అన్వేషించండి

Kailash Mansarovar Yatra: కైలాష్ మానస సరోవర్‌ యాత్రపై భారత్‌ చైనా మధ్య కుదిరిన సయోధ్య

Kailash Mansarovar Yatra: 2020లో నిలిచిపోయిన 'కైలాస్ మానస సరోవర్ యాత్ర'పై భారత్‌, చైనా కీలక నిర్ణయం తీసుకున్నాయి. యాత్ర పునరుద్ధరణకు అంగీకరించాయి. విమాన సర్వీసులకు గ్రీన్‌సిగ్నల్ పడింది.  

Kailash Mansarovar Yatra: ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభ్ 2025 జరుగుతుండగా, భక్తులకు మరో శుభవార్త చెప్పింది కేంద్రం. కైలాష్ మానస సరోవర్‌ యాత్ర పునః ప్రారంభం కానుంది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సోమవారం (జనవరి 27, 2025) ఈ గుడ్‌న్యూస్‌ను వెల్లడించింది. విదేశాంగ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ జనవరి 26-27 తేదీల్లో చైనాతో జరిగిన చర్చలు సఫలమయ్యాయి. బీజింగ్‌లో జరిగిన విదేశాంగ కార్యదర్శులు సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు విదేశాంగ శాఖ పేర్కొంది. అందులో భాగంగానే కైలాష్ మానసరోవర్ యాత్రను పునఃప్రారంభించాలని ఇరు వర్గాలు నిర్ణయించినట్టు తెలిపింది. 

ఈ యాత్రను 2020లో నిలిపేశారు. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ మధ్య జరిగిన చర్చల్లో దీన్ని పునఃప్రారంభించాలనే నిర్ణయానికి వచ్చారు. 2025 వేసవిలో కైలాస మానస సరోవర్‌ యాత్రను పునఃప్రారంభించాలని పరస్పరం అంగీకరించారు. ప్రస్తుత ఒప్పందాలకు అనుగుణంగా విధివిధానాలను సంబంధిత యంత్రాంగాలు చర్చిస్తాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటనలో తెలిపింది. మిగతా ప్రక్రియ కోసం భారత్‌-చైనా నిపుణులు సమావేశం కానున్నారు. ఈ తేదీని త్వరలోనే ఖరారు చేయనున్నారు. 

Also Read: తెల్లటి మంచుతో అద్భుతమైన శిల్పాలు అదుర్స్ - అంతర్జాతీయ పోటీలో భారత్‌కు కాంస్యం, బ్యూటిఫుల్ వీడియో చూశారా?

దీంతోపోటు ఇరు దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులను కూడా పునః ప్రారంభించనున్నారు. అందుకు ఇరుపక్షాలు సూత్రప్రాయంగా అంగీకరించాయి. "రెండు దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులను పునఃప్రారంభించేందుకు సూత్రప్రాయంగా అంగీకరించారు. ఇరువైపుల సంబంధిత అధికారులు త్వరలో సమావేశమై దీని కోసం ఒక ఫ్రేమ్‌వర్క్‌పై చర్చలు జరుపుతారు" అని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.

విక్రమ్ మిస్రీ రెండు రోజుల చైనా పర్యటన 
విదేశాంగ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ భారత్‌-చైనాల మధ్య సంబంధాల కోసం రెండు రోజులుగా పర్యటిస్తున్నారు. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ, బీజింగ్‌లో భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీతో భేటీ అయ్యారు. చైనా-భారత్ సంబంధాలు మెరుగుపరిచే ప్రక్రియ వేగవంతం చేసేందుకు అంగీకరించారు. గతేడాది జాన్‌లో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమైనప్పటి నుంచి అన్ని స్థాయిల్లో సానుకూల చర్చలు జరిగాయని తెలిపారు. సమావేశం అనంతరం చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ మంత్రి మాట్లాడుతూ.. 'ఇరుదేశాల నేతల మధ్య కుదిరిన ముఖ్యమైన అంశాలను ఇరుపక్షాలు చిత్తశుద్ధితో అమలు చేస్తాయి.' అని అన్నారు. 

Also Read: ఆ పిల్లలే నిజాయితీపరులు, స్నేహపూర్వకంగా ఉండే వాళ్లు- కెనడియన్ విశ్వవిద్యాలయాల సంచలన సర్వే

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

IND vs NZ 3rd ODI: మూడో వన్డేలో న్యూజిలాండ్ రికార్డ్ స్కోర్.. టీమిండియా బ్యాటర్లు ఛేజ్ చేస్తారా?
మూడో వన్డేలో న్యూజిలాండ్ రికార్డ్ స్కోర్.. టీమిండియా బ్యాటర్లు ఛేజ్ చేస్తారా?
Harish Rao: రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs NZ 3rd ODI: మూడో వన్డేలో న్యూజిలాండ్ రికార్డ్ స్కోర్.. టీమిండియా బ్యాటర్లు ఛేజ్ చేస్తారా?
మూడో వన్డేలో న్యూజిలాండ్ రికార్డ్ స్కోర్.. టీమిండియా బ్యాటర్లు ఛేజ్ చేస్తారా?
Harish Rao: రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
Hyundai Venue లేదా Kia Syros.. టాప్ వేరియంట్లో ఏ SUV బెస్ట్, కొనే ముందు ఇది తెలుసుకోండి
Hyundai Venue లేదా Kia Syros.. టాప్ వేరియంట్లో ఏ SUV బెస్ట్, కొనే ముందు ఇది తెలుసుకోండి
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
Embed widget