అన్వేషించండి

Kailash Mansarovar Yatra: కైలాష్ మానస సరోవర్‌ యాత్రపై భారత్‌ చైనా మధ్య కుదిరిన సయోధ్య

Kailash Mansarovar Yatra: 2020లో నిలిచిపోయిన 'కైలాస్ మానస సరోవర్ యాత్ర'పై భారత్‌, చైనా కీలక నిర్ణయం తీసుకున్నాయి. యాత్ర పునరుద్ధరణకు అంగీకరించాయి. విమాన సర్వీసులకు గ్రీన్‌సిగ్నల్ పడింది.  

Kailash Mansarovar Yatra: ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభ్ 2025 జరుగుతుండగా, భక్తులకు మరో శుభవార్త చెప్పింది కేంద్రం. కైలాష్ మానస సరోవర్‌ యాత్ర పునః ప్రారంభం కానుంది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సోమవారం (జనవరి 27, 2025) ఈ గుడ్‌న్యూస్‌ను వెల్లడించింది. విదేశాంగ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ జనవరి 26-27 తేదీల్లో చైనాతో జరిగిన చర్చలు సఫలమయ్యాయి. బీజింగ్‌లో జరిగిన విదేశాంగ కార్యదర్శులు సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు విదేశాంగ శాఖ పేర్కొంది. అందులో భాగంగానే కైలాష్ మానసరోవర్ యాత్రను పునఃప్రారంభించాలని ఇరు వర్గాలు నిర్ణయించినట్టు తెలిపింది. 

ఈ యాత్రను 2020లో నిలిపేశారు. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ మధ్య జరిగిన చర్చల్లో దీన్ని పునఃప్రారంభించాలనే నిర్ణయానికి వచ్చారు. 2025 వేసవిలో కైలాస మానస సరోవర్‌ యాత్రను పునఃప్రారంభించాలని పరస్పరం అంగీకరించారు. ప్రస్తుత ఒప్పందాలకు అనుగుణంగా విధివిధానాలను సంబంధిత యంత్రాంగాలు చర్చిస్తాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటనలో తెలిపింది. మిగతా ప్రక్రియ కోసం భారత్‌-చైనా నిపుణులు సమావేశం కానున్నారు. ఈ తేదీని త్వరలోనే ఖరారు చేయనున్నారు. 

Also Read: తెల్లటి మంచుతో అద్భుతమైన శిల్పాలు అదుర్స్ - అంతర్జాతీయ పోటీలో భారత్‌కు కాంస్యం, బ్యూటిఫుల్ వీడియో చూశారా?

దీంతోపోటు ఇరు దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులను కూడా పునః ప్రారంభించనున్నారు. అందుకు ఇరుపక్షాలు సూత్రప్రాయంగా అంగీకరించాయి. "రెండు దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులను పునఃప్రారంభించేందుకు సూత్రప్రాయంగా అంగీకరించారు. ఇరువైపుల సంబంధిత అధికారులు త్వరలో సమావేశమై దీని కోసం ఒక ఫ్రేమ్‌వర్క్‌పై చర్చలు జరుపుతారు" అని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.

విక్రమ్ మిస్రీ రెండు రోజుల చైనా పర్యటన 
విదేశాంగ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ భారత్‌-చైనాల మధ్య సంబంధాల కోసం రెండు రోజులుగా పర్యటిస్తున్నారు. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ, బీజింగ్‌లో భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీతో భేటీ అయ్యారు. చైనా-భారత్ సంబంధాలు మెరుగుపరిచే ప్రక్రియ వేగవంతం చేసేందుకు అంగీకరించారు. గతేడాది జాన్‌లో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమైనప్పటి నుంచి అన్ని స్థాయిల్లో సానుకూల చర్చలు జరిగాయని తెలిపారు. సమావేశం అనంతరం చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ మంత్రి మాట్లాడుతూ.. 'ఇరుదేశాల నేతల మధ్య కుదిరిన ముఖ్యమైన అంశాలను ఇరుపక్షాలు చిత్తశుద్ధితో అమలు చేస్తాయి.' అని అన్నారు. 

Also Read: ఆ పిల్లలే నిజాయితీపరులు, స్నేహపూర్వకంగా ఉండే వాళ్లు- కెనడియన్ విశ్వవిద్యాలయాల సంచలన సర్వే

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: పోలవరానికి మరోసారి సీఎం చంద్రబాబు, ఈ 27న ప్రాజెక్టుపై అక్కడే సమీక్ష
పోలవరానికి మరోసారి సీఎం చంద్రబాబు, ఈ 27న ప్రాజెక్టుపై అక్కడే సమీక్ష
IPL 2025 CSK VS MI Result Update: చెన్నైదే పైచేయి.. ముంబైపై ఉత్కంఠ భ‌రిత విజ‌యం.. రుతురాజ్ కెప్టెన్స్ ఇన్నింగ్స్, రాణించిన రచిన్
చెన్నైదే పైచేయి.. ముంబైపై ఉత్కంఠ భ‌రిత విజ‌యం.. రుతురాజ్ కెప్టెన్స్ ఇన్నింగ్స్, రాణించిన రచిన్
KTR Comments: బీఆర్ఎస్ ఓటమిలో ప్రజల తప్పు లేదు, కానీ సీఎం కుర్చీలో దొంగ !: కేటీఆర్
బీఆర్ఎస్ ఓటమిలో ప్రజల తప్పు లేదు, కానీ సీఎం కుర్చీలో దొంగ !: కేటీఆర్
Dhoni Magic Stumping: మెరుపు వేగంతో ధోనీ స్టంపింగ్, సూర్యకుమార్ షాక్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో
మెరుపు వేగంతో ధోనీ స్టంపింగ్, సూర్యకుమార్ షాక్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

CSK vs MI Match Highlights IPL 2025 | ముంబైపై 4 వికెట్ల తేడాతో చెన్నై జయభేరి | ABP DesamSRH vs RR IPL 2025 Match Highlights | రాజస్థాన్ పై 44 పరుగుల తేడాతో సన్ రైజర్స్ ఘన విజయం | ABP DesamSRH vs RR IPL 2025 Match Highlights | ఉప్పల్ లో తన రికార్డును తనే బ్రేక్ చేసిన సన్ రైజర్స్ | ABP DesamCSK vs MI IPL 2025 Match Preview | నేడు చెన్నైతో తలపడుతున్న ముంబై | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: పోలవరానికి మరోసారి సీఎం చంద్రబాబు, ఈ 27న ప్రాజెక్టుపై అక్కడే సమీక్ష
పోలవరానికి మరోసారి సీఎం చంద్రబాబు, ఈ 27న ప్రాజెక్టుపై అక్కడే సమీక్ష
IPL 2025 CSK VS MI Result Update: చెన్నైదే పైచేయి.. ముంబైపై ఉత్కంఠ భ‌రిత విజ‌యం.. రుతురాజ్ కెప్టెన్స్ ఇన్నింగ్స్, రాణించిన రచిన్
చెన్నైదే పైచేయి.. ముంబైపై ఉత్కంఠ భ‌రిత విజ‌యం.. రుతురాజ్ కెప్టెన్స్ ఇన్నింగ్స్, రాణించిన రచిన్
KTR Comments: బీఆర్ఎస్ ఓటమిలో ప్రజల తప్పు లేదు, కానీ సీఎం కుర్చీలో దొంగ !: కేటీఆర్
బీఆర్ఎస్ ఓటమిలో ప్రజల తప్పు లేదు, కానీ సీఎం కుర్చీలో దొంగ !: కేటీఆర్
Dhoni Magic Stumping: మెరుపు వేగంతో ధోనీ స్టంపింగ్, సూర్యకుమార్ షాక్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో
మెరుపు వేగంతో ధోనీ స్టంపింగ్, సూర్యకుమార్ షాక్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో
Robinhood Trailer: నేను వస్తే లైఫ్ లాంగ్ క్వారంటైన్ - నితిన్ 'రాబిన్ హుడ్' ట్రైలర్ వేరే లెవల్ అంతే.. వార్నర్ ఎంట్రీ అదుర్స్..
నేను వస్తే లైఫ్ లాంగ్ క్వారంటైన్ - నితిన్ 'రాబిన్ హుడ్' ట్రైలర్ వేరే లెవల్ అంతే.. వార్నర్ ఎంట్రీ అదుర్స్..
AP Police: బెట్టింగ్లు ప్రమోట్ చేసేవాళ్లనే కాదు.. ఆడేవాళ్ళనీ వదిలేది లేదు: ఏపీ డీజీపీ వార్నింగ్
బెట్టింగ్లు ప్రమోట్ చేసేవాళ్లనే కాదు.. ఆడేవాళ్ళనీ వదిలేది లేదు: ఏపీ డీజీపీ వార్నింగ్
SRH Vs RR Result Update:  స‌న్ రైజ‌ర్స్ గ్రాండ్ విక్ట‌రీ.. ఈ సీజ‌న్లో సొంత‌గ‌డ్డ‌పై గెలిచిన‌ తొలి జ‌ట్టు.. పోరాడి ఓడిన రాజ‌స్థాన్.. జురెల్, శాంస‌న్ పోరాటం వృథా 
స‌న్ రైజ‌ర్స్ గ్రాండ్ విక్ట‌రీ.. పోరాడి ఓడిన రాజ‌స్థాన్.. జురెల్, శాంస‌న్ పోరాటం వృథా 
David Warner: శ్రీవల్లి స్టెప్ వేసిన డేవిడ్ భాయ్... 'రాబిన్‌హుడ్‌' ప్రీ రిలీజ్‌లో వార్నర్ మెరుపుల్
శ్రీవల్లి స్టెప్ వేసిన డేవిడ్ భాయ్... 'రాబిన్‌హుడ్‌' ప్రీ రిలీజ్‌లో వార్నర్ మెరుపుల్
Embed widget