అన్వేషించండి

Akshaya Tritiya 2023: అక్షయ తృతీయ ఎప్పుడు (ఏప్రిల్ 22 or ఏప్రిల్ 23) జరుపుకోవాలి, ఈ రోజుకున్న ప్రత్యేకత ఏంటి!

ఈ ఏడాది అక్షయ తృతీయ ఏప్రిల్ 23 ఆదివారం వచ్చింది. ఈ రోజు బంగారం కొనుగోలు చేసి లక్ష్మీపూజ చేస్తే మంచిదని భావిస్తారు కానీ వాస్తవానికి అక్షయ తృతీయ అంటే బంగారం కొనడం కాదు..ఇంకా చాలా ప్రత్యేకతలున్నాయి

 Akshaya Tritiya 2023: హిందువుల పండుగలలో అక్షయ తృతీయకు ప్రత్యేక స్థానం ఉంది. ఏటా వైశాఖ శుద్ధ తదియ రోజున  హిందువులు, జైనులు ఈ పండుగ వైభవంగా జరుపుకుంటారు. ఈ ఏడాది తిథులు తగులు మిగులు రావడంతో అక్షయ తృతీయ ఎప్పుడు అనే సందేహం అందర్లోనూ నెలకొంది. ఇంతకీ పండుగ ఎప్పుడు జరుపుకోవాలో తెలియాలంటే ముందుగా తదియ తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకూ ఉందో చూడాలి...

  • ఏప్రిల్ 22 శనివారం ఉదయం..అంటే సూర్యోదయానికి విదియ తిథి ఉంది...ఈ రోజు ఉదయం 8.15 నిముషాలు దాటిన తర్వాత తదియ వస్తోంది...అంటే సూర్యోదయం సమయానికి తదియ లేదు
  • ఏప్రిల్ 23 ఆదివారం సూర్యోదయానికి ఉన్న తదియ తిథి...8.15నిముషాలు దాటిన తర్వాత పూర్తై..చవితి వచ్చేస్తోంది...
  • ఇక్కడే డైలమా మొదలైంది.. శనివారం రోజు సూర్యోదయానికి తదియ తిథి లేకపోయినా రోజంతా ఉంది కాబట్టి శనివారం అని కొందరంటే... హిందువుల పండుగలకు సూర్యోదయం తిథి లెక్క కాబట్టి ఆదివారం జరుపుకోవాలని ఇంకొందరు పండితులు చెబుతున్నారు.
  • చాలామంది మాత్రం ఏప్రిల్ 23 ఆదివారం సూర్యోదయానికి తదియ తిథి ఉండడంతో ఈ రోజే జరుపుకుంటున్నారు.

Also Read: భర్తలకు గుడ్ న్యూస్ - అక్షయ తృతీయ రోజు బంగారం కొనాల్సిన అవసరం లేదు - ఎందుకంటే!

అక్షయ తృతీయ ఎందుకు ప్రత్యేకం
అక్షయ తృతీయ రోజు చేసే ప్రతి పనీ ఎందుకు ప్రత్యేకం, వాస్తవానికి అక్షయ తృతీయ ఎందుకంత ప్రత్యేకం అంటే..శివుడి అనుగ్రహంతో కుబేరుడు సంపదలకు రక్షకుడిగా నియమితుడైన రోజు ఇదే. శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని పెళ్లిచేసుకున్న మంచి రోజు కూడా ఇదే. అందుకే ఈ రోజు లక్ష్మీదేవిని బంగారంతో అలంకరించి పూజిస్తే ఇల్లు సిరిసంపదలతో కళకళలాడుతుందని భక్తులు భావిస్తారు. ముఖ్యంగా అక్షయ తృతీయ రోజు ఇంటికి బంగారం కొనడం కన్నా..ఈ రోజు చేసే దానాలు, జపాలు రెట్టింపు ఫలితాన్నిస్తాయని స్వయంగా పరమేశ్వరుడు లోకమాత పార్వతీదేవికి చెప్పినట్టు శివపురాణంలో ఉంది. 

నిరుపేద అయిన కుచేలుడిని శ్రీకృష్ణుడు అనుగ్రహించిన రోజు అక్షయతృతీయే అని చెబుతారు. ఇంకా ఎన్నో ప్రత్యేకతలున్న ఈ రోజున రాహుకాలాలూ, వర్జ్యాలు , దుర్ముహూర్తాలు, యమగండాలు  వర్తించవు. ప్రతి నిమిషం సుముహూర్తమే. ఏ కార్యక్రమం చేపట్టినా శుభప్రదమే! అక్షరాభ్యాసాలూ అక్షయ తృతీయరోజే పెట్టకుంటారు. ఈ రోజు ఏ వ్రతం చేసినా, ఏ పూజ చేసినా, ఏ హోమం నిర్వహించినా ఫలం అక్షయం అవుతుంది. ఒకటో రెండో కాదు  అక్షయ తృతీయకు ఇంకా చాలా ప్రాముఖ్యత ఉంది...

  • పరశురాముడు జన్మించింది అక్షయతృతీయ రోజే
  • పవిత్ర గంగా నది భూమిని తాకిన పర్వదినం కూడా ఈ రోజే
  • శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడైన కుచేలుడిని కలుసుకున్న రోజు అక్షయతృతీయ..ఈ రోజుతో కుచేలుడి దారిద్ర్యం తీరిపోయి సంపన్నుడయ్యాడు
  • వ్యాస మహర్షి "మహా భారతం" వినాయకుడి సహాయముతో రాయడం మొదలెట్టింది అక్షయ తృతీయ రోజే
  • వనవాసం చేస్తున్న పాండవులకు సూర్య భగవానుడు అక్షయ పాత్ర ఇచ్చింది అక్షయ తృతీయ రోజే
  • శివుడిని ప్రార్థించి కుబేరుడు శ్రీమహాలక్ష్మితో సమస్త సంపదలకు సంరక్షకునిగా నియమితుడైంది ఈ రోజే
  • కటిక దారిద్ర్యం అనుభవిస్తున్న ఓ పేదరాలి ఇంట జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు "కనకధారాస్త్రోత్రం" చెప్పిన దినం ఇదే
  • అన్నపూర్ణా దేవి తన అవతారాన్ని స్వీకరించిన రోజు అక్షయ తృతీయ
  • ఒడిషా పూరి రథయాత్ర సంబరాల కోసం నిర్మించే రథ నిర్మాణం ప్రారంభించే రోజు అక్షయ తృతీయ
  • బృందావనంలోని బంకే బిహరి ఆలయంలో శ్రీకృష్ణుని పాదాలను దర్శించుకునే అవకాశం ఒక్క అక్షయ తృతీయ రోజునే దక్కుతుంది
  • సింహాచలం దివ్యక్షేత్రం లో సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం మరియు చందనోత్సవం ప్రారంభమయ్యే రోజు అక్షయ తృతీయ

Also Read: ప్రతియుగానికి 4 లక్షల సంవత్సరాలు ఎందుకు తగ్గుతూ వచ్చింది, ఇంకా కలియుగం ఎన్నాళ్లుంది

గమనిక: వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని ఆధ్యాత్మిక అంశాలు, పరిష్కారాలను ఇక్కడ యథావిధిగా అందించాం. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించదని గమనించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుమల బూంది పోటులో సిట్ అధికారుల పరిశీలన, క్వాలిటీపై ఆరాడ్రా అనుకున్న మ్యాచ్‌ని నిలబెట్టిన టీమిండియా, కాన్పూర్‌ టెస్ట్‌లో రికార్డుల మోతKTR on Revanth Reddy: దొరికినవ్ రేవంత్! ఇక నీ రాజీనామానే, బావమరిదికి లీగల్ నోటీసు పంపుతావా?Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేస్‌, ఈ రూట్స్‌లోనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Tirupati Laddu Issue : సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
Jammu Kashmir 3rd Phase Voting: జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
Dussehra 2024 Prasadam : దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
Sobhita Dhulipala : శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
Embed widget