PM Modi And Trump Talk Over Phone:డొనాల్డ్ ట్రంప్తో ఫోన్లో మాట్లాడిన ప్రధాని మోదీ- ఏయే అంశాలు చర్చించారంటే!
PM Modi And Trump Talk Over Phone:ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ఫోన్లో మాట్లాడారు. భారత్-అమెరికా సంబంధాలను బలోపేతం చేయడంపై అగ్రనేతలు చర్చించారు.

PM Modi Phone Call US President Donald Trump: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం (జనవరి 27, 2025) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ఫోన్లో మాట్లాడారు. ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత ఇద్దరు నేతలు తొలిసారి ఫోన్లో మాట్లాడుకున్నారు. ఈ ఫోన్ కాల్లో ఇరువురు నేతల మధ్య భారత్-అమెరికా సంబంధాలపై చర్చ జరిగింది. క్వాడ్ తదుపరి సమావేశంతోపాటు, ఇద్దరి మధ్య అనేక ప్రపంచ సమస్యలు కూడా ప్రస్తావనకు వచ్చాయి.
అమెరికా అధ్యక్షుడితో మాట్లాడిన తర్వాత, ప్రధాని మోదీ ఇన్స్టాగ్రామ్లో ఇలా రాశారు, “నా ప్రియమైన స్నేహితుడు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో మాట్లాడటం చాలా ఆనందంగా ఉంది. చారిత్రాత్మకంగా రెండోసారి పదవీ బాధ్యతలు చేపట్టినందుకు అభినందనలు తెలిపాను. మేము పరస్పర ప్రయోజనానికి, విశ్వసనీయ భాగస్వామ్యానికి కట్టుబడి ఉన్నాము. మా ప్రజల సంక్షేమం కోసం, ప్రపంచ శాంతి, శ్రేయస్సు, భద్రత కోసం మేము కలిసి పని చేస్తాము." అని అన్నారు.
Also Read: ఆ పిల్లలే నిజాయితీపరులు, స్నేహపూర్వకంగా ఉండే వాళ్లు- కెనడియన్ విశ్వవిద్యాలయాల సంచలన సర్వే
ట్రంప్ విజయంపై ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు
అమెరికా ఎన్నికల్లో ట్రంప్ ఘనవిజయం సాధించి పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రధాని మోదీ ఆయనతో ఫోన్లో మాట్లాడారు. నా స్నేహితుడు, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో నేను చాలా విషయాలు మాట్లాడినట్టు ప్రధాని మోదీ X లో రాశారు. అద్భుత విజయం సాధించినందుకు ఆయనకు అభినందనలు. సాంకేతికత, రక్షణ, ఇంధనం, అంతరిక్షం, అనేక ఇతర రంగాలలో సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి భారతదేశం , అమెరికా మరోసారి కలిసి పని చేయాలని భావిస్తున్నాను అన్నారు.
Delighted to speak with my dear friend President @realDonaldTrump @POTUS. Congratulated him on his historic second term. We are committed to a mutually beneficial and trusted partnership. We will work together for the welfare of our people and towards global peace, prosperity,…
— Narendra Modi (@narendramodi) January 27, 2025
ప్రధాని మోదీ లేఖతో ప్రధాని మోదీ అమెరికా వెళ్లారు
జనవరి 20, 2025న డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ భారత్ తరపున హాజరయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ లేఖతో విదేశాంగ మంత్రి అమెరికా చేరుకున్నారు. అప్పడు ఇరువురు నేతల మధ్య ద్వైపాక్షిక అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. ఈ చర్చల్లో భారత్-అమెరికా సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు అంగీకారం కుదిరింది.
ప్రధాని మోదీ, డొనాల్డ్ ట్రంప్ మధ్య బలమైన బంధం వెనుక చాలా కారణాలున్నాయి. ఇరువురు నేతలు రక్షణ సంబంధాలను బలోపేతం చేసుకోవడంపై దృష్టి సారించారు. ముఖ్యంగా ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు ఇరువురు నేతలు కీలక చర్యలు తీసుకున్నారు. ‘హౌడీ మోదీ’, ‘నమస్తే ట్రంప్’ వంటి కార్యక్రమాల్లో కూడా ఇద్దరు నేతల మధ్య వ్యక్తిగత సమన్వయం కనిపించింది.
Also Read: కైలాష్ మానస సరోవర్ యాత్రపై భారత్ చైనా మధ్య కుదిరిన సయోధ్య
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

