అన్వేషించండి

Ram Navami 2025: శ్రీరామనవమి సందర్భంగా రామాయణ పారాయ‌ణం రెండో రోజు - అయోధ్య‌కాండ!

Ayodhya Kanda in Telugu: ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు తొమ్మిది రోజులు...ఈ 9 రోజులు ప్రతి ఇంట్లోనూ రామాయణం పారాయణం చేస్తారు. రెండో రోజు చేయాల్సిన పారాయణ ఇది..

Ram Navami Special 2025

  సంక్షిప్త దివ్య రామాయణ పారాయ‌ణం మొదటి రోజు  బాలకాండ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

సంక్షిప్త దివ్య రామాయణ పారాయ‌ణం రెండో రోజు  అయోధ్య కాండ మొదలు... (Ayodhyakanda)
 
కోస‌ల‌దేశం అయోధ్యా న‌గ‌రం స‌ర్వశోభాయ‌మానంగా అలంకంరించారు.  మిథిలాన‌గ‌రం నుంచి వ‌చ్చిన పెళ్లి వారంద‌రికీ ఆతిథ్యం అందించారు.  వ‌శిష్ఠ మహర్షి ఆదేశానుసారం నూత‌న దంప‌తుల‌కు జ‌రిపించ‌వ‌ల‌సిన కార్య‌క్ర‌మాల‌న్నీ చేశారు. రాజ్యంలో ప్రజలంతా ఉత్సవాలు జరుపుకున్నారు.  భ‌ర‌తుడు, శ‌త్రుఘ్న‌డు తమ తాత‌గారి ఇంట్లో ఓ రోజు ఉండివచ్చేందుకు వెళ్లారు. రాముడి శౌర్య ప్ర‌తాపాల‌ను ప్ర‌జ‌లు   కొనియాడుతున్నారు. అదే సమయంలో దశరథుడు...మంత్రి, సామంత , పురోహిత‌, దండ‌నాదుల‌తో స‌మావేశం ఏర్పాటు చేశాడు. తనకు వ‌య‌సు పైబ‌డిన రీత్యా  రామ‌చంద్రునికి రాజ్య‌భారాన్ని అప్ప‌గించి విశ్రాంతి తీసుకోవాల‌ని ఉందన్నాడు. సరే శ్రీరామ పట్టాభిషేకం జరిపిద్దాం అన్నారంతా. మ‌హారాజు అందరకీ అభివాదం చేసి కుల‌గురువులు వ‌శిష్ఠుడి వైపు చూసి ప‌ట్టాభిషేకానికి సుమూహూర్తం నిర్ణ‌యించ‌మ‌ని కోరాడు. పుష్య‌మీ న‌క్ష‌త్ర‌యుక్త  సుముహూర్తం నిర్ణ‌యించి రేపే పట్టాభిషేకం అన్నారు. వెంట‌నే రామ‌చంద్రుని స‌భామందిరానికి పి‌లిపించి ప‌ట్టాభిషేకం గురించి చెప్పాడు. రాముడు తండ్రికి పాదాభివంద‌నం చేసి అక్క‌డి నుంచి వెళ్లి త‌ల్లి కౌస‌ల్య‌కు ఈ విష‌యం చెప్పాడు. ప‌ట్టాభిషేకానికి వ్ర‌త‌దీక్ష‌ను త‌మ‌చేత పూర్తిచేయించాల్సిందిగా కోరాడు. 

శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మేషం నుంచి మీనం వరకూ 12 రాశుల సంవత్సర ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి

కైక- ద‌శ‌ర‌థుడి వ‌రాలు

అయోధ్య వాసులంతా సంబ‌రాల్లో మునిగితేలుతున్నారు.  అదే స‌మ‌యంలో కైకేయి దాసి మంధ‌ర ఈ ఉత్స‌వాల హ‌డావుడి చూసి విషయం ఏంటా అని ఆరాతీసింది. పట్టాభిషేకం గురించి తెలుసుకుని కైకేయి మందిరానికి వెళ్లింది మంధర. అంతా అయిపోయింది. రామ‌చంద్రుడు రాజుకాబోతున్నాడు. భరతుడు రాజుకావాల్సింది అని నూరిపోసింది..గతంలో దశ‌ర‌థ‌ుడు గ‌తంలో కైకేయికిఇచ్చిన  రెండు వ‌రాలు గుర్తుచేసింది. కైకేయికి ఇష్టం లేక‌పోయినా మంథ‌ర మాట‌లు క్ర‌మంగా ప‌నిచేసి అల‌క మందిరానికి వెళ్లిపోయింది. ద‌శ‌ర‌ధుడు అల‌క మందిరం చేరుకుని విష‌యం తెలుసుకుని బాధ‌ప‌డ్డాడు. కైకేయిని బ్ర‌తిమలాడాడు. కన్నీళ్లు పెట్టుకున్నాడు. కానీ కైకేయి మాత్రం భ‌ర‌తుడి ప‌ట్టాభిషేకం జ‌ర‌గాల‌ని ప‌ట్టుబ‌ట్టింది. రాముడు 14 సంవ‌త్స‌రాలు అరణ్య వాసం చేయాల‌ని, నార‌బ‌ట్ట‌లు క‌ట్టి సంచ‌రించాల‌ని కోరింది. కైకేయి మాట‌ల‌కుద‌శ‌ర‌థుడు మూర్ఛ‌పోయాడు. 

రామ ప‌ట్టాభిషేకానికి ప‌నులుసాగుతున్నాయి. ఇంత‌లోనే కైకేయి రాముడిని పిలిపించి దశరథుడు  త‌న‌కు ఇచ్చిన వ‌రాల గురించి తెలియ‌జేసింది.  అమ్మా..నాన్నగారు స్వ‌యంగా ఈ విష‌యం చెప్తేనేను కాదంటానా..వారు ఆదేశిస్తే ప్రాణాలైనా విడ‌వ‌డానికి నేను సిద్ధ‌మే కదా అన్నాడు.  ల‌క్ష్మ‌ణుడికి ఈ వార్త తెలిసి ఆగ్రహంతో ఊగిపోయాడు. కౌస‌ల్యా  ఈ విష‌యం తెలుసుకుని త‌ల్ల‌డిల్లింది. అర‌ణ్య‌వాసానికి సిద్ధపడిన రాముడితో పాటూ బయలుదేరాడు ల‌క్ష్మ‌ణుడు. సీతమ్మ కూడా స్వామి వెంటే బయలుదేరింది. సుమంత్రుడు తీసుకొచ్చిన ర‌థంలో సీతా, రామ లక్ష్మ‌ణులు అర‌ణ్య‌వాసానికి బ‌య‌లుదేరారు.  

రామ‌చంద్ర‌డు లేని అయోధ్య‌లో ఉండ‌లేమంటూ  ర‌థం వెంట బ‌య‌లుదేరారు కొందరు. సాయంత్రానికి  ఓ న‌ది ఒడ్డుకుచేరి అక్క‌డ విశ్ర‌మించారు. జ‌నం కూడా అక్క‌డ విశ్ర‌మించారు. రాత్రి పొద్దుపోయాక‌, సుమంత్రా ఈ జ‌నం ఇలాగే నాతో అడవికి వ‌చ్చేలా ఉన్నారంటూ వాళ్లంతా నిద్రలేవకముందే బయలుదేరాలి అని చెప్పి అక్కడి నుంచి గంగానదీ తీరం చేరారు. గుహుడు వారికి స్వాగ‌తం ప‌లికి ఆతిథ్యం ఇచ్చాడు. సుమంత్రుడికి చెప్ప‌వ‌ల‌సిన జాగ్ర‌త్త‌లుచెప్పి  వీడ్కోలు ప‌లికాడు రాముడు.  సీతారామ ల‌క్ష్మ‌ణులు గుహుడు ఏర్పాటుచేసిన ప‌డ‌వ‌లో గంగాన‌ది దాటి అర‌ణ్యంలోకి ప్ర‌వేశించారు. వారు కంటికి క‌నిపించ‌నంత దూరం వ‌ర‌కూ వారిని చూస్తేనే ఉండి వెన‌క్కు తిరిగివ‌చ్చాడు గుహుడు. సీతా,రామ‌ల‌క్ష్మ‌ణులు అలాఅర‌ణ్య మార్గంలో ముందుకు సాగుతున్నారు. స‌ర్యాస్త‌మ‌య వేళ‌కు ప్ర‌యాగ‌కు స‌మీపంలో ని భరద్వాజ మ‌హ‌ర్షి ఆశ్ర‌మం చేరుకున్నారు. మ‌హ‌ర్షికి న‌మ‌స్క‌రించి వారి ఆతిథ్యం స్వీక‌రించారు. అక్క‌డి నుంచి మాల్య‌వ‌తీ తీరం చేరి చిత్ర‌కూట ప్రాంతంలో ఆశ్ర‌మం ఏర్పాటు చేసుకున్నారు.

శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మేషం నుంచి మీనం వరకూ 12 రాశుల ఆదాయ వ్యయాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి

అయోధ్య‌లో అంతా భార‌మైన హృద‌యంతో ఉన్నారు. ఒంట‌రిగా వ‌చ్చిన సుమంత్రుడిని చూసి ద‌శ‌ర‌ధుడు  మూర్ఛ‌పోయాడు. పుత్ర‌శోకంతో ద‌శ‌ర‌ధుడు ఆ రాత్రి క‌న్నుమూశాడు. తాతగారి భరతుడు, శత్రుఘ్నుడు అయోధ్య‌ప్ర‌వేశిస్తూనే జ‌ర‌గ‌రానిదేదో జ‌రిగింద‌ని గ‌మ‌నించారు. తండ్రిమ‌ర‌ణ‌వార్త విని త‌ల్ల‌డిల్లారు. జరిగిన విషయం తెలుసుకుని రాముడిని వెతుక్కుంటూ వెళ్లాడు. గుహుడి సాయంతో గంగా న‌దిని దాటి.. భ‌ర‌ద్వాజ మ‌హ‌ర్షి ఆశ్ర‌మానికి వెళ్లారు. రాముడికి తిరిగి సింహాసనం అప్ప‌గించేందుకు భ‌ర‌తుడు వ‌చ్చాడ‌ని తెలిసి భ‌ర‌ద్వాజ మ‌హ‌ర్షి సంతోషించాడు. రాముడు చిత్ర‌కూటంలో నివ‌శిస్తున్నాడ‌ని చెప్పాడు. శ్రీ‌రాముడిని చేరుకోగానే భ‌ర‌త‌,శ‌తృఘ్నలు పాదాల‌పై ప‌డ్డారు. తండ్రి గారు ఎలా ఉన్నార‌ని అడిగి రాజ‌ధర్మం స‌క్ర‌మంగా నిర్వ‌ర్తిస్తున్నావా అడి అడిగాడ.  ఇంకెక్క‌డి తండ్రి అన్న‌య్యా అంటూ మరణవార్త చెప్పాడు. తిరిగి రాజ్యానికి రమ్మని వేడుకున్నాడు రాముడు సున్నితంగా తిరస్కరించడంతో పాదుకలు తీసుకుని అయోధ్యకు తిరుగుపయనం అయ్యాడు భరతుడు. 
 
అరణ్య‌వాసంలో ఉన్న రామచంద్ర‌ుడు చిత్ర కూటం  నుంచి  అత్రి మ‌హ‌ర్షి ఆశ్ర‌మ ప్రాంతానికి వెళ్లి అక్కడ ఆతిథ్యం పొందారు. ఆ రాత్రి అక్క‌డ విడిది చేసి మ‌రునాడు వారు ముందుకు క‌దిలేందుకు సిద్ధ‌మయ్యారు. మీరు వెళ్లే దారిలో రాక్షసులు ఉంటారు జాగ్ర‌త్త అంటూ మహ‌ర్షులు సూచ‌న చేశారు. వారికి ప్ర‌ణ‌మిల్లి సీతా,రామ ల‌క్ష్మ‌ణులు అర‌ణ్య‌మార్గంలో ముందుకు సాగారు.
 
( అయోధ్య‌కాండ స‌మాప్తం)

శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో  మీ నక్షత్రం ప్రకారం కందాయ ఫలాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి 

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

2026 మార్చి 24 రాశిఫలాలు: మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారికి ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ ఫలితాలు!
2026 మార్చి 24 రాశిఫలాలు: మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారికి ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ ఫలితాలు!
Vastu Tips for Puja Room: ఇంట్లో పూజ గదికి సంబంధించి ముఖ్యమైన వాస్తు నియమాలు - మీ ప్రశ్నలకు సమాధానాలు ఇవిగో!
ఇంట్లో పూజ గదికి సంబంధించి ముఖ్యమైన వాస్తు నియమాలు - మీ ప్రశ్నలకు సమాధానాలు ఇవిగో!
శని అనుగ్రహం పొందడం అత్యంత సులభం! మీ జీవితంలో మార్పులు తెచ్చే రహస్యాలు, పరిహారాలు తెలుసుకోండి!
శని అనుగ్రహం పొందడం అత్యంత సులభం! మీ జీవితంలో మార్పులు తెచ్చే రహస్యాలు, పరిహారాలు తెలుసుకోండి!
తిరుమలలో అత్యాధునిక ఫుడ్ అనాలిసిస్ ల్యాబ్‌ను ప్రారంభించిన చంద్రబాబు, TTD ఆలయాలను ఆధునిక ఆధ్యాత్మిక కేంద్రాలుగా తీర్చిదిద్దాలని ఆదేశం!
తిరుమలలో అత్యాధునిక ఫుడ్ అనాలిసిస్ ల్యాబ్‌ను ప్రారంభించిన చంద్రబాబు, TTD ఆలయాలను ఆధునిక ఆధ్యాత్మిక కేంద్రాలుగా తీర్చిదిద్దాలని ఆదేశం!

వీడియోలు

5 key Reasons behind Trump's decision to halt war | ఇరాన్ పై 5 రోజులపాటు దాడులకు విరామం ప్రకటించిన ట్రంప్. ఆయన నిర్ణయం వెనుక 5 ప్రధాన కారణాలపై విశ్లేషణ
MS Dhoni about IPL Retirement | రిటైర్మెంట్ పై క్లారిటీ ఇచ్చిన తల ధోని | ABP Desam
Virat Kohli Reacts on Fake News | ఫేక్ వార్తలపై విరాట్ ఫన్నీ రియాక్షన్ | ABP Desam
Abhishek Sharma Shouts 'Jai Babu' | జై బాబు అంటూ అభిషేక్ శర్మ రచ్చ | ABP Desam
Aakash Chopra comments on SRH | SRH బౌలింగ్‌పై ఆకాశ్ చోప్రా ఘాటు వ్యాఖ్యలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Foundation stone laid for steel plant: చంద్రబాబు చొరవతోనే ఏపీలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు - స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనలో మిట్టల్ ప్రశంసలు
చంద్రబాబు చొరవతోనే ఏపీలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు - స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనలో మిట్టల్ ప్రశంసలు
Hyderabad Latest News: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో విస్తరణ! సీఎం రేవంత్ రెడ్డి భారీ రోడ్డు మ్యాప్!
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో విస్తరణ! సీఎం రేవంత్ రెడ్డి భారీ రోడ్డు మ్యాప్!
YS Sharmila On Jagan: నాది ఆస్తుల పోరాటం కాదు.. వివేకా హత్యపై నిజాల వేట - జగన్‌పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు
నాది ఆస్తుల పోరాటం కాదు.. వివేకా హత్యపై నిజాల వేట - జగన్‌పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు
Pawan Kalyan : పొలిటికల్ థ్రిల్లర్‌కు పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్? - డైరెక్టర్ ఎవరో తెలుసా!
పొలిటికల్ థ్రిల్లర్‌కు పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్? - డైరెక్టర్ ఎవరో తెలుసా!
Gold and Silver Price: పసిడి, వెండి మార్కెట్‌లో పెను ప్రకంపనలు; మూడు గంటల్లోనే 165 లక్షల కోట్లు మాయం- ఇరాన్ యుద్ధం వేళ షాకింగ్ పరిణామం!
పసిడి, వెండి మార్కెట్‌లో పెను ప్రకంపనలు; మూడు గంటల్లోనే 165 లక్షల కోట్లు మాయం- ఇరాన్ యుద్ధం వేళ షాకింగ్ పరిణామం!
Stock Market 23 March: కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
Harish Rao: ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
National Highways: జాతీయ రహదార్లపై ఏఐ నిఘా!లోపాలు గుర్తించే సరికొత్త డ్యాష్‌ క్యామ్‌ టెక్నాలజీ!
జాతీయ రహదార్లపై ఏఐ నిఘా!లోపాలు గుర్తించే సరికొత్త డ్యాష్‌ క్యామ్‌ టెక్నాలజీ!
Embed widget