అన్వేషించండి

Kalki 2898 AD Kurukshetra : మహాభారత యుద్ధం జరిగిన కురుక్షేత్ర ఎక్కడుంది..ఎలా వెళ్లాలి..అక్కడ చూసేందుకు ఏమున్నాయ్?

మహాభారత యుద్ధం కురుక్షేత్ర భూమిలోనే ఎందుకు జరిగింది? దృతరాష్ట్రుడు ఆ ప్రదేశాన్నే ఎందుకు ఎంపిక చేశాడు? ఆ స్థలం విశిష్టత ఏంటి? ఎక్కడుందా ప్రదేశం, ఎలా చేరుకోవాలి, అక్కడ ఇంకా ఏమేం చూడొచ్చు...

Mahabharatam Kurukshetra : కురుక్షేత్ర అంటే కేవలం మహాభారత యుద్ధం జరిగిన స్థలం మాత్రమే కాదు. హర్యానా రాష్ట్రంలో ఉన్న ఆ ప్రదేశానికి ఓ విశిష్టత ఉందని స్థలపురాణం చెబుతోంది. ద్వాపరయుగంకన్నా ముందు ఈ ప్రదేశానికి కురు అనే రాజు వచ్చాడు. ఆ చుట్టుపక్కల 8 నదులు పరవళ్లు తొక్కుతూ ప్రవహించడం చూసిన ఆ రాజు..తన బంగారు రథం నుంచి కిందకు దిగివచ్చి నాగలి తయారు చేశాడు. ఆ తర్వాత పరమేశ్వరుడిని పూజించి నందిని, యముడిని ప్రార్థించి మహిషాన్ని తీసుకొచ్చి ఆ నాగలికి కట్టి భూమి దున్నడం ప్రారంభించాడు. అక్కడకు వచ్చిన ఇంద్రుడు.. ఏం చేస్తున్నావని ప్రశ్నించాడు. సత్యం, దయ, క్షమ, దానం, స్వచ్ఛత, నిష్కామం, బ్రహ్మచర్యం, యోగం అనే 8 పంటలు పండించేందుకు ఉపక్రమిస్తున్నానని చెప్పాడు కురు రాజు. ఆ తర్వాత శ్రీ మహావిష్ణువు స్వయంగా దిగివచ్చి అదే ప్రశ్న అడిగితే..మళ్లీ అదే సమాధానం చెప్పాడు కురు మహారాజు. అయితే విత్తనాలేవని అడిగితే..తన శరీరాన్ని అప్పగించాడు. అప్పుడు ఏవరం కావాలో కోరుకోమనడంతో కురురాడు..వెంటనే తాను మరణించిన తర్వాత ఈ ప్రదేశం తనపేరుతో వర్థిల్లాలని..ఇక్కడ పోయిన ప్రతిప్రాణి స్వర్గానికి చేరుకోవాలన్నాడు. సరే అని వరమిచ్చాడు శ్రీ మహావిష్ణువు. అలా కురు రాజు క్షేత్రంగా మలచాలి అనుకున్నప్రదేశం కురుక్షేత్రం అయింది.  

Also Read: మహాభారత విషాద వీరుడు సూర్య పుత్ర కర్ణుడిని ముంచేసిన మూడు శాపాలు ఇవే!

ధృతరాష్ట్రుడు ఈ ప్రదేశం ఎందుకు ఎంపిక చేశాడు?

మాయాజూదంలో ఓడిన పాండవువు అరణ్యవాసం, అజ్ఞాతవాసం పూర్తిచేసుకున్నాక మహాభారతయద్ధం జరిగింది. మహా సంగ్రామాన్ని ఎక్కడ నిర్వహించాలి అనే చర్చ జరిగినప్పుడు అప్పుడు కురుక్షేత్రం ప్రదేశాన్ని ఎంపిక చేశాడు ధృతరాష్ట్రుడు. దీనివెనుకున్న ఉద్దేశం ఏంటంటే.. పరాక్రమవంతులు, ధర్మపరులైన పాండవు చేతిలో తన సంతానం అయిన కౌరవులు ఎలాగూ మరణిస్తారు..వారికి స్వర్గప్రాప్తి కలగాలనే ఉద్దేశంతో ఈ ప్రాంతాన్ని ఎంపిక చేశాడని చెబుతారు.  

Also Read: కర్ణుడు - అర్జునుడు ఇద్దరిలో ఎవరు బలవంతులు? కల్కి 2898 AD సినిమాలో ఏం చూపించారు - పురాణాల్లో ఏముంది?

కురుక్షేత్రలో ఏమున్నాయ్?

కురుక్షేత్రలో చూసితీరాల్సిన కట్టడాలేమీ లేవు. బ్రహ్మసరోవరం అనే ఓ కొలను..దాని ఒడ్డునే లక్ష్మీనారాయణుడి పురాతన ఆలయం ఉంటుంది. అప్పట్లో చాలా పెద్దదిగా ఉండే కొలనును పునర్నించారు. ప్రస్తుతం దీని పొడవు 1170 మీటర్లు..ఇక్కడ స్నానమాచరించడం పుణ్యప్రదంగా భావిస్తారు. ముఖ్యంగా గ్రహణ స్నానాలు ఆఛరిస్తుంటారంచా. ఉత్తర ప్రదేశ్ లో చాలా ప్రాంతాల నుంచి గ్రహణం రోజు వచ్చి స్నానమాచరించే భక్తులతో కురుక్షేత్రలో ఉన్న బ్రహ్మరసరోవరం నిండిపోతుంది. ఈ ప్రదేశానికి సమీపంలో రానురాను కొన్ని ఆలయాలు నిర్మించారు. కురుక్షేత్ర నుంచి దూరంగా ఓ చిన్న ఆలయానికి ఆనుకుని దిగుడుబావి లాంటి కొలను ఉంటుంది. కురుక్షేత్ర సంగ్రామం ముగిసిన తర్వాత అంపశయ్యమీదున్న భీష్ముడి దాహం తీర్చేందుకు అర్జునుడు వేసిన బాణం ద్వారా ఆ కొలను ఏర్పడిందని చెబుతారు. కురుక్షేత్రకి మరోవైపు జ్యోతి సర్ అని మరో కొలను ఒడ్డున అర్జునుడికి శ్రీకృష్ణుడు గీతోపదేశం చేసినట్టు స్థలపురాణం. బ్రహ్మ సరోవరం ఒడ్డునే ఉండే రోడ్డుకు రెండో వైపు బిర్లా ధర్మశాల, జాట్ ధర్మశాలలున్నాయి. 

Also Read: శంబల నగరం ఎక్కడుంది , ఇప్పటివరకూ ఎవరెవరు వెళ్లొచ్చారు - శంబల గురించి ఆశ్చర్యపోయే విషయాలివే!

కురుక్షేత్ర ఎలా చేరుకోవచ్చు?

ఈ ప్రదేశం కురుక్షేత్ర, తానేశ్వర్ అనే జంటనగరాలుగా ఉంటుంది. ఇక్కడున్న స్థానీశ్వరుడి ఆలయం పేరుమీద ఈ పేరు వచ్చింది.ఈ సమీపంలోనే అత్యంత పురాతనమైన భద్రకాళి ఆలయం కూడా ఉంది. దిల్లీ నుంచి ఉత్తరంగా చండీగఢ్, జమ్మూ వైపు వెళ్లే రైలు మార్గంలో కురుక్షేత్ర ఉంటుంది. దిల్లీ నుంచి దాదాపు 165 కిలోమీటర్లు ఉన్న కురుక్షేత్ర చేరుకోవాలంటే ట్రైన్లోనే నాలుగున్నర గంటలు పట్టేస్తుంది. బస్సుల్లో వెళ్లాలి అనుకుంటే దిల్లీ నుంచి బస్సులు అందుబాటులో ఉంటాయి..

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

IND vs NZ 3rd ODI: కీలకమైన మూడో వన్డేలో పరుగుల వర్షమే.. పిచ్ రిపోర్ట్, IND vs NZ ప్లేయింగ్ XI అంచనా
కీలకమైన మూడో వన్డేలో పరుగుల వర్షమే.. పిచ్ రిపోర్ట్, IND vs NZ ప్లేయింగ్ XI అంచనా
AR Rahman Vs Kangana Ranaut: ఏఆర్ రెహమాన్‌పై విమర్శలు గుప్పించిన కంగనా రనౌత్... నన్ను కలవలేదు, అంత ద్వేషమా?
ఏఆర్ రెహమాన్‌పై విమర్శలు గుప్పించిన కంగనా రనౌత్... నన్ను కలవలేదు, అంత ద్వేషమా?
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
CM Revanth Reddy: ఖమ్మంలో కీలక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
ఖమ్మంలో కీలక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

వీడియోలు

Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్
Vande Bharat Sleeper Train Started | పచ్చ జెండా ఊపి వందేభారత్ స్లీపర్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ | ABP Desam
WPL 2026 RCB vs GG Highlights | హ్యాట్రిక్ కొట్టిన బెంగళూరు!
Ashwin about India vs New Zealand | టీమ్ సెలక్షన్ పై అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Manoj Tiwari about Rohit Sharma Captaincy | రోహిత్ కెప్టెన్సీపై మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs NZ 3rd ODI: కీలకమైన మూడో వన్డేలో పరుగుల వర్షమే.. పిచ్ రిపోర్ట్, IND vs NZ ప్లేయింగ్ XI అంచనా
కీలకమైన మూడో వన్డేలో పరుగుల వర్షమే.. పిచ్ రిపోర్ట్, IND vs NZ ప్లేయింగ్ XI అంచనా
AR Rahman Vs Kangana Ranaut: ఏఆర్ రెహమాన్‌పై విమర్శలు గుప్పించిన కంగనా రనౌత్... నన్ను కలవలేదు, అంత ద్వేషమా?
ఏఆర్ రెహమాన్‌పై విమర్శలు గుప్పించిన కంగనా రనౌత్... నన్ను కలవలేదు, అంత ద్వేషమా?
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
CM Revanth Reddy: ఖమ్మంలో కీలక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
ఖమ్మంలో కీలక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
Rafale Fighter Jets: భారత్‌లో తయారుకానున్న రాఫెల్ ఫైటర్ జెట్స్.. విదేశాలకు ఎగుమతితో ఎలైట్ క్లబ్‌లోకి
భారత్‌లో తయారుకానున్న రాఫెల్ ఫైటర్ జెట్స్.. విదేశాలకు ఎగుమతితో ఎలైట్ క్లబ్‌లోకి
Shefali Jariwala Death Reason: చేతబడి వల్లే నా భార్య మరణించింది... అజ్ఞాతవాసి, సర్కారు వారి పాట విలన్
చేతబడి వల్లే నా భార్య మరణించింది... అజ్ఞాతవాసి, సర్కారు వారి పాట విలన్
Mrunal Thakur: వెడ్డింగ్ న్యూస్ తర్వాత ఇన్‌స్టాలో మృణాల్ ఠాకూర్ ఫస్ట్ పోస్ట్... ధనుష్ కనెక్షన్ ఉందా?
వెడ్డింగ్ న్యూస్ తర్వాత ఇన్‌స్టాలో మృణాల్ ఠాకూర్ ఫస్ట్ పోస్ట్... ధనుష్ కనెక్షన్ ఉందా?
Embed widget