అన్వేషించండి

Govardhan Puja 2024 Date: కార్తీకమాసం మొదటి రోజు గోవర్ధన పూజ .. దీని ప్రాముఖ్యత ఏంటి? ఎందుకు జరుపుకుంటారు - ఈ ఏడాది ఎప్పుడొచ్చింది!

History of Goverdhan Puja 2024: ఏటా దీపావళి అమావాస్య మరుసటి రోజు ..కార్తీకమాసం ప్రారంభం రోజు గోవర్థన పూజ జరుపుకుంటారు. ఈ ఏడాది ఎప్పుడొచ్చింది? ఈ వేడుక ఎందుకు జరుపుకుంటారో తెలుసుకుందాం...

Significance Of Govardhan Puja:  ప్రతి సంవత్సరం దీపావళి జరుపుకునే గోవర్ధన్ పూజను కొన్ని ప్రాంతాల్లో అన్న కూట్ అని కూడా పిలుస్తారు. ప్రకృతికి - మనిషికి మధ్య ఉన్న సంబంధానికి ప్రతీక ఈ పండుగ. ఈ రోజు శ్రీ కృష్ణుడిని, గోవులను పూజిస్తారు. మొత్తం 56 రకాల నైవైద్యాలు సమర్పిస్తారు.  

ఈ ఏడాది  గోవర్థన్ పూజ ఎప్పుడొచ్చింది

సాధారణంగా దీపావళి మరుసటి రోజు గోవర్థన పూజ చేస్తారు.. అంటే కార్తీక మాసం మొదటి రోజు వచ్చే పాడ్యమి రోజు. అయితే ఈ ఏడాది తిథులు తగులు మిగులు రావడంతో ఆశ్వయుజ అమావాస్య, కార్తీక పాడ్యమి రెండు రోజులు వచ్చాయి. దీంతో ఏ రోజు పరిగణలోకి తీసుకోవాలనే సందేహం ఉంది. దీపావళిని అమావాస్య ఘడియలు ఉన్నప్పుడు జరుపుకోవాలి కాబట్టి అక్టోబరు 31 గురువారం సూర్యాస్తమయ సమయానికి అమావాస్య ఉండడంతో అదే రోజు నరకచతుర్థశి, దీపావళి వచ్చాయి. నవంబరు 1 శుక్రవారం ఉదయానికి అమావాస్య ఉంది..అంటే సూర్యోదయానికి పాడ్యమి లేదు.. నవంబరు 02 శనివారం పాడ్యమి తిథి సూర్యోదయానికి ఉంది. అందుకే కార్తీకమాసం ప్రారంభం అయ్యే ఈ రోజు గోవర్థన పూజ జరుపుకోవాలి. 

Also Read: ఈ దీపావళికి అయోధ్యలో అద్భుతం..అస్సలు మిస్సవకండి!

మీ అవగాహన కోసం ఏ తిథి ఎప్పటివరకూ ఉందో ఇక్కడ తెలుసుకోండి

అమావాస్య - అక్టోబరు 31 గురువారం 2 గంటల 45 నిముషాల నుంచి నవంబరు 01 శుక్రవారం సాయంత్రం 4 గంటల 47 నిముషాల వరకూ

పాడ్యమి - నవంబరు 01 శుక్రవారం సాయంత్రం 4 గంటల 48 నిముషాల నుంచి నవంబరు 02 శనివారం సాయంత్రం 6 గంటల 33 నిముషాల వరకూ. 

నవంబరు 02 శుక్రవారం రోజు సూర్యాస్తమయ సమయం సాయంత్రం ఐదున్నర. అంటే పాడ్యమి తిథి సూర్యోదయానికి, సూర్యాస్తమయానికి ఉన్న రోజు అంటే నవంబరు 02 శనివారమే ఇదే రోజు కార్తీకమాసం ప్రారంభం అవుతోంది..ఇదే రోజు గోవర్థన పూజ చేసుకోవాలి. 

Also Read: అక్టోబరు 31 or నవంబరు 01..ఈ ఏడాది దీపావళి ఎప్పుడొచ్చింది - లక్ష్మీపూజ ముహూర్తం ఏంటి!
 
శ్రీ కృష్ణుడి పట్ల రేపల్లె ప్రజలకు ఉన్న భక్తిని భరించలేని ఇంద్రుడు రాళ్ల వర్షం కురిపిస్తాడు. రేపల్లె ప్రజలపై ఇంద్రుడు కురిపించిన రాళ్ల వర్షం నుంచి ప్రజలను, గోవులను రక్షించేందుకు చిటికెన వేలుపై గోవర్థన పర్వతాన్ని గొడుగుగా పట్టుకున్నది కార్తీక శుక్ల పాడ్యమి రోజే.  అందుకే ఈ రోజు శ్రీ కృష్ణుడికి, గోవులకు, గోవర్థన పర్వతానికి పూజచేస్తారంతా. ఈ వేడుక బంధం, ఆత్మీయత, ప్రకృతి ఆరాధనకు ఉన్న ప్రాముఖ్యతను తెలియజేస్తుంది.  
 
గోవర్థన పూజ ఎలా చేయాలి?

గోవర్ధన పూజ చేయాలి అనుకునేవారు ఆవుపేడతో ఓ పర్వతాన్ని తయారు చేసి..ఆ పక్కనే శ్రీకృష్ణుడి ఫొటో, ఆవు బొమ్మ కానీ,ప్రతిమ కానీ ఉంచాలి. నువ్వుల నూనె లేదా నేతితో దీపం వెలిగించి...పూలు, పసుపు, చందనం , కుంకుమ సమర్పించి పూజ చేయాలి. తియ్యటి పదార్థాలను నివేదించి వాటినే ప్రసాదంగా అందరకీ పంచాలి. శ్రీకృష్ణాష్టకం, శ్రీ కృష్ణ అష్టోత్తర శతనామావళి చదువుకున్న అనంతరం నివేదన తర్వాత గోవర్థనగిరి కథ చదువుకోవాలి.  

Also Read: 5 రోజుల దీపావళి వేడుకలో ఏ రోజు విశిష్టత ఏంటి - ఏ రోజు ఏం చేయాలి!

గోవర్ధన పూజ ఎందుకు చేయాలి?

ఏ ఇంట్లో గోవర్ధన పూజ చేస్తారో ఆ ఇంట్లో ఆనందానికి లోటుండదని పండితులు చెబుతారు. ఆరాధ్యుడు మాత్రమే కాదు గురువుగా మీ వెన్నంటే ఉండి శ్రీ కృష్ణుడు నడిపిస్తాడని విశ్వశిస్తారు. జీవితంలో ఎదురయ్యే కష్టాలు, బాధలు తీరిపోయి శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు లభిస్తాయని భక్తుల విశ్వాసం.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Bandi Sanjay: కేంద్ర మంత్రి బండి సంజయ్ అరెస్ట్! ఏం హక్కు ఉందంటూ పోలీసులపై అసహనం
Bandi Sanjay: కేంద్ర మంత్రి బండి సంజయ్ అరెస్ట్! ఏం హక్కు ఉందంటూ పోలీసులపై అసహనం
AP CM Chandrababu: రాజధాని అమరావతి నిర్మాణ పనులు పునఃప్రారంభించిన సీఎం చంద్రబాబు
రాజధాని అమరావతి నిర్మాణ పనులు పునఃప్రారంభించిన సీఎం చంద్రబాబు
Unstoppable Season 4 - AP CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు అతిథిగా బాలయ్య పండగ మొదలు... రేపే 'అన్‌స్టాపబుల్ 4' ఫస్ట్ ఎపిసోడ్ షూటింగ్
ఏపీ సీఎం చంద్రబాబు అతిథిగా బాలయ్య పండగ మొదలు... రేపే 'అన్‌స్టాపబుల్ 4' ఫస్ట్ ఎపిసోడ్ షూటింగ్
Andhra Pradesh Latest Updates: 2029లో కూటమిగానే పోటీ- కలిసి నడవాలని నేతలకు చంద్రబాబు సూచన- లిక్కర్‌ వ్యాపారానికి దూరంగా ఉండాలని హెచ్చరిక
2029లో కూటమిగానే పోటీ- కలిసి నడవాలని నేతలకు చంద్రబాబు సూచన- లిక్కర్‌ వ్యాపారానికి దూరంగా ఉండాలని హెచ్చరిక
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆ లిక్కర్‌తో హెల్త్ పాడైంది, ఈ రూ.100 మందు బాగుందివీడియో: రూ.50కే కిలో చికెన్, ఇక్కడ అస్సలు తినకండి!!Hamas Chief Yahya Sinwar Killed | హమాస్ చీఫ్‌ సిన్వర్‌ని ఇజ్రాయేల్ ఎలా చంపింది | ABP Desamనటి తమన్నాని ప్రశ్నించిన ఈడీ, మనీ లాండరింగ్ కేసులో విచారణ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bandi Sanjay: కేంద్ర మంత్రి బండి సంజయ్ అరెస్ట్! ఏం హక్కు ఉందంటూ పోలీసులపై అసహనం
Bandi Sanjay: కేంద్ర మంత్రి బండి సంజయ్ అరెస్ట్! ఏం హక్కు ఉందంటూ పోలీసులపై అసహనం
AP CM Chandrababu: రాజధాని అమరావతి నిర్మాణ పనులు పునఃప్రారంభించిన సీఎం చంద్రబాబు
రాజధాని అమరావతి నిర్మాణ పనులు పునఃప్రారంభించిన సీఎం చంద్రబాబు
Unstoppable Season 4 - AP CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు అతిథిగా బాలయ్య పండగ మొదలు... రేపే 'అన్‌స్టాపబుల్ 4' ఫస్ట్ ఎపిసోడ్ షూటింగ్
ఏపీ సీఎం చంద్రబాబు అతిథిగా బాలయ్య పండగ మొదలు... రేపే 'అన్‌స్టాపబుల్ 4' ఫస్ట్ ఎపిసోడ్ షూటింగ్
Andhra Pradesh Latest Updates: 2029లో కూటమిగానే పోటీ- కలిసి నడవాలని నేతలకు చంద్రబాబు సూచన- లిక్కర్‌ వ్యాపారానికి దూరంగా ఉండాలని హెచ్చరిక
2029లో కూటమిగానే పోటీ- కలిసి నడవాలని నేతలకు చంద్రబాబు సూచన- లిక్కర్‌ వ్యాపారానికి దూరంగా ఉండాలని హెచ్చరిక
Salman Khan: సల్మాన్ ఖాన్ కోసం బుల్లెట్ ప్రూఫ్ కార్ దిగుతోంది - దాని రేటు ఎంత, ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా?
సల్మాన్ ఖాన్ కోసం బుల్లెట్ ప్రూఫ్ కార్ దిగుతోంది - దాని రేటు ఎంత, ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా?
KTR News: గత పాలకుల వల్లే మురికికూపంలా మూసీ - సీఎం రేవంత్ వ్యాఖ్యల్ని సమర్థించిన కేటీఆర్
గత పాలకుల వల్లే మురికికూపంలా మూసీ - సీఎం రేవంత్ వ్యాఖ్యల్ని సమర్థించిన కేటీఆర్
Musi  Politics : రేవంత్‌ సవాల్‌పై స్పష్టత ఇవ్వని బీఆర్ఎస్ - మూసీపై అసెంబ్లీ చర్చకు సిద్ధం కాదా ?
రేవంత్‌ సవాల్‌పై స్పష్టత ఇవ్వని బీఆర్ఎస్ - మూసీపై అసెంబ్లీ చర్చకు సిద్ధం కాదా ?
Talliki Vandanam News: ఆంధ్రప్రదేశ్‌లో జనవరి నుంచి తల్లికి వందనం పథకం అమలు- ఎవరెవరికి ఇస్తారంటే?
ఆంధ్రప్రదేశ్‌లో జనవరి నుంచి తల్లికి వందనం పథకం అమలు- ఎవరెవరికి ఇస్తారంటే?
Embed widget