో ఉంది. అందుకే శివరాత్రితో పాటూ కార్తికమాసంలోనూ ఈ  ఆలయం కన్నులపండువగా ఉంటుంది.
  • ఈ ఆలయానికి ఉత్తరాన రెండు కిలోమీటర్ల పొడవూ 600 మీటర్లు ఎత్తున్న ఏకశిలా పర్వతం కనిపిస్తుంది. దీనిపైన సీతారాములు, పాండవులు సంచరించారని చెబుతారు.
  • రామాలయం పక్కనే ఉన్న కోనేరులోని నీరు ఏ కాలంలోనైనా ఇంకిపోవంటారు. ఆ నీటి మడుగు నుంచి పశ్చిమం వైపు వెళ్తే భీముని బుర్ర, గాడీ పొయ్యి, బుద్ధ విగ్రహం, పర్ణశాల, పలుకురాయి, సీతమ్మ పురిటి మంచం తాలూకు చిహ్నాలు కనిపిస్తాయి
  • ఈ ప్రాంతంలో జైనులు, బౌద్ధులు కూడా నివసించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. 
  • ఈ క్షేత్రాన్ని ఆనుకుని చంపావతీ నదీ ప్రవహిస్తూ ఉంటుంది.  
  • విగ్రహాలు దొరికాయని చెప్పే 13 ఎకరాల విస్తీర్ణం లో ఏర్పడ్డ పుష్కరిణి ఎంతో ప్రత్యేకం .
  • ప్రధాన ఆలయంలో శ్రీరామ స్వామి ఎదురుగా ఆంజనేయ స్వామి ఆలయం ఉంది .
  •  పర్వదినాల్లో గ్రామమంతా ఊరేగించే ఉత్సవ మూర్తులు ,వివిధ వాహనాలు ,తులాభారాలు నిర్వహించే త్రాసు లాంటివి ఈ ఆలయ ప్రాంగణంలో భక్తులకు దర్శనం ఇస్తుంటాయి. 

రెండేళ్లుగా కోవిడ్ కారణంగా ఇక్కడ శ్రీరామ నవమి ఉత్సవాలు జరగలేదు . ఏకాంతంగానే అర్చకులు  పూజలు   జరిపించారు . అయితే ఈసారి కోవిడ్ ఉధృతి తగ్గడం తో భక్తుల సమక్షంలో శ్రీరామ నవమి జరపడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు . వాస్తవానికి  రాష్ట్ర విభజన జరిగిన సమయంలో తెలంగాణ కు భద్రాచలం వెళ్ళిపోవడంతో ఆంధ్రా భద్రాద్రిగా రామ తీర్ధాన్ని ప్రకటించాలనే డిమాండ్ వినిపించింది. కానీ కొన్ని కారణాల వల్ల అది ఒంటిమిట్టకు తరలిపోయింది. ఇక్కడ మరో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ శ్రీరామ నవమి వేడుకలు మాత్రమే కాదు శివరాత్రి కూడా కన్నులపండువగా జరుగుతుంది. ఇప్పటికీ ఈ ఆలయానికి పూసపాటి వంశీయులే ధర్మకర్తలుగా ఉన్నారు . 
Also Read:  ఈ లక్షణాలుంటే మీరు కూడా రాముడే-దేవుడే

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

భూమిలో దాచిన నిధుల దగ్గర పాములు ఎందుకు కనిపిస్తాయి, అవి నిజంగా వాటిని కాపలా కాస్తాయా?
భూమిలో దాచిన నిధుల దగ్గర పాములు ఎందుకు కనిపిస్తాయి, అవి నిజంగా వాటిని కాపలా కాస్తాయా?
Today Rashifal June 03: ఈ రోజు రాశి ఫలాలు జూన్ 03, 2026 మేషం నుంచి మీనం వరకు ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ ఫలితాలు!
ఈ రోజు రాశి ఫలాలు జూన్ 03, 2026 మేషం నుంచి మీనం వరకు ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ ఫలితాలు!
Mrigashira Karte 2026 Dates: రోహిణి కార్తె ముగింపు, మృగశిర కార్తె ప్రారంభం - వానలు ఎప్పటి నుంచి మొదలవుతాయి?
రోహిణి కార్తె ముగింపు, మృగశిర కార్తె ప్రారంభం - వానలు ఎప్పటి నుంచి మొదలవుతాయి?
World Oldest Religion: ప్రపంచంలో అత్యంత పురాతన మతం ఏది? శాస్త్రీయ , చారిత్రక ఆధారాలు ఏం చెబుతున్నాయ్?
ప్రపంచంలో అత్యంత పురాతన మతం ఏది? శాస్త్రీయ , చారిత్రక ఆధారాలు ఏం చెబుతున్నాయ్?

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Peddi Ticket Price Hike In Telangana:
Peddi Ticket Price Hike In Telangana: "పెద్ది"కి గుడ్ న్యూస్- తెలంగాణలో టికెట్‌ ధరలు పెంపు
Minister Ponnam Prabhakar counter to Pawan Kalyan: ఔను.. తెలంగాణ మా అయ్యా జాగీరే.. నువ్వొచ్చి ఇక్కడ పీకేదేంది? పవన్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన కౌంటర్!
ఔను.. తెలంగాణ మా అయ్యా జాగీరే.. నువ్వొచ్చి ఇక్కడ పీకేదేంది? పవన్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన కౌంటర్!
TGPSC Recruitment 2026: తెలంగాణ ఇంజినీరింగ్ అభ్యర్థులకు బంపర్ ఆఫర్‌! 290 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్! ఖాళీల పూర్తి వివరాలు ఇవే!
తెలంగాణ ఇంజినీరింగ్ అభ్యర్థులకు బంపర్ ఆఫర్‌! 290 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్! ఖాళీల పూర్తి వివరాలు ఇవే!
NHAI Toll Exemption List: టోల్ ప్లాజాల వద్ద వీఐపీ కల్చర్ కు బ్రేక్: ప్రభుత్వ అధికారుల వాహనాలకు టోల్ మినహాయింపు రద్దు చేయనున్న కేంద్రం
టోల్ ప్లాజాల వద్ద వీఐపీ కల్చర్ కు బ్రేక్: ప్రభుత్వ అధికారుల వాహనాలకు టోల్ మినహాయింపు రద్దు చేయనున్న కేంద్రం
AP DSC Sports Quota Controversy: ఏపీ డీఎస్సీలో పేకాటలో నైపుణ్యం సాధించిన వారికి స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలిచ్చారా? - ఇవిగో సంచలన నిజాలు
ఏపీ డీఎస్సీలో పేకాటలో నైపుణ్యం సాధించిన వారికి స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలిచ్చారా? - ఇవిగో సంచలన నిజాలు
Annamalai Resigns BJP Tamil Nadu: బీజేపీకి సింగం అన్నామలై గుడ్‌బై! ఐదు పేజీల లేఖతో షాక్.. సొంత పార్టీతో ఉపఎన్నికల్లో పోటీ
బీజేపీకి సింగం అన్నామలై గుడ్‌బై! ఐదు పేజీల లేఖతో షాక్.. సొంత పార్టీతో ఉపఎన్నికల్లో పోటీ
Kanpur Petrol Pump Scam: ట్యాంక్ 45 లీటర్ల కెపాసిటీ అయితే 52 లీటర్ల పెట్రోల్ కొట్టేశారట - ఆ కార్ ఓనర్‌కు అడ్డంగా దొరికిపోయిన బంకు శీను
ట్యాంక్ 45 లీటర్ల కెపాసిటీ అయితే 52 లీటర్ల పెట్రోల్ కొట్టేశారట - ఆ కార్ ఓనర్‌కు అడ్డంగా దొరికిపోయిన బంకు శీను
Tamil Nadu Politics | రజనీ ఆశీస్సులతో అన్నామలై కొత్త పార్టీ?
రజనీ ఆశీస్సులతో అన్నామలై కొత్త పార్టీ?.. తమిళనాడులో రాజకీయ భూకంపానికి రంగం సిద్ధం!
Embed widget