అన్వేషించండి

Tirumala laddu issue: తిరుమల లాంటి పరిస్థితిని ఎదుర్కోవాలని మేం కోరుకోవడం లేదు.. ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం!

Odisha: తిరులలో శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ ప్రభావం అన్ని ఆలయాలపైనా పడింది. దీంతో ఒడిశా ప్రభుత్వం అప్రమత్తమైంది.  ఈ మేరకు ఓ యంత్రాంగం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది..

Odisha Govt to Check Quality of Mahaprasad: పూరీ జగన్నాథుడి ఆలయంలో ఇచ్చే మహాప్రసాదాన్ని నిరంతరం పర్యవేక్షించాలని ఒడిశా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఓ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయనున్నట్లు న్యాయశాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచంద్రన్ ప్రకటించారు. ముఖ్యంగా నెయ్యి విషయంలో అత్యంత శ్రద్ధ తీసుకోనున్నట్లు స్పష్టం చేశారు.  కఠిన పరీక్షలు నిర్వహించిన తర్వాతే ప్రసాదం తయారీ గదిలోకి ఏ పదార్థం అయినా వెళ్లేలా నిబంధనలు అమలు చేస్తామన్నారు పృథ్వీరాజ్ హరిచంద్రన్.  

Also Read: బ్రహ్మోత్సవం అనే పేరెలా వచ్చింది.. దేవతలకు బ్రహ్మోత్సవ ఆహ్వానపత్రం ఎవరిస్తారు!

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం విషయంలో ఏ జరిగిందో అదే పరిస్థితి ఇక్కడ ఎదుర్కోవాలని కోరుకోవడం లేదని వెల్లడించింది ఒడిశా ప్రభుత్వం.  వంటల్లో వినియోగించే నెయ్యిమాత్రమే కాదు..జగన్నాథుడి నివేదనకు తయారు చేసే ప్రతి పదార్థంలో వినియోగించే ముడిసరుకులు అన్ని నాణ్యత తనిఖీ చేసిన తర్వాతే వినియోగించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు పూరీ జగన్నాథ ఆలయానికి ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌ను నియమించాలని ప్రభుత్వం ఆరోగ్య శాఖకు లేఖ రాసింది .

పూరీ జగన్నాథుడిని దర్శించుకునే భక్తులు..ఆలయంలో ప్రసాదం నాణ్యతపై అనుమానంతో తీసుకోకూడదు.. అదే సందేహంతో ఆలయం నుంచి వెళ్లకూడదు..అందుకే ఈ నిర్ణయం అని చెప్పారు పృథ్వీరాజ్ హరిచంద్రన్.

Also Read: దసరాతో ప్రారంభం..దీపావళితో ముగింపు - 2024 అక్టోబరులో పండుగల జాబితా!
 
కొన్నేళ్లుగా పూరీ జగన్నాథ ఆలయానికి.. ఒడిశా రాష్ట్ర సహకార పాల ఉత్పత్తిదారుల సమాఖ్య (ఓంఫెడ్) నెయ్యి సరఫరా చేస్తోంది. నెలకు  ఓంఫెడ్ నుంచి దాదాపు 6,000 లీటర్ల నెయ్యి కొనుగోలు చేస్తారు.

పూరీ జగన్నాథుడికి నిత్యం భారీగా మహాప్రసాదాలు సిద్ధం చేస్తారు. అన్నం, కిచ్డీ, పప్పు, దాల్మా, కూర , వివిధ రకాల స్వీట్లు సిద్ధం చేస్తారు.  అందుకే ప్రభుత్వం తక్షణం వీటి నాణ్యతను తనిఖీ చేయాలని గుర్తించాలని నిర్ణయించుకుంది

జగన్నాథుడి మహాప్రసాదం ధరలు నియంత్రించాలని భక్తులు ప్రభుత్వాన్ని కోరారు..ఆలయ పాలకవర్గం భక్తులకు ఈ మేరకు హామీ ఇచ్చింది.. కానీ అది ఇప్పటికీ అమలుకాలేదు. అయితే ముడిపదార్థాలు, కూరగాయల ధరల ఆధారంగా ప్రసాదం ధరలు మారుతున్నాయని.. తాము భక్తుల నుంచి ఎక్కువ వసూలు చేయడం లేదంటున్నారు సేవకుల సంఘం సభ్యులు. మహాప్రసాదం నాణ్యత తనిఖీని తాము స్వాగతిస్తున్నామని చెప్పారు.

పూరీ ఆలయానికి ఆగ్నేయంగా ఉండే వంటగది ప్రపంచంలోనే అత్యంత పెద్ద వంటగది అని చెబుతారు. గంగా, యమునా అనే రెండు బావుల నుంచి నీటిని వంటకోసం వినియోగిస్తారు. ఒకేసారి 50 వేల మందికి సరిపడా మహాప్రసాదం తయారవుతుంది. రోజుకి 70 క్వింటాళ్ల బియ్యం వండుతారు. ప్రసాదం తయారీకి ఏడు పాత్రలను దొంతరగా పెట్టి వండుతారు. పై పాత్రలో ఉన్న ఆహారం ముందుగా సిద్ధం అవుతుంది. ఆ తర్వాత ఒక్కో పాత్రను కిందకు దించుతారు. వంటలన్నీ పూర్తయ్యాక ముందుగా జగన్నాథుడికి నివేదించి..ఆ ప్రసాదాన్ని భక్తులకు అందిస్తారు. 

Also Read: 'దేవర' న్యాయం అంటే ఏంటి - మహాభారతంలో దీని గురించి ఏముంది!

పూరీలో జగన్నాథుడికి రోజుకు ఆరుసార్లు నైవేద్యం సమర్పిస్తారు. ఉదయం 4 గంటలకు, 8 గంటలు, మధ్యాహ్నం 12, సాయంత్రం 4 గంటలకు, రాత్రి 7.45,  8.30...ఇలా ఆరుసార్లు నివేదిస్తారు. ఇందుకోసం 56 రకాల పదార్థాలు తయారుచేస్తారు. 56ని హిందీలో ఛప్పన్ అంటారు.. అందుకే జగన్నాథుడి మహాప్రసాదాన్ని ఛప్పన్ భోగ్ గా పిలుస్తారు.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Weather Updates: ముంచుకొస్తున్న దిత్వా తుపాను ముప్పు.. మరో 2 రోజులపాటు ఏపీలో వర్షాలు
ముంచుకొస్తున్న దిత్వా తుపాను ముప్పు.. మరో 2 రోజులపాటు ఏపీలో వర్షాలు
Maoists Surrender: దంతేవాడలో 37 మంది మావోయిస్టుల లొంగుబాటు.. ప్యాకేజీ ఏం ఇచ్చారంటే..
దంతేవాడలో 37 మంది మావోయిస్టుల లొంగుబాటు.. ప్యాకేజీ ఏం ఇచ్చారంటే..
Chiranjeevi Venkatesh: మాస్ పాటకు చిరు, వెంకీ స్టెప్పేస్తే... అదీ 500 మంది డ్యాన్సర్లతో!
మాస్ పాటకు చిరు, వెంకీ స్టెప్పేస్తే... అదీ 500 మంది డ్యాన్సర్లతో!
AP New Pensions 2025: ఏపీలో కొత్త పెన్షన్లు మంజూరు.. డిసెంబర్ 1 నుంచి లబ్ధిదారులకు ప్రయోజనం
ఏపీలో కొత్త పెన్షన్లు మంజూరు.. డిసెంబర్ 1 నుంచి లబ్ధిదారులకు ప్రయోజనం
Advertisement

వీడియోలు

ప్రపంచంలోనే మొట్టమొదటి ఏలియన్ టెంపుల్ మిస్టరీ
India vs South Africa First ODI | నేడు భారత్ సఫారీ మధ్య మొదటి వన్డే
Ind vs SA ODI KL Rahul | కేఎల్ రాహుల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Faf du Plessis Out of IPL 2026 | IPLకు స్టార్ ప్లేయర్ గుడ్​బై
BCCI Meeting With Rohit, Kohli | రో-కోతో గంభీర్ సమావేశం?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Weather Updates: ముంచుకొస్తున్న దిత్వా తుపాను ముప్పు.. మరో 2 రోజులపాటు ఏపీలో వర్షాలు
ముంచుకొస్తున్న దిత్వా తుపాను ముప్పు.. మరో 2 రోజులపాటు ఏపీలో వర్షాలు
Maoists Surrender: దంతేవాడలో 37 మంది మావోయిస్టుల లొంగుబాటు.. ప్యాకేజీ ఏం ఇచ్చారంటే..
దంతేవాడలో 37 మంది మావోయిస్టుల లొంగుబాటు.. ప్యాకేజీ ఏం ఇచ్చారంటే..
Chiranjeevi Venkatesh: మాస్ పాటకు చిరు, వెంకీ స్టెప్పేస్తే... అదీ 500 మంది డ్యాన్సర్లతో!
మాస్ పాటకు చిరు, వెంకీ స్టెప్పేస్తే... అదీ 500 మంది డ్యాన్సర్లతో!
AP New Pensions 2025: ఏపీలో కొత్త పెన్షన్లు మంజూరు.. డిసెంబర్ 1 నుంచి లబ్ధిదారులకు ప్రయోజనం
ఏపీలో కొత్త పెన్షన్లు మంజూరు.. డిసెంబర్ 1 నుంచి లబ్ధిదారులకు ప్రయోజనం
Andhra King Taluka Collections : 'ఆంధ్ర కింగ్ తాలూకా' 3 డేస్ కలెక్షన్స్ - వరల్డ్ వైడ్‌గా ఎంతో తెలుసా?
'ఆంధ్ర కింగ్ తాలూకా' 3 డేస్ కలెక్షన్స్ - వరల్డ్ వైడ్‌గా ఎంతో తెలుసా?
Marriages in 2026: డిసెంబర్ రెండో వారం నుంచి పెళ్లిళ్లు బంద్.. వచ్చే ఏడాది ముహూర్తాల తేదీలివే
డిసెంబర్ రెండో వారం నుంచి పెళ్లిళ్లు బంద్.. వచ్చే ఏడాది ముహూర్తాల తేదీలివే
Akhanda 2 Tickets : 'అఖండ 2' సింగిల్ టికెట్ 2 లక్షలు - ఇది కదా బాలయ్య క్రేజ్
'అఖండ 2' సింగిల్ టికెట్ 2 లక్షలు - ఇది కదా బాలయ్య క్రేజ్
SUVs to launch in December 2025: మారుతి నుంచి టాటా వరకు, మార్కెట్లోకి 4 కొత్త SUV లు.. ఫీచర్లు చూసి డిసైడ్ అవ్వాలి
మారుతి నుంచి టాటా వరకు, మార్కెట్లోకి 4 కొత్త SUV లు.. ఫీచర్లు చూసి డిసైడ్ అవ్వాలి
Embed widget