అన్వేషించండి

Madhuban mein Radhika: మధుబన్ లో ఏం జరిగింది, సన్నీ లియోన్ సాంగ్ పై ఎందుకీ వివాదం..

"మధుబన్ మే రాధికా నాచే" ఆల్బమ్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొన్నటి వరకు పూజారులు ఆగ్రహం వ్యక్తం చేయగా మధ్యప్రదేశ్ హోం మంత్రి సన్నీకి వార్నింగ్ ఇచ్చారు. ఇంతకీ మధుబన్ అంటే ఏంటి..అక్కడ ఏం జరిగేది!

సన్నీలియోన్ ‘మధుబన్‌ మే రాధిక నాచే’ వీడియో ఆల్బమ్‌ విడుదలైంది. డిసెంబర్ 22న విడుదల చేసిన ఈ సాంగ్  సోషల్ మీడియాలో దుమ్ములేపుతోంది. అయితే ఉత్తర ప్రదేశ్‌లోని ప్రవిత్ర స్థలాల్లో ఒకటైన ‘మధుర’కు చెందిన పూజారులు ఆ పాటపై అభ్యంతరం వ‍్యక్తం చేశారు. పలు రాష్ట్రాల మంత్రులు కూడా దీనిపై స్పందించి.. ఆ సాంగ్ తొలగించాలన్నారు. ఈ పాటలో సన్నీ లియోన్‌ చేసిన అశ్లీల నృత్యం మతపరమైన మనోభావాలను కించపరిచేలా ఉందన్నారు. ఇంతకీ మధుబన్ లో ఏం జరిగింది... సన్నీ లియోన్ సాంగ్ లో ఏముంది... 

నాస్తికులకు, హేతువాదులకు కూడా ఇప్పటికీ అంతుచిక్కని రహస్యం ఆ ఆలయం. అక్కడ దేవుడు లేడని నిరూపించేందుకు అర్థరాత్రి కాపుకాసినా, కెమెరాలు పెట్టినా , ఎంత మంది ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. అలాంటి ప్రదేశాల్లో ఒకటి మధురలో నిధివన్. ఇక్కడ అర్థరాత్రి ఏం జరుగుతుందో తెలుసుకుందామనుకున్నప్పటీ ద్వాపరయుగం నుంచి కలియుగం వరకూ అది రహస్యంగానే మిగిలిపోయింది.

Also Read:  బొట్టు పెట్టుకునే అలవాటుందా .. అయితే ఈ వేలితో పెట్టుకుంటే ఆయుష్షు పెరుగుతుందట…
ఉత్తర ప్రదేశ్ రాష్ర్టంలోని మధుర జిల్లా బృందావనలోని ఉంది మధుబన్. ఈ స్థలం ప్రత్యేకత ఏంటంటే ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు నిత్యం రాధను కలుసుకోవడానికి ఇక్కడికి వచ్చేవాడని చెబుతారు. అది ఇప్పటికీ కొనసాగుతుందంటారు. అదృశ్య రూపంలో రాధాకృష్ణులు గోపికలతో కలసి ఇక్కడ రాత్రిపూట నాట్యం చేస్తుంటారని చెబుతారు. అందుకే  మధుబన్ ప్రధాన ఆలయం ద్వారాలను సూర్యాస్తమయం అయిన వెంటనే మూసివేస్తారు. ప్రవేశ ద్వారానికి ఏకంగా తాళం పెట్టేస్తారు.  చీకటి పడిన తర్వాత మనుషులు మాత్రమే కాదు పక్షులు కూడా ఇక్కడకు వెళ్లవంటారు. ఇందుకు నిదర్శనం ఏంటంటే పగలంతా ఆ వనంలో ఉండే వందల సంఖ్యలో కోతులు, పక్షులు కూడా చీకటిపడగానే ఏమైపోతాయో తెలియదట. 

Also Read: పద్మవ్యూహం అనే మాట పదే పదే వాడేస్తుంటాం కానీ.. పద్మవ్యూహం ఎంత భయంకరంగా ఉంటుందో తెలిస్తే..
అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఆతృతతో ఎవరైనా సహాసం చేసినా చనిపోవడమో, మతిస్థిమితం కోల్పోవడమో జరుగుతుందని స్థానికుల విశ్వాసం. గతంలో అలా జరిగిందని కూడా కథలు కథలుగా చెబుతారు. పైగా ఆ వనానికి చుట్టూ ఉన్న ఏ ఇంటికీ ఎంట్రన్స్ అటువైపు ఉండదు. చీకటి పడగానే అటువైపు ఉన్న కిటికీలు కూడా మూసేస్తారట. ఇప్పటికీ రాథాకృష్ణులు అక్కడ ఏకాంతంగా గడుతారని ఇందుకు నిదర్శనంగా రాత్రివేళ గజ్జెల శబ్దం, వేణనాదం వినిపిస్తాయని అక్కడి చుట్టుపక్కల వారు చెబుతారు. 

Alos Read: తీర్థం తీసుకుని చేయి తలకు రాసుకుంటున్నారా…
ఇక్కడి మరో ప్రత్యేకత ఏంటంటే మొక్కల కాండాలన్నీ ఒకేలా ఉంటాయి. చుక్కనీరు పోయకపోయినా పచ్చగా కళకళలాడుతుంటాయంటే అదంతా కృష్ణమాయ అంటారు. వనం మధ్యలో ఉన్న రంగమహల్ లోనే రాధ, కృష్ణులు నాట్యం తర్వాత ఏకాంతంగా గడుపుతారని పూజారులు చెబుతారు. అందువల్లే రాత్రి ఆలయ ద్వారం మూసే ముందు అలంకరించిన మంచం, ఓ వెండి గ్లాను నిండా పాలు, స్వీట్స్, పళ్లు, తాంబూలం, అలంకార వస్తువులు అక్కడ ఉంచుతారట. ఆలయ ద్వారం తీసే సమయానికి తాంబూలం తిని ఉమ్మిన గుర్తులు, పాలు తాగిన ఆనవాళ్లతో పాటూ మంచంపై దుప్పటి చెదిరి ఉంటుందట. వేల సంవత్సరాలుగా ఇదే తంతు జరుగుతోందని చాలామంది భక్తులు చెబుతారు. 

Also Read: తిరుప్పావై అంటే ఏంటి, ఆండాళ్ ఎవరు.. గోదాదేవి రాసిన 30 పాశురాల ప్రత్యేకత ఏంటి…
ఇక్కడ ఏం జరుగుతోందో వాస్తవం తెలుసుకుంటామంటూ ఎందరో నాస్తికులు, హేతువాదులు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవేమీ ఫలించలేదని దేవుడున్నాడని చెప్పేందుకు ఇంతకన్నా నిదర్శం ఏంటంటారు కృష్ణ భక్తులు. ఇప్పుడు అలాంటి ప్రాంతాన్ని కించపరిచేలా సన్నీలియోన్ సాంగ్ ఉందంటున్నారు. సిగ్గుపడే సాహిత్యం, సాహిత్యం విలువలే దిగజార్చేలా ఉందని నెటిజన్లు  ఆవేదన వ్యక్తం చేశారు. 1960లో కోహినూర్‌ సినిమాలో మహమ్మద్ రఫీ ఆలపించిన పాటను రీమేక్‌ చేసి ఇలా మధుబన్ లో రాధికా నాట్యం చేసినట్లుగా రూపొందించారు...

Also Read: మంచి భర్త లభించాలన్నా.. సంసార జీవితం సంతోషంగా సాగాలన్నా ఈ నెలరోజులు చాలా ముఖ్యమట...
Also Read: కలియుగం అంతం అయ్యేసరికి మనిషి ఆయుష్షు ఎంతో తెలిస్తే షాకైపోతారు..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP DSC: ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
KTR Comments: కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలు కేసీఆర్‌ను దెబ్బతీయలేవు- నేతల వలసలపై కేటీఆర్‌ సంచలన కామెంట్స్
కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలు కేసీఆర్‌ను దెబ్బతీయలేవు- నేతల వలసలపై కేటీఆర్‌ సంచలన కామెంట్స్
Tillu Square: ‘టిల్లు స్క్వేర్’ వచ్చేది ఆ ఓటీటీలోనే - టీవీ చానెల్ కూడా ఫిక్స్!
‘టిల్లు స్క్వేర్’ వచ్చేది ఆ ఓటీటీలోనే - టీవీ చానెల్ కూడా ఫిక్స్!
Andhra Pradesh News: ఉపాధి కూలీ లక్కప్ప, అంగన్‌వాడీ వర్కర్‌ శిరీషకు అసెంబ్లీ టికెట్ - ఏపీ రాజకీయాల్లో వీళ్లే స్పెషల్
ఉపాధి కూలీ లక్కప్ప, అంగన్‌వాడీ వర్కర్‌ శిరీషకు అసెంబ్లీ టికెట్ - ఏపీ రాజకీయాల్లో వీళ్లే స్పెషల్
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

RR vs DC Highlights IPL 2024 | Avesh Khan Bowling | చివరి ఓవర్ లో 4 పరుగులే ఇచ్చిన ఆవేశ్ ఖాన్ | ABPRR vs DC Highlights IPL 2024 | Riyan Parag Batting | పాన్ పరాగ్ అన్నారు..పరేషాన్ చేసి చూపించాడుRR vs DC Match Highlights IPL 2024: ఆఖరి ఓవర్ లో అదరగొట్టిన ఆవేశ్, దిల్లీపై రాజస్థాన్ విజయంYS Jagan vs Sunitha | YS Viveka Case: ప్రొద్దుటూరు సభలో జగన్ కామెంట్స్ కు వివేకా కుమార్తె కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP DSC: ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
KTR Comments: కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలు కేసీఆర్‌ను దెబ్బతీయలేవు- నేతల వలసలపై కేటీఆర్‌ సంచలన కామెంట్స్
కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలు కేసీఆర్‌ను దెబ్బతీయలేవు- నేతల వలసలపై కేటీఆర్‌ సంచలన కామెంట్స్
Tillu Square: ‘టిల్లు స్క్వేర్’ వచ్చేది ఆ ఓటీటీలోనే - టీవీ చానెల్ కూడా ఫిక్స్!
‘టిల్లు స్క్వేర్’ వచ్చేది ఆ ఓటీటీలోనే - టీవీ చానెల్ కూడా ఫిక్స్!
Andhra Pradesh News: ఉపాధి కూలీ లక్కప్ప, అంగన్‌వాడీ వర్కర్‌ శిరీషకు అసెంబ్లీ టికెట్ - ఏపీ రాజకీయాల్లో వీళ్లే స్పెషల్
ఉపాధి కూలీ లక్కప్ప, అంగన్‌వాడీ వర్కర్‌ శిరీషకు అసెంబ్లీ టికెట్ - ఏపీ రాజకీయాల్లో వీళ్లే స్పెషల్
Telangana News: కాంగ్రెస్ లో చేరేందుకు మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తీవ్ర ప్రయత్నాలు, వద్దే వద్దంటున్న హస్తం పార్టీ కార్యకర్తలు
కాంగ్రెస్ లో చేరేందుకు మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తీవ్ర ప్రయత్నాలు, వద్దే వద్దంటున్న హస్తం పార్టీ కార్యకర్తలు
Hanuma Vihari: హనుమ విహారికి షోకాజ్‌ నోటీస్‌, మళ్లీ మొదలైన రగడ
హనుమ విహారికి షోకాజ్‌ నోటీస్‌, మళ్లీ మొదలైన రగడ
Prathinidhi 2 Teaser: నారా రోహిత్ ‘ప్రతినిధి 2’ టీజర్ - ఓటు వేయడం కుదరకపోతే చచ్చిపోండి, రూ.5 లక్షల కోట్ల అప్పు ఎలా తీర్చుతారు?
నారా రోహిత్ ‘ప్రతినిధి 2’ టీజర్ - ఓటు వేయడం కుదరకపోతే చచ్చిపోండి, రూ.5 లక్షల కోట్ల అప్పు ఎలా తీర్చుతారు?
కేజ్రీవాల్ అరెస్ట్‌పై స్పందించిన ఐక్యరాజ్య సమితి, అందరి హక్కులు కాపాడాలంటూ వ్యాఖ్యలు
కేజ్రీవాల్ అరెస్ట్‌పై స్పందించిన ఐక్యరాజ్య సమితి, అందరి హక్కులు కాపాడాలంటూ వ్యాఖ్యలు
Embed widget