అన్వేషించండి

Kailash Mansarovar Yatra: కైలాష్ మానస సరోవర్‌ యాత్రపై భారత్‌ చైనా మధ్య కుదిరిన సయోధ్య

Kailash Mansarovar Yatra: 2020లో నిలిచిపోయిన 'కైలాస్ మానస సరోవర్ యాత్ర'పై భారత్‌, చైనా కీలక నిర్ణయం తీసుకున్నాయి. యాత్ర పునరుద్ధరణకు అంగీకరించాయి. విమాన సర్వీసులకు గ్రీన్‌సిగ్నల్ పడింది.  

Kailash Mansarovar Yatra: ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభ్ 2025 జరుగుతుండగా, భక్తులకు మరో శుభవార్త చెప్పింది కేంద్రం. కైలాష్ మానస సరోవర్‌ యాత్ర పునః ప్రారంభం కానుంది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సోమవారం (జనవరి 27, 2025) ఈ గుడ్‌న్యూస్‌ను వెల్లడించింది. విదేశాంగ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ జనవరి 26-27 తేదీల్లో చైనాతో జరిగిన చర్చలు సఫలమయ్యాయి. బీజింగ్‌లో జరిగిన విదేశాంగ కార్యదర్శులు సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు విదేశాంగ శాఖ పేర్కొంది. అందులో భాగంగానే కైలాష్ మానసరోవర్ యాత్రను పునఃప్రారంభించాలని ఇరు వర్గాలు నిర్ణయించినట్టు తెలిపింది. 

ఈ యాత్రను 2020లో నిలిపేశారు. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ మధ్య జరిగిన చర్చల్లో దీన్ని పునఃప్రారంభించాలనే నిర్ణయానికి వచ్చారు. 2025 వేసవిలో కైలాస మానస సరోవర్‌ యాత్రను పునఃప్రారంభించాలని పరస్పరం అంగీకరించారు. ప్రస్తుత ఒప్పందాలకు అనుగుణంగా విధివిధానాలను సంబంధిత యంత్రాంగాలు చర్చిస్తాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటనలో తెలిపింది. మిగతా ప్రక్రియ కోసం భారత్‌-చైనా నిపుణులు సమావేశం కానున్నారు. ఈ తేదీని త్వరలోనే ఖరారు చేయనున్నారు. 

Also Read: తెల్లటి మంచుతో అద్భుతమైన శిల్పాలు అదుర్స్ - అంతర్జాతీయ పోటీలో భారత్‌కు కాంస్యం, బ్యూటిఫుల్ వీడియో చూశారా?

దీంతోపోటు ఇరు దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులను కూడా పునః ప్రారంభించనున్నారు. అందుకు ఇరుపక్షాలు సూత్రప్రాయంగా అంగీకరించాయి. "రెండు దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులను పునఃప్రారంభించేందుకు సూత్రప్రాయంగా అంగీకరించారు. ఇరువైపుల సంబంధిత అధికారులు త్వరలో సమావేశమై దీని కోసం ఒక ఫ్రేమ్‌వర్క్‌పై చర్చలు జరుపుతారు" అని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.

విక్రమ్ మిస్రీ రెండు రోజుల చైనా పర్యటన 
విదేశాంగ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ భారత్‌-చైనాల మధ్య సంబంధాల కోసం రెండు రోజులుగా పర్యటిస్తున్నారు. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ, బీజింగ్‌లో భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీతో భేటీ అయ్యారు. చైనా-భారత్ సంబంధాలు మెరుగుపరిచే ప్రక్రియ వేగవంతం చేసేందుకు అంగీకరించారు. గతేడాది జాన్‌లో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమైనప్పటి నుంచి అన్ని స్థాయిల్లో సానుకూల చర్చలు జరిగాయని తెలిపారు. సమావేశం అనంతరం చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ మంత్రి మాట్లాడుతూ.. 'ఇరుదేశాల నేతల మధ్య కుదిరిన ముఖ్యమైన అంశాలను ఇరుపక్షాలు చిత్తశుద్ధితో అమలు చేస్తాయి.' అని అన్నారు. 

Also Read: ఆ పిల్లలే నిజాయితీపరులు, స్నేహపూర్వకంగా ఉండే వాళ్లు- కెనడియన్ విశ్వవిద్యాలయాల సంచలన సర్వే

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ABP India at 2047 Conclave: పశ్చిమాసియా అనిశ్చితితో భారత్‌లో ఆర్థిక ముప్పు.. దిగుమతులపై నిషేధం సరికాదు: మాంటెక్ సింగ్ అహ్లూవాలియా
పశ్చిమాసియా అనిశ్చితితో భారత్‌లో ఆర్థిక ముప్పు.. దిగుమతులపై నిషేధం సరికాదు: మాంటెక్ సింగ్ అహ్లూవాలియా
US Iran War: అమెరికా స్థావరాలపై ఇరాన్ మిస్సైల్, డ్రోన్ దాడులు.. యుద్ధం మళ్లీ మొదలైందా?
అమెరికా స్థావరాలపై ఇరాన్ మిస్సైల్, డ్రోన్ దాడులు.. యుద్ధం మళ్లీ మొదలైందా?
Indian Mango party San Francisco: అమెరికాలో ఫ్రీ మ్యాంగో ఫెస్టివల్ పెట్టిన భారతీయులు - క్యూలో నిలబడి తిన్న అమెరికన్లు - వీడియోలు వైరల్
అమెరికాలో ఫ్రీ మ్యాంగో ఫెస్టివల్ పెట్టిన భారతీయులు - క్యూలో నిలబడి తిన్న అమెరికన్లు - వీడియోలు వైరల్
Indian woman shoplifting in Japan: జపాన్‌లో చేసింది దొంగపని - పైగా పోలీసులకు లంచం ఆఫర్ - భారతీయ పర్యాటకురాలికి ఏ శిక్ష పడిందంటే?
జపాన్‌లో చేసింది దొంగపని - పైగా పోలీసులకు లంచం ఆఫర్ - భారతీయ పర్యాటకురాలికి ఏ శిక్ష పడిందంటే?

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Delhi Fire Accident: ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
Congress Internal Rifts: ఇందిరమ్మ ఇళ్ల కోటా లొల్లి - పల్లెల్లో సెగ రేపుతున్న లబ్ధిదారుల ఎంపిక.. కాంగ్రెస్ నేతల్లోనే అంతర్గత కుమ్ములాటలు!
ఇందిరమ్మ ఇళ్ల కోటా లొల్లి - పల్లెల్లో సెగ రేపుతున్న లబ్ధిదారుల ఎంపిక.. కాంగ్రెస్ నేతల్లోనే అంతర్గత కుమ్ములాటలు!
Peddi USA Collection : పెద్ది పెద్ద రికార్డు - ఓవర్సీస్ To తెలుగు స్టేట్స్... ఇప్పటివరకూ...
పెద్ది పెద్ద రికార్డు - ఓవర్సీస్ To తెలుగు స్టేట్స్... ఇప్పటివరకూ...
Manoj Bajpayee INDIA@2047 : ఎందుకు యాక్టర్ అయ్యాను? - ప్రతీ రోల్ కొత్తగా ఉండాలి... ఏబీపీ కాన్‌క్లేవ్‌లో మనోజ్ బాజ్‌పేయ్
ఎందుకు యాక్టర్ అయ్యాను? - ప్రతీ రోల్ కొత్తగా ఉండాలి... ఏబీపీ కాన్‌క్లేవ్‌లో మనోజ్ బాజ్‌పేయ్
Foods for Healthy Joints : కీళ్ల నొప్పులు తగ్గాలంటే.. ఈ 7 ఫుడ్స్ తప్పక డైట్‌లో చేర్చుకోండి, మోకాళ్ల ఆరోగ్యానికి ఇవి బెస్ట్
కీళ్ల నొప్పులు తగ్గాలంటే.. ఈ 7 ఫుడ్స్ తప్పక డైట్‌లో చేర్చుకోండి, మోకాళ్ల ఆరోగ్యానికి ఇవి బెస్ట్
Early Symptoms of Type 2 Diabetes : టైప్ 2 డయాబెటిస్ తొలి దశలో కనిపించే 7 ముఖ్య లక్షణాలు.. అలసట, దాహం నుంచి తరచూ మూత్రం వరకు
టైప్ 2 డయాబెటిస్ తొలి దశలో కనిపించే 7 ముఖ్య లక్షణాలు.. అలసట, దాహం నుంచి తరచూ మూత్రం వరకు
Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్ రివ్యూ... ఆ ఒక్క షాట్‌లో రవితేజ మాస్ టచ్ - డాటర్ సెంటిమెంట్ ఎక్కువ
ఇరుముడి గ్లింప్స్ రివ్యూ... ఆ ఒక్క షాట్‌లో రవితేజ మాస్ టచ్ - డాటర్ సెంటిమెంట్ ఎక్కువ
US Iran War: అమెరికా స్థావరాలపై ఇరాన్ మిస్సైల్, డ్రోన్ దాడులు.. యుద్ధం మళ్లీ మొదలైందా?
అమెరికా స్థావరాలపై ఇరాన్ మిస్సైల్, డ్రోన్ దాడులు.. యుద్ధం మళ్లీ మొదలైందా?
Embed widget